భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
64. సప్తమి కల్పమును ఫలసప్తమి వర్ణనము
తా॥ దిండియిట్లనెను. “భాస్కరదేవుడు ఉపవాసములతో నెట్లు తుష్టినందును? ఉపవాసముచేయువారు ఏ ఏ వస్తువులను పరిహరింపవలెను. దేనిని వదలి పెట్టవలెనో తేలుపుడు-1, ఓ బ్రహ్మదేవా! సూర్యుని పూజించుటయందు ఏ ఏ కార్యములను ఎట్లు చేయవలెనో అంతయును సవిస్తరముగఁజెప్పుడు”-2. బ్రహ్మదేవుడిట్లనెను. “పుష్పధూపదీపనైవే ద్యములతో నా దేవుని పూజించి భుజించువారలైనను ఫలమును పొందుదురన్నచోనిక ఉపవసించుచునుపాసించువారి మాట చెప్పనేల?-3. పాపములచే నావరింపబడినవాడు, భోగములను విడిచిపుచ్చి, పాపములకు దూరముగను గుణములతో కూడియు నియమముతో నుండుటయే ఉపవాసమని యెఱుంగవలయును-4. ఒకరాత్రి, రెండు రాత్రులు, లేక మూడు రాత్రులు 'నక్తభోజనము' మాత్రము చేయుచు సూర్యునారాధించు మానవుడు,-5. సూర్యనామమునే జపించుచుండువాడును, అతనీయందే మనస్సు నుంచి యతనికి సంబంధించిన కర్మలలో నిమగ్నుడైయుండువాడును పరబ్రహ్మపదమును పొందుదురు-6. ఏదేని కోరికను మనస్సుననుంచుకొని, సూర్య భగవానుని యందు భక్తి కలిగి ఉపవసించినవాడు సూర్యానుగ్రహముచే సమస్తమును పొందును”-7. దిండి యిట్లనెను. “బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వర్ణములవారు, స్త్రీలును సంసారమనెడు బురదగుంటలోనున్నవారేట్లు సద్గతిని పొందెదరు?”-8. బ్రహ్మయిట్లనెను. “జగన్నాథుడు, గ్రహరాజు, చీఁకట్లను పారఁద్రోలువాడునైన సూర్య భగవానుని నిష్కల్మష బుద్ధితో నారాధింపక ఎవడైనను సద్గతినెట్లు పొందును?-9. విషయలాలసుడు, సూర్యాయత్త చిత్తములేనివాడు, పాపపు బురదనంటుకొని యున్నవాడు సద్గతినెట్లు పొందును?”.
తా॥ సంసార దుఃఖముతో బాధపడునీవు సుగతి నంద దలచినచో సర్వేశ్వరుడు ఖగోళ నాయకుడైన సూర్యదేవు నారాధింపుము-11. సుగంధ పుష్పములు, అగరుచందనములతో గూడిన మనోజ్ఞమైన ధూపములు, వస్త్రములు, భూషణములు, భక్ష్యములు మొదలగువానితో నుపవాస పరాయణుడవై పూజింపుము-12. సంసార బాధ నుండి విముక్తుడవై సద్గతిని పొందుట కిచ్చయించితివేని భక్త్యాసక్తమైన మనస్సుతో సూర్యదేవునారాధింపుము-13. నీకు పుష్పములు లభింపనిచో ప్రశస్తమైన చెట్ల చిగుళ్లు, గజీక మున్నగుపోనితోను, అవియును లభింపని పక్షమున ఊరక పూజింపవచ్చును-14. నీ సంపదననుసరించి పూలు, పత్రములు, నీరు, ధూపములు మున్నగువానీతో నేకాగ్రచిత్తుడవై పూజించిన యెడల నా దేవుడసమానమైన తృప్తినందును-15, సూర్యుని మందిరమున ప్రతిదినము ఊడ్చి శుభ్రము చేయువాడు పాపములనుండి ముక్తుడై యుత్తమ స్థితి నందును-16. భాస్కరాలయమున నెన్ని కసవు రేణువుల నూడ్చివేయునో అన్ని దీనములోతడు సూర్య సమానుడై స్వర్గ లోకముననుండును 17 దినదినముచేయు పాపము, దిన - దీనము గోచర్మ మాత్రమైన ప్రదేశమును శుభ్రము చేయుటచే నశించిపోవును-18. సూర్యాలయమున నలికి శుభ్రము చేయువాడు సూర్య లోకమునకుఁబోయి సూర్య భగవానునితో కూడ నానందించును-19. మట్టిచేత, ధాతు వికారములచేత, వివిధ వర్ణములచేత, ఆవు పేడచేత సూర్య దేవాలయమున నలికిపూయుచో వాహనారూఢుడై నా లోకమునకు వచ్చును.
