భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

107. సప్తమీ కల్పమున భాను పదద్వయ వ్రత వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ధర్మజ్ఞా! మఱియొక విషయమును చేప్పెదను వినుము. జగద్ధాత దేవ దేవుడునైన సూర్య భగవానుని పాదద్వయము. ఒక పాదపీఠిక పై నుంచబడినది. స్వయముగ నా యంశుమంతుడే లోకములకు మేలు చేయగోరి తన పాదములనట్లు ఒకే పాద పీఠికపై మో పెను. దేవాది సకల ప్రాణి సంఘములకు వందనీయములగు నతని పాదములలో, నేడమ పాదముత్తరాయణమనియు, కుడి పాదమును దక్షిణాయనమనియు నెఱుంగవలెను. నీవు, నేను అతని యెడమ పాదము నర్చింతుము. హరి, శివుడు శ్రద్దాన్వితులై యతని కుడి పాదము నర్చింతురు . ప్రతి దినమా దేవ దేవుని పాదము నారాధించు మానవుని యెడ నాతడు ప్రసన్నుడగును.” విష్ణు దేవుడిట్లనెను. “ఆ సూర్య భగవాను నెట్లారాధింపవలెను? ఆ వివరములు నాకుఁజెప్పుడు”. బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “ఉత్తరాయణమున స్నానమాచరించి, నియత మానసుడై ఘృత క్షీరాదులతో భాను దేవునభిషేకింపవలయును. సుందరములైన వస్త్రములచేతను, కానుకలచేతను, పుష్ప ధూపాను లేపనముల చేతను చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణాదులతో సంతర్పణ చేయవలెను. భాను దేవునందే తాత్పర్యము కలిగి యీ పదద్వయ వ్రతమును స్వీకరింపవలెను. “స్నాతుడనై చిత్రభానునకు సమస్కరింతును. భోజనాంతరము, చిత్రభానుని స్మరింతును. పోవుచు వచ్చుచు, నిదురించుచు, మేల్కొనుచు, ప్రణమిల్లుచు, హోమము చేయుచు, పూజ చేయుచు. అనుదినమును చిత్రభానుని నామ సంకీర్తనమే చేయుదును. ఈ దినమున దక్షిణాయనము వచ్చు వఱకును. ప్రతి కదలికలోను, హుంకారము చేయుచు గాని, వేదాధ్యయనము ప్రారంభించునపుడు గాని, ఉత్తరాయణము వచ్చు వకును చిత్రభాను నామమే యుచ్చరింపుచుందును .

తా॥ నేను జీవించి యున్నంతకాలము, ఏపాటి జ్ఞానముతోగాని, అజ్ఞానముతోగానీ ఆ సూర్య దేవుని గూర్చి యట్లే కీర్తింపుచుందును. ఏ కొంచే మసత్యము చెప్పుట నాచేసంభవించినను వెంటనే చిత్రభానుని స్మరింతును. తెలిసియో తెలియకయో ఆ ప్రభువును ఓరించుచునే యుందుము ఆు మాసము లేకాగ్రచితముతో శేషసుగు చితూను సొమునుతోనే నా టీ అనకుమ నీ యుందును. మరణ కాలమున నాదేవుని స్మరించు వారికి కలుగు గతియే నాకును కలుగుగాక ! . ఆు మాసముల లోపుననే నాకు మరణము సంభవించెనేని అది నాకు నేనుగ భాస్కరదేవున కాత్మనివేదన చేసినట్లగును. చిత్రభానుడు పరమాత్ముడు. పరబ్రహ్మ అట్టి యతనిని మరణ కాలమున స్మరింతును. ఆ దేవునే పరమగతిగ పొందెదను. హే జగన్నాధా! ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నిన్నే జపించుచుందును. ఆు మాసములలోననే నాచే నీ వ్రతమును సంపన్నము చేయింపుము. స్వర్గలోక మాశ్రయించు వానిగ జేయుము. ఓ చిత్రభానూ! యథాశక్తిగా నిన్ను సేవించు సోకు నీవే పరమగతివీ.” అని యిట్లుచ్చరించుచు నాజు మాసములలో చిత్రభానువ్రతమును దక్షిణాయనము సమాప్తమగు వఱకు పూర్తి చేయవలెను. అటుపై సూర్యదేవుని ప్రీత్యర్థముగ దివ్యులను, బ్రాహ్మణులను భోజన దక్షిణాదులతో సంతృప్తి పరుపవలెను.  ఆ పిదప మార్తాండుని పుణ్యకథా ప్రవచనములను నిర్వహింపవలెను. అటుపిమ్మట పురాణ ప్రవచకునిని, లేఖకుని పూజింపవలెను. విష్ణుదేవా ! ఈ వ్రతము ననుష్ఠించు మానవు డిహలోకముననే సర్వపాపముల నుండి ముక్తుడగును. ఒకవేళ ఆయుమాసముల లోపుననే మరణముసంభవించెనేని యుపవాస వ్రతసమాప్తినొనరించిన వానికి చెప్పబడిన ఫలమే యితనికిని కలుగుననుటలో సంశయములేదు. ఇట్లు సూర్యపదద్వయవ్రత మాచరించి చక్కగా సూర్యారాధన చేయువానికి సత్ఫలములు కలుగునని, పూర్వము చంద్రుడడుగగా నా సూర్యభగవానుడే స్వయముగ చెప్పెను .

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భాను పదద్వయ వ్రత వర్ణనమను నూటయేడవ అధ్యాయము సమాప్తము.