భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
13. స్త్రీ ధర్మ కథనము
తా॥ బ్రహ్మదేవుడిట్టనెన్లు. “స్త్రీ అందజీకంటే ముందే మేల్కొని స్వీయ కార్యములు నిర్వర్తించి ఆపిదప భృత్య జనుల వ్యవహారములను చూచి భోజనము చేసి విశ్రమింపవలెను. భర్త ఇంట లేనప్పుడు, ముఖ్యముగా అత్తమామల కొఱకు, ఎంత గొప్ప ప్రతీకారము చేయదగియున్నను, స్త్రీ ఇంటి గడపదాటి బయటకు వెడల కూడదు. భర్త కంటే తాను ముందు మేలుకొనినను అతనికి తెలియకుండ బయటకు పోకూడదు. రాత్రి మిగిలియుండగాగాని (తెల్లవారకముందు, రాత్రిగాని, పగటి సమయము లందుగాని అట్లు పోకూడదు. పనివారి నందజీని తన నివాస భవనమునకు పిలిపించి వారిని వారివారి పనులయందు నియోగింపవలేను, అప్పుడు భర మేల్కొనిన పిదప అతనికి కావలసినవీ సమకూర్చీ అటుపిమట ఇంటి పనులనియును కడు జాగరూకతతో నిర్వహించుకొనవలెను. ఇంటిలోనున్నప్పటి ప్రస్తభూషణాద్యలంకారములను విడిచి పెట్టి, పనిచేసి కొనుటకు వీలైన వేషము ధరించి ఆయా సమయములయందాయ పనులను క్రమానుసారముగా చేయవలెను. వంట యింటిని శుభ్రముగా ఊడ్చి, పొయ్యి మొదలగు వానిని శుద్ధిచేసి (అలంకరించి) ఉపకరణములన్నింటిని కావలసిన రీతిలో, కాలుష్యము లేకుండ నుంచుకొనవలెను. పాకశాల మిక్కిలి ఏకాంతమైనది కాక, మిక్కిలి బట్టబయలైనదికాక, విడిగా పనులు చేసికొనుటకు వీలుకలిగియుండి, ఎప్పుడును తన భర్తకు ఆప్తులైనవారితో కళకళలాడుచు గడ్డిగాదెములు లేకుండ శుభ్రముగా బయటవారి దృష్టికి దూరముగా నుండవలెను. వంటపాత్రలు మొదలగునవి శుక్తిచూర్ణము, నారమొదలగువానితో లోపల బయట చక్కగా కడిగి గరగరిక చేయవలెను. పగలు ఎండలో నుంచి శోధించిన కఱ్ఱలతో రాత్రిమంట (వంట) చేయవలెను. పెరుగు పోసిన పాత్రలను ఎప్పుడును లోపలి భాగములయందు శుభ్రపఱచు చుండవలెను.
తా ॥ పగటి వెలుగులో చక్కగా మధింపబడిన నిర్ణీతమైన పాత్రలలో స్వచ్ఛముగా నుంచబడిన పాలలో చేమిరి పెట్టి మంచి పెరుగును సిద్దము చేయవలెను. నూనెలు, మజ్జిగ వానితో చేయు వంటకములు జాగ్రత్తగా చేసి భర్తకొఱకైన పాక క్రియను స్వయముగా చేయవలెను. షడ్రసములలో భర్తకు ప్రియమైనది, ముఖ్యమైనదేదో గమనించి, హితమైనది, కానిది తెలిసికొని, ఎట్టి పదార్థములలో అతనికి ఆరోగ్యమో యేఁగి ఆప్రకారముగ పాకములు సిద్ధము చేయవలెను. క్రమముగా వచ్చెడి ఆపులకును పరీక్షితమైన ఆహారమును గౌరవముగను ప్రేమతోడను పాకస్థలాదులయందు వడ్డించుచు భోజనము పెట్టవలేను. శత్రువులను, జ్ఞాతుల సంబంధులను, భర్తచే కోపగింపబడిన వారిని, భయ పెట్టబడిన వారిని, అవమానింపబడిన వారిని, తిట్లుతిన్నవారిని ఇంకను ఇట్టివారిని పాకాది కార్యములందు నియోగింపరాదు. పాకశాలకు మఱల మలబోయి, అచటనే ఉండుచు, స్వయముగనే ఆధిపత్యము వహించి భర్తకు సంబంధించిన ఆహార పానీయములను ప్రమాద పడక సిద్దము చేయవలెను. వంట పని పూర్తిచేసి, చెమట తుడుచుకొని, ఆభరణములు, గంధము, తాంబులము, పుష్పములు మున్నగువానితో తగు మాత్రముగా అలంకరించుకొని. తత్కాలోచితములగు వినయ సంభ్రమములతో కొసరి కొసరి వడ్డించుచు భోజనము పెట్టవలెను. సాధారణమైన జబ్బులు కలిగిన సమయములందు ఆహార పానీయాదులను నిత్యపద్దతి కంటే వ్యత్యస్తముగా ప్రయోగింపవలెనని తెలిసినవారు చెప్పుదురు. తన భర్త ఎవరెవరిని, తనకంటే హీనులుగ, తనతో సమానులుగా, లేక తనకన్న అధికులుగ ఎట్లు చూచునో భార్య, తాను కూడా వారువారు తటస్థించినపుడు అట్లే-అంతకన్న అధికముగను-న్యాయముగా చూడవలెను.
