భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
17. ప్రతి పత్కల్సమున బ్రహ్మపూజన విధి వర్ణనము
తా॥ శతానీకుడిట్లనెను “ఓ బ్రహ్మదేవా! నాయందనుగ్రహముంచి, ప్రతిపత్కృత్యమును బ్రహ్మ పూజనమును, పూజ వలన కలుగు ఫలమును వివరించి చెప్పుడు”. సుమంతు ముని ఇట్లు చెప్పెను “శాంతి నిచ్చెడు ఈ విషయమును గూర్చి చెప్పుచున్నాను. సావధాన మనస్కుడవై వినుము. పూర్వము స్థావర జంగమములన్నియు నశించి ప్రళయమేర్పడెను. ఒకే ఒక్క విశాలమైన కడలి మాత్రముండెను. దాని నుండి దేవతలలో పెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మ స్వయంభువుగా ఆవిర్భవించి లోకములను, దేవతలను, వేర్వేరు భూతములను సృష్టించెను. అంతేకాక వివిధ జంగమ స్థావరములను త్రికరణములచే రచించెను. అతడు దేవతలకు తండ్రియు, భూతరాశికి పితామహుడు -4. అందువలన అతడు అందజికిని పూజ్యుడైన లోక గురువు. జగత్తునంతయు అతడు సృష్టించును. పాలించును. సంహరించును. ఇతని మనస్సునుండి రుద్రుడు, వక్ష స్థలమునుండి విష్ణువు పుట్టిరి. ఇతని ముఖముల నుండి నాలుగు వేదములు, వేదాంగములన్నియు పుట్టెను. దేవతలకు నాయకుడైన ఈ విరించిన దేవతలు, అప్సరసలు, గంధర్వులు, యక్షులు, ఉరగులు, రాక్షసులు ఎల్లప్పుడును పూజించుచుదురు. ఈ లోకమంతయు బ్రహ్మమయము. అంతయును బ్రహ్మయందున్నది. కావున తన శ్రేయమును కోరుకొనువాడెవడైనను అతనిని చక్కగా పూజింపవలెను. సురేశ్వరుడైన అతనిని భక్తితో పూజింపనివాడు స్వర్గ రాజ్యమునకుగాని మోక్షమునకుగాని అరుడు కాడు. ఈ భువనేశ్వరుడైన విరించిని భక్తితో పూజించువాడు స్వర్గాది పుణ్యలోకములకు లేక మోక్షమునకు 'యోగ్యుడగును.
తా ॥ అందువలన మానవుడు ఆపదలో నుండినను సౌమ్యమైన మనస్సుగలవాడై జీవించియున్నంత కాలమును ప్రతిజ్జాపూర్వకముగ బ్రహ్మదేవుని పూజించుచుండవలెను. అట్లు పూజించినవానికి దేహపరిత్యాగమైనను నరకమైనను శ్రేష్ఠములే. ఏలయన బ్రహ్మ పూజనము చేయనివారు మాత్రము దానిననుభవింతురు, మిక్కిలి భక్తితో ఆ విరించిని అర్చించువాడు మనుష్య చర్మముతో కప్పబడిన బ్రహ్మదేవుడే యగుచున్నాడు. సందేహము లేదు. బ్రహ్మ పూజనము కంటే పుణ్యాధిక్యము నిచ్చునది వేడొకటిలేదని తెలిసికొని నియతముగా నిరంతరముగా తత్పూజనము చేయవలెను, అందు దేవతల చేత నమస్కరింపబడు బ్రహ్మను మోహవశమున నెవడు ద్వేషించునో, లేక అట్టి ద్వేష సంభాషణముచేయునో వాడు నరకమునకు పోవును. బ్రహ్మదేవుని అర్చామూర్తిని సర్వ ప్రయత్నములతో విధి విధానముగ ఎవడు ప్రతిష్ఠించునో వాడు పొందు పుణ్య ఫలమును గూర్చి సావధానుడవై వినుము. అన్ని యజ్ఞములు, తపములు, దానములు, తీర్థములు, వేదములలో ఏ ఫలము కలదో దానికి కోటి కోటి రెట్లు అధికముగా బ్రహ్మ ప్రతిష్ఠ వలన లభించును. ఒక సుందరమైన ఆలయమును నిర్మించి అందు బ్రహ్మను ప్రతిష్ఠించిన యెడల సర్వాగమములలో చెప్పబడిన పుణ్య ఫలమునకు కోటి కోటి రెట్లు అధిక ఫలము లభించును. బ్రహ్మ ప్రతిష్ఠ చేయువాడు తల్లి దండ్రుల యొక్కయు భార్య యొక్కయు ఇరువది యొక్క తరములను ఉద్ధరించువాడై బ్రహ్మ పద ప్రాప్తినందును. అచట విస్తారమైన దివ్య భోగములనుభవించి, ప్రళయము సంభవించినపుడు జ్ఞాన యోగమునంది అచటనే మోక్షము నందును.