తా॥ ఎల్లప్పుడును సూర్య గృహమునందు సూర్య దేవునకభి షేకము చేయువాడు (నీళ్ళు చల్లువాడు) వరుణలోకమునకు బోవును-21. పూఁతలతో నలంకరింపబడిన సూర్యదేవాలయమునందు మిక్కుటమగు సుగంధ పుష్పరాశులను సమర్పించు వాడెప్పుడును దుర్గతినందడు-22. భాస్కరాలయమున దీపము వెలిగించువాడు, అన్ని ఋతువులయందును సుఖమునిచ్చు మిక్కిలి సుందరమగు విమానమును పొందును-23. ఒక సంవత్సరమునకై సూర్యునకు తలపాత్ర, ధ్వజమునిచ్చు వాడు కూడ అదే ఫలమునందును-24. అట్టి దానకర్త తెలియక చేసిన పాపములు పతాకపు గాలిచేత రాత్రింబవలు కదలిపోయి నశించును-25. చీఁ కట్లను తొలగించు నా సూర్య దేవుని గీత వాద్యాదులచే నుపాసించువాడు గంధర్వుల నృత్య గీతములచే దివ్య విమానమునందు సేవింపబడును-26 సూర్యాలయమున పురాణ కాలక్షేపము నేర్పాటు చేయువాడు, అఖండ మగు మేథాశక్తిని, తన జన్మ పరంపరల జ్ఞానమును, జన్మ చాలించిన పిదప స్మృతిని పొందగలడు-27. ఖగేశ్వరుడైన భానుదేవుని ఈ విధముగ నుపాసించువాడు తన మనస్సున నెట్టి స్థితిని కోరునో అట్టి శ్లాఘ్య స్థితిని పొందును-28. అతని నారాధించిన మానవులు కొందఱు దేవత్వమును మ కొందఱు గంధర్వత్వమును, ఇంకను కొందఱు విద్యాధరత్వమును పొందుదురు-29. ఇంద్రుడు నూఱు యజ్ఞములచే సూర్యదేవు నారాధించియే ఇంద్ర పదవిని పొంది దేవతలకు నాయకుడయ్యెను. కావున సూర్యుని వంటి పూజ్యతము లింకేవరును లేరు.
తా॥ బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, స్త్రీలకును - సూర్య భగవానునికి సాటిగ పూజింపదగిన ఇతర దైవము లేదు-31. తమ్ము తాము జయించిన వారిలో, మహాత్ములలో, యతీశ్వరులలోను సూర్యోపాసకులే మోక్ష ద్వార రూపమగు సూర్యుని చేరుదురు-32. ఇట్లన్ని ఆశ్రమములవారికిని, అన్ని వర్ణములవారికిని సూర్యదేవుడే ఆశ్రయింపఁదగినవాడు. ఆతఁడే పరమ గతియునైయున్నాడు-33. దిండీ! ఇక నితరములగు కామ్యోపవాసములను, మహా పుణ్య ఫలద్రమైన సప్తమితిథిని గుజించి చెప్పుచున్నాను. వినుము-34. సమస్త పాపములను నశింపజేయునది, మంగళ ప్రదమైనదియునైన ఆ తిథినాడు సూర్యారాధన కొఱకై భక్తితోనుపవసించువాడు సర్వపాపములనుండి ముక్తుడగును-35. అటు పైన అమిత తేజస్వియైన సూర్యునిలోకమును పొందును. భాద్రపద మాసమునందలి శుక్లపక్షమున వచ్చు సప్తమినాడు ఉపవాసము చేయవలెను. మొదటి నుండి దాని విధానమును వినుము. చతుర్థినాడు ఎవరిని యాచింపకుండ లభించు నాహారము తీసికొనవలెను. పంచమినాడు ఒకే పూట భుజింపవలెను-37. షష్ఠినాడు ఉపవాసపరుడై జయించిన క్రోధముగలవాడై ఇంద్రియములను నిగ్రహించి, గంధ ధూప నైవేద్యాద్యుపచారములతో సూర్యదేవుని పూజచేసి-38. ఆ దేవుని యెదుటనే ఒక స్థండిలమేర్పరచి దానిపై సర్వ ప్రాణుల శోకమును నశింపజేయగలుగు సూర్య భగవానుని ధ్యానించుచు రాత్రి పరుండవలెను-39. సూర్యదేవుడే సర్వ దోషములను శమింపజేయగలవాడు, సర్వపాపములను నశింపజేయగలవాడని భక్తితో ధ్యానించుచు నిద్రింపవలెను. సప్తమినాడు మేల్కొని సూర్యదేవ నిమిత్తకముగ బ్రాహ్మణ భోజన సంతర్పణమును సాగింపవలేను.