తా॥ సవతుల సంతానములను తన సంతానముకంటే నధికముగా చూడవలెను. సవతిని సోదరివలెను, ఆమె వధువులను తన బంధువుల వలెను చూడవలేను. భోజనము, బట్టలు, అభ్యంగన స్నానాదులు, అలంకరణలు సవతి బిడ్డలకు కానిదే తన బిడ్డలకు చేయకూడదు. వ్యాధిగ్రస్తులైన వారికి చికిత్స కొఱకు ఔషధములు మొదలగునవి తనబిడ్డలకు వలెనే సవతి బిడ్డలకును, ఆశ్రితుల వారికెల్లరకును మిక్కిలి ప్రేమతో ఈయవలెను. వారి దుఃఖమున దుఃఖింపవలెను. వారి సంతుష్టిలో సంతోషింపవలెను. భృత్యుల, బంధువుల, సవతుల సుఖ దుఃఖములలో సానుభూతి కలిగియుండవలెను. పనులన్నియు పూర్తి చేసికొనిన పిమ్మట అవకాశము కలుగగా అప్పుడు విశ్రమింపవలెను. రాత్రి సమయమున నిద్రనుండి మేల్కొని, ధనమునుగానీ సమయమును గాని అన్యధా వ్యయము చేయుచుండిన భర్తను, ఏకాంతమందు బోధచేయుచు జాగరూకుని చేయవలెను. సవతులకు సంబంధించిన అల్ప విషయములను తానుగా తన భర్తకు చెప్పకూడదు. కాని ప్రమాదకరములైన వ్యభిచారాదులను గుజించి మాత్రము రహస్యముగా నివేదింపవలెను. దౌర్బాగ్యురాలు, సంతానములేనిది, భర్తచేత అత్యంతముగా తిరస్కరింపబడినది, సరిగా చూడబడనిది, అయిన సవతిని ఓదార్చి భర్తకు ఆమె పై ప్రేమ కలుగునట్లు అనుకూలపరచవలెను. అటులే భర్తచేత, పురుష వాక్యములతోను, కఠిన శిక్షలతోను పీడింపబడిన వానిని తగు విధమున నోదార్చి వానిని తిరిగి భర్తకు విధేయనిగా మార్చవలెను. లేనిచో వాడు మఱల దోషములను చేయుచు ప్రమాదకారియగును. చాలా కాలము గడిచినను తనకు సంతానము కలుగకుండిన యెడల నియతి విధానమును గుర్తించి ఓదార్పు పొందవలెను. భర్త చేయనిచ్చగించు (అన్య వివాహాది) ఏపనిని గూర్చియైనను ఇంచుక గమనించి, దాని విషయమేజింగిన దానివలె ఆయత్తతను ప్రదర్శింపవలెను.
