భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
61. సప్తమి కల్పమున సూర్యయోగ మహిమ వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “అవ్యయుడు, సదసత్తులకతీతుడు, భేదాభేద స్వరూపములలో నుండువాడు, తేజస్వులలో శ్రేష్ఠుడు నయిన సూర్యదేవునకు నమస్కరించి. పూర్వకాలమున మహాత్ముడైన బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిన రీతిగా నేను నీకు చెప్పుచున్నాము. సావధానుడవై వినుము. మహాత్ముడైన బ్రహ్మదేవుడు, సూర్యభగవానుని యారాధన కొఱకు బ్రహ్మపరమైన యోగమును మహరులకుపదేశించెను. ఋషుల నమస్కృతులను స్వీకరించియాతడు, సమస్త చిత్తవృత్తులను నిరోధించుట వలన కలుగు కైవల్యరూపమగు యోగమును వారికి బోధించేను. స్వయంభువగునా బ్రహ్మ వారందజీ ప్రార్థన మేరకు లోకహితకరమైన చిత్తవృత్తిని నిరోధించునీ యోగమును వారికి దేలి పెను. బ్రహ్మన్! ఆ యోగమును అనేక జన్మల సాధన తరువాత మాత్రమే పొందుటకు సాధ్యమగును. ఏలయన మానవుల ఇంద్రియములనాకర్షించు విషయములు జయింపరానివి. రాగద్వేషాది వృత్తులు చంచలమైన మనస్సున అనివార్యములుగ చేరియున్నవి. వందలేండ్లకును వానిని జయించుటకెట్లు సాధ్యమగును?. అందువలన వీనిని జయింపనంతవఱకు, మనస్సు, వృత్తినిరోధ యోగమునకు యోగ్యమైనది కాకుండును. బ్రహ్మదేవా! మానవులీకృతయుగమున నల్పాయుష్కులు. త్రేతాయుగము, ద్వాపరయుగములందు కూడనిట్టి మహత్సాధనల , సాపేక్షముగ నల్పమైన ఆయువుకలవారే యగుదురు. ఇక కలియుగము వచ్చిన పిదపనేమి చెప్పగలము? భగవన్! మీ అండచేరితిమి. ప్రసన్నులై మాకు తెలుపుడు. ఆయాసము లేకుండ ఏయుపాయముచేత నీ సంసార సాగరమును దాటగలము? దుఃఖమనెడు నీటిలో మునిగిపోవుచున్న పురుషులకు ఒక గొప్ప తెప్పవంటి తారకమేది?.
తా॥ ఈ భవసాగరము నెట్లు దాటగలమో మీరు యోచించి చెప్పుడు” అని ఇట్లు ఋషులడుగగా బ్రహ్మదేవుడు మహాత్ములైన ఆ ఋషులకు, లోకోపకారార్ధమై “శ్రద్ధాళువులై విశ్వేశుడైన దీవాకరుని యారాధింపు"డని క్రియాయోగమును బోధించెను-11,12. బాహ్యములైన వస్తు క్రియాదులయందాధార పడుట పై ఇష్టములు గలవారు (మధ్యమాధికారులు) అజాతుడు, జగత్ర్పభువునైన సూర్యభగవానుని, యజ్ఞము, పూజ, నమస్కారము, సేవ-13. వ్రతములు, ఉపవాసములు, వివిధ పద్ధతులలో బ్రాహ్మణ సంతర్పణలు మున్నగువానిలో వారి వారి యభీష్టములననుసరించి, వారి వారి మానసిక తృప్తిని బట్టి-14. ఏదేని యొక మార్గమున అపరిచ్ఛేద్యమహాత్ముడైన భాస్కరుని, తదేక నిష్ఠతో, తదేక బుద్ధితో, తదేక క్రియాకలాపముతో, తదాశ్రయ భావముతోనారాధింపుడు-15. అతని యందే దృష్టినిలిపి, అతని యందే మనస్సునిలిపి, అంతటనాతడే నిండియున్నాడను భావనతో, సర్వాత్మనా కర్మలనన్నింటిని నాతనిపరముగా నిర్వహింపుడు-16. ఆయనయే మన కర్తయని దృఢవిశ్వాసముననుండుడు. ఈ పృధివ్యాది సప్తావరణాదులతో ప్రళయమునకు గుజియగునశ్వర జగత్తు, అవినాశియగునా బ్రహ్మవస్తువు, ఇరువురును ప్రధాన పురుషులు-17. వీరిరువురును సర్వవ్యాప్తమైన సృష్టియందుండుటచే, ఒక్కడుగనే తెలియబడును. అతడు శ్రేష్టులలో శ్రేష్ఠుడు. పరమాత్మ, పరదైవతము-18. ఈ జగత్తతని కంటే భిన్నమైనది. అయినను ఇదియంతయును నిశ్చలుడైన అతడే యగుచున్నాడు. అతడే మోక్షమునకు కారణము. అతడవ్యక్తుడు. ఊహకందనివాడు. కేవలుడు. అట్టి జగన్నాథుడైన సూర్యభగవానునీ క్రియాయోగముతో నుపాసించువాడు ముక్తుడగును.
తా॥ ఆ ఋషి సత్తములు బ్రహ్మదేవునిచే చెప్పబడిన ఈ రహస్యమును విని-20. మానవులకుపకరించు నిమిత్తము యోగశాస్త్రములను రచించిరి. అవి యనేకములైన క్రియాయోగ పరములై ముక్తి కారకములుగ నుండెను-21. ఆయా యోగములనుష్ఠించువారు పరమాత్ముడు, జగన్నాథుడు, దేవేశుడునైన సూర్యభగవానుని పూజింతురు-22. పూర్వము బ్రహ్మదేవునిచే చెప్పబడిన పాపనాశకములగు నట్టి ఆయోగములను నేను నీకు-23. చెప్పెదను. ఈ ఉత్తమమైన రహస్యమును వినుము. సంసారసాగరమున మునిగి, విషయములచేనాక్రమింపబడిన మనస్సులు గలవారికి-24. దానిని తరించుటకు సూర్యుడనేడు ఓడ తప్ప ఆశ్రయింపదగినది మఱియొకటిలేదు. లేచుచు, నడచుచు-25. భుజించుచు, పరుండుచు, ఎల్లవేళలనా సూర్యభగవానునే స్మరించుచుండుము. ఏకాగ్రచిత్తుడవై యిట్లు నిరంతరము సూర్యదేవునే చింతన చేయుచుండిన యెడల-26. జనన మరణ పౌనఃపున్యరూపమగు మొసళ్ళచే నిండిన సముద్రమును దాటగలవు-27. గ్రహములకు ప్రభువు జగదీశ్వరుడు, వరములిచ్చువాడు, సనాతనుడు, సృష్టికర్త, పుట్టుకలేనివాడు, అయిన మార్తాండునాశ్రయించి, అతనినే ఈశ్వరుడుగ నెంచి నిత్యము ఉపాసించుచుండువారు మోక్షమునకు పాత్రులగుదురు. వారికి సంసార దుఃఖములుండవు.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యయోగ మహిమ వర్ణనమను అరువది యొకటవ అధ్యాయము సమాప్తము.
