28 - విశుక్రవిషంగవధో   

శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున విశుక్రవిషంగవధమను నిరువదియెనిమిదవ యధ్యాయము-తృతీయదివ సయుద్ధము.

            భండాసురుడు సోదరుడైన మహారాక్షసుడు (గజాసురుడు) రణమున జచ్చుటను విని సేనల యొక్క యుద్ధమును గూడవిని సంతపుడై మిక్కిలి చింతించెను-1. అంత, భండాసురుడు తనసోదరులగు విషంగవీశుక్రులను యుద్ధమునకు పంపెను.వారిరిరువురు నెప్పుడును కలిసియుండువారు. భండునిచే నాజ్ఞాపింప బడినవారు. అట్టి విషంగ విశుక్రులు యుద్ధమునకు మహోద్యమమును జేసిరీ-3. కనిషునితో గూడి మహాబలుడై యువరాజగు శ్రీశుక్రుని ముల్లోకముల నగరజేయు సేనయనుసరించేను. నాలుగువందల యక్షౌహిణీ సేన విశుక్రుని నావరించి వచ్చుచుండెను. యువరాజైన విశుక్రుడు గూడ గొప్ప ప్రతాపముచే హెచ్చుచుండెను-5. ఉలూకుడు మొదలగు భండాసురునీ మేనల్లుండ్రు గూడ మహోద్దతులై బయలుదేరిరి, వారు భండాసురుని యక్కయగు ధూమిని యందు బుట్టిన వారు-6. వారికి మామ యగు భండాసురుడే యస్త్రశీక్షణము నిచ్చెను. పరాక్రమమున దీరుగుచు వారు సేనాధిపతులై బయలు దేరిరి-7. పైకెగసిన తమ ధనుష్టంకార ధ్వనితో పది దీకులను మారు మ్రోగించిరి. ఈ మేనల్లుండ్రు తమ యిరువురి మేనమామలకు (విషంగవిశుక్రులకు) ప్రీతిని గలుగజేసిరి-8. తమ తమ వాహనములెక్కిది. ప్రతియొక్కరును గాఢమైన యహంకారములతో నొప్పిరి. తమ బరువైన ధనువుల నారులను లాగిరి. ఈ విధముగా వారు విశుక్రుని ననుసరించి వెడలిరి-9. యావరాజ్య ప్రభాచిహ్నములైన ఛత్రచామరములతో బ్రకాశించి గజమునెక్కి విశుక్రుడు యుద్ధభూమీని జేరెను-10. అంత, కలకలా రావమును జేయుసేనతో నావరింపబడినవాడై విశుక్రుడు ఒక గంభీరమై భయంకరమైన సింహనాదమును జేసెను-11. ఆకలతతో కలత జెందిన మదీతో శక్తులు సంభ్రమముతో విజృంభించిరి. వరుసలు గట్టి అగ్ని ప్రాకార వలయము నుండి బయలువెడలి-12. తమ తమ కాంతులతో నాకాశమునంతయు మెఱపులు నిండినట్లుగా జేసిరి. రణోన్ముఖులై ఆశాశమండలమును ఎట్ట కమలములతో నావరింపబడిన దానిగా జేసిరి-13. అంతలో భండాసురునీ తమ్ములు యుద్ధదుర్మదులై, శక్తులు వచ్చుటను విని, ఒక్కుమ్మడిగా మంత్రిణీ దండనాయికలతో యుద్ధము జేయవచ్చిరి-14. ఆ మంత్రీడీ దండనాయికలు శ్రేష్ఠములైన కిరిచక్రరథమును బ్లేయ చక్రరథమును ఆధీష్ఠించిరి. ఆ రథములకు రాజచిహ్నములైన గొడుగులు గలవు. వీచుచున్న చామరములును గూడ గలవు. అప్సరలు వచ్చి వారి మహోదయములును గానము జేయుచుండిరి. విషంగవీశుక్రులతో యుద్ధము జేయుటకు లలితాదేవి యాజ్ఞచేత, శ్రీచక్రరాజరథముయొక్క రక్షణమున నియోగింపబడిరి-17. రథమున గూర్చున్న దండనాథ అస్త్రములతో భయంకరమైన తక్కిన సైన్య సమూహములను గూర్చి రణోన్ముఖియై ముందుకు బయలుదేరెను-18. చేతియొక్క ఒక్కవేలిచేత హలాయుధమును ద్రిప్పుచుండెను. మరోక హస్తముతో రోకలి వంటి యాయుధమును మాటిమాటికి ద్రిప్పుచుండెను-19. ఆమె ముఖము పద్మము వలెనుండెను. ముసుగు వస్త్రములో నుండి సిగలోనున్న చంద్రకళ తళతళమని ప్రకాశించుచుండెను. యుద్ధమున శత్రువుకన్న ముందే దెబ్బవేయునట్టి పరాక్రమముతో విజృంభించుచుండెను-20. ధనువు యొక్క నారీఠంకారముచే వీశ్వమునే నీంపుచుండెను. అల్లిన జడలో చంద్రుడను చివురాకు నలంకరించేను-21. మూడవకన్ను సిందూర తిలకకాంతిని గలిగియున్నది. చేయి మణికంకణముతో సుందరమై పద్మమువలే రమ్యమైనదీ-22. అమ్ములపొదీనుండి లాగిన బోణమును చేత త్రిప్పుచుండెను. జయింపుము, వర్ధిల్లుము వర్ధిల్లుము అని మిక్కిలి సంతోషముతో నమృతవాక్కులతో-23. నాట్యము జేయుచు దివ్యమునులాశీర్వదించుచుండిరి. గేయ చక్రరథశ్రేష్ఠము యొక్క చక్రపుటంచుల ఘట్టనములు-24. దానవ హృదయములతో బాటు భూతలమును జీల్చుచుండెను. అమరస్త్రీలుపెక్కురు విశ్వ మనోమోహనమైన గీతిబంధముతో దండనాథయొక్క లోకాతీశయ వైభవమును గానము జేయుంచుండిరి-25. కల్పాంతకాలమునుద్వేలమైన సముద్రమువలె సమరమున విజృంభించు ఎనిమిది వేల యక్షౌహిణీ సైన్యమును దండనాథ లాగుకోనీ పోవుచుండెను-26. ఆమెయొక్క శక్తి సైన్య మండలమున కొందరు బంగారు వన్నెగలవారు, కొందరు దానిమ్మ పండు రంగు గలవారు. కొందరు మేఘకాంతి గలవారు-27. ఇతరులు సిందూరపు వన్నెగలవారు. మరి కొందరు కలిగొట్టు పువ్వువలె  నెఱ్ఱనైన వారు, కొందరు  కాచాద్రీకాంబరులు (గాజు పర్వతము వంటి వస్త్రములు గలవారు). కొందరు శ్యామల వర్ణముగల సుకుమారులు-28. కొందరు మణులవలె ప్రకాశించువారు. కొందరు గరుత్మత మణుల వలే బ్రకాశించువారు. (గరుడపచ్చలవంటివారు). కొందరు విరుద్ధములైన పంచ బాణములతో మిశ్రితములైన శతకోటి కాంతులతో తమ దేహకాంతిని వ్యంజింపజేయువారు. కొందరు  వివిధాయుధములు గలవారు. దండినీ సైన్యమున వీరు అసంఖ్యాకులై కదిలిరీ-30. ఓ అగస్త్యా! మంత్రిణీ సేనానాయిక యొక్క సైన్య సన్నాహము:- భూష-వేషాదులలోను, ప్రభావ లక్షణములలోను-31, సద్గుణ సౌలితలోను, ఆశ్రిత రక్షణలోను, రాక్షస సమూహ సంహారములోను, సర్వులచే పూజింపబడుటలోను-32. మహారాజ్ఞి కెంత శక్తి కలదో దండినికి గూడనంతటి సమస్త శక్తి కలదు. కాని, మంత్రిత్వమునకై మహారాజ్ఞచే నీయబడి యామె కరముననున్న ఆమెయాజ్ఞాముద్రాంగుళీయకము మాత్రము విశేషము, (ఇది మహారాజ్ఞకడనుండదని భావము)-33. ఈ విధముగా మంత్రిణీదండనాథల సైన్యము ముందుకు కదలగా నా, సైన్య భారముచే బీటలు వారిన భూమీ ఊయెల యూగెను -34. ఆ తరువాత యుద్ధము ప్రవర్తిల్లెను. అది దొమ్మి యుద్దము, గగుర్పాటు గలిగించెను. దాని వలన పైకెగసిన ధూళిచేత సప్త సముద్ర జలములన్నియు బురదగానైనవి-35, గుఱ్ఱము నెక్కిన వారితో గుఱ్ఱము నెక్కిన స్త్రీలు, రథముననున్న వారితో రథముననున్న స్త్రీలును, గజము నెక్కిన వారితో గజము నెక్కిన స్త్రీలును, గడ్డ ధారులతో ఖడ్గ ధారిణులైన పదాతి దళమును ఢీ కొనిరీ-36, దండనాథ విషంగునితో రణమున యుద్ధము జేసెను. విశుక్రునితో లాగిన మణి ధనువు గల శ్యామా శక్తి యుద్దముజేసెను-37. అశ్వారూఢ ఉలూకజిత్తుతో గొప్ప రణము జేసెను. సంపదీశ పురుషునితో యుద్ధము జేయదలచి వాని బట్టుకొనెను-38. నకులీదేవి విషునితో యుద్ధము జేసెను. మహామాయ కుంతిషేణునితో యుద్ధము జేసెను-39, ఉన్మత్త భైరవి మలదునితో యుద్ధము జేసెను. లఘుశ్యామ కుశూరునితో యుద్దము జేసెను-40. స్వప్నే మంగలుడను దైత్య-రాజుతో యుద్దము జేసెను. పొగ్వాదిని, ద్రుఘణునితో తలపడేను-41. చండకాలి దుష్టుడైన కోలాటునితో యుద్దము జేసెను. శక్తుల శతాక్షౌహిణీ సైన్యము క్రోధమూర్ఛితలైన రాక్షసుల యక్షౌహిణీ సైన్యముతో నొండొరులు రణమున తలపడిరి-42. యుద్ధము జరుగుచుండెను. దుష్టుడైన విశుక్ర రాక్షసుడు శక్తిసేన వర్ధిల్లుచుండుటను తమ సేన తగ్గుతున్నట్లను జూచెను-43. చూచి కోపావిష్ణుడై తన బరువైన ధనువును లాగీ సమస్త శక్తి సైన్యముపై తృషాస్త్రమును (దప్పిని కలుగజేయు నస్తమును) వదిలెను-44. కారు చిచ్చువలె మండిన యాతృషాస్త