తా ॥ ఒకవేళ రాజ్యమే కోరినచో సృష్ట్యంతరములో, జంబూ ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు, లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర శుద్ధజలములను సప్త సముద్రములతో కూడిన భూమికి చక్రవర్తియగును. అష్టదళ పద్మమును సిద్ధపఱచి పూర్ణిమనాడు పాడ్యమినాడును మూడు సంధ్యలలోను బ్రహ్మజపము చేయువాని పుణ్యఫలమును గూర్చి వినుము. ఈ దేహముతోడనే ఈ భూమియందే అతడు బ్రహ్మగా నుండును. మానవులందఱకును అతనిని దర్శించినను, స్పృశించినను పాపములన్నియు పటాపంచలైపోవును. అతడు తన కులమునకు చెందిన ఇరువది యొక్క తరముల పురుషులనుద్దరించి వారికి స్వర్గప్రాప్తి కలిగించి వారితో సహా తాను ఈ భూమియందే ఉండి సుఖించును. తామర పువ్వులో పుట్టి అందే విరాజమానుడైన బ్రహ్మదేవుని ఒక్క పర్యాయమైనను భక్తితో పూజించిన వాడు బ్రహ్మలోకమును పొందును. పుణ్యము తగి పోయిన పిదప ఈ భూమిపై జన్మించి గొప్ప చక్రవర్తియగును. భక్తి పరములైన ఇట్టి యత్నములతో కాక దివ్యమైన బ్రహ్మలోక నివాసము అత్యుగ్రములైన తపములచేతగాని, అనేక విధములైన యాగములచేతగాని అభింపదు. మట్టి, కఱ (లేక ఇత్తడి), ఇటుకజాయి, శిల - వీనిలో దేనితోనైనను బ్రహ్మకు ఆలయము నిర్మించినవాడు ఇరువది యొక్క తరముల వారితో గూడి బ్రహ్మలోకమున వెలుగొందును. మట్టితో లేక ఇటుకజాయితో నిర్మించిన ఆలయము వలన కోటి రెట్లు ఫల మధికముగ నుండును. ఇటుకలతో నిర్మించుటకంటే జాతితో నిర్మించిన రెండింతలు పుణ్యమధికముగ లభించును. రాజా! ఆడుచు నైనను బ్రహ్మాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకమున సర్వకామికమైన విమానమును పొందును.
