భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
75. శ్రీ కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుట
తా॥ శతానీకుడిట్లనేను “సాంబుడు సూర్యదేవునెట్లు శరణువేడెను. సూర్యు నారాధింపుమని యెవరు సూచించిరి? దారుణమైన ఆ శాపమును పొంది అతడు తన తండ్రితో నేమనెను?”-1. ఆ ప్రశ్నలు విని సుమంతుముని యిట్లు నుడివెను. “సాంబుడెట్లు శపింపబడెనో లోగడ వివరించితిని కదా! శ్వేత పద్మధరుడైన శ్రీ కృష్ణునిచే సాంబుడు శపింపబడిన మీదట-2. శాప తిరస్కృతుడైన ఆతడు తన తండ్రితో నిట్లనెను. వినయముతో వినమ్రుడై, అంజలి ఘటించి, శిరమువంచి నమస్కరించి-3. "తండ్రీ! నేను చేసిన యపరాధమేమి? ఎందులకు నన్ను శపించితిరి? నేను మీ ఆజ్ఞననుసరించియే త్వరపడుచునిటకేతెంచితిని-4. ఏ అపచారమును చేయని నా మీద మి ఉగ్రమైన శాపఘాతమేందుకు పడినది? ఓ జగత్పతీ! నా కేమియు తెలియదు. నన్ననుగ్రహింపుడు-5. దేవా! ప్రభో! నాపై దయజూపి శాపమునుపసంహరింపుడు. నా తప్పిదమేదియో తెలియకుండగనే శపింపబడినాను. ఈ పాపమునుండి నేనెట్లు ముక్తుడనగుదును?”-6. సాంబుని దోషములేని వానిగ గ్రహించి శ్రీ కృష్ణుడతనితో నిట్లనెను. “కుమారా! ఈ నీ రోగమును తొలగించుటకు నేను శక్తుడనుకాను-7, జగన్నాథుడు, ద్వాదశాత్ముడు, దివాకరుడు, సహస్రకిరణుడునైన సూర్య భగవానుడే నీ వ్యాధిని తొలగింపగల సమర్థుడు-8. నాకు వలెనే మహాత్ముడైన నారదునకు కూడ కోపము కలిగించి యతని చేత కూడా తిరస్కృతుడ నైతివని ఇప్పుడే నాకు తెలిసినది-9. కాబట్టి ఋషి సత్తముడైన ఆ నారద భగవానునే ప్రసన్నునిగ జేసికొని యా మహనీయునే అడుగుము. ఏ దేవుని యనుగ్రహము సంపాదించిన నీ శాపము తొలగునో ఆతడు నీకు చెప్పగలడు-10.
తా॥ జాంబవతీసుతుడైన సాంబుడు తన తండ్రి మాటలు విని శోక మనస్కతతో దీనుడై బాగుగా ఆలోచించి-11. ద్వారకలోనున్న విష్ణుదేవుని దర్శించుటకై ఏనాడో వచ్చియుండిన నారదుని సమీపించి వినయముతో నిట్లు ప్రశ్నించెను–12. “భగవన్! బ్రహ్మ మానస పుత్రా! సర్వలోకజ్ఞా! నాపై దయచూపుడు. భక్తితో ప్రణమిల్లు నీ దీనునియెడ ప్రసన్నులుకండు-13. ఈ నా శరీరమునందలి వ్యాధి, మనస్సునందలి అజ్ఞానము తొలగింపగల యోగమునుపదేశింపుడు. ఆర్తుడనై నమస్కరించుచున్న నన్నను గ్రహింపుడు”-14. సాంబుని దీనాలాపములు విని నారదుడిట్లనెను. “సాంబా! దేవత లందఱికిని పూజ్యుడు, నమస్యుడు, స్తుత్యుడునయిన ఆ దేవుని పూజించినచో నీ రోగమునుండి ముక్తుడవు కాగలవు”-15. సాంబుడిట్లనెను. “ఋషివర్యా! సర్వ దేవతలకును పూజ్యుడు, నమస్యుడు, సుతుండున 6.6 దేవుడెవరు? నేను సగాను నా నగలుషాంగదగిన పరాంతుడెవరు? ఈ అగ్ని చల్లారుటకు నేనే దేవుని శరణు పొందవలెను?. జాలి గొలి పెడి సాంబుని ఈ వ్యాక్యములు విని నారదుడు కోపమును వీడి ఇట్లు పలికెను-18. “యదుశార్దూలా! స్తుతింపదగినవాడు, పూజింపదగినవాడు, వందనమాచరంప దగినవాడు, నమస్కరింపదగినవాడు, ప్రార్థింపదగినవాడు, బ్రహ్మాది దేవతల కందఱికిని ఆరాధ్య దేవత ఎల్లవేళల యందును ఆ సూర్య భగవానుడొక్కడే!”-19.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున, సాంబోపాఖ్యానమున కృష్ణునిచే శపింపబడిన సాంబుడు నారదుని వద్దకు వచ్చుటయను డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
