వరాహ మహా పురాణము
అధ్యాయము - 105
రాజా! ఇప్పుడు దధిధేనువు విధానమును వినుము.
ఆవు పేడతో అలికిన నేలపై గోచర్మ మంత కొలతతో పూవులతో పాటుగా దర్భలు పరచి లేడి చర్మమును దర్భా సనమును ఉంచ వలయును.
ఏడు విధములగు ధాన్యములపై పెరుగు కుండను చక్కగా నిలుప వలయును. నాలుగవ వంతుతో బంగారు మొగము గల దూడను చేయ వలయును.
వస్త్రముల జంటతో కప్పి పూవులతో గంధముతో పూజించి, మంచి కులము, చక్కని నడవడి, బుద్ధి, ఓర్పు, అంతరింద్రియ బహి రింద్రియముల నిగ్రహము కల బ్రాహ్మణునకు దానమీ వలయును.
తోక దగ్గరగా కూర్చుండి ఉంగరమును కుండలము లను పాదుకలను, గొడుగును సమర్పించి “దధిక్రామ్” మొదలగు మంత్రమును పఠించుచు దధి ధేవును సమర్పింప వలయును.
ఇట్లు దధి ధేనువును దాన మొసగి ఒక పూట పెరుగు భోజనముతో గడుప వలయును.
యజమానుడు ఒక దినమును, పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడు రాత్రుల వరకును ఇట్లు పెరుగు భోజనముతో గడుప వలయును. ఇచ్చు చుండగా చూచిన వారును పరమ పదమున కరుగుదురు.
వెనుక పది తరముల వారును, ముందు పది తరముల వారును తనతో పాటు మొత్త మిరువది యొక్క తరముల వారు ప్రళయ కాల పర్యంతము విష్ణు లోకమును పొందుదురు. దాతయు, ఇప్పించు వాడును పరమగతి కరుగుదురు.
పెరుగు నదులు, పాయసపు పంకములు కల చోటికి, మునులు, ఋషులు, సిద్ధులు ఉండు తావునకీ ధేను దానము చేసిన వారరు గుదురు.
దీనిని వినిపించు వాడును, విను వాడును అశ్వమేధ యాగ ఫలమును పొంది విష్ణు లోకమున కరుగును.
