భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

125. వ్యోమ మహాత్మ్యమున భువన కోశ వర్ణనము

తా॥ శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! సూర్యదేవుని యెదుట కన్పట్టుచున్న యీ వ్యోమ స్వభావమేమి? అది యెట్టిదో దయతో నాకుఁ దెలియఁజెప్పుడు”. శతానీకుని యాకాంక్షవిని సుమంతుముని యిట్లనెను. “శుభ ప్రదమైన సూర్యాయుధమగు వ్యోమమును గూర్చి తప్పక చెప్పెదను. దాని స్వభావమెట్టిదో, దాని యందు దేవతలేట్లు నివసింతురని చెప్పబడినదో వివరింతును. సర్వ దేవమయము, నాలుగు శృంగములు గల (నలువైపుల వ్యాపించియున్న) వ్యోమ స్థానము సూర్యదేవుని ముందు భాగమున గలదు. స్వర్ణాది ధాతుమయ సముద్రమునఁబుట్టి విశ్వము నావరించియున్న దాని నుండి వ్యోమము కలిగినది. కలికి సంబంధించిన వ్యోమము, భూమీయని చెప్పబడును. వరుణునకు పాశము, బ్రహ్మదేవునకు హుంకారము, విష్ణు భగవానునకు చక్రము, శివునకు త్రిశూలము. ఇంద్రునకు వజ్రాయుధమెట్లో సూర్యునకు వ్యోమ మట్టిది. ఆ వ్యోమమునందు ముప్పది ముగ్గురు యాజ్ఞికులైన దేవతలు క్రీడించుచుందురు. హరుడు, వరుడు, శుద్ధుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభుడు, కపర్ది, రైవతుడు, ఈశ్వరుడు, భవనుడు అను వారే ఏకాదశ రుద్రులని చెప్పబడుదురు. ఆదిత్యుల యొక్కయు, విష్ణు చక్రము యొక్కయు నామములు చెప్పవలెను గదా! అర్యముడు, మిత్రుడు, భగుడు, వరుణుడు. వివస్వంతుడు, సవిత, పూషుడు, త్వష్ట అంశుడు, అతితేజుడు, విష్ణువు, ఇంద్రుడు - వీరు ద్వాదశాదిత్యులు. ధ్రువుడు, ధరుడు, సోముడు, ఆపుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాతుడు - వీరెనమండ్రు వసువులు.

తా॥ నాసత్యుడు, దస్రుడు నను నిరువురును అశ్వినులను పేర్కొనబడుదురు. ఇక విశ్వేదేవులనామములను దెలుపుచున్నాను. తెలిసికొనుము. క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, కాలుడు, కాముడు ధృతి, కురు, శంకుమాత్రుడు, వామనుడు - ఈ పదుగురు విశ్వేదేవులు. వీరిప్పుడున్నారు. రాబోవు వారిని గూర్చి వినుము. యముడు, తుషితులు, వస్తువులు, వశవర్తులు. సత్యులు, భూతరజస్సులు, సాధ్యులు తరువాతి వారు. ఇట్లాబు మన్వంతరములందు పన్నెండుగురు దేవతల చొప్పున నుందురు. పార్వతులను నితరులు తుషితులతో నుండిరి. సాధ్యులను దేవతలను పేళ్లతో(జెప్పుచున్నాను. తెలిసికొనుము మనుడు, అనుమంతుడు, ప్రాణుడు, నరుడు, నారాయణుడు. వృత్తిలంబుడు, మనువు, సముడు, ధర్ముడు, వీర్యవంతుడు, విత్తేశుడు, ప్రభువు అని సాధ్యులు పన్నెండుగురు చెప్పబడియున్నారు. వీరు యజ్ఞ భుక్కులు. సర్వలోకములయందు పూజింపబడు దేవతలు. వీరదితి యందు కశ్యపునకు బుట్టిన సంతానము. విశ్వేదేవులు, వస్తువులు, సాధ్యులు ధర్ముని పుత్రులు. ఇట్లు ధర్మసుతుడైన సోముడు మూడవ వసువు. ధర్ముడు బ్రహ్మ పుత్రుడని పురాణ నిశ్చయము. ఇఁక ఇంద్రులను, వస్తువులను వారి వారి నామములతోఁజెప్పుచున్నాను. వినుము.

