15 - వైవాహికోత్సవోనామ  పంచదశోఽధ్యాయః

            ఆమాటవినీ మహాదేవి చిరునవ్వు ముఖముతో బ్రహ్మవిష్ణువు మొదలగు దేవతలతో నిట్లనెను-1. ఓ దేవతలారా! నేనెప్పుడు స్వతంత్రను స్వేచ్చాచారమున విహరించుదానిని. నాకు దగిన చరిత్ర గలవాడు నాకు ప్రియుడుగాగలడు-2. అయని యామెమాట నంగీకరించి, సమస్త దేవతలతోబాటు బ్రహ్మ మహాదేవితో ధర్మార్థ సహితముగా నిట్లనెను -3. ఒక సమయమునకు మాత్రమే కొనబడినది, డబ్బుతో కొనబడినది, స్వయముగా చేరినది తండ్రిచేనీయబడినది, ఈ విధముగా స్త్రీ పురుషుల వివాహము నాలుగు విధములు-4. నిర్ణీత కాలమునకు కొనబడినది వేశ్యయగును. వెలగట్టికొన్నది దాసియగును, గాంధర్వవిధితో వివాహముజేసికొన్నది ‘యుక్త’ యగును. తండ్రిచే యథావిధిగ నీయబడినదీ భార్యయగును-5. (యుక్త) సమాన ధర్మముగలదియగును. భార్య పితరులకు వశంవద చెప్పినట్లు వినునది యగును. మొదట సదసద్భావములు లేక అద్వైతమై (రెండులేనిదై) పరబ్రహ్మయుండెను-6. దానినుండి చిదానందాత్మకముగా   ప్రకృతి జనించెను. నీవేయా బ్రహ్మపు, నీవేగా ప్రకృతివి-7. నీవేయనాదీవి (మొదలులేని దానివి) అఖిల స్వరూపిణివి. కార్యకారణ స్వరూపిణివి. సనకాదియోగులు నిన్నే వెదకుదురు-8. సదసత్కర్మరూపిణీవి, వ్యక్త (బయల్పడినది) అవ్యక్త (బయల్పడనిది)యైనయుదయము గలదానివి. అట్టి నిన్నే పంచబ్రహ్మ స్వరూపీడిగా ప్రశసింతురు-9. మొదటనీవే సృష్టింతువు. నీవేదానిని రక్షింతువు. లోకానుగ్రహమునుగోరి. ఒకపురుషుని బొందుము-10. ఈ విధముగా దేవతల చేతను. బ్రహ్మచేతను విన్నవింపబడి యమహా దేవి చేతితో నొకహారము నెత్తి యాకాశమధ్యమునకు విసిరేను-11. ఆమె విసిరిన మాల ఆకాశమును బ్రాకాశింపజేయుచు అపుడు కామేశ్వరుని కంఠమునబడెను-12. అంత బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలు సంతసించిరి. పిల్లవాయువులతో కదల్పబడిన మేఘములు పుషముల వర్షించినవి-13.

ఆ తరువాత బ్రహ్మ భగవంతుడైన విష్ణువుతో నిట్లనెను. ఓ హరీ! ఈశివులకు మహాదేవీమహేశ్వరులకు వివాహము జేయవలెను-14 . జగన్మంగల కారకమైన ముహూర్తము దేవతలచేత సంప్రాప్తమైనది (వచ్చినది) మహాదేవి నీ రూపము గలిగియున్నది. నీవు గూడ నామెకుతోబుట్టువు-15. కావున ఈ కల్యాణిని కామశివునకీయదగుదువు. బ్రహ్మయొక్క యీ మాటను వినీ దేవదేవుడైన త్రివిక్రముడు (మూడు పాదములలో ముల్లోకము సాక్రమించిన విష్ణువు)-16. ప్రేమతో నా మహాదేవిని వీధిపూర్వకముగా శంకరునకిచ్చెను. దేవతలకు ఋషులకు పితృదేవతలు మొదలగు సమస్త దేవతలకును యోగులకును కల్యాణమైన మహేశ్వరీ మహేశ్వరుల కల్యాణమును ఆదిశ్రీహరి చేయించెను. బ్రహ్మాదులైన దేవతలు కానుకలు సమర్పించిరి-18. బ్రహ్మ వజ్రసారమై యనశ్వరమైన చెరకువిల్లును, శ్రీ విష్ణువు పాడని పుష్పాయుధమును-19. వరుణుడు నాగపాశమును, రాజైన విశ్వకర్మ అంకుశమును-20. అగ్ని కిరీటమును, చంద్రసూర్యులు చెవికమ్మలను, రత్నాకరుడు నవరత్నమయములైన సొమ్ములను-21. దేవేంద్రుడు అక్షయమైన మధుపొత్రమును, కుబేరుడు చింతామణి మయమైన మాలను-22. లక్ష్మీపతి స్వయముగా సామ్రాజ్య సూచకమైన ఛత్రమును (గొడుగును), గంగాయమునలు చంద్రునివలె తెల్లని వింజామరలను-23. ఇంకను అష్ట వసువులు ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్వినీదేవతలు, ఇంద్రాది దీక్పాలురు, మరుత్తులు, సొధ్యులు, గంధర్వులు, ప్రమథ గణపతులును, పరితోషితులై వారీ వారీ యాయుధములను ఈమెకిచ్చీరి-24. రథములను, మహావేగములైన గుఱ్ఱములను, మహాబలములైన ఏనుగలను, రోగములేని ఒంటెలను, అశ్వములను ఆకలిదప్పులు లేనివానిని ఇచ్చేరి, సపరీచ్చదములై (కవచములుగల) వజ్రముతో సమానమైన యాకారముగల యాయుధములనిచ్చీరి-25. ఆ తరువాత మహేశ్వరీ - మహేశ్వరులను సామ్రాజ్యమునందు మంగళకరముగా నభిషేకించిరి. తరువాత బ్రహ్మ కుసుమాకరమను విమానమును నిర్మించియిచ్చెను-26. అది వాడిపోని మాలలుగలది. ఆయుధములచే నెప్పుడును భేదింపనలవికానిది. దేవలోకమునను, భూలోకమునను, అంతరిక్షమునను (ఆకాశమునను) సుసమృద్ధిమంతమై కామ గమనము గలది. (ఇచ్చవచ్చినట్లు పోవునది)-27. దాని గంధమును వాసనజూచిన మాత్రమున భ్రాంతీ-రోగము-ఆకలి-పీడలు-ఇవి క్షణకాలముననే నశించును. అది మనమున కానందమును గూర్చునది. శుభమైనదీ-28. చామరములు, విసనకర్రలు, గొడుగులు జెండాకట్టెలు-వీనితో మనోహరమైన యా విమానమునా యిద్దరు దివ్యదంపతులు అధిరోహించరీ-29. వీణ వేణువు మృదంగము-మొదలగు వివిధములైన మద్దెల మొదలగు వాద్యములు మ్రోయగా దేవగణములతో రాజమందిరము నుండి వెడలి-30. ఆ యీశ్వరీ తేజముతో బ్రకాశింపజేయుచు వీధిలో విహారము గావెడలెను. ఎదుట (ప్రక్క) నున్న మేడల చివరనున్న వేలకొలదీ-51. యస్పరసలు ముత్తైదువలును తమ చేతులతో లాజక్షతలను వర్షించిరి. మంగళార్ధములైన గాధలు బాడిరి. వీణావేణ్వాది ధ్వనులు చెలగినవి. వీనితో సంతసించుచు ఈ విధముగా వీధివీథులలో మెల్లమెల్లగా తిరిగివచ్చెను-52. అప్సరలచే చేయబడిన నీరాజనమునుగైకొని మీమానాగ్రమునుండి దిగీ మహాసభలో ప్రవేశించేను-33. శివునితో సహా సింహాసన మధిరోహించెను. అచట మహాజనులు మనమునగోరిన దానినెల్ల సర్వజ్ఞయైన యామహాదేవి కరుణా కటాక్షపాతముచేతనే పూరించెను-34. దానిని జూచి లోకపితామహుడైన బ్రహ్మ ‘కామాక్షి యనియు కామేశ్వరీ’ యనియు పేరిడేసు-35. ఆ పురమున ఆమె యాజ్ఞచే ఆశ్చర్యకరమైన మేఘము గూడ గొప్ప విలువైన వస్తువులను దివ్యములైన యాభరణములను వర్షించినది-36. దేవియొక్కయెదుట ప్రత్యింటను చింతామణీ, కల్పవృక్షము, కమల (లక్ష్మి), కామధేనువులును నెలకొన్నవి-37. వదలిపెట్టిన యితర క్రియా-గుణములుగల వారై సర్వకామార్థసంయుక్తులై నిత్యము సంతసించుచు సేవానందము మూర్తీభవించిన యా మహాదేవిని సేవించిరి-38. బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతా గణములు-39. దేవర్పులు నారదాదులు, సనకాదులైన యోగులు, మహర్షులు, మన్వాదులు, వశిష్టాదులైన తపోధనులు-40. గంధర్వులు, అప్పరసలు, యక్షులు, ఇతర దేవజాతులు, దివిలోభువీలో ఆకాశములో ససంబాధముగా నున్నవారు-41. వీరందరును ఆమె పురమున నేబాధయులేక యుండిరి-42. ఈ విధముగా వత్సలమైన (భక్తులందదయగల) యాదేవి ఈ యఖిల జనములను వదలి వేరొక చోటికి వెళ్ళదు. మీక్కలి యనురాగముతో పారిసెల్లప్పుడు సంతసింపజేసేను-43. అందరి కోరికలను దెలిసి ఈ మహాభూలోకమునకు రాజైన వాని యొక్కయు, ఈ సమస్త భూతలముననుండు వారియొక్కయు అభీష్టములనన్నింటిని ఈ రాణీ పీతికెను-44, అంబికతో గూడిన కామశంకరుడు త్రిలోకమునకేకరాజు పదివేలయేండ్లు ఒక క్షణమువలే గడచెను-45. అంత, ఒకసాడు భగవంతుడు ఋషియైన నారదుడు వినయముతో పరాశక్తికి నమస్కరించి యిట్లనెను-48. ఓ పరమేశ్వరి! నీవు పరబ్రహ్మవు. నీవే పరమమే పవిత్రమైన ధామమవు (స్థానము) సదసద్భావముల సంకల్పించుదానివి వికల్పించు దానివీ-47. జగముయొక్క యభ్యుదయము కొఱకే వ్యక్తభావమును బొందినదానివి. అసజ్జన వీసాశమే ప్రయోజనముగా గలదానివి. సజ్జనులయభ్యుదయమును గోరిన దానివి. నీ ప్రవృత్తియంతయు ఓ కల్యాణీ! సాధుసంరక్షణ కొరికే గదా-48. ఓదేవి! ఈ భండాసురుడు మూడు జగముల బోధించుచున్నాడు. నీ వొక్కరితమే వానిని జయింపగలవు. ఇతరులైన దేవతలకు సాధ్యముగాదు-49. నీ సేవయందే తత్పరులైన దేవతలు చిరకాలమిచటనేయుండిరి. నీయాజ్ఞచే పొరీ వారియిండ్లకు పురములకు బోగలరు-50. అమంగలములు శూన్యములైనవి. సత్త్వవంతములై సమృద్ధమైన ప్రయోజనములు గలవియైనవి- ఇట్లు నారదుడు విన్నవింపగా నాయఖిలేశ్వరి దేవతలను తమ తమ నివాసములకు వెళ్ళియుండుటకై పంపెను-51. అంబిక బ్రహ్మను, హరిని, శంభువును, ఇంద్రాది దీక్పాలకులను, వారివారికి తగినట్లు పూజించిపంపివేసేను-52. అట్లు పంపబడిన దేవతలు ఆమెను వదలిపెట్టుట ఆపరాధమని తలించిరి, కాని ఎవరికి వారు తమ యాత్మాంశలలో ఆదిపితరులైన మహేశ్వరీ మహేశ్వరుల సేవించునేయుండిరి-53. ఈ లలితోపాఖ్యానము ఆయుష్యమునిచ్చునది. సర్వమంగళములకు కారణము. విద్వాంసుడు భక్తి శ్రద్దలతో గూడినవాడై ప్రొద్దున లేచి మహాదేవియావిర్భావమును, ఆమె రాజ్యాభిషేచనమును జపించినచో ధన సమృద్ధి గలవాడై అమృతము వలె తీయగా మాటలాడు వాడగును-55. ఆతనికీ లోకమునగాని పరలోకమునగాని అశుభముండదు. విశాలమైన యశమును (కీర్తిని)బొందును. సమానులలో నుత్తమశ్లోకుడగును-56. అతనికి స్థిరమై చంచలముగొనీ లక్ష్మి లభించును. అడుగడుగున శ్రేయము చేకూరును. ఎప్పుడును భయము గలుగదు. తేజస్వియు వీర్యవంతుడును అగును-57. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపములంటవు. ధర్మార్థకామమోక్షములను నాలుగు పురుషార్థములతో నిండియుండును. సింహాసనేశ్వరుని మూడు సంధ్యలలో ధ్యానించి జపించిన వాడు జాపకోత్తముడు ఆరుమాసములలో మహాలక్ష్మిని బొందును-59.

ఇది బ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున వైవాహికోత్సవమను పదియేనవయధ్యాయము.