తా ॥ ఆ విమానము నలు ప్రక్కల పూలదండలచే చుట్టబడి, చిఱుగంటలతో అలంకరింపబడి, ఊయెలల కదలికలతో సొంపై, గంటలు, వీవనలతో నలరారుచు. ముత్యముల దండలతో శోభించెడి మేలు కట్టుతో, సూర్య ప్రభా భాసమానమై, అప్సరసల సంఘములచే నిండి, అన్ని కోరికలను తీర్చుటకు సమర్థమై. ఉండును. ఆ పుణ్య పురుషుడు ఆ విమానమున విరాజమానుడై, మహా భోగములనుభవించును, దేవతలతో కూడి క్రీడించుచునుండి తిరిగి ఈ భూలోకమున కేతెంచి ధార్మికుడైన రాజగును. రాజా! జాగ్రత్తగా పరిశీలించుచు ఏమైన క్రిమికీటకాది ప్రాణులున్నచో వానిని మృదువుగా పరిహరింపుచు ఊడ్చుట మొదలగు పారిశుధ్య కార్యములు చేయువాడు చాంద్రాయణ ఫలమును పొందును. ప్రాణి హననము జరుగకుండ చూచుచు వడబోసిన నీటితో అలుకువాడు చాంద్రాయణ ఫలమును పొందును. బ్రహ్మ మందిరమున ఒక పక్షము దినములు విడువకుండ ఊడ్చుట, శుభ్రము చేయుట, అలంకరించుట మున్నగు పనులు చేయుచు పూజించువాడు వంద కోటి యుగముల వఱకు బ్రహ్మలోక సుఖమును పొందును. ఆ పిదప అతడు చతుర్వేద పారంగతుడు, సౌందర్యవంతుడు, అందఱిచే ప్రియముగా చూడబడువాడు, ఒప్పిదమైనవాడు, సంపన్నుడు, సర్వ సద్గుణ శోభితుడు, ధార్మికుడు అయిన రాజగును. బ్రహ్మమందిరమును కపటముతో నిర్మించిన వాడైనను, ఆ మందిరమున ఊడ్చుట మొదలగునవి చేయువాడైనను అట్టి ఫలమునే పొందును. బ్రహ్మదేవునియందు భక్తిగలవారు కానంతవఱకు జనులు సంసారమునందలి దుఃఖ శోక భయముల నుండి దాటజాలరు. విషయ గోచరమైన ఈ సంసారమునందు జీవుని చిత్తమెట్లు తగులుకొని యుండునో అటులే ఆ చిత్తము బ్రహ్మయందు తగులుకొని యుండెనేని బంధము నుండి ఎట్లు ముక్తుడు కాకుండును?
తా ॥ పగుళ్లు వారిన, జీర్ణమైన, శిథిలావస్థలో నున్న, బ్రహ్మాలయములందుగాని, తోటలయందుగల, మందిరముల ప్రాంగణములందుగాని ఎవరు సంస్కారము చేయుదురో వారికి ముక్తి ఫలము లభించును. బ్రహ్మతో సమానుడైన దేవుడు వేజులేడు. బ్రహ్మతో సమానుడైన గురువు లేడు. బ్రహ్మతో సమానమైన జ్ఞానములేదు. బ్రహ్మతో సమానమైన తపస్సు గానీ లేదు. పాడ్యమి మొదలుకొని అన్ని దినములయందు, ఉత్సవములయందు, పుణ్యప్రదములైన పర్వకాలములయందు, ప్రత్యేకముగా పూర్ణిమనాడు. సురజ్యేష్ఠుడు, చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుని సన్నిధియందు, శంఖములు, భేరీ వాద్యములు మొదలగునవి మ్రోగించుచు, గొప్పనైన మంగళ గేయములు గానము చేయుచు నీరాజనమీయవలెను. విధి విధానముగ ఎన్ని పర్వదినములలో ఇట్లు నీరాజనార్చన చేయుదురో అన్ని వేల యుగములు బ్రహ్మలోకమునందు నివసింతురు. మూడు సంధ్యలయందును బ్రహ్మకు అభిషేకముచేయుసమయమున నృత్యము చేయుట, వీణాది వాద్యములను వాయించుట, గేయములనాలపించుట, ముఖముతో వాయించు వాద్యములు వాయించుట ఎవడు చేయునో వాని పుణ్య ఫలమును వినుము. ఇట్లెన్ని దినముల వఱకు గీత నృత్య వాద్యముల బ్రహ్మదేవుని సేవించునో అన్నివేల యుగముల పర్యంతమతడు బ్రహ్మలోకమున ఘనత నందును. పుల్లావు పాలు, పెరుగు, నేయి, పంచితము, గోమయములతోను, దర్భనీటితోను మంత్రపూతముగా బ్రహ్మకు స్నానము చేయింపవలెను. అదియే స్నానమనబడును. ఇతర వస్తువులతోడి స్నానము కన్నను కపిలా పంచగవ్యములతో, లేక పాలు, పెరుగు, నేయితో చేయబడు స్నానము వందరెట్లు ఎక్కువ ఫలమునిచ్చునది అని తెలియవలయును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, దేవకార్యములను, అగ్ని కార్యముల నుద్దేశించి ఎల్లవేళల నొక పుల్లావును ఆహారపానీయములిచ్చుచు పోషించుచుండవలెను. శూద్రుడెప్పుడును ఈ పనీ చేయరాదు.
