భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
53. రధ సప్తమి కల్పమున సూర్యగతి వర్ణనము
తా॥ అరుణుడు సూర్యురథ సారథ్యమునకై పూర్వము నాచే నియుక్తుడయ్యెను. ఇంద్రుని చేత మాఠరుడు, వాయు యములచే తమ ప్రతినిధులు. గరుత్మంతునిచే ననూరుని పై ముందు పయనించుటకై నఖములచే, తుండముచే దెబ్బకొట్టగల విమలుడు నియమింపబడిరి. మహాదండమే ఆయుధముగా గల దండుడు, మిగిలిన మహాగణముల కధిపతులు కాలస్వరూపుడవైన నీచేత సూర్య పార్శ్వ వర్తులుగ నియమింపబడిరి. కార్తికేయ ప్రభువుచేత వసుభిత్తు, ఆయుధాంగారికుడు; అగ్నిచేత పింగళుడు, నీ చేతనే చక్కగా కట్టడిచేయగల మహాదండాయుధుడు, మహాగణాధిపుడు నియుక్తులైరీ. యముడు హస్తుని, వరుణుడు పాశహస్తుని సమిధనుని, కుబేరుడు విష్ణువును. అశ్వినీ కుమారులు కాలోషకాలురను శక్తి ప్రధానులను, నరనారాయణులు క్షారులు, ధారులు, ధిషణ కృష్ణులను వారిని నియమించిరి. దిక్కులయందు, వీదిక్కులయందు దిక్పాలనమను వైరాజ, శంఖపాల, పర్జన్య, రజస్సులకు విశ్వేదేవతలిచ్చిరి-6. బ్రాహ్మ్యది సప్తమాతృకలు మరుద్గణములకిచ్చిరి. ఓంకారము, వషట్కారము, వేదఘోష, శివుడు, వినాయకుడు, ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, తమతో సమానులైన వేయి సాగులతో కూడి సూర్యరథమునను గమింతురు. ప్రాతసాయం సంధ్యలతో కూడ గాయత్రియైన సావిత్రీదేవి భగవానుడైన సహస్రకరణు నాశ్రయించి యుండుట కొఱకు సూర్యమండలమును విడువకుండును. ఇదియే సర్వదేవతాకమైన సూర్యమండలము. ఇదియే బ్రహ్మవాదులకు, బ్రహ్మయజ్ఞవాదులకును పూజాస్థానము. భగవద్భక్తులకు శ్రేష్ఠమగు దేవత. హరిహరులకు మహేశ్వరుడు. ఈ స్థానాభిమాన దేవత లెల్లప్పుడు తమ తేజస్సులతో సూర్యుతేజస్సును పుష్టమొనర్చుచుందురు.
తా॥ ఋషులు తమ మాటల కూర్పుల నేర్పులతో సూర్యదేవుని స్తోత్రము చేయుచుందురు. గంధర్వులు తమగానముతో, అప్సరలు తమ నృత్యముతో నాదేవుని యుపాసింతురు. ఇషు (బుధ) గ్రహమాకాశమునఁదిరుగుచు రక్షించుచుండును. సర్పములు, రాక్షసులును సూర్యుననుసరించియుండి రక్షణ చేయుచుండును. అరువదివేల మంది వాలఖిల్య ఋషులు సూర్యునకు పరిచర్యలు చేయుచు సమస్కరించుచుందురు. దీవస్పతి, స్వభువు ఇద్దఱును సూర్యరధమునకు ముందు ఒక యోజన మాత్రదూరమున నడచుచందుగు. భర్గుడు రథమునకు కుడిప్రక్కన, బ్రహ్మదేవుడెడమ ప్రక్కన వెంటనంటియందురు. లోకముచే పూజింపబడు గ్రహములన్నియు రథము వెనుక నడచుచుందురు. రాహుకేతువులిద్దఱు ముందేయుందురు. కుబేరుడు దక్షిణభాగమున, వరుణుడుత్తరభాగముననుందురు. ఐనను వీరు తఱచుగ ముందునకగుచుందురు. ఎడమ ప్రక్క వీతిహోత్రుడు, వెనుక ప్రక్క హరియునుందురు. రథపీఠమునందు పృథివి, అంతరాళమున నాకాశముండునని తెలియవలెను. రథము నుండి వెలువడు, కాంతి నాశ్రయించి ఆకాశము, స్వర్గము, కాలము ఉండును. టెక్కెము దండముగను, ఆటెక్కము పైన వృషరూప ధర్మముతో, పతాక బుద్ది, వృద్ధి, శ్రీ యుక్తమైయుండును. ధ్వజ దండాగ్రమునందు గరుడుడు, దానిపై వరుణాలయముండును. హిమవంతుడు ఛత్రముగను మైనాకుడు ఛత్రదండముగను ఉందురు. కొందతిట్లు చెప్పుదురు. మణి కొందఱు క్లేశమే ఛత్రదండమని, క్లేశమే ఛత్రమనియుననుకొందురు.