తా ॥ భర్త వివాహ విధినంతయును అదరముతో నిర్వర్తించి, అతడు వివాహమాడిన వధువును ఎప్పుడును తన చెల్లెలి వలె చూడవలెను. క్రొత్త పెండ్లికూతురుకు సంబంధించిన బంధువులకు, వారి సమూహములకు సంతోషముతో కూడిన మనస్సుతో వారికి శుభమును కోరుచు పూజ చేయవలెను. పెండ్లి కూతురుకు తాను స్వయముగ ఈర్యాక్రోధాది భావములు లేకుండ, తల్లివలె, గృహ కృత్యములయందు, అక్కడి అచార వ్యవహారములందు శిక్షణనీయవలెను. ఈ విధముగ భర్త అభిప్రాయములన్నింటిని నెరవేర్పవలెను. తన సుఖమును త్యాగము చేసి యైనను భర్తకు ఆనుకూల్యమును చేయవలెను. స్త్రీలకు భర్తయే దైవము. స్త్రీలకు వారి భర్తలు, సర్వవర్ణముల వారికి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు అగ్నిహోత్రము, ప్రజలకు రాజు దైవతములు. స్త్రీల ధర్మార్థకామ పురుషార్థముల సాధనకు రెండు కారణములు నిర్దేశింపబడినవి. ఒకటి భర్తకు అనుకూలముగా నుండుట. రెండవది ఎప్పుడును జారని శీలము. ఆ విధముగ లోకమునందు స్త్రీలకు రూప యౌవన భూషణాదులు కాక ప్రియునికి (భర్తకు) అనుకూలముగ నుండుటయే ఎల్లప్పుడు ఆరోగ్యకరము. వయో రూపాదులు లేని దౌర్భాగ్యురాండ్రు, యౌవనము జారిపోయిన సామాన్యరూపవతులును భర్తకు అనుకూలముగనుండుటచేత అతని ప్రేమకు పాత్రులైన వారున్నారు. అందువలన ప్రియత్వమనునది జనములకు యోగ్యతాపరమైన మొదటి కారణము. ఆ ప్రియత్వము లేనిచో తక్కిన గుణములెన్నియున్నను నిష్పలములు. అన్నియును ప్రయోజన రహితములు కూడ. కాబట్టి సర్వ ప్రయత్నములతో తన యోగ్యతను పోషించుకొనవలెను. అన్ని పనులయందును ఇతరుల మనోభావములను తెలసి ప్రవర్తించుచుండుటయే దీనికి మూలము.
తా॥ భర్త బయటకు వచ్చుచున్న సమయమును గమనించి తన వేషమును శుభ్రపరచుకొని భర్త కూర్చుండుట కొఱకు ఆసనమును సిద్దపఱచి, అతని ఆజ్ఞకొఱకు తత్పరురాలై నిలబడియుండవలెను. పరిచారికను నివారించి అతని పాదములను తానే స్వయముగా కడుగవలెను. అతని అలసటను (శ్రమ స్వేదమును) పోగొట్టుటకై విసన కఱ్ఱవీపనలు మొదలగు ఉపచారములు చేయవలెను. ఆహారము, స్నానము, పానము మొదలగువాని విషయమును అతడు సొలోచనుడై ఎక్కడ దృష్టి యుంచునో, ఇంగిత మెఱుఁగు విధానమున, దానిని అతనికి సమకూర్చి పెట్టవలెను. సవతుల యొక్కయు భర్తయొక్కయు బంధువులును భర్త మసన్సునకనుకూలముగా గౌరవింపవలెను. తన వారిని అట్లు గౌరవింపబనిలేదు. వారి బంధువులను తన బంధువులును గమనించి భర్త చిత్తమును ప్రసన్నము చేయవలెను. అనగా వారి బంధువులనాదరింపవలెను. తన బంధువులనట్లదరింపకుండవలెను. ఆ కులముననే జీవితము గడుపవలసిన స్త్రీ, తనవారిని సత్కరించుట భర్త అభిప్రాయమైనను అట్లు చేయరాదు. తన బంధువులను సత్కరించుటచేత స్త్రీకి గణనీయత రాదు. స్త్రీలకు అన్ని దశల యందును పతి కుల సంబంధమే పూజ్యమైనది. ఏ సత్కులజాతుడైన పురుషుడును స్వకన్యాపక్షము నుండీ ఉపకారాంశమును వాంఛింపడు. తన కూతురును సాలంకృతముగా పూజించి, శాస్త్రోక్తముగ అతనికి ఇచ్చి వివాహము చేయును. అట్టి తరి ఆమె నుండి తాను సత్కారములు కోరుటకంటే అకార్యమేమి కలదు! కన్యనిచ్చి, తద్ద్వారమున తమ వృత్తులు కల్పించుకొనుట యనునది సేవకులు, ఆతతాయులు, నటులు మొదలగు వారు అనుసరింపదగిన "మార్గమే కాని ఉత్తము అనుసరింపదగినది కాదు. అందువలన కన్యాపక్షము వారెప్పుడును వర పక్షము వారి నుండి కేవలము ప్రేమను మాత్రము సాధించు ప్రసంగముగల ఆదరమును పొందవలెను.
