44 - చతుశ్చత్వారింశోధ్యాయః

హయగ్రీవుడనేను : జపస్థానమున బ్రవేశించి, తనయాసనమును దెచ్చి, మంత్రములతో శాస్త్రీయముగా అభ్యుక్షణమును జేసి, గురువు చెప్పిన క్రమయోగమును బట్టి-1. స్వాత్మగా దేవతామూర్తిని ధ్యానముజేయవలె. (తనకు దేవతామూర్తికిని భేదములేని విధముగా ధ్యానింపవలె). అప్పుడు ప్రాజ్ముఖుడై (తూరుపుమొగమై యుండవలె. పద్మాసనమున గూర్చుండవలే, అన్యబుద్ధిరానీక ఏకాగ్రబుద్ధీయే యుండవలె-2. శ్రీఖండముద్రను జూపవలె, గురువు మొదలగువారినభినందింపవలె రెండుమారులు పలికిన బౌలామంత్రబీజాక్షరములను నడిమి వేలివరుసలో -3. రెండు చేతుల వేళ్లపై కరన్యాసముగానుంచి కరశుద్ధిపూర్వకముగా ఆర్నీ ప్రాకారము వఱకు మంత్రవేత్త  స్వాస్త్రముతో జేయవలె-4. ప్రతి లోమముతో పాదాద్యమును, అనులోమముతో కోరికమును జేయవలె. పోగవాదులతో వ్యాపకన్యాసమునారోపించి వ్యాపించి జేయుచు-5. వ్యక్తములతో కారణ-సూక్ష్మ-స్థూల శరీరములను కల్పింపవలె. తరువాత, నాభియందు, హృదయమందు, భ్రూమధ్యయందును బాలా బీజములనుంచవలె-6, మూలముతో సంపుటీకృతమైన మాతృకను నాభ్యాదులలో క్రమముగా నుంచవలె. ఆబాలా బీజములనే రెండు మారులావర్తించి యుంచవలె.(7) మధ్యమము మొదలగు వ్రేళ్లయందు రెండేసి తలములపైనుంచవలె తరువాత నాభి మొదలగువాని యందును. తఱువాత రెండు పాదములందును ఉంచవలె-8. మోకాళ్లయందు, తొడలయందు, పిరుదలందు, స్త్రీపురుషావయములందు, మూలాధారము(గుదము)నందు, బొడ్డునందు, హృదయమునందు, శిరస్సునందు క్రొత్త యాసనములను కల్పించి వరుసగా బ్రహ్మను, విష్ణువును, రుద్రుని, ఈశ్వరుని సదాశివుని, సూర్యుని, తూలికను, ప్రకాశకమును, విద్యాసనమునుంచి తరువాత హృదయమున పద్మ త్రిఖండ-యోనులను ముద్రలను దర్శింపవలెను-10. ఓష్ణపుటముతో (పెదవులతో) వాయువును నింపవలె. “హుం హుం హుత్” అని కుండలినిని మేలుకొలుపవలె-11. మంత్రశక్తితో దానిని పైకి రప్పించవలె. ద్వాదశాంతమున శివైకత్వమును భవించ వలె. మరల నాకుండలినిని న్యస్థానమున  బ్రవేశింప జేయవలె-12. వాగ్భవబీజములను మూలాధార-హృదయ -బాహువులందుంచవలె, రెండు చేతులను వ్రేళ్ల పైభాగము వరకు, మొత్తము శిరమునందు బాహువుల యొక్క మూల-మధ్య అగ్రములైన యవయవములందును ఉంచవలె, హృదయాదులందు గూడనుంచీ కుంకుమన్యాసముజేయవలె-14, పవిత్రమైన మాతృకను తృతీయ బీజముతో సంపుటితముగా జేయవలె. మొదట రెండు బీజములనుంచి తరువాత అంత్యబీజమునుంచవలె-15. తరువాత కొద్దీ వీస్తరముగా భూతలవిన్యాసము జేయవలె.. మూలాధారమున, నాభియందు, హృదయమున, కంఠమునను వర్గాష్టకమునుంచవలె-16. ముందు ఈ మూలాధార-హృదయ-శిరస్సులందు. శషసలనుంచవలె. తరువాత, చంకలు, నడుము, భుజములు, ఎడమ భుజము, నడుము, హృదయము-వీనియందుంచవలె-17. ప్రభూతములైన (పెద్దవియైన) క్రిందీ యాంగములందు దాదివర్గములనుంచవలె. ఋషి శబ్దబ్రహ్మ భూతలిపి ఛందము-18. ఈ మంత్రమునకు శ్రీమూలప్రకృతీ దేవత ఎత్తైన అక్షమాల-పుస్తకములు పుష్పబాణములు విల్లును-19, వరము అభయమును చేతులలోధరించినది, సాటిలేనిది, రక్షణకోఆంకైన అక్షమాలను కంఠదేశమున ధరించినది-20. కంఠహారములు, భుజభూషణములు, కంకణములు, మీనిచే గప్పబడిన వీరవీభూషణములు గలది, దీవ్యమైనమైపూతతోను మణికుండలములతోను అలంకరింపబడినది-21. “లిపి కల్పద్రుమము” యొక్క క్రింద రూపము దాల్చి యున్నకమలముననున్నది. భక్తవత్సలయైనది. సాక్షాత్తులిసీమయి-ఇట్టి భైరవీనీధ్యానించవలె-22. అనేక కోటిదూతులతోనంతట నలంకరింపబడిన యామెను ఈ విధము ధ్యానించి మరల అక్షరక్రముననుసరించీ భూతలముననుంచవలె-25. తరువాత మూలాధారము మొదలు ఆజ్ఞాచక్రావసానమువరకు వర్గాష్టకము నుంచవలె. శషసలను శిరస్సుననుంచి స్వరముల (అచ్చులను గూడ వీనిలోనే యుంచవలెను-24. హాదులను ఊర్ద్వము మొదలు ఐదు ముఖములందును, అగ్రమున; మూలమున, మధ్యమున, అంగుళీమూలమున, మజీబంధమున, బాహువులందున, పాదములందున-25. జఠరమున, కుడియెడమ, ప్రక్కలందు, నాభియందు, వీపునందును ఉంచవలె, శషసలను లాదీకములను మూలస్థానమున హృదయమున, శిరముననుంచవలెను-26. ఐదుహ్రస్వాచ్చులు (అణఉబలు) సంధ్యచ్చులు నాలుగు (ఏఐఓటి) “హయర'లు 'వల'లు 'అక'లు ఖగ-నగ-ఇది. శిష్టవర్ధకమున క్రమము-27. శషసలు-వీయన్నీయు నలుబడిదిండు అక్షరములు. మొదటిది ఐదక్షరముల వర్గము, రెండవది నాలుగక్షరముల వర్గము-28 పంచాక్షరి షడ్వరి తొమ్మిదవది త్రివర్ణము అనబడినది. బ్రహ్మ విష్ణువు - రుద్రుడు - కుబేరుడు- ఇంద్రుడు - యముడు- వరుణుడు, సోముడు- శక్తిత్రయము- వీరు వరుసగా తొమ్మండుగురు-వర్ణములకీశ్వరులు అనబడిరి. ఇది భూతలిపియొక్క క్రమము-30. ఈ విధముగా సృష్టియందుపాఠము విపరీతము. సంహృతియందు ఇవియే స్థానములు. వర్ణాంతములుగా విసర్గ బిందువులను చేర్పవలెను-31. ధ్యానమునకన్న పూర్వము ప్రాజ్ఞుడు రత్యాదిన్యాసమునాచరింపవలె. తరువాత మందారపు పూవువలెను-కుంకుమవలేను ఎఱ్ఱని యాకారముగలవారును-32. కాముని (కామేశ్వరుని) వామ భాగముననున్న వారు. విల్లమ్ముల ధరించినవారు ధ్యానింపదగినవారు. రతి ప్రీతియుతుడైన కాముడు కామినికి కాంతుడుగా కోరబడును-83. కాంతిమంతుడు, మోహినీయుక్తుడు కామాంగుడు విలాసీనితో గూడినవాడై కలహప్రియురాలినీ కామచారములతోననుసరించును-34, కాముడు కల్పలతతోగూడినవాడు. కాముకుడు: శ్యామవర్ణతో గూడినవాడు. కాముడు శుచిస్మితతో గూడినవాడు. బంధకుడు విస్మస్మితాయుతుడు-35, రమణుడు విస్మీతాక్షితో గూడినవాడు. ఈ రాముడు లేలిపోనతోగూడిన వాడు. రతినాథుడు (కాముడు)రమణితో గూడినవాడు, రతిప్రియుడు (కాముడు) దిగ్వస్తతో (దిగంబరితో) నొప్పినవాడు-56, రతినాథుడు వామన కుంజతో గూడినవాడు. అతడే ధరతోగూడినవాడు. రమాకాంతుడు రమచేనుపాసింపదగినవాడు. ఆమెను రమించుచు నిశాచరుడు. (రాత్రియంతయు రమించువాడు)-37. కల్యాణుడు మోహినీకి నాథుడు. సందకుడు ఉత్తమతోగూడిన వాడు. నంది. సురోత్తమతోనొప్పినవాడు. నందనుడు స్త్రీలనునందింపజేయువాడు-38. మంచి లావణ్యతో గూడినవాడు పంచబాణములుగలవాడు. బాలనిధీశ్వరుడు కలహప్రియతో గూడినవాడు అట్లే రతీయే సఖిగాలవాడు-39, పుష్పధనుడు గూడ ఏకాక్షితో గూడినవాడు. మహాధనుష్కడు  సుముఖకు ఈశుడు. నల్లనివాడు జటలుగలవాడు క్రమముగా భ్రమణుడు వీడు పాలినికీపతి-40. భ్రమించువాడు శివకు కాంతుడు, భీముడు ముగ్గచే భ్రాంతుడు-భామకుడు - రమచేపొందబడినవాడు. వాడు భ్రమితుడై భృంగమనబడును-41. భాంతాచారుడు లోచనతోగూడిన వాడు, భ్రమావహుడు దీర్ఘజిహ్వికతో గూడిన వాడు. మోహనుడు రతిప్రియను అనుసరించును-42- మోహకుడు. పలాశాక్షితోగూడువాడు. అతనికి గృహిణియందే మోహమనబడినది. మోహధరుడు వికటకీశుడు. వర్ధనుడు ధరాయుతుడు-43. అనూపముడు మదకునాథుడు, మన్మథుడు మలయతోగూడినవాడు, మాదకుడు ప్రదీనితోగూడినవాడు. ఈ విధముగా గోరుచు విశ్వతోముఖియగును-44. భృంగపూర్వుడు నాయకుడు గాయకుడు నందినితోగూడినవాడు. గణకుడు సామతోగూడినవాడు. నర్తకుడు. కాలీ(ళి)తో గూడినవాడు. జైల్లకుడు కాలకర్ణితోగూడినవాడు. కందర్పుడు మత్తుడనబడును. నర్తకుడు శ్యామలకు కాంతుడు విలాసవంతుడు రషతోగూడినవాడు -46.కామవర్ధనుడు ఉన్మత్త నుసంగమించి యానందిచును. తరువాత ధ్యానపూర్వకముగా శ్రీకంఠాదిన్యాసమునుజేయవలె-47. సిందూరవర్ణము కాంచనవర్ణము-సమముగాను భయభాగములందును గలవాడును, పార్వతీ పరమేశ్వరులయలంకార చిహ్నములు గలవాడును, రెండుపాశములు, అక్షమాల వరాభయము హస్తములందుగలవాడునునైన యర్థనారీశ్వరుని స్మరించి కోరిన కోరికనే నెరవేరుటకై లిపీస్థానములలోనుంచవలె-48. శ్రీకంఠుడు, అనంతుడు, సూక్ష్ముడు, త్రిమూర్తి, అమరేశ్వరుడు, ఉర్వీశుడు భారభూతి, అతిధీశుడు, స్థాణుకుడు, హరుడు-49. చండీశుడు, భౌతికుడు, సద్యోజాతుడు, అనుగ్రహేశ్వరుడు, అక్రూరుడు, మహాసేనుడు-వీరు వరమూర్తులు-50. అట్లే