భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

127. సాంబోపాఖ్యానమున సూర్యప్రసాద వర్ణనము

 తా॥ శతానీకుడిట్లనెను. “అమిత తేజస్కుడైన సాంబునిచే సూర్యభగవానుడెట్లారాధింపబడెను? సాంబుడు తన రోగముల నుండి యెట్లువిముక్తుడయ్యెను? మునిసత్తమా! ఈ విశేషములు నాకుఁజెప్పుడు. సమాధానముగ సుమంతుముని యిట్లు చెప్పఁదొడగెను. “రాజేంద్రా! లెస్సగానడిగితివి. పూర్వము జరిగిన పాపవిమోచకమగు సాంబుని కథను సాకల్యముగఁజెప్పెదను. వినుము. పూర్వము నారదుని వలన సూర్యభగవానుని మాహాత్మ్యము విని సాంబుడు వినయమున తన తండ్రిని సమీపించి అతనితో నిట్లనెను. "తండ్రీ! కశ్మలము, మలినమునైన వ్యాధిపాలబడితిని. ఔషధములచేత, వైద్య చికిత్సలచేత నాయీ వ్యాధి నయమగుటలేదు. నాకు శాంతిలభించుటలేదు. అందుచేతపస్సు చేయుటకై యరణ్యమువేనకుడలేదను. అనుజ్జయిండు. నాకు శుభము కలుగవలెనని యాకాంక్షింపుడు. అని యిట్లు ప్రార్థించి, తండ్రిచే ననుజ్ఞాతుడై సింధూనదికి ఉత్తర తీరమునగల ప్రాంతమునకుఁబోయి సాంబుడు చంద్రభాగ యను మహానదిని దాటేను. అటనుండి ముల్లోకములలో ప్రసిద్ధిగాంచిన 'మిత్రవన'మను సూర్యక్షేత్రమునుఁజేరెను. అచటనుపవాసతత్పరుడై, ఎండిపోయిన రక్తనాళముల గలవాడై పూనికతో తపస్సు చేయనుద్యమించెను. సూర్యదేవునారాధించు కొఱకు నాలుగువేదములతో సమానమైనదియు, పురాణములనాశ్రయించి చెప్పబడినదియునైన రహస్య సూర్యస్తోత్రమునాతడు జపించెను. “బ్రహ్మవాదులును, మనోవేగమున, పరుగెత్తగలవీయునైన హరితాశ్వములతోను గూడిన యీ సూర్యమండలము దివ్యమైనది. అజరమైనది. అవ్యయమైనది. ఆదిత్యుడను నామముగల యీ భగవానుడు సర్వభూతములకంటెను ఆదిపురుషుడు. ముల్లోకములకు సాక్షియగు పరమాత్ముడు. ప్రజాపతి. ఈ మండలమున దీపించు మహాపురుషుడే విష్ణువు, అచింత్యుడు. పరమాత్మ ఇతడే పితామహుడగు బ్రహ్మ. రుద్రుడు, మహేంద్రుడు, వరుణుడు, పృథివి, ఆకాశము, జలము, వాయువు, చంద్రుడు, పర్జన్యుడు, ధనాధ్యక్షుడగు కుబేరుడు. విభావసుడు.

తా॥ ఈ మండలమున దేదీప్యమానముగ ప్రకాశించు మహాపురుషుడు కేవలుడు. సాక్షాత్తుగ మహాదేవుడు. చీకటిని గప్పివేయుచు ప్రకాశించుచుండువాడు-13. ఇతడే కాలస్వరూపుడు. సుదీర్ఘమగు బాహుపులుగలవాడు. జ్ఞానోత్పత్తియే లక్షణముగ గలవాడు. ఈ మండలమునుండియే యీతడు తన తేజస్సులచేత భూతలమును నింపుచు -14. అమృత లక్షణుడై భూత జాలములకు ప్రాణ వాయువులను ప్రసాదించుచు నేడ తెరిపిలేక తిరుగుచుండును. ఇతని కంటే నితరమగు దేని చేతను, ఏదైనను, ఏ మాత్రమైనను, ప్రకాశింపజాలదు-15. ఇతడే తన సుధామృతములతో సకల భూతములను పోషించుచుండును. కడపటి జాతి పోరిని, లోనున్నవారిని, మేచ్చ జాతీయులను తిర్యగ్యోనులను - అందని, అన్ని ప్రాణులను పోషించుచుండును-16. హే భగవాన్! సూర్యదేవా! నీవు సర్వ భూతములను దయతో రక్షింపుచుందువు. బొల్లి మచ్చలు గలవారిని, కుష్ఠ వ్యాధిగ్రస్తులను, గ్రుడ్డివారిని, చెవిటివారినీ, కుంటివారిని వీరు పారను భేదములేక అందని కాపాడుచుందువు. ప్రభూ!-17. శరణు పొందిన వారి పై వాత్సల్యమును వర్షించు దేవదేవా! నీవే కదా ఆరోగ్యమును ప్రసాదింతువు! దుఃఖముల సుడిగుండములలో మునిగియున్న వారిని, దరిద్రులను, అల్పాయుష్కులను నీవే కదా ఉద్దరింపగలవాడవు!-18. స్వామీ! నీవు ప్రత్యక్షముగ చూడగలవు. లీలగా సముద్ధరింపగలవు. రోగ పీడితుడను. ఆర్తుడను. స్తోత్రములతో నిన్ను స్తుతించుటకు నా శక్తి యేపాటిది?-19. బ్రహ్మ విష్ణు శివాది దేవతల చేతనే నీ వెల్లప్పుడు స్తుతింపబడుచుందువు. మహేంద్రుడు, సిద్ధులు, గంధర్వులు, అప్సరలు, గుహ్యకులు మున్నగువారు నిన్నెప్పుడును పొగడుచునే యుందురు. సుందరములు, పవిత్రములునైన స్తోత్రములతో నీకేమి కొదవ? ఋగ్యజుస్సామ వేదములు మూడును నీ మండలముననే గలవుగదా!-21. ఓ జగన్నాథా! ధ్యానము చేయువారికి నీవే ధ్యేయ వస్తువవు. మోక్షార్థులకు నీవే మోక్షద్వారమవు. అనంతములగు తేజస్సులతో ప్రకాశించుచును కలఁత నొందని వాడవు. అచింత్యుడవు. అవ్యక్త స్వరూపుడవు. నిష్కలుడవు-22. ప్రభూ! నేను పలికిన యీ చిన్న స్తోత్రమునందలి యార్తిని, భక్తిని తెలిసికొని - సర్వమును నీకు తెలియును - గాన నన్ను కరుణింపుమ.