తా॥ మొదటి మనువు స్వాయంభువు. అటు పిమ్మట స్వారోచిషుడు. అటు పైన ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనువారలు క్రమముగ మనువులైయుండిరి. ఈ ఆణుగురు మనువులిప్పటి వఱకు గడిచిపోగా నేడవ వాడగు వైవస్వతుడు వర్తమానుడని తెలియవలెను. వీరుకాక భవిష్యత్కాలమున రాబోవు వారేడుగురు కలరు. వీరిలో మొదటివాడు అర్కసావర్ణి. అటు పిమ్మట కమముగ బహు సావరి, భవసావరి, ధరుసావరి. ఐదవవాడు దకసావరి, ఇటుసావరులేదుగురు. వీరి యనంతరము రౌచ్యుడు, భౌవ్యుడు (భౌత్యుడు)నను వారితో కలిసి మొత్తము పదునలుగురు మనువులు గలరు. విష్ణుభుక్కు మొదటి యింద్రుడు. విద్యుతి, విభువు, ప్రభువు, శిఖి, మనోజవుడు. ఓజస్వి (వర్తమాన కాలమున నున్న ఇంద్రుడు) బలి, భావ్యుడు, అద్బుతుడు (ఇతడు పదియవ యింద్రుడు). సుసొత్త్వికుడు (శాంతుడు), కీర్తి, శతధాముడు (ఋతుధాముడు), దీవస్పతి, యనువారు భవిష్యత్కాలమున రాబోవు యింద్రులని తెలియవలెను. కశ్యపుడు, అత్రి వసిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని యనువారు సప్తర్షులు. తదుపరి యగ్ని పరిగ్రహులగు మరుత్తులను గూర్చి చెప్పెదను. ప్రవహుడు, ఆవహుడు, ఉద్వహుడు, సంవహుడు. వివహుడు, నీవహుడు, పరీవహుడు, అను మరుత్తులేడుగురు వేజ్వేలు మార్గములందంతరిక్షమున చరించుచుందురు. శుచి, వైద్యుతుడు, పావకుడు అను వారు సూర్యాగ్నులు. అరణి మంధనమున నుత్పన్నమగు నగ్ని పేరు పవనుడు. ఈ అగ్ని మూడు విధములని చెప్పబడినది.

తా॥ అగ్నులలో పుత్ర పౌత్రులు కలిసి మొత్తము నలుబదుగురు. మరుత్తులలో నొక్కక్కగణమున నేడుగురు చొప్పున నలుబది తొమ్మండుగురుగాఁదేలియవలెను. వ్యోమమునకు కాలము, సంవత్సరము, అగ్ని, ఋతువులు పుట్టెను. ఋతు పుత్రులైదుగురని సనాతనుల నిశ్చయము. వారిలో సంవత్సరుడు మొదటి వాడు. పరివత్సరుడు రెండవవాడు. ఇద్వత్సరుడు మూడవవాడు. అనువత్సరుడు నాలుగవవాడు. ఐదవవాడు వత్సరుడు. ఇట్లు వీరైదుగురని చెప్పబడినది. వీరిలో సంవత్సరుడగ్ని. పరివత్సరుడు సూర్యుడు. ఇద్వత్సరుడు సోముడు. అనువత్సరుడు ఛాయువు. వత్సరుడు రుద్రుడని యెఱుంగవలెను. వీరైదుగురును యుగ దేవతలు. ఋతుపుత్రులు పితరులనియు క్రతుపుత్రులు పితామహులనియు తెలియవలెను. వత్సర పంచకము బ్రహ్మపుత్రులు. సౌమ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులనుమువ్వురు తండ్రులు జీవించియున్న నరులకు పితరులు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు. రాహువు, కేతువు అనువారు గ్రహములు. వీరు ముల్లోకములకును భావాభావములను (ఔగాములను) దెలుపుచుందురు. సూర్యుడు చంద్రుడు మండల గ్రహములు. రాహువు ఛాయాగ్రహము. మిగిలినవి తారాగ్రహములు.

తా॥ నక్షత్రాధిపతి చంద్రుడు. గ్రహాధిపతి సూర్యుడు. సూర్యడగ్నియని, చంద్రుడు జలమనియు చెప్పబడును. అట్లే గ్రహములలో సూర్యుడు బ్రహ్మయనియు, చంద్రుడు విష్ణువనియు తక్కిన తారాగ్రహము(లు) రుద్రుడనియు తెలియవలెను. సూర్యుడు కశ్యపుని కుమారుడు, చంద్రుడు ధర్ముని కుమారుడు. గురుశుక్రులు మహాగ్రహములు. వీరిరువురు ప్రజాపతి కుమారులు. బుధుడు సోముని కొడుకు. శని సూర్యతనయుడు. రాహువు సింహికాపుత్రుడు. కేతువు బ్రహ్మకుమారుడు. గ్రహములన్నింటికి క్రిందు భాగమున సూర్యుడు చరించుచుండును. చంద్రుని నక్షత్రమండలమచటినుండి దూరముగనున్నది. నక్షత్రముల కన్న కుజబుధులు, వారికన్నను శుక్రుడు దూరముననున్నారు. అంతకంటెను తారాగ్రహమండలము పైన గలదు. దాని పైన బృహస్పతి, అంతకు పై భాగమున శని, అంతకు పైన రావుహుగలరు. వీరిక్రమమీట్లు చెప్పబడినది. స్వర్గము ధ్రవాసక్తమై యుండును. ఆదిత్యునాశ్రయించి రాహువుండును. ఎల్లప్పుడు చరించుచుండును. శుక్రుని వైశాల్యము తొమ్మిదివేల యోజనములు. సూర్యుని విస్తీర్ణము కంటే శనైశ్చరుని విస్తీర్ణము రెండింతలుండును. చంద్రుని విస్తీర్ణము కంటే నక్షత్రమండల విస్తీర్ణము మూడింతలుండునని తెలియవలెను.