ఏకరుద్రుడు, కూర్ముడు, ఏకనేత్రుడు, చతురాననుడు-51. అజేశుడు, శర్వుడు, సోమేశుడు, హరుడు, లాంగలి, దారుకుడు, అర్థనారీశ్వరుడు, ఉమాకాంతుడు, పాండ్యుడు, దండి-52. అత్రి, మీనుడు, మేషుడు, రౌహితుడు, శిఖి, ఖడ్లదండుడు ద్విదండుడు, సుమహాకాలుడు, వ్యాళి-53. భుజంగేశుడు పినాకి, ఖడ్గశుడు, బకుడు, శ్వేతుడు, అభ్రుడు, లకులీశుడు, శివుడు, సంవర్తకుడును నరమూర్తులు-54. పూర్ణోదరి, విరజ, మూడవదీశాల్మీలి, లోలాక్షి, వర్తులాక్షి దీర్ఘఘాణ-55. సుదీర్ఘముఖి, గోముఖి, తొమ్మిదవది దీర్ఘజిహ్విక. కుంజరీ, ఊర్ధ్వకేశ, ద్విముఖి, వికృతానన-56. సత్యలీల, కల, వీధ్యమొదలగువారు. సర్వశక్తులు. సర్వసిద్దులతోగూడిన మహాకాళీ-సరస్వతులు-57. గౌరి, త్రైలోక్యవిద్య, మంత్రాత్మశక్తిక, లంబోదరీ, భూతమత, ద్రావీణి, సొగరి-58, ఖేచరి, మంజరీ, రూపిణీ, వీరిణి, కోటర, పూతన, భద్రా, కాళి, యోగిని-59. శంఖిని, గర్జిని, కాలరాత్రి, కూర్గిని, కపర్దిని, వజ్ర, జయ, సముఖేశ్వరి-60.. రేవతీ, మాధవి, వారుణి, వాయవి, రక్షావధారిణి, తక్కిన సహజాహ్వయ-61. లక్ష్మీ, వ్యాపిని, మాయ, వీరందరు వర్ణశక్తులనబడినారు. దేవతాత్మాత్వసిద్దికొకు కేవలము రెండు మారులుచ్చరించిన పోలా మంత్రము యొక్క వర్ణములతో రంగమును జేసి పదునాలుగాన్యాసము జేయవలె. అచట ఓఘ్నశుడు మొదలగు వారిని మొదట ధ్యానపూర్వకముగా విన్యాసము జేయవలె-63. వారు బాలసూర్యకాంతిగలవారు. గజముఖముగలవారు. మూడుకన్నులుగలవారు, పాశము-అంకుశము-వర-అభీతులు, హస్తములందుగలవారు. శక్తిసమన్వితులు-64 విఘ్నేశుడు, విఘ్నరాజు, వినాయకుడు, శ్రీవోత్తముడు, విప్నుకృత్తు, విఘ్నహంత, విఘ్నరాట్టు, గణనాయకుడు -65 ఏకదంతుడు, ద్విదంతుడు, గజవక్రుడు, నిరంజనుడు, కపర్దవంతుడు, దీర్ఘముఖుడు, శంకుకర్ణుడు, వృషధ్వజుడు,-66. గణనాథుడు, గజేంద్రాస్యుడు, శూర్పకర్ణుడు, త్రిలోచనుడు, లంబోదరుడు, మహానాదుడు, చతుర్మూర్తి, సదాశివుడు -67 ఆమోదుడు, దుర్మదుడు, సుముఖుడు, ప్రమాదకుడు, ఏకపాదుడు, ద్విపాదుడు, శూరుడు, వీరుడు, షణ్ముఖుడు, -68 వరదుడు, నామదేవుడు, వక్రతుండుడు, ద్వీదంతకుడు, సేనాని, గ్రామణి, మత్తుడు, మత్తమూషకవాహనుడు -69 జటి, ముండి, ఖద్ధి, వరేణ్యుడు,వృషకేతనుడు. భక్ష్యప్రియుడు, గణేశుడు, మేఘనాదుడు, గణేశ్వరుడు, -76- వీరు వరుసగా ఏబది వర్ణములకు గణేశులు, శ్రీ స్త్రీ, పుష్టి శాంతి, తుష్టియు, సరస్వతి,-71 రతి, మేధ, కాంతి, కామిని, మోహిని, తీవ్ర, జ్వాలినీ, నంద, సుయశ, కామరూపిణి -72 ఉగ్ర, తేజోవతి, సత్య, విఘ్నేశాని, స్వరూపిణి, కామార్త, మదజిహ్వ, వికట, ఘూర్జీతానన, -73 భూతి, భూమి, ద్విరమ్య, అమారూప, మకరధ్వజ, వికర్ణభ్రుకుటి, ఆజ్ఞ, దీర్ఘమౌణీ, ధనుర్ధరీ, -74 