భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

103. సప్తమీ కల్పమున సూర్యపూజా మహిమ వర్ణనము

తా. బ్రహ్మ ఇట్లనెను. “సూర్యదేవునకు భక్తితో స్థిరమైన ఆలయమును నిర్మింపజేయువాడు ఏడు తరముల పురుషులను సూర్యలోకమునకు జేర్చగలడు. ఆ దేవాలయమున నెన్ని సంవత్సరములు అర్చన జరిపించునో, అన్ని వేల సంవత్సరములాతడు సూర్య లోకమున నానందింపుచుండగలడు. ఎవని గృహమున విధ్యుక్తముగా సూర్యపూజ జరుగుచుండునో, ఎవని మనస్సు నిష్కామముగనుండునో అట్టివాడు సూర్య దేవునితో సమానుడగును. సూర్య భగవానునకు పరిమళ భరితములును, సుందరములునైన పుష్పములను తదేక చిత్తముతో. ఆయా ధూపములును, పరిమళ భరితమైన విలేపమును, దీపము, బలి, వివిధ నైవేద్యములును, ఆదేవునకు ఇష్టమగు వస్తువులును. ఆయనకు సమర్పించుచు ప్రతి దినమారాధించువానికి సూర్య యజ్ఞ ఫలము కలుగును. సూర్య భగవానుడు యజ్ఞేశ్వరుడైనందున యజ్ఞముల వలన కూడా సంతుష్టినందును . కాని యజ్ఞములు నిర్వహింపవలెననిన బహూపకరణములు, నానా సంభారములు కావలెను. అట్టివి మిక్కిలి ధనవంతులైన వారికి మాత్రమే సంపాదించుటకు వీలుపడును. భక్తి కలిగి గడ్డి పరకలతో భాస్కరార్చన చేసిన యెడల కూడ మిక్కిలి దుర్లభమగు యజ్ఞముల ఫలము లభించును. సూర్య భగవానునకు అర్పింపదగిన పుష్పములు, భోజ్య పదార్థములు ( నైవేద్యము), ధూపము, గంథము, విలేపనములు, శ్రేష్ఠుములైన భూషణములు, ఎఱ్ఱని వస్త్రములు. ఉపహారములు, భక్ష్యములు, ఫలములు - ఇవియన్నియును సూర్యదేవునకనురూపమైనవిగ నుండవలెను.

తా. అదే మానవ నిర్మితమైన ఆలయమునందు స్థాపింపబడిన నా యజ్ఞపురుషుడును, ఆది దేవుడునైన సూర్యభగవానునకు అతని కనుకూలమైన ఆయా వస్తువులను సమర్పింపవలెను. చిత్రభానుడైన దివాకరుని పుణ్యతీర్దములనుండి కొని రాబడిన యుదకములతోను, పరిమళ భరితములైన జలములతోను, తేనెతోను, నేయితోను, పాలతోను అభి షేకింపవలెను. అటు లభి షేకించువాడు పాలు పెరుగుల ప్రదములు పొందును. తేనెలూరు స్వర్గధామములు పొందును. లేక శాశ్వతమైన శాంతిని పొందును. స్తోత్రములతోను, గీత ములతోను, వాద్యములతోను, బ్రాహ్మణ సంతర్పణలతోను, ఏకాగ్రచిత్తుడవై విభావసునారాధింపుము . అటులారాధించియే విదేహ వంశీయులగు జనకాదులు డెబ్బది యేడుగురు పురుషాంతరములవారు, హైహయవంశీయులేబది పురుషాంతరముల వారును అమృతత్వమును పొందిరి. ఈ విధమైన ఉపవాసాది వ్రతాచరణములచే నీవు సూర్య భగవానుని సంతోషింపఁజేయుము. అతడు తుష్టుడై శాంతినిచ్చువాడగును”. కృష్ణ భగవానుడిట్లనెను. “చిత్రభానుడు ఉపవాసములచే నెట్లు తుష్టినందును? ఉపవాసి యగువాడాదేవున కెట్లు సేవచేయవలెను?. భానుదేవుని యారాధనమున నెప్పుడెప్పుడేయే కార్యములు చేయవలెనో అంతయును నాకు సాకల్యముగ దెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. భోగ పరాయణులైనను ఆ దేవేశుని గంధ పుష్పాదులతో నర్చించి, ఆతని స్మరించియు శుభఫలములు పొందుదురనగా నిఁక ఉపవాస దీక్షితులగు వారి విషయము చెప్పనేల?. పాపములకు దూరముగా నుండుట, సద్గుణములనవలంబించి భోగ విముఖులై యుండుటయే ఉపవాసమని తెలియవలెను.

తా. ఒక రాత్రిగాని, రెండు రాత్రులుగాని, మూడు రాత్రులు గాని యుపవాసము చేసి, భక్తితో సూర్య భగవానుని ధ్యానించు మానవుడు . అతని నామమునే స్మరించుచు, అతనికి సంబంధించిన కర్మయందే యిచ్చగల మనస్సు గలవాడై, నిష్కాముడై యాదేవునే పూజించివాడు పర బ్రహ్మను పొందును. ఏ యభీష్టమునైనను సిద్దింపఁజేసికొనఁగోరువాడు, సూర్యదేవుని యందు మనస్సు నిలిపి ఉపవసించినచో నా దేవుడు ప్రసన్నుడు కాగా అతని యభీష్టము నెరవేరును” . శ్రీకృష్ణ భగవానుడిట్లనెను. "బ్రహ్మదేవా! సంసారమనేడు బురద గుంటలో నున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులెవరైనను సద్గతిని పొందుట యెట్లు సాధ్యమగును?. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “చీకట్లను తొలగించు. జగత్ర్పభువగు భాస్కర దేవుని నిష్కపట చిత్తముతో నారాధించి సుగతిని పొందనగును. విషయ వాంఛలనెడు మొసళ్లచే విషమించినదియు, సూర్య భగవానుని కర్పింపబడనిదియునైన చిత్తముగల పాపకర్ముడు సద్గతి నెట్లు పొందగలడు?. సంసారదుఃఖముతో బాధపడుచున్న నీవు సుగతిని బడయ గోరేదవేని, లోక పూజితుడు, గ్రహేశ్వరుడు సర్వేశుడునైన సూర్య దేవునారాధింపుము . ఉపవాస పరాయణుడవై సుందరములైన సుగంధ పుష్పములతోను, అగురు, చందన, ధూపములతోను, వస్త్రాభరణములచేతను, భక్ష్య భోజ్యాదులతోను ఆ దేవుని పూజింపుము. సంసార శోకమునుండి ముక్తుడవై సద్గతి నంద గోరెదవేని, కోలేశ్వరుడైన సూర్యదేవుని నీ మనస్సునకు నచ్చిన రీతిగా పూజింపుము. పుష్పములు లభించని యెడ, చెట్ల చిగుళ్లతోను, అవియును దొరకనిచో, గజిక మొలకలతోనైనను ఆ దేవుని పూజించుట ప్రశస్తమగును.

తా॥ పుష్పములతో, పత్రములతో, ఉదకములతోను, తన శక్తిననుసరించి, భక్తితో, ఏకాగ్ర చిత్తముతోను పూజించినచో నా దేవేశుడు మిక్కిలి తృప్తినొందును. సూర్య భగవానుని యాలయమున నెల్లప్పుడును సమ్మర్జనము చేసి శుభ్రపఱచువాడు, మాలిన్యముతో గూడిన శరీర సంయోగమునుండి, సర్వ పాపములనుండియు ముక్తుడగును. భాస్కరాలయమునందెన్ని ధూళి రేణువులనూడ్చివేయునో అన్నీ దివ్య దినములు స్వర్గ సౌఖ్యమనుభవించుచుండును. వెలుపల, లోపల సూర్యమందిరమున నూడ్చి శుభ్రము చేయువాని శరీరము సబాహ్యాభ్యంతరముగ పవిత్రమగును-34. సూర్యాయతనమున నలికి శుభ్రము చేయువాడు సూర్య లోకమును జేరి విష్ణుదేవునితో నానందించును. మట్టితో గాని, మట్టికి సంబంధించిన వానితో గాని, వర్ణములతో గాని, ఆవు పేడతోగాని, భక్తి పురస్పరముగ నలుకు(బూతలు చేయువాడు సూర్యభగవానుని చేరును. సూర్యాలయమున నీరు చల్లి శుభ్రపఅచువాడు సూర్య స్థానమును చేరును. అలికిన మందిరమున వివిధములైన సుగంధ 'పుష్ప సమూహములతో నలంకరించువాడును సూర్య స్థానమును చేరును. సూర్య మందిరమున దీపమును వెలిగించువాడు బహురత్నమయమైన దివ్య విమానోరూధుడై స్వర్గమును చేరును. సూర్య మందిరమున కొక సంవత్సరము వఱకును తలపాత్రము, ధ్వజమును, సమకూర్చువాని కట్టి ఫలమే కలుగును.

తా॥ తీవ్రమైన గాలి కా ధ్వజము కదలునట్లు, దాత, తెలియక చేసిన పాపము కంపించిపోవును. సూర్యదేవుడాతని యింట రాత్రింబవలు ప్రకాశించుచుండును. సందేహములేదు. దేవ రథమున నుండి, గీత వాద్యములతోను, అభివృద్దిని, అటుపిమ్మట పరమగతిని పొందగలడు. దేవుని సమక్షమున పుణ్య కథా శ్రవణములను నిర్వహించువాడును ఈ ఫలములను పొందును. పుణ్య కథా శ్రవణాదులనుమించి సూర్యదేవునకు ప్రీతికరమైన దేదియు లేదు. అందుచే నట్టి పురాణ ప్రవచనములను సర్వ ప్రయత్నములతో జరిపించుచు, పౌరాణికుని యధావిధిగా పూజింపవలేను. సూర్య భగవానునకు చేసిన ఒక్క నమస్కారమైనను మిక్కిలి పుణ్యప్రదమైనది. అది పది అశ్వమేథ యాగములు పూర్తి చేసి యవభృథ స్నానములు చేసిన ఫలముతో సమానమైనది. పది అశ్వ మేథములు చేసిన వాడైనను మఱల జన్మించును. కాని సూర్య నమస్కారము చేసిన వారికి పునర్జన్మ లేదు. ఇట్లు దేవదేవుడైన సూర్య భగవానుని భక్తితో నుపాసించినవాడు తన మనస్సున కోరిన యుత్తమ గతిని పొందును. ఆ దేవునర్చించి యుండుట వలననే నాకీ లోకపూజ్యమైన బ్రహ్మత్వము లభించినది. ఆ దేవుని వలననే నీవును నీవు కోరిన విష్ణుత్వమును పొందియుంటివి. బ్రహ్మ హత్యాదోషమున తెగబడిన శివుడా సూర్య దేవు నర్చించియే అట్టి బ్రహ్మహత్యాపాపము నుండి ముక్తుడయ్యెను. మానవులు కొందఱు దేవత్వమును, మణికొందఱు గంధర్వత్వమును, ఇంక కొందఱు విద్యాధరత్వమును సూర్యో పాసనఁజేసి యా దేవుని వలన పొందగలిగిరి. సూర్యదేవుని నూజు క్రతువులతో నారాధించి దేవజాతి పురుషుడింద్రపదవిని పొందెను. కాబట్టి యా దివాకర దేవుని కంటే పూజ్యుడన్యుడు లేడు. బ్రహ్మచారియైన వాడితర దేవతలందజ కంటెను స్వగురువైన సూర్యదేవునే పూజింపవలెను. వివస్వంతుడు యజ్ఞపురుషుడైనందున నాతడే యందకిని పూజ్యుడగును. స్త్రీలు కూడ తమతమ భర్తలతో(బాటుగా సూర్యదేవునే భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. గృహస్థుడైన 'పతి'కి కూడ నెల్లప్పుడును సూర్య భగవానుడే పూజింప దగినవాడు. వైశ్యులకు తపస్సులచేతను, యతి వరులకు ధ్యానములచేతను ఆ దేవుడే ఆరాధింపఁదగినవాడు. ఈ విధముగ నన్ని యాశ్రమములవారికిని ఆ చిత్రభానుడే ఆశ్రయింపదగినవాడు. అన్ని వర్ణముల వారికిని ఆతని నారాధించుట చేతనే సద్గతి కలుగును.