భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
129. సాంబకృతాదిత్యమూర్తి స్థాపనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “సాంబుడు సూర్య భగవానునిచే వరము పొంది, శ్రేష్ఠమగు తన పూర్వ రూపమును బడసి సంతుష్టాంతరంగుడై, తన తపస్సు, సూర్య దేవుని యను గ్రహమును గూర్చి యాలోచించుచు నానందాశ్చర్యములలో మున్కలిడేను-1. తపః కాలమునందలి యభ్యాసవశమున లోక పూజ్యులగు తపస్వులతోగూడి స్నానార్ధమై సమీపముగల చంద్రభాగానదికిఁబోయెను-2. ప్రతి దినమునందు వలెనే అతడు తన మనస్సున మండలాకారుడగు సూర్యదేవుని భావనచేయుచు శ్రద్ధాళువైస్నానమాచరించి ఎట్టిరూపముగలస్యూర్యదేవుని ప్రతిమను ప్రతిష్ఠింపవలెనో యని యాలోచించెను-3. స్నానమును త్వరగా పూర్తిగావించి నదీమ తల్లికకు నమస్కరించుచున్నంతలో, తానూహించుచుండిన సూర్యదేవుని ప్రతిమ నీటితోబాటుగ ప్రవహించుచు సమీపమునకు వచ్చెను-4. ఆ ప్రతిమను చూచి సాంబుడు మిక్కిలి సంతసించి, “సూర్యదేవుడు తనను ప్రతిష్ఠింపుమని నన్నాజ్ఞాపించెను గదా! ఆ దేవదేవుని ప్రభావము వలననే యీ ప్రతిమ యిటనావిర్భవించిన దనుటలో సందేహములేదు"-5. అని తర్కించుకొని ప్రతిష్ఠించెను-6. సాంబుడిట్లా ప్రతిమను మీత్రవనమునందలి యొక రమ్యమైన ప్రదేశమున విధివిధానముగ ప్రతిష్ఠించి-7 నమస్కరించి, “భగవాన్! ఈ నీ దివ్యాకృతి నేవరు నిర్మించిర”ని యా ప్రతిమనడిగెను-8. అప్పుడా సూర్య ప్రతిమ సాంబునితో నిట్లనెను. “సాంబా! వినుము. అద్భుతమైన యీ నా పురుషాకృతి యెవరిచే నిర్మింపబడినదో స్వయముగ నేనే చెప్పుచున్నాను వినుము-9. “పూర్వము నా రూపము మిక్కిలి తేజోవంతమై సర్వ ప్రాణులకును దుర్నిరీక్ష్యమై ప్రకాశించుచుండెను. అప్పుడు దేవతలందఱు నన్ను పూజించి "దేవా! సర్వ ప్రాణులకును మీ తేజః స్వరూపము చూడశక్యము కాకున్నది. కావున దర్శనీయమగు నట్లనుగ్రహింపుడ'ని ప్రార్థించిరీ.
తా॥అప్పుడు “నా తేజస్సు నరుగదీసి నా రూపమును సరిచేయుమ”ని మహాతపుడైన విశ్వకర్మనాదేశించితిని-11. నా యీ యాదేశమున, నాతడు శాకద్వీపమునందు తిరుగుయంత్రమునమర్చి నిపుణతతో నా రూపమును సరిచే సెను-12. ప్రాణి ప్రపంచమంతయు తదనుగుణముగ పునర్నిర్మితమయ్యెను. ఆ విశ్వ కర్మయే కల్ప వృక్షపు దారువుతో నీ ప్రతిమను నిర్మించేను-13. నిర్మించి, పూర్వము సిద్దులతో సేవింపబడు హిమవత్పర్వతమునకు వెనుకగల ప్రదేశమునందున్న చంద్రభాగానది యందు, దీనిని, నీ కొఱకే వదిలి పెట్టేను-14. నిన్ను తరింప జేయునుద్దేశముననే యాతడీ ప్రతిమను చంద్రభాగా జలములలో దించేను. సాంబా! అందుచే నీ ప్రదేశము పవిత్రమైనది. సుందరమైనది కూడా. ఇచట నెల్లప్పుడు నా సాన్నిధ్యముండును-15. పూర్వాహ్లామున నా యునికి యిచటి తీరము నుండి జనులచే చూడబడును. మధ్యాహ్న సమయమున ‘కాల ప్రియము'నందు ('కాలపి'యందు) చూడబడును. అపరాష్ట్రమున నిచట నిత్యమును నాదర్శనమగును-16. పూర్వాహ్లామున బ్రహ్మదేవుడు, మధ్యాహ్నమున విష్ణుదేవుడు, అపరాష్ట్రమున శివదేవుడును నన్ను పూజించుచుందురు”-17. అని ఇట్లు భగవానుడగు భాస్కరుడు సాంబునకుఁజెప్పెను. సాంబుడు సూర్యుని వాక్యములను విని సంతసించెను. అప్పుడు ప్రతిమాగతుడైన భగవానుడంతర్షితుడయ్యెను.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు, సాంబోపాఖ్యానమున 'సాంబకృతాదిత్య స్థాపన'మను నూట యిరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