యామిని, రాత్రీ, చంద్రకాంత, శశిప్రభ, లోలాక్షి, చపల, ఋజ్వి, దుర్బగ, సుభగ, శివ,-75. దుర్గ, గుహప్రియ, కాలి, కాలజిహ్వ - వీరు శక్తులు, ధ్యానపూర్వకముగా సమాహీతుడై, తరువాత గ్రహన్యాసముజేయవలె-76, వరద -అభయ, చిహ్నములుగల చేతులతో నొప్పినవారు, శక్తిచే ఆలింగింపబడిన విగ్రహముగల వారు, కుంకుమ క్షీరము, రక్తము, మల్లెమొగ్గ, బంగారము, శంఖము వీనితోను, మేఘము-ధూమము- చీకటీ-వీనితోనుపోలిన వారినిగా సూర్యాదులను తొమ్మండుగురిని స్మరింపవలె. హృదయముక్రింద సూర్యునుంచవలె. శిరమున చంద్రునుంచవలె. కన్నులలో కుజునుంచవలె-78. హృదయమున శుక్రుని, హృదయమధ్యమున బుధుని, కంఠమున పృహస్పతిని, నాభియందు శనైశ్చరుని, ముఖమున రాహువును, పదద్వయమున కేతువును ఉంచవలె-75.తరువాత, మండుచున్న కాలాగ్నితో సమానులు, వరద-అభయ చిహ్నములు హస్తములందుగలవారును, సర్వాభరణముల చేనలంకరింపబడినవారునునైన తారలను ధ్యానించుచు న్యసించవలె-80. నుదుట కన్నులలో, చెవులలో, ముక్కురంధ్రములలో, కంఠమున, భుజములపైనను, తరువాత మోచేతులలో, మణికట్టులలోను-81. స్తనములలో,నాభియందును, నడుమునందును, తొడలయందును, మోకాళ్లయందును, పిక్కలయందును, పాదములయందును శుద్దుడైయోగినీ న్యాసముజేయవలె. అట్లే హృదయమున-82, నాభియందు, స్వాధిష్టానమందును మూలాధారమందును, భ్రూమధ్యమున, శిరమున క్రమముగా పద్మ-ఇందుకర్ణికల మధ్యన దళములందు వర్ణశక్తులను, -83.తరువాత దళాగ్రములందు పద్మము యొక్కశిరమున అన్నిశక్తులను వ్యిన్యసిపంపలే అమృత, నందిని, ఇంద్రాణి, ఈశానీ, అత్యుమ-84 ఉర్ధ్వకేశి, ఋద్విదుషి, (అచ్చుకారిక, ఏకపాదాత్మక,ఐశ్వర్యాకారిణీ, ఔషధాత్మిక-85. అంబిక, రక్షాత్మక, అనునవి పదునాలు శక్తులు. కాలిక, ఖేచరి, గాయత్రీ, ఘంటాధారిణి-86. నాదాత్మక, చాముండ, ఛత్రిక, జయ, ఝుంకారిణి, సంజ్ఞ, టంకహస్త, ఓంకారి మీరు క్రమముగా పండ్రెండుగురు శక్తులు. ఢంకారి, టంకారిణి, జామీని, తామసీ, ధంకారిణి, దయ, ధాత్రి, నాదిని, పార్వతి, ఫటికారిణీ, ద్వయ పన్నగశక్తులు(పదుగురు శక్తులు)-89. వర్దిని, భద్ర, మజ్జ, యశస్వినీ, రమ, లామనీ, వరుసగా నీయాఱుగురు శక్తులు-90. . నారద, శ్రీ, షండ, శశ్వతీ- ఇవి ఈ నాలుగు శక్తులు, హాకిని, క్షమ ఇవి రెండు శక్తులు-1, తరువాత పాదమున, భీంగమున, కడుపునందు, హృదయమున, బాహువులందు, శిరమున, కుడినుండి యొడమపాదముచివరి వరకు మేషాదిరాశులను విన్యసింపవలె-92. తరువాత ఏబదీ ఫీఠములు, ఒక చక్రమము-మనస్సు--వీనిని విన్యసింపవలె. వారాణసి, కామరూపము, నేపాలము, పౌండ్రవర్థనము-93. కాన్యకుబ్జము