తా॥ నక్షత్రమండలము కన్న నొక పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవాడు బృహస్పతి. బృహస్పతి కంటే పాదభాగము తక్కువ విస్తీర్ణము గలవారు శుక్రుడు, అంగారకుడు. శుక్రోంగారక మండలముకన్న చతుర్ధభాగము తక్కువ వైశాల్యము గలవాడు బుధుడు. ఆకాశమున గల నక్షత్రములన్నియు బుధునితో సమానమైన విస్తీర్ణముగలవి. వానిలో యోజనార్ద ప్రమాణముకన్న కుఱుచగ ఏ నక్షత్రమైన నుండదు. రాహువు సూర్యుని ప్రమాణముననుండును. ఎప్పుడేని చంద్రుని ప్రమాణమునను ఉండును. ఇవి నక్షత్ర గ్రహ ప్రమాణములు. కేతువు మాత్రము విస్తీర్ణ ప్రమాణ విషయమున నెల్లప్పుడొకే విధమున నుండడు. అతని గమనము కూడ అవిజ్ఞాతమై, అనియతమైయుండును. అతడు చంచలుడగుటయే దీనికి కారణము. అట్లు చూడబడుచున్న రూపము గలవాడయియును అతడనేక రూములను ధరించుచుండును. పృథివియే భూలోకమనిచెప్పబడును. అంతరిక్షము భువర్లోకము. స్వర్గము స్వర్లోకము. ఊర్థ్వలోకము లొకదాని కన్ననొకటి పైభాగమున గలవు. భూలోకమున కెల్లప్పుడు అగ్నియే రాజు, అందుచే నతడు భూపతి యని పిలువబడును. వాయువు నభస్పతి. సూర్యుడు దివస్పతి, గంధర్వులు, అప్సరలు, గుహ్యకులు, సిద్ధులు, రాక్షసులు 'భూలోక వాసులు. ఇక భువర్లోక వాసులనుగూర్చి వినుము. మరుద్గణము, రుద్రగణము, అశ్వినులు. ఏడవ స్కంధమున నుందురు. ఆదిత్యులు, వస్తువులు, దేవగణములు స్వర్లోకమున నుందురు. నాల్గవదియగు మహర్లోకమున ప్రజాపతులతోబాటుగ కల్పవాసులుందురు. ఐదవదియగు జనోలోకమున భూమికి నిగ్రహాదులిచ్చు జననామక ఋషులుందురు.

 తా॥ తపోలోకమున ఋతు సనత్కుమారాదులు, బ్రహ్మసంబంధులుందురు. పునరావృత్తి లేని వారు నివసించునది సత్యలోము. దానిని బ్రహ్మలోకమందురు. అది ఆప్రతిఘాత లక్షణము గలది (విఘ్నములు, బాధలు లేనిది) అచట పురాణేతిహాస - విదులు క్రీడింతురు. పురాణములు వినువారును నివసింతురు. భూతలమునుండి కొన్ని వందల వేల లక్ష యోజనముల పై " " దూరమున సూర్యదేవుడున్నాడు. భూమి, నుండి నూఱు కోట్ల యోజనముల పై దూరమున ధ్రువుడుండును. అచటి నుండి యిరువది లక్షల యోజనముల పర్యంతము మూడులోకముల (భూర్భువస్స్వర్లోకముల) ప్రదేశముగా పేర్కొనబడును. ధ్రువలోకమున కూర్థ్వముగా రెండు లక్షల యోజనముల క్రిందుగా లోకాంతరము గలదు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, భూతగణములు, విద్యాధరుడు అను ఎనిమిది జాతులవారు దేవయోనులు. వ్యోమము నందీయేడు లోకములు ప్రతిష్ఠితములై యున్నవి. ఈ వ్యోమమునందే మరుత్తులు, పితరులు అగ్నులు, గ్రహములు. నేనింతకు పూర్వము పేర్కొనిన దేవజాతులెనిమిది, కొందఱు రూపముగలవారు, మణికొందఱమూర్తులు-వీరందఱు నీ వ్యోమమునందే నివసింతురు. వ్యోమము అననిట్టిది. సర్వము దీనియందే యిమీడియున్నది. సర్వదేవతలు, సర్వగ్రహములు నిందే యున్నవి. అందువలన వ్యోమము నర్చించువాడు, సర్వదేవతల నర్చించువాడగును. కావున శుభము న పేక్షించువాడు సర్వప్రయత్నములచే వ్యోమమును పూజింపవలెను. భక్తి శ్రద్ధా సమన్వితుడై వ్యోమము నర్చించువాడు సూర్యలోకమునకుఁబోవును. రాజా! ఇందు సందేహము లేదు.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు వ్యోమ మాహాత్మ్యమున భువన కోశ వర్ణనమను నూట యిరువదియైదవ అధ్యాయము సమాప్తము.