తా॥ సూర్యదేవుడు ప్రసన్నుడై సాంబునితో 'వత్సా! నీ తపస్సుకు సంతసించితిని. నీకేమి కావలయునో కోరుకొనుమని' ప్రీతితోఁ బలికెను-24. “భగవన్! నాకు నీ యందు అమితమైన భక్తి కలుగునట్లను గ్రహింపుము. ప్రసన్నుడనైతివేని యిదియే వరముగ నాకు ప్రసాదింపు”మని సాంబుడు వినమ్రుడై ప్రార్థించేను-25. “సాంబా! నీ భక్తికి మణింత సంతుష్టుడనైతిని. నీకు శుభమగుగాక! వరమును కోరుకొమ్మ”ని సూర్యదేవుడాదరమున బలికెను. అప్పుడు సాంబుడు వరదుడైన సూర్య ప్రభువును రెండవ వరము నీట్లు కోరెను-26. “సూర్య దేవా! నీ యను గ్రహమున నా శరీరమందలి యీ వ్యాధి రూపమాలిన్యము నశించి నాకు యథా పూర్వముగ శుద్ధమగు రూపము కలుగవలయును”-27. సుమంతుముని యిట్లనెను. “సూర్య భగవానుడు సాంబుని కోరికను మన్నించి “తథాస్త"నేను. వెంటనే పాము తన కుబుసమును విడిచినట్లు సొంబుడు తన కుష్ట వ్యాధిని సంపూర్ణముగ విడిచివేసెను-28. అప్పుడు దివ్యమైన రూపముతో పూర్వ మట్లు సౌందర్యవంతుడై ప్రకాశించేను. శిరము వంచి నమస్కరించి సూర్య దేవునెదుట సవినయముగ నిలబడెను-29. సూర్యదేవుడిట్లు పలికెను. “సాంబా! ఇంకను వినుము. సంతుష్టుడనై చెప్పుచుంటిని. నేటి నుండి నా స్థానములు నీ పేర ప్రసిద్దినందగలవు. భూమి యందెవరు నా క్షేత్రముల నిర్మింతురో వారికి ఉత్తమ లోకములు ప్రాప్తించును-30. శుభ ప్రదమైన ఈ చంద్రభాగా నదీ తీరమున నా మూర్తిని ప్రతిష్ఠించి యొక క్షేత్ర స్థానముగ దీనిని తీర్చిదిద్దుము. సాంబా! ఈ పుణ్య క్షేత్రము నీ పేరనే మిక్కిలి' ఖ్యాతి నందగలదు-31. నీ కీర్తి అక్షయమై లోకమున ప్రసరింపగలదు. నీ కింక నొక వరమును గూడ ప్రసాదింతును. అదేమన నిత్యమును నీకు స్వప్నమునందు నేను దర్శనమిచ్చుచుందును”-32. సుమంతుముని యిట్లు చెప్పఁ దొడంగెను. “సూర్య భగవానుడు, వృష్ఠికుల సింహుడగు సాంబునకిట్లు మఱియొక వరమును ప్రసాదించి, ఆ క్షణమున ప్రత్యక్షదర్శనమిచ్చి యచ్చటనే యంతర్థానమొందెను-33. ఏ మానవుడు భక్తి గలవాడై యీ స్తోత్రమును త్రికాలములందు పఠించునో అట్టివానికి-34. రాజ్య కాముడైనచో రాజ్యము, ధనము కావలసిన వాడగుచో ధనము, లభించును. రోగముతో బాధపడువానికి నారోగ్య లాభము చేకూరును. సాంబుడెట్లు తన భయంకరమగు వ్యాధి నుండి ముక్తుడయ్యెనో అట్లే పారాయణ హవనములు పూర్తి చేసిన వాడును రోగ ముక్తుడగును-35. అంతీయకాక దివాకరుని భక్తితో పూజించువాడు సూర్య లోకమునకుఁబోయి, అచట దేవతలతో గూడి చిరకాలమానందించుచుండును.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున సూర్యప్రసాద వర్ణనమను నూటయిరువది యేడవ అధ్యాయము సమాప్తము.