వరస్థిరము, పూర్ణశైలము, అర్బుదము. ఆమ్రతకేశ్వరము ఏకామము, త్రీస్తోతము, కామకోర్ధకము-4 కైలాసము భగునగరము, కేదారము చంద్రపుష్కరము, శ్రీపీఠము, ఏకవీర, జాలంధ్రము, మాలవము-95. కులాన్నము, దేవికోటము, గోకర్ణము, మారుతేశ్వరము, అట్టహాసము, విరజము, రాజవేశ్మము, "మహాపథము-96. కోలాపురము, ఏలాపురము, కాలేశ్వరము, జయంతిక, ఉజ్జయిని, చిత్రీ, క్షీరకము, హస్తినాపురము-97. ఉడీర, ప్రయాగ, షష్టిమాయాపురము, గౌరీశము, సలయము, శ్రీశైలము, మరువు -98. గిరివరము, తరువాత మహేంద్రము, వామనగిరి, హిరణ్యపురము, మహాలక్ష్మీపురము-69. పురోద్యానము, ఛాయాక్షేత్రమునుగూడ విద్వాంసులు చెప్పుదురు. వీనిని లిపిక్రమసమాయుక్తములుగా జేసి లీపిస్థానములలో విన్యసింపవలె-100. తరువాత, లీపీసంక్రమమువల్ల చెప్పిన స్థానములలో తక్కిన వానిని గూడ విన్యసింపవలె. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన షోడాన్యాసము నాచే చెప్పబడినది-101. ఈ విధముగా విశ్వసించిన దేహముగలవాడు దేవతా విగ్రహుడేయగును. తరుపోత ముందు అణు విభాగములు చేసి శ్రీ చక్రన్యాసమునాచరింపవలె-102. అంశాలగాయిత్తు 'ఆనంద్యమూర్తివరకు మంత్రములతో వ్యాపకమును చేయవలె, చక్రేశ్వరుని, చక్రసమర్పణ మంత్రములను హృదయమునన్యసింపవలె-103. తరువాత తక్కినవానిని చెప్పిన స్థానములలో గణపతి మొదలగు వారిని న్యసింపవలె కుడితొడకు సమముగా ఎడమతొడనుంచి అందరి నచట క్రమముగా విన్యసంపవలే -104 గణేశుని క్షేత్రపాలుని, యోగినిని, బటుకుని నుంచవలె, మొదట. నీంద్రాదులను కాలిబొటనవ్రేళ్ల చీవరలలోను-105. మోకాలు ప్రక్కభుజములుశిరము-ముఖము-ప్రక్కమోకాళ్ళు, శిరములు వీనితోను ఉంచవలె. మూలాధారమున పద్యణిమాది సిద్దులనుంచవలె-106. తరువాత (వానినే భుజములు బాహువులు- వీపు- రొమ్ము- పాదాగ్రములు, పిరుదులు, బాహుదేశములు- వెన్ను-శిరము. రెండుపాదములు వీనియందు క్రమముగానుంచవలె-107, అజీమ-లఘిమ- మూడవది మహిమ- ఈశిత్వము- వశిత్వము- ప్రాకామ్యము- ప్రాప్తిఇచ్చాసిద్ది -రససిద్ది- మోక్షసిద్ధి ఇవి పండ్రెండు సిద్ధులనబడినవి-108. తరువాత ఓ బ్రాహ్మణా! అగస్త్యా బుద్ధిమంతుడు ఎనిమిది మాతలను క్రమముగా కాలి బొటన వ్రేళ్లజంటలోను, కుడిప్రక్కన, శిరమున, ఎడమ వైపున;ఎడమ మోకాలిలోను, కుడిమోకాలిలోను, కుడియెడమ భుజములలోను-110. (ఉంచవలె) బ్రాహ్మి-మహేశ్వరి- కౌమారి-వైష్ణవి-వారాహీ ఇంద్రాణీ- ఏడవది చాముండ మహాలక్ష్మి-వీరు క్రమముగా ఏడుగురు మాతలు అని బుధులు దెలియవలె. వీనియందే ఎనమండుగుర ముద్రాదేవతల నుంచవలె, వీనిలోనే అయిరువురినుంచవలె-112. శిరమున