తా॥ సప్తమినాడు పుష్పధూప నైవేద్యములతో సూర్యుని పూజించిన పిమ్మట, బ్రాహ్మణ భోజనములను సాగింపవలెను. సూర్య దేవుని నైవేద్యమునకు ఫలములే శ్రేష్ఠములని చెప్పుదురు-41. ఖర్జూరములు, కొబ్బరికాయలు, మామిడిపండ్లు, మాదీఫలములు ఈ ఫలములే మనీషులచే చెప్పబడినవి-42. బ్రాహ్మణ భోజనమునకు కూడ వీనినే వినియోగింపవలెను. తాను కూడ వీనినే భుజింపవలెను. ఇవి దొరకని పక్షమున నితరములను వేని నుపయోగింపవలేనో చెప్పెదను వినుము.-43. బియ్యము, గోధుమలు పిండి చేయింపవలెను. వానిని గుడ గర్భములుగ నేతిలో వేసి పాకము చేయవలెను-44. నాలుగు విధములైన అలసందెల మిశ్రమమును ఖాద్య యోగ్యములుగఁ జేసి సూర్యునకు నివేదింపవలెను. అగ్ని కార్యముచేసిన పిదప బ్రాహ్మణులను భుజింపజేయ వలెను-45. ఇట్లే శ్రేష్ఠమగు వ్రతమును పన్నెండు మాసములాచరింపవలెను. ప్రతి మాసము సూర్యదేవుని ఫలములతోడనే అర్పించుచు, తాను కూడ ఫలములనే ఆహారముగ తీసికొనుచున్న యెడలనది ఫలదాయక వ్రతమగును-46. సంవత్సర సమాప్తియందు శక్తి కొలదిగ బ్రాహ్మణ భోజన సమారాధన చేయవలెను. ఇఁక స్నాన ప్రాశన విధానమును వినుము-47. ఆవు మూత్రము, పేడ, పాలు, పెరుగు, నేయి, దర్భలు కలిపిన నీరు, నువ్వులు, ఆవాల మడ్డి, తెల్లని మట్టి-48. గజికతో చేసిన కల్కము, నేయి, ఆవుకొమ్ము కడిగిన నీరు, జాజి చెట్టుబంక, ఇవి స్నానమునకు ప్రశస్తమైనవి-49. ప్రాశనమునకు కూడా ఇవియే ప్రశస్తములు. పాపములన్నింటిని పోగొట్టునవి. భాద్రపదమాసమున ఈ వ్రతమును ప్రారంభించి పన్నెండు మాసములు పూర్తియగునంత వఱకు కొనసాగింపవలెనని పెద్దలు చెప్పుదురు.
తా॥ ఇట్లు సంవత్సరాంతము వఱకు సాగించి, బ్రాహ్మణులను భోజనములతో తృప్తి పఱచి, వారికి దివ్యమైన భోగములను నివేదింపవలెను-51. యథాశక్తిగ వారికి బంగారు ఫలములు, లేగతో కూడిన ఆవు, సన్యముతో కూడిన పంట పొలము(భూమి)-52. సర్వ ధాన్యములతో కూడిన సంబారములు, తెల్లని వస్త్రములు, పగడము(ల)తో కూడిన తామ్ర పాత్ర మొదలగునవి ఈయవలెను-63. ఇవి ధనికులైన వారియవలసిన వస్తువులు. పేదవారైనచో చెప్పెదను వినుము. పిండితో చేసినవి, నువ్వుల పొడితో చేసినవియునైన 'ఫలము'లీయవచ్చును-54. బ్రాహ్మణులు భోజనము చేసిన పిదప వెండితో చేయబడిన “పండ్లు', గైరికాదిధాతువుల వర్ణమువలె నుండు ఎఱ్ఱని జంట వస్త్రములు, ఆచార్యున కీయవలెను-55. వీనిని పంచరత్నములతో కూడిన బంగారముతో కూడ నీయవలెను. సంవత్సరాంతమునందు పారణమిట్లు సమాప్తము చేయబడును-56. ఈ విధముగ నీ సప్తమితిథి పాపహరము, పుణ్యకరమునైనది. ఈ దినమున నుపవసించు వారందఱు సూర్యలోకమునకు బోవుదురు-57. గంధర్వులు, అప్సరసలు సూర్యదేవుని సదా పూజించుచుందురు. కావున మానవుడు కూడా నిత్యమితనిని పూజింపవలేను-58. సూర్యారాధన చేయువాడు దారిద్ర్య దుః ఖమునుండి ముక్తుడగును. బ్రాహ్మణుడైనచో మోక్షమునందును. క్షత్రియుడింద్ర సమాన పదవిని పొందును-59. వైశ్యుడు కుబేరుని లోకమునకు బోవును. శూద్రుడు బ్రాహ్మణత్వమును పొందును. పుత్రుడు లేనివానికి పుత్రుడు కలుగును. దౌర్భాగ్యవతి యగు స్త్రీ సౌభాగ్యవతి యగును-60. ఈ సప్తమినాడుపవసించిన స్త్రీకి ఇట్టి ఫలము కలుగును. భర్త చనిపోయిన స్త్రీయైనను భక్తితో సూర్యదేవుని పూజింపవలెను-61. అటులజేసిన స్త్రీ ఇతర జన్మలయందు వైధవ్యమును పొందదు. ఈ ఫలసప్తమి వ్రతము చింతామణి'తో సమానమైనది. (కోరిన కోరికలిచ్చును)-62. ఇది చదివిననున వినినను సర్వకామ ప్రదమని చెప్పబడినది.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మ దిండి సంవాదమునందు సప్తమి కల్పమున ఫలసప్తమి వర్ణనమను అటువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
