భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

126. వ్యోమ మహాత్మ్య వర్ణనము

తా॥ సుమంతుముని యిట్లనెను. “ఆకాశము, ఖం, దిశ, వ్యోమము, అంతరిక్షము, నభము, అంబరము, పుష్కరము, గగనము, మేరువు, విపులము, బిలము. అపోఛిద్రము, శూన్యము, తమము, రోదసి అని వ్యోమమునకు పేళ్లు చెప్పబడినవి. లవణ, క్షీర, దధి, (ఆమ్ల) ఘృత, మధు, ఇక్షు, స్వాదూదక సముద్రములని ఏడు సముద్రములు కీర్తింపబడినవి. హిమవంతము, హేమకూటము, నిషధము, నీలము, శ్వేతము, శృంగవంతము అను నీ యాటు వర్షపర్వతములు. వీని మధ్యభాగమున మహారాజత పర్వతము గలదు. మా హేంద్రి, ఆగ్నేయి, యామ్య, నైరృతి. వారుణి, వాయవ్య, ఈశానీ అను దేవనగరములు ఆ పైన గలవు. భూమి పైన లోకాలోకమను పర్వతము గలదు. దాని పిమ్మట అండ కపాలము గలదు. దాని పిదప. అగ్ని, వాయువు, ఆకాశము మున్నగు భూతములు గలవని చెప్పబడినది. అటు పై మహదహంకారములు, ప్రకృతి, ఆపై పురుషుడు. పురుషుని పిదప ఈశ్వరుడుగలడని యెఱుంగవలెను. ఈశ్వరునితో జగత్తంతయు నావరింపబడియున్నది. ఈశ్వరుడన సూర్యభగవానుడే. అతని తోడనే ఈ జగము నిండియున్నది. అతడు సహస్రాంశుడు. మహాతేజుడు. చతుర్భుజుడు. మహాబలుడు. అనాదిగ నున్నవిగ చెప్పబడునండావరణకారకములగు నూర్ఖాథోలోకములను గూర్చి మఱలనొక తడవ వివరింతును.

తా॥ భూలోకము, భువర్లోకము, సువర్లోకము. మహార్లోకము, జనోలోకము తపోలోకము, సత్యలోకమునని యేడు లోకములు చెప్పబడినవి. అటు పైఅండ పాలము, దాని పై తమము (అండభిత్తి) గలదు. అటనుండి అగ్ని, వాయువు, ఆకాశము మున్నగు భూతాదులు, అటుపై మహత్తు, ప్రధానము ప్రకృతి, పురుషుడు. ఆపై ఈశ్వరుడు ఈశ్వరునిచే జగత్తెవరింపబడియున్నది. భూమికి క్రిందుభాగమున గల లోకములను గూర్చి వినుము. తలము, సుతలము, పాతాళము, తలాతలము, అతలము, వీతలము, రసాతలము అను నీయేడు అధోలోములు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల. పాతాళము లని వాని క్రమము). అటు పైన నగ్ని, వాయువు, ఆకాశము, భూతాదులు, మహత్తు, ప్రధానము, ప్రకృతి, పురుషుడు. పురుషునిపై ఈశ్వరుడు-ఈశ్వరునితో నీజగత్తంతయు నిండియున్నది. మేరు ప్రమాణమంతయును ఇట్లు చెప్పబడినది. నాలుగు మూలలుగా నుండి నాలుగు శృంగములుగల మేరువు స్వర్ణమయమైనది. ఇది భూమధ్యమున వ్యాప్తమైయున్నది. సిద్దులు, గంధర్వులు దీనిని సేవించుచుందురు. నాలుగు దివ్యమైన కాంచన శృంగములతో నొకాశమునకు వ్యాపించుచు నెనుబదినాలుగువేల యోజనములు యెత్తు గలిగియున్నది. ఇది భూమిలో పదునారువేల యోజనముల లోతు వకు ప్రవేశించియున్నది. అడుగుభాగమున నిరువది యెనిమిది యోజనములు విస్తీర్ణము కలిగియున్నది విస్తీర్ణమునకు మూడురెట్లు పరిధి గలిగియున్నది.