పాదమున సర్వసంక్షోభిణీ-సర్వవిద్రావిణి ముద్రలు తరువాత సర్వార్ణాకర్షిణి-113, సర్వాద్యవశకరిణి, సర్వాద్యప్రియకారిణి, సర్వాద్యమహాంకుశి, సర్వాధ్యఖేచరి-114. త్రిఖండ సర్వబీజ, సర్వప్రపూరికాముద్ర యోనిముద్ర అని తెలియవలె, అచట చక్రేశ్వరి నుంచవలె-115, త్రైలోక్యమోహనమైన చక్రమును సమర్పించీ శరీరమున వ్యాపకము జేయవలె. తరువాత వరుసగా పదునాలు నిత్యకళలునుంచవలె-116, కామాకరణరూప, శబ్దాకర్షణరూపిణి, అహంకారాకర్షిణి, శబ్దాకరణరూపిణి-117. స్పర్శాకర్షణరూప రూపాకరణరూపిణి. రసాకర్షణరూప గంధాకర్షణరూపిణి-118 చిత్తాకర్షణరూప ధైర్యాకర్షణ రూపిణీ, స్కృత్యాకర్షణ రూప హృదయాకర్షణరూపిణి-119 శ్రద్దాకర్షణరూప ఆత్మాకర్షణరూపిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణిగా చెప్పబడినది. -120. స్థానములు- ఎడమచెవి, వీపు, భుజము, మోచేయి, కుడిచేతి పైన-వీపు, పిరుదు-మోకాళ్ళు- పీక్కలు-121. పాదాగ్రములు, ఎడపాదాగ్రములు మొదలుకొని విలోమముగ చక్రేశ్వరిని న్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపనము జేయవలె-122. తరువాత ఎనమండుగురును అనంగకుసుమదేవ్యాదులను నొసలు, మూపుయొక్కసంధులు, తొడలు, పిక్కలు, న్యసింపవలె. ఎడమవైపున ప్రతిలోమముగా న్యసింపవలె-123. అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర -124, అనంగరేఖ, వేగయను అనంగపూర్విక, అనంగాంకుశ, అనంగాధారమాలిని-125. చక్రేశ్వరి వీనిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపకకర్మచేయవలె. ఆ తరువాత సర్వంక్షోభిణ్యాదులైన శక్తి దేవతలను విన్యసింపవలె. -126 నొసట, చెక్కిళ్లయందు, భుజమునందు, పాదమూలమునందు మోకాలియందు పిక్కపైన క్రిందను, ఎడమవైపున విలోమముగ న్యసింపలె-127. సర్వసంక్షోభిణీ శక్తి, సర్వవిద్రావిడి, సర్వాద్యాకర్షిణీశక్తి, సర్వప్రహ్లాదీని, సంమోహినీశక్తి, సర్వాద్యోస్తంభిని, సర్వాద్యాజృంభిశక్తి, సర్వాద్యావశకారిణి-124 సర్వాద్యారంజనీశక్తి, సర్వాద్యోన్మాదిని, సధినీశక్తి, సర్వాశాపూరిణీ-130. సర్వమంత్రమయీశక్తి, సర్వద్వంద్వక్షయంకర. చక్రేశ్వరిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాకపము జేయవలె-131. తరువాత సర్వసిద్ధి ప్రదాదుల పదుగురిని విన్యసింపవలె. కుడివైపున ముక్కుపుటమున, దంతమూలమున కుడిస్తనమున-132. మోచేతియందు, మణికట్టునందు, విన్యసింపవలె. ఎడమవైపున విలోమముగానుంచవలె. నిత్యము సర్వసిద్ధిప్రద