భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
68. సిద్ధార్థ సప్తమి వ్రత వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేతను, ఇతర దేవతలందతిచేతను పూజింపబడు సూర్యదేవుని గుణించి నీకు చెప్పెదను-1. బ్రహ్మదేవుడు (నేను) పద్మాకారముననున్న సూర్యుని తామరలచేత గుగ్గులుచేత పూజించును. (తను) వ్యోమ రూపుడైన సూర్యుని మహాదేవుడు పూజించును-2. ఇతడు జాజిపూలు, విజయధూపమును తన సూర్య పూజలో వినియోగించును. మొక్కపు చెట్టు, చిల్లమడ్డి, చందనము, అగరు-3. శర్కర, కర్పూరము, నిడుముస్తే వీని మిశ్రమమే స్వయముగ మహాదేవుడు సిద్ధపఱచిన విజయధూపము-4. విష్ణుదేవుడు చక్రరూపమున సూర్యునారాధించును. నీలోత్పలశ్యాముడగు విష్ణువు సూర్యుని, నల్ల గలువల గుత్తులచే-5. అగరు ధూపముచేతను భక్తి శ్రద్ధలతో పూజించును. సూర్యుని పూజయందే పుష్పములు, ఏ క్రియలు వినియోగింపవలెనో నేనొక పర్యాయమతని నడిగితిని. స్వయముగ అతడే సూర్య పూజా పుష్పములను గుఱించి చెప్పెను. వాని వివరములు నీవు తెలిసికొనుము. చెప్పుచూన్నాను-6,7. సూర్యదేవుని మల్లెలతో పూజించువాడు భాగ్యవంతుడగును. తెల్లదామరలతో పూజించువాడు శాశ్వతమైన సౌభాగ్యమును పొందును-8. పరిమళ భరితములైన కొండ మల్లెలతో చర్చించువాడు గొప్ప ఐశ్వర్యమును పొందును, నిత్యమి పూలతో చర్చించిన మిక్కుటమగు సంపద అక్షయమైయుండును-9. దాసాని పూలతో పూజించుట సర్వ కుష్టు వ్యాధులను నశింపజేయును. మారేడు దళములు, పూలతో చర్చించిన గొప్ప ధన సంపదను పొందును.
తా॥ జిల్లేడు పూల దండతో పూజించినచో ధనము కలుగును. సూర్య దేవుడు కోరికలన్నింటిని ఫలింపజేయును. పొగడ పూవుల దండతో నర్పించిన సౌందర్యవతియైన కన్యను భార్యగా నిచ్చును-11. మోదుగుపూల పూజ వలన సూర్యుడు జాతకరీత్యా దుఃస్థానమునందున్నను పీడింపడు. అగి సె పూలతో పూజించినచో సర్వ కార్యములందానుకూల్యమునిచ్చును-12. గన్నేరు పువ్వులతో నర్చించినచో సూర్యునకనుచరుడగును. ముద్గర పుష్పములతో సూర్యార్చన చేసినచో-13. హంసయుక్తమైన విమానము మీద సూర్య లోకమును జేరును. వేయి సదాప లేక తామర పుష్పములతో పూజచేసిన వానికి సూర్య లోకప్రాప్తి కలుగును. బక పుష్పములతో పూజించినను అట్టి ఫలమే కలుగును-14. కస్తూరీ, చందనము, కుంకుమము, కర్పూరము, వీనిని సమ భాగములుగ కలిపి చేసి యక్షకర్దమ గంధముతో సూర్య పూజ చేసినవానికి సూర్య లోక ప్రాప్తి కలుగును. సంశయములేదు-15. సూర్య దేవాలయమునందు భక్తితో నూడ్చియలుకు వాడు సత్వరమే రోగముల నుండి ముక్తుడై ద్రవ్య లాభమును పొందును-16. సూర్యభగవానుని ఆలయమును గైరికాదిధాతువులచే నలికి శుభ్రము చేయువాడు గొప్ప సంపదను పొందుటయేగాక సర్వరోగముల నుండి విముక్తుడగును-17. పదునెనిమిది విధములైన కుష్ఠ వ్యాధులు, ఇంకను ఇతర రోగములేవియైనను, సూర్యాలయము నలికి శుభ్రము చేయుటచేత నశించిపోవును-18. విలేపన వస్తువులన్నింటిలో రక్త చందనము శ్రేష్టమైనది. పుష్పములలోకెల్ల సూర్య పూజా విషయమున గన్నేరు పువ్వులు ప్రశస్తములని చెప్పుదురు-19. సూర్య దేవుని తృప్తి పఱచుట కొంతకన్న వేడైన వేవియులేవు. వీనితో నాతని పూజించుటచే నాతని లోకమే ప్రాప్తించునుగదా!.
