వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 130

ఉదయమున పలుదోము పుల్ల నుపయోగింపక (పండ్లు తోము కొనక) నా కడకు వచ్చు వాని పూర్వ పుణ్య మంతయు ఆ ఒక్క పాపముతో నశించును.

 

నారాయణుని మాట విని ధర్మము నందు నిలుకడ గల భూదేవి విష్ణు భక్తుల సుఖము కొరకై విష్ణువుతో నిట్లు పలికెను.

 

 

ఎంతో కష్టపడి సంపాదించిన సర్వకాల సంబంధమగు పుణ్య మంతయు ఒక్క తప్పుతో ఎట్లు నశించును?

 

 

సుందరీ! ఒక్క తప్పు చేత పూర్వ పుణ్య మంతయు ఎట్లు నశించునో నేను చెప్పెదను. వినుము.

 

మనుష్యుడు సహజముగా దోషములు కలవాడు. కఫము, పిత్తములతో కూడిన వాడు. కుళ్ళిన రక్తముతో నిండిన ఆతని ముఖము చెడు వాసన కలదియై యుండును.

 

పలుదోము పుల్లను వాడుట వలన, ఆ దోషము నిలువదు. ఆచారము వదలిన భక్తునికి శుద్ధి కలుగును.

 

 

పలుదోము పుల్లను నమలక నీ పూజా కర్మముల నాచరించు వానికి ప్రాయశ్చిత్తమేమి? దేని వలన నాతని ధర్మము నశింప కుండును? నాకు చెప్పుము.

 

 

పుణ్యాత్మురాలా! నీవు నన్నడిగిన దానికి సమాధానముగా మానవు లెట్లు శుద్ధి పొందుదురో చెప్పెదను.

 

ఏడు దినములు ఆకాశ శయనము చేసినచో పలు దోమని పాపము నుండి మానవుడు శుద్ధి పొందును.

 

ఈ విధానముతో ప్రాయశ్చిత్త మొనరించిన వానికి దోషము కలుగదు. సంశయము లేదు.