సర్వసంపత్ర్పద-133. సర్వప్రియంక్వారాదేవి, సర్వమంగళకారిణి, సర్వాఘమోచనీశక్తి, సర్వదుఃఖవిమోచిని-134. సర్వమృత్యుప్రశమిని, సర్వవిఘ్నవినాశిని, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయినీ-135. చక్రేశ్వరిని వీస్యసించి, చక్రము నర్చించి, శరీరమున వ్యాకపము జేయవలె. తరువాత, సర్వాజ్ఞాద్యులను - తొమ్మున, దంత స్థలమున విన్యసింపలే, -136 సర్వజ, సర్వశక్తి, సర్వజ్ఞానప్రద, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీ-137. సర్వాధారస్వరూపక సర్వపాపహర, సర్వానందమయీదేవి, . సర్వరక్షాస్వరూపిణి, పదవది సర్వేప్సిత ఫలప్రద-138. చక్రేశ్వరిని విన్యసించి చక్రము నర్చించి శరీరమున వ్యాపకము చేయవలె, ముందు (తూర్పున) వామాదులను విన్యసించి తరువాత పక్షిణ్యాదుల విన్యసింపలలె. 139 కుడివైపున - గదవయందు, కంఠమున, స్తనమున, నాభియందు, ప్రక్కలందు, పామా, వినోదిని, విద్య, వశిత, కామిక-140 కామేశ్వరి, పరా, మోహిని విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని, అని ఆశక్తులనామములను పండితులు చెప్పిరి. -141. చక్రేశ్వరిని విన్యసింపవలె. చక్రమునర్చించి శరీరమున వ్యాపకమును జేయవలె. హృదయమున త్రికోణమును సంభావించి తూరుపు మొదలగుదిక్కులందు వరుసగా-142. వీన్యసింపవలె. బుద్ధిమంతుడు వానికి వెలుపలగూడ నాలుగాయుధములను ఆగ్నేయది మూలలందు విన్యసీంవలె, మధ్యన నాలుగు పీఠములనుంచవలె-148. మధ్యవృత్తమును న్యసించి నిత్యాషోడశికను న్యసింపవలె. నిత్యాకామేశ్వరి, నిత్యాభగమాలిని-144, నిత్యక్లిన్న, నిత్యాభేరుండినీ నిత్యావహ్నివాసినిక, నిత్యామహావజ్రేశ్వరి-145, నిత్యాదూతీ, నిత్యాత్వరిత, నిత్యాకులసుందరీక, -146. నిత్యానీలపతాక, నిత్యాపరావీజయ, నాత్యామంగల-147. నిత్యాప్రభామాలినిక, నిత్యాచిత్ర-వీరిని త్రికోణాంతరముగా ఏమనుండీ హృదమయమువరకు విన్యపింపవలె-148. నిత్యాప్రమోదిని, నిత్యాత్రిపురసుందరి, హరిమధ్యన అఖండజగదాత్మకమైనదేవిని విన్యసింపవలె-149. చక్రేశ్వరిని హృదయమున విన్యసించి, చక్రమును పైకెత్తబడిన దానినిగా జేసి యోని ముద్రను ప్రదర్శించి, సర్వానందమంత్రమును జపించవలె. -150. ఈ విధముగ ఆత్మచక్రమునకు చక్రదేవి దేవిగాగలదు. -151.

ఇది శ్రీ బ్రహ్మాండమహా పురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీ నాల్గవ అధ్యాయమున లిలితోపాఖ్యానము సమాప్తము.

శ్రీమత్పతాపగడపత్తనమధ్యముననుండు శ్రీరామగథ నివాసియైన రఘునాథునిచే సంశోధింపబడిన యీ నిఖిలమాన్య బ్రహ్మండపురాణము మొత్తము విద్వన్మోదము గూర్చుగాత. రఘునాథునిచే శోధించడినను ఎచటనైనను సంశుద్ధము గానీది ఉన్నచో దయతో ఆ మొత్తమును క్షమింపగోరెద.