తా॥ ఈ దేవతల సామర్థ్యము, తపము, యోగము, సత్త్వము, బలములనుబట్టి. సూర్యభగవానుడు తన తేజస్సుచే సిద్దుడై తపించుచుండును. ఈ దేవతలు కూడ సూర్యప్రతాపముచే తపింతురు. వర్షింతురు. విశ్వమును సృష్టింతురు. పోషింతురు. జీవుల చేత కీర్తింపబడి వారి యశుభ కర్మలను నివృత్తి చేయుదురు. వీరలే ఆకాశమునందు సూర్యదేవుననుసరించుచు తిరుగుచుందురు. బ్రాహ్మణులు వీరినే జపించుచు, వీరిని గుణించియే తపస్సులు చేయుచు జగత్తున కానందమునిచ్చుచుందురు. వీరు తమ కరుణా దృష్టిచే ప్రాణులను రక్షింపుచుందురు. సూర్యుడు తన కిరణములను ప్రసరింపజేయుట ద్వారా చంద్రునితో అమృతమును వృద్ధి చేసి దానితో దేవతలను సంతోషపరచుచుండును. దీనక్రమమున శుక్లపక్షమున వృద్ధియయిన అమృతమును కృష్ణపక్షమున దేవతలు త్రాగుచుందురు-25. కృష్ణపక్షమున దేవతలు త్రాగగా రెండు కళల మాత్రముగా శేషించి, రుచులతో ప్రకాశించు చుండు నమృతమును పితృదేవతలు-ఉత్సాహవంతులు, సౌమ్యులు, యోగ్యులు త్రోవుచుందురు. సూర్యభగవానునిచే వృద్ధిచేయబడిన నీటిచేత, ఆవులచేత, వివిధములైన ఓషదుల చేత పితరులు, మానవ ప్రాణులు వారి అన్నపానములను పొంది తృప్తులగుచున్నారు. వానిని తృప్తిగా సేవించుటచే ఆకలిని జయించుచున్నారు. పితృదేవతలకు మాసార్థము జలముచేతను, ఒక మాసము హవిర్దానము చేతను, ఎల్లప్పుడన్నముచేతను తృప్తినిచ్చును. మర్త్యమైన ఈ జగత్తును ఆవులచే పోషించును. సూర్యభగవానుడేక చక్రరథారూఢుడై రాత్రింబవలు సప్తద్వీపయుక్త పృథ్వీమండలముతో కూడిన సముద్రపర్యంతము తన ఏడు గుఱ్ఱములతో తిరుగుచుండును. ఆ రథాశ్వములు ఛందః స్వరూపములు, వేగవంతములు (తెక్కలుగల గుట్టములవంటివి) రథానుకూలగమనము గలవి. కోరిన రూపమును ధరిపగలవి, ఒకేసారి పూన్చబడినవి, వెలుపలనుండునని, మనోవేగముగలవి. వ్యయముకానివి, వశమైయుండునని, ఆకలిదప్పులు, అలసటలేనివి; అట్టియాగుఱ్ఱములు ఒక సంవత్సరమున ఎనుబది రెండు వందల ఆవృత్తములు పూర్తిచేయును.