తా॥ భాస్కర దేవుని గన్నేరు పూలతో శ్రద్దా భక్తి సమన్వితుడై పూజించువాడు తన కోరికలన్నీంటిని సఫలము చేసి కొనగలుగును. ఆ పైన సూర్య సాలోక్యమునందును-21. సూర్యమందిరమున లేపనముచేసి మండలముచేసినవాడు సూర్య లోకమును పొంది అచట పెక్కు సంవత్సరములు సుఖ సంతోషములతో నుండును-22. ఒక మండలము చేసిన ధన ప్రాప్తి, రెండు మండలములు చేసిన ఆరోగ్య ప్రాప్తి, మూడు చేసిన అవిచ్చిన్నమైన సంతతి, నాలుగు చేసిన లక్ష్మీ-23. ఐదు మండలములు రచించిన విపులమైన ధాన్య సంపద, ఆంటీని చేసిన ఆయువు, బలము, కీర్తి, ఏడు మండలములు చేసిన మండలాధిపతిత్వము కలుగును-24. ఆయువు, ధనము, సంతానములతో సౌఖ్యముననుభవించి సూర్య లోకమున వెలుగొందును. నేతి దీపమును సూర్య సమక్షమున వెలిగించువానికి చక్కని చూపు కలుగును-25. నల్లావనూనె సమర్పించువాడు శత్రువులను జయించును. నువ్వుల నూనె నిచ్చువాడు సూర్యలోకమునొందును-26. ఇప్పనూనెనిచ్చువాడు మిక్కిలి సౌభాగ్యమును పొందును. పుష్ప ధూపాదులచేత సూర్య దేవుని యథావిధిగా పూజించి-27. శక్తిననుసరించి అటుపిదప నైవేద్యము పెట్టవలెను. పుష్పములలో జాజి శ్రేష్టము. ధూపములలో పూర్వము చెప్పబడిన విజయధూపము ప్రశస్తము.-28. గంధములలో కుంకుమము, లేపములలో రక్తచందనము, దీపమునకు నేయి, నైవేద్యమునకు లడ్డువములు శ్రేష్ఠములైనవి-29. ఈ వస్తువులతో సూర్య భగవానుడు తుష్టిచెంది సన్నధిలోనికి వచ్చును. ఇట్లు పూజించి ప్రదక్షిణము చేసి-30 శిరమువంచి నమస్కరించి ఆ దేవదేవుడైన భాస్కరదేవునకభిముఖముగా కూర్చుండి ఆయన వైపు చూడవలెను.
తా॥ నీటితో సహా ఒక తెల్ల ఆవగింజను చేతగొని మనసులోని ఇష్టమైన కోరికను ధ్యానింపవలెను-32. పిమ్మట ఆ నీటిని దంతముల కంటకుండునట్లుగా ఒకసారి త్రాగవలెను. రెండవ సప్తమినాడు రెండావగింజలు తీసికొని ఇటులే చేయవలెను-33. మూడవ సప్తమినాడు మూడు, నాల్గవ సప్తమినాడు నాలుగు, ఐదవ సప్తమినాడైదు-34. ఆవ సప్తమినాడాలు, నీటితో కలిపి దంత స్పర్శ కలుగకుండునట్లు త్రావవలెను. ఈ విధానమంతయు వైదిక శ్రుతి చెప్పుచున్నది. ఏడవసప్తమినాడు ఏడు గింజలతో త్రాగవలెను-35. పుచ్చుకొన బోవు జలమును మొదటి సప్తమి నుండియు ఈ మంత్రముతో నభిమంత్రించి స్వీకరింపవలెను. “ఓ సూర్యదేవా! లోకమునందంతటను ప్రచారముననున్నట్లు నీవు సిద్ధించిన ప్రయోజనము గలవాడవు. నన్ను కూడ అటులే సిద్ధార్థునిగ జేయుము”-36. అప్పుడు హవిస్సు పై జలము ప్రోక్షించి కోరినట్లుగ జపము చేయవలెను. విధి పూర్వకముగ అగ్ని హోత్రునకు ఆహుతులీయవలెను-37. ఏడు సప్తముల కార్యక్రమములీ విధముగనే నిర్వహింపవలెను 'సర్వ దోదక సప్తమి' ఒక ఆవగింజ నీటితో తీసికొనెడు నాటి నుండి ప్రారంభింపవలెను. ఒక గింజను నీటితో, రెంటిని నేయితో, మూటిని తేనెతో, నాల్గింటిని పెరుగుతో-39. ఐదింటిని క్షీరాన్నముతో, ఆంటీని గోమయముతో, ఏడింటిని పంచగవ్యముతో జలసహితముగ నిట్లు ఏడు పర్యాయములు సిద్దార్ధకములను సేవింపవలెను-40. ఈ విధానముతో సర్షపసప్తమి వ్రత మాచరించు వాడు అనేకులను పుత్రులను బడసి, మిక్కిలి ధనవంతుడై, సిద్ధార్థుడై విలసిల్లును-41. ఇహ లోకమున కోరికలన్ని తీరినవాడై పరమున సూర్య లోక ప్రాప్తినందును. అందుచేత నీ పద్దతిగ సూర్య భగవానుని పూజింపవలయును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందలి సిద్ధార్ధ సప్తమి వ్రత వర్ణనమను పేరుగల అణువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