తా ॥ ఆమె భర్త పైన ప్రేమను కొనసాగింపవలెను. లోకమునందు తమ గౌరవమును కాపాడుకొనవలెను. తమ్మతాము నిందలపాలు కాకుండ రక్షించుకొనవలెను. సాధు వృత్తుల నవలంబింపవలెను. ఇట్లు విషయమును తెలిసికొని స్త్రీ తన పుట్టింటి వారికినీ, తన భర్తకును ఆమోదకరమైన రీతిగా సత్రవర్తన కలిగియుండవలెను. భర్త ప్రేమను పొందినదైనను, సచ్చీలము కలిగియుండినదైనను పుట్టిన కులము సత్కీర్తి కలదైనను, లోకాపవాదము వలన సీత, భయంకరమైన అనర్థములను పొందెను. భోగ్యస్థితి కలిగియుండుటచేత, గుణదోష జ్ఞానము లేకపోవుటచేత, సాధారణముగనే వినయము, ఔచిత్యము పాటింపకుండుట చేత స్త్రీల శీలమును తెలిసికొనుట కష్టసాధ్యము. స్వభావము గ్రహింపవీలుకానిది యగుటవలనను, ప్రాయికముగ కాపట్యము కనబడుచుండుట వలనను, నిరంకుశత్వము వలనను, పేర్కొనదగిన స్త్రీలు లోకమునకు అరుదుగా కన్పట్టుదురు. స్త్రీలకు తమ గౌరవ మర్యాదల విషయమున మనస్సునందు ఏ కల్మషము లేకుండినను, దైవయోగము వలననో, దుర్యోగము వలననో, ఎట్లు వ్యవహరింపవలెనో వారికి తెలియకపోవుటవలననో భ్రష్టురాండ్రుగా కన్నట్టువారు కలరు. ఇట్టి దౌర్భాగ్యస్థితికి అనుభవించుటయే తప్ప దీనికి ప్రతీకారములేదు. ఒక వేళ ఉండినచో అది ఉత్తమ చరిత్ర సృష్టించుకొనుట, లోకరీతిననుసరించి ప్రవర్తించుట అగును. అదియే, అకారణముగ నేర్పడిన దుశ్చారిత్రమును చక్కజేయు నౌషధము. ఊలాటలు మొదలగు వానియందు రాత్రి వేళల ప్రసక్తి గల స్త్రీని, విటులతో వినోదించుదానిని, భర్తలేని స్వైరిణిని, -58. చక్కగా అలంకరించుకొనిన, వృదుని యొక్క, అంగవికలుని యొక్క భార్యను, ప్రయాణములయందు, పాటలయందు తగుల్కొనియుండుదానిని, సతియనిగాని సాధ్వియని గాని ఎవడు విశ్వసించును?. ఇట్టి వారిలో అభిప్రాయ గర్భితములైన ఆకారములు గలవారు, శంకాస్పదమైన, ఇంద్రియ ప్రయోజనము నాశించిన అలంకరణ గలవారునైన ఏ ఇరువురి స్త్రీ పురుషుల, సంభాషణమునకైనను తత్వ పరిజ్ఞానమే విషయమైన యెడల నిక యోగులకు మధ్య విషయమేమైయుండగలదు? లేక యోగ్యుల మధ్య గలు సంభాషణయే తత్వజ్ఞాన విషయకమగునంటిమేని యిట్టివారి మధ్య గలునది క్షుద్రమైనది కాక మఱియొకటి కాజాలదు కదా !
తా ॥ కాబట్టి, ఆచారమెట్లు విహితమైయున్నదో అటులే, దానికి కట్టుబడియే, స్త్రీ నడుచుకొనవలెను. అనుచిత స్నేహములు, అవాచ్యభాషణములు ఆ కులమును కంపింపజేయును. పుట్టినిల్లు, మెట్టినిల్లు, స్త్రీజాతి గౌరవములను కాపాడవలెను. సంతాన గౌరవమును నిలుకడగా నుంచవలెను. అటుల నడచుకొనుటచేతనే కులస్త్రీలకు భర్తయొక్క తనయొక్క ధర్మార్థకామపురుషార్థములు సిద్ది సాధ్యమగును. దుశ్శీలతవలన తనతోబాటుగా తల్లికులము, తండ్రికులము, భర్తకులము పతనమగును. ఉత్తమ చరిత్రయే భూషణముగా గల స్త్రీలు వీనినుద్దరింపగలుగుదురు. భర్త చిత్తమునకనుకూలముగ నుండుట, సచ్చీలము అను నీ రెండు కలిగియున్న స్త్రీలకు, బంగారములు, రత్నములు మొదలగునవి బరువులు మాత్రమే యగును కాని అలంకారములు కానేరవు. సద్వంశములందు బుట్టిన స్త్రీలకు లోకము, జ్ఞానము, భర్త మీద అచంచలమైన భక్తి కంటే అతిశయించిన శ్రేష్టధర్మములు లేవు. ఇవియే కులవ్రతముగా తెలియవలెను. కాబట్టి ఏ స్త్రీ లోకమును, భర్తను యధోచితముగ నారాధించునో ఆమెయే ధర్మార్థకామములను అవినాశముగ పొందును.
ఇది శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున స్త్రీ ధర్మకథన మను పదమూడవ అధ్యాయము.