తా॥ దినక్రమముగ సాగుచుండు నీ బాహ్మభ్యంతరా వృత్తములు కల్పాదియందు ప్రారంభింపబడినవి. ప్రళయము వఱకును యిలు సాగించుచుండును. వాలఖిల్యుల చేతను. మహారులు తమ వాకు) లతో కూడిన పోతపాఠము చేతను ఆవరింపబడి యహో రాత్రములు తిరుగుచుండును. గంధర్వులు, అప్పగలు తమ ఆటపాటలతో సేవింపుచుండగా సూర్యనారాయణుడు ఆ టెక్కల గుఱ్ఱముల రథముతో నాకాశమున తిరుగుచుండును. చంద్రుడు నక్షత్ర మార్గమున విహరించునట్లు, ఆకాశమునందలి ప్రముఖమైన వీధిలో పయనించుచు సూర్యుడింద్రుని పట్టణమైన అమరావతి మధ్య భాగమును చేరుకొనిన సమయమున. యుముని పట్టణమైన సంయమనిలో నుదయించుచు కన్పట్టును. వరుణుని రాజధాని యగు సుఖా పట్టణమున నపుడర్థరాత్రియగును. అదే సమయమున చంద్రుని రాజధానియగు విభాపట్టణమున అస్తమయమగును. యముని పట్టణమైన సంయమనమున మధ్యభాగమును చేరుకొనినప్పుడు వరుణుని సుఖాపట్టణమున నుదయించుచు కన్పించును. అప్పుడమరావతిలో నర్ధరాత్రియగును. యమ పట్టణమున నస్తమయమగును. సూర్యుడు చంద్రపట్టణమైన ‘విభలో మధ్యభాగమునకు చేరుకున్నప్పుడు. అమరావతిలో నుదయకాలమగును. సంయమనమున నర్థరాత్రమగును. వరుణుని సుఖాపట్టణమున నస్తమయకాలమగును. ఇట్లు మేరు పర్వతము నలుప్రక్కల ప్రదక్షిణము చేయుచు సూర్యుడు మల మఱల నుదయించుచు నస్తమించుచు అస్తమించుచు నుదయించుచు నుండును.
తా॥ పూర్వాష్ఠమునందు, అపరాష్ట్రమునందును సూర్యదేవునకు రెండేసి స్థితులుండును. మధ్యాహ్నకాల స్థితియందు మాత్రమాతడు తన కిరణములతో తీక్షముగ వెలుగుచుండును, ఉదయించినది మొదలుకొని మధ్యాహ్నము వఱకు వృద్దిచెందుచున్న కిరణములతో తపించుచుండును. ఆ పిదప క్రమముగా హ్రస్వమగుచున్న కిరణములతో నస్తమించును. ఎచట సూర్యుడుదయించుచున్నట్లు కనపడునో అది అచటవారికి ఉదయకాలమగను. ఎచట నస్తమించినట్లగుపడునో అది ఆచటీ వారికస్తమయ సమయమని చెప్పబడును. ఇట్లాకాశమధ్యమున సూర్యుడు సంచరించుచుండును. ఒక ముహూర్తకాలమునందు భూమి ఉపరితలము పైని ఆకాశమును ముప్పది భాగములు తిరుగును. ఒక ముహూర్తమునకాతడు భూమ్యుపరి భాగమున తిరుగుచు తన తాపమును ప్రసరింపజేయు భూభాగమును యోజనముల సంఖ్యలో తెలిసికొనుము. త్రిలోచనా! ఆ సంఖ్యనూజులక్షలు!. సూర్యగతి కనిష్టముగా నేబదియోజనములు, గరిష్టముగ వేయి యోజనములోక ముహూర్తకాలముననుండును. ఒక నిమిషములో, వేయి యోజనముల ప్రయాణమునందు రెండేసి వందలు గరిష్ఠముగను. రెండు యోజనములు కనిష్ఠముగను సూర్యుడు సంచరించును. (అనగా నొక ముహూర్తమున తొంబదియాఱు యోజనములకు తగ్గకుండ, తొమ్మిది వేలయాటువందల యోజనములు మించకుండ సూర్యగమనముండును). భాస్కరుడు అలాత చక్రమువలె (దుందుమ త్రిప్పినట్లు) వేగముగ కదలి పోవుచుండును. తిరుగుచున్న నక్షత్రములలో విహరించుచుండును. ప్రతిదినము ఉదయించుచున్న సూర్యుని ఇంద్రుడు పూజించుచుండును. యముడు మధ్యాహ్న సమయమున, వరుణుడస్తమయ కాలమున. చంద్రుడర్ధరాత్రి సమయమున విడువక పూజించుచుందురు. ఓ శివా! నీవు, నేను, విష్ణువు, రుద్రుడు రాత్ర్యంతమున (ఉదయాత్పూర్వ సమయమున) ఆ సూర్యభగవానుని పూజించుచుందుము కదా!. ఇటులే అగ్ని, నిరృతి, వాయువు, ఈశానుడు మొదలైన వారు కూడ-ఇంకను బ్రహ్మాది దేవతలందఱును శ్రేయః కాములై గమనశీలుడైన ఆ దేవదేవుని పూజించుచుందురు.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, రథసప్తమి కల్పమునందు సూర్యగతి వర్ణనమను ఏబది మూడవ అధ్యాయము సమాప్తము.