తా॥ దానికి సౌమనసమను పేరనొక బంగారపు శృంగము, పద్మరాగ ప్రభమై జ్యోతిష్కమను పేరుగల రెండవ శృంగము. సర్వదేవమయమగు చిత్రమను పేరఁబరగు మూడవ శృంగము, చంద్రౌజస్కమని చెప్పబడు వెండిదియగు తెల్లని నాల్గవ శృంగమును వెరసి నాలుగు శృంగములు గలవు. సౌమనసమను శృంగమే గాంగేయమనియు, ఉదయమనియును పేర్కొనబడును. ఉదయించు సూర్యభగవానుడచటనే కాన్పించును. ఉత్తరము నుండి విహరించుచు వచ్చిన దివాకరుడు ఈ ఉదయ శిఖర మధిరోహించియే జంబూద్వీప వాసులకు దర్శన మిచ్చును. పూర్వపశ్చిమ దిశలందలి ప్రాతస్సాయం సంథ్యలు రెండును సూర్యతేజస్సునాదరించుచునే కాంచన శైల తేజస్సుతో నెఱగా ప్రకాశించుచుండును. ఉత్తరాయణమునందు సూర్యభగవానుడు సౌమనస శృంగమున నుదయించును. దక్షిణాయనమున రెండవ శృంగమగు జ్యోతిష్కమున నుదయించును. సంవత్సరమున నారెండింటి మధ్య భాగములలో నుదయించుచుండును. ఈ పర్వతపుటీశాన్య కోణమున నీశ్వరుడు, ప్రాగ్బాగమున నింద్రుడు, ఆగ్నేయకోణమున నగ్ని, దక్షిణమునయముడు, నైరృతికోణమున నిరృతి, పశ్చిమమున వరుణుడు, వాయువ్యకోణమున మరుత్తులు మధ్యభాగమున సాక్షాత్పద్మజన్ముడగు బ్రహ్మదేవుడు; గ్రహనక్షత్రాదులు, ఆదిత్యుడును వ్యోమమునందు గలరు. ఈ వ్యోమము దేవమయము, లోకమయముననియు చెప్పబడినది. తూర్పుకోణమున గల శృంగమున శుక్రుడు, రెండవకోణమునందలి శృంగమున శనైశ్చరుడు, మూడవ శృంగమున కుబేరుడు, నాల్గవ శృంగమున సోముడు నివసింతురు.

 తా॥ రాజా! మధ్యభాగమున బ్రహ్మ, విష్ణువు, శివుడు నివసింతురు. పూర్వోత్తర శృంగమున పితృగణము. మహాదేవుడు, లోకపూజితుడనైన గోపతియువసింతురు. పూర్వాగ్నేయమందలి శృంగమున శాండిల్యుడుండును. తదనంతర శృంగమున మహాతేజస్వియు, సూర్యనందునుడైన యముడుండును. నైరృతి శృంగమున మహాబలుడు విరూపాక్షుడుండును. అనంతరమున వరుణ దేవుడు నివసించును. ఆపై శృంగమున మహాబలుడగు వీరమిత్రుడు నివసించును. ఇతడు సర్వలోకనమస్కృతుడై వాయువ్యశృంగము నాశ్రయించియుండును. అటు పిదప నరవాహనుడగు కుబేరుడుండును. మధ్య భాగమున బ్రహ్మ, క్రిందగా ననంతుడు, బ్రహ్మకు తరువాతి భాగమున ను పేంద్రుడు, శంకరుడునుందురు. ఇది మేరువనియు వ్యోమమనియు, ధర్మమనియును పేర్కొనబడును. ఈ వ్యోమస్వరూప మేరువు సర్వదేవమయము. సర్వవేదమయమనియుఁజెప్పఁబడును. పూర్వదిక్కునగల శృంగము మొదలుకొని నాలుగు శృంగములే నాలుగు వేదములని తెలియుదురు.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు వ్యోమ మాహాత్యవర్ణనమను నూటయిరువదియాఱవ అధ్యాయము సమాప్తము.