తా ॥ బ్రహ్మదేవుని పూజకొఱకు సిద్ధము చేయబడిన కపిలధేనువు పంచగవ్యమును (లేక పాలు, పెరుగు మొ.) త్రాగు శూద్రుడు దీర్ఘకాలము వఱకు ఘోరమైన నరకార్ణవమునందు వండబడును. బ్రహ్మదేవునికి నేతితో తలంటు పోసిన యెడల వేయి కోట్ల సంవత్సరముల నుండి సంపాదింపబడిన పాపము భస్మమైపోవును. వేయికోట్ల కల్పములుగా ఆర్జించుకొనిన పాపము, బ్రహ్మదేవునికి చేసిన ఘృత స్నానము చేత అగ్నితో ఇంధనమువలె దహించుకొనిపోవును. పాడ్యమినాడు ఆ దేవునికి ఒక్కసారి ఘృతాభిషేకము చేసినవాడు ఇరువదియొక్క తరములను తరింపజేసి విష్ణులోకమును పొందును. పాలతో ఆ దేవునికి స్నానము చేయించువాడు వేద పారగుడైన బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారముతోకూడ పదివేల ఆవులను భక్తితో దానము చేసినవాడు పొందెడి ఫలమును పొందును. బ్రహ్మను ఒక్కసారి నేయితో, పాలతో స్నానము చేయించువాడు గాంగేయ (బంగారు) విమానమున బ్రహ్మలోకము పొందును. రాజా! ఆ దేవుని ఒకసారి పెరుగుతో అభిషేకించిన యెడల విష్ణువును పొందును. తేనెతో అభిషేకము చేసినవాడు వీరలోకము పొందును. చెఱకు రసముతో స్నానము చేయించినవాడు ఆకాశమును ప్రకాశమానము చేయుచు సూర్యలోకమునకు పోవును. భక్తితో ఆ పద్మసంభవుని స్వచ్చమైన జలముతో స్నానము చేయించిన వాడు తన అజేయమైన పాపమునంతయును విడిచి బ్రహ్మలోకము నందును. వస్త్రముతో వడబోసిన నీటితో ఒక్కసారి ఆ ప్రభువు నభిషేకించినవాడు అన్ని కాలములయందును తృప్తాత్ముడై యుండుటయే గాక లోకమును వశీకరించుకొనియుండు శక్తిని పొందును.
తా ॥ అన్ని విధముల ఓషధులచేత బ్రహ్మదేవుని భక్తితో స్నానమాడించినవాడు బంగారపు విమానమున బ్రహ్మలోకముచేరి అచట గౌరవింపబడును. గంధపు నీటితో, చందనపు నీటితో అభిషేకించువాడు బంగారు వన్నె కాంతితో రుద్రలోకమును పొందును. తెలుపుమించు ఎట్ట గలువలు, తామరలు, నిలుకడైనవి పరిమళముగలవియైన కలువలు వీనిని స్నాన సమయమున ఉపయోగింపవలెను. వీనిలో ఒక్కదానినైనను బ్రహ్మస్నానమున నుపయోగించిన పాప కలిలమును పోద్రోలి బ్రహ్మలోక గౌరవమునందును. కర్పూరము చందనము కలిపిన నీటితో బ్రహ్మకు స్నానము కల్పించినవాడు పాపములనుండి విడివడి, శుదుడై బ్రహ్మలోకమునందును. పరిశుద్ధమైన జలముతో, గాయత్రీ మంత్రమును ఒక వంద పర్యాయములు జపించుచు ఒకసారి భక్తితో బ్రహ్మదేవునకు స్నానము చేయించువాడు బ్రహ్మలోకమును పొందును. ప్రభువును మొదట చన్నీటితో, పిదప వెచ్చని నీటిధారలతో, ఆ పిదప నేతితో స్నానమాడించినవాడు పాపములనుండి విడువబడును. ఇట్లు మూడు విధములుగా అభిషేకముచేసి ఆ దేవుని భక్తితో పూజించు మానవుడు వేయి అశ్వమేధములు చేసిన పుణ్యమును పొందును. మట్టి కుండలతో, రాగి బిందెలతో స్నానమాడించిన నూడురెట్లు గుణమగును. వెండి బిందెలతోనైన లక్షకు మించియు, బంగారు కలశములతోనైన కోటిరెట్లు శ్రేష్ఠమైన ఫలమునొందును. బ్రహ్మదేవుని దర్శనము పుణ్యప్రదమైనది. దర్శనముకంటె స్పర్శనము మఱంతమేలైనది. స్పర్శనము కంటెను పూజించుట శ్రేష్ఠమైనది. దాని కన్నను ఘృత స్నానము శ్రేష్ఠతరమైనదీ. ఘృత స్నానము వలన బ్రహ్మదేవుడు సంప్రీతుడై మానవుల మనస్సంబంధమైన, వాక్సంబంధమైన పాపములను నశింపజేయును. అందువలన అది తప్పక చేయవలెను.
తా ॥ భారతా! ఆ దేవునికి స్నానోపచారము పిదప భక్తితో పూజించు విధానమును వినుము. స్నానాంతరము పరిశుద్ధమైన వస్త్రమును ధరించి న్యాసము చేయవలెను. నాలుగు భాగములుగా చేయబడిన నాలుగు మూరల పరిమాణముగల పద్మమును వ్రాయవలెను. దాని మధ్యభాగమున పన్నెండు రిక్కలచేత కూర్చబడినట్లు చక్రమును గీయవలెను. దాని చుట్టును ఉన్న తామరలు నిర్దుష్టముగా ఉండవలెను. దళ భాగములేవియు చెడకుండ నుండవలెనని శాస్త్ర విహితమైయున్నది. వివిధములైన గంగుల కమషమేళనముగా దానిని తీగవలెను. మద భాగమున మీకు టమైన నలుపు (వీలము) ఆపే పసుపును ఆ పెన ఎఱుపు వన్నేను నింపవలెను . చక్రవలయమధ్యమందు పరిశుద్ధమైన తెలుపు వర్ణమును పూరింపవలెను. చక్రనాయకుని వెలుపలి భాగమునుండి మెఱుపు పోగులతో గుండ్రముగా చుట్టవలెను. ఇట్లు లిఖించి మూల మంత్రమును న్యాసము చేయవలెను. బుద్ధిమంతుడు శిరస్సు నుండి పాదతలము వఱకు ఓంకారమును న్యాసము చేయవలెను. శబ్దమునకు శూన్యత్వమేర్పడువఱకు నాదరూపముగా దానిని న్యస్తము చేయవలెను. శిరస్సు నందు తత్ కారము, ముఖమండలమన ‘సకారము. కంఠమున 'వి' అను నక్షరము, సంధులన్నింటియందు తుకారము, హృదమునందు 'వ' కారము, రెండు ప్రక్కలయందు రేకారము. కుడి కడుపున 'ణ'కారము, ఎడమ కడుపున 'య'కారము, మొల నడిమి స్థలమున “భకారము, మోకాలి కణుపులయందు 'రో' కారము, పిక్కలయందు. 'దే'కారము, పాదపద్మములయందు వ కారము, బొటన వ్రేళ్ళయందు “స్య'కారము, జొమ్మున 'ధీ'కారము. మోకాళ్ల పై 'మ'కారము, గుహ్యమున 'హి'కారము, హృదయమున ‘ధి'కారము, పెదవుల యందు 'యో'కారము. నాసికాగ్రమున 'న' కారము కన్నులయందు 'ప్ర' అనునక్షరము, కనుబొమ్మనడిమి భాగమున 'చో'కారము ప్రాణమున `ద'కారము. శిరస్సున 'యా'కారము తలవెంట్రుకల పై 'త' కారము తన శరీరమున నిట్లు న్యాసము చేసి దేవునియందును అటులే చేయవలెను. ఉపచారములన్నింటికిని కావలసిన ద్రవ్యములన్నింటిని కూర్చుకొని మఱల ఒకసారి చూచుకొనవలెను.
తా ॥ కుంకుమ, అగురు, కర్పూరము, చందనము వీని మిశ్రమమును కలుపుట ద్వారా నీటిని లెస్సగా పరిమళీకరించి, ఓంకారముతో కూడిన గాయత్రీమంత్రము నుచ్చరింపుచు పూజాద్రవ్యములన్నిటి పైన ప్రోక్షణ చేసి, ఆ పిమ్మట పూజచేయవలెను. చక్రపు గనుపులన్నింటియందు ఓంకారమును న్యాసము చేయవలెను. మఱల ఓంకారమును మూడు మాత్రల కాలము ఉచ్చరించి, ఆపైన పీఠ నిష్పత్తి కొఱకు పద్మమధ్యమున సర్వతోముఖముగా. ప్రణవమును న్యాసము చేయవలెను. ఆసనమునందు, సర్వప్రాణులను ధరించు భూమి ఎఱుఁగదగినది. ప్రస్వోంకారమునం దాసనము (భూమి) దీర్ఘంకారమునందు దేవరాజైన బ్రహ్మ భావింపదగినవారు, అమృతమయము, మోక్షప్రదమునైన ప్లుతమును (మూడుమాత్రలకాలమున నుచ్చరించు నోంకారము) భావమునందంతటను వ్యాపింపజేయవలెను. చిత్తమును చాంచల్యము నందనీయని ప్రయత్నముతో, పరమతాత్పర్యయుక్తమైన ఏకాగ్రతతోను, పరమాక్షరమైన ఓంకారమునుచ్చరింపుచు బ్రహ్మదేవుని ఆవాహన చేయవలెను. అట్లు తేజోరూపుడైన బ్రహ్మను ఆవాహన చేసి అప్పుడు గాయత్రీమంత్రాక్షరన్యాసము చేయవలెను. చతుర్ముఖుడు, పద్మస్థుడునైన ఆ దేవదేవుని ధ్యానింపవలెను.
తా॥ సర్వజగత్తును సృష్టించినవాడును, విష్ణురుద్రుల విధానములను తెలిసినవాడును అయిన బ్రహ్మదేవుని సంభావించి, ఆ పిమ్మట భక్తితో విధి విధానముగ పూజింపవలెను -91. గంధము, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను యథాక్రమముగా దేవునికి సమర్పించవలెను. పూజకు సంబంధించిన ఉపచార సమర్పణలన్నియును గాయత్రీ మంత్రము నుచ్చరింపుచునే చేయవలెను -92. పూలు, ధూపము, దీపము, మనోహరమైన నైవేద్యము, పులకండము, లడ్డువములు, దేవదారు ధూపములు, అశోక (కంకేళి) పుష్పములు, దీపమాలలు, (లేక అగరువత్తులు) -93. శుభప్రదములు, సమ్మోహనకరములైన వస్తువులు, (లేక క్షేమమును కలిగించు ప్రారముగల దేవగృహము), పాలు, నువ్వులతో చుట్టబడినవి, అంతటను నువ్వులుగల ఉండలు, పండిన పండ్లు బెల్లము, ఖండశర్కరతో కలుపబడినవి -94. ఇంకను ఇతరములైన వివిధ భక్ష్యవిశేషములు (పిండివంటలు) ఇవి మొదలుకొని శక్తికొలదిగ అనేక వస్తువులను బ్రహ్మదేవునికి సమర్పించుకొనవలెను -95. అప్పుడు మూలమంత్రముతో ఆ దేవతా స్వరూపమును ధ్యానింపవలెను. ఆ దేవుని ఏ విధితో పూజింపవలెనో చెప్పచున్నాను -96. శరీరము పరిశుద్దమగుట కొఱకు మొదట మూడు ప్రాణాయామములు చేయవలెను. అప్పుడు, ఎల్లవేళలలో వాక్కును ధరించుచుండిన ఆదిశేషుని ఆ వాహన చేయవలెను -97. ఆ పిదప పద్మమునందలి అకరువు పై రుద్రుని ధ్యానింపవలెను. విష్ణువును ధ్యానింపవలెను. ఆపైన పద్మమునందు బ్రహ్మను న్యాసము చేయవలెను -98. ఇట్లు ముగ్గురు దేవతలతో అధివసించిన బ్రహ్మదేవుని, పద్మమధ్యభాగమునందున్నవానిని, మూలమంత్రముతో పూజింపవలెను -99. పిమ్మట ఋగ్యజుస్సామవేదములను, జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ధర్మమును పూజింపవలెను -100.
తా ॥ ఓ రాజా ! ఈశానాది క్రమమున విదిక్కుల కధిపతులైన దేవతలను, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందము -101. జ్యోతిషము, ఉపవేదములు, ఇతిహాసపురాణములను క్రమముననుసరించి యధాయోగ్యముగా పూజింపవలేను (102) శిక్ష, కల్పము, వ్యాకరణము ఎల్లప్పుడు దేవతకు ముందుభాగమునను, తక్కినవాని ఆయాదిక్కులయందును, మూలలయందును పూజింపవలెను -103 ప్రణవముతో కూడిన వ్యాహృతులను తూర్పుదిక్కునుండి మొదలుకొని క్రమముగా పూజింపవలెను -104. ఇవి లోకరూపములుగా వ్యవస్థితములై యున్న బ్రహ్మశక్తులు; స్వయముగా మంత్రరూపములై కూడనున్నవి. వీనిని పూజింపవలేను. -105. యంత్ర (పద్మ) దళాంతర్వర్తులైన ఆరు సముద్రములను పూజింపవలెను. దేవతల సమీపమునందుగల నక్షత్రములను, గ్రహములను, రాశులను యథావిధిగా పూజింపవలెను -106. ఆ పైన గరుడుని, నాగులను, దేవతలను, ఋషులను, కులపర్వతములను, ఆయా తేజములను ధరించియున్న వానినన్నింటిని శ్రద్ధగా పూజింపవలెను -107. మొదట మంత్రపూతమైన జలముతో ఆచమించి తన హృదయము మొదలగు అంగములనన్నింటిని దేవతా హృదయాద్యంగములయందు న్యాసము చేయవలెను -108. శిఖ, నేత్రము, చర్మము, అస్త్రము, ఇవి ఇంద్రుని దిక్కగు తూర్పు మొదలుగా గల దిక్కులు, వీనిని యథావిధిగ పూజింపవలెను -109. దేవుని హృదయముముందు, వెనుక శిరస్సును పూజింపవలెను. ఆది దేవుడైన బ్రహ్మను మూలమంత్రముతో అంతటను అర్చింపవలెను -110.
బ్రహ్మేపర్వణి ప్రతిపత్కల్పే బ్రహ్మణోఽర్చనా విధి వర్ణనంనామ సప్తదశోఽధ్యాయః
తా॥ భరతర్షభా! ముద్రను చూపి చివర విసర్జనము చేయవలెను. ఆహ్వానమునందు బ్రహ్మదేవునకు అంకుశముద్ర (లేక ముకుళముద్ర)ను ప్రదర్శింపవలెను -111. ఇట్లు ప్రతిపదాదిగ నియతముగా బ్రహ్మను పూజించుచు, పూర్ణిమ, అమావాస్య దినములలో ఉపవసించువాడు పరమపదమును పొందును -112. సుమంతుముని ఇంకను ఇట్లు చెప్పెను. “అపోహిషామ” మంత్రము హృదయమని చెప్పబడినది. “ఋతం సత్యం” అను మంత్రము శిఖగా కీర్తింపబడినది. “ఉదుత్యం” అనునది నేత్రముగా చూపవలెను అని చెప్పబడినది. “చిత్రందేవానాం” అను మంత్రము మస్తకమని సర్వలోకములందు ప్రసిద్ధము. “వర్మణా తే చ్చాదయామి” అనునది కవచముగా ఉదహరింపబడినది -114. “భూర్బువస్సువః అనునది శిరస్సు కొఱకుగా కీర్తింపబడినది. సాధకుడు బ్రహ్మార్చన విషయికమగు కర్మలన్నింటియందును గాయత్రీమూల మంత్రమునే ప్రధానమని యెంచవలెను -115. ఓంకారముచేత అభిమంత్రితమగు గాయత్రీమంత్రముచే బ్రహ్మను పూజింపవలెను. ఇతరములైన ఋగ్వేదాదులను ఓంకారముతో మాత్రము పూజింపవలెను -116. బ్రహ్మదేవుని ఆవాహనమునందు పూజయందు, త్యాగమునందును గాయత్రియే శ్రేష్ఠమైన మంత్రము. అది వేదమాతగా ప్రశస్తీనందినది -117. గాయత్రీ మంత్రాక్షరతత్వములచే దేవతను పూజించువాడు దుర్లభము, దురాసదమునైన బ్రహ్మస్థానమును పొందును -118.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమున, ప్రతిపత్కల్పము నందలి బ్రహ్మను పూజించు విధిని గులించిన వర్ణనము అను పదునేడవ అధ్యాయము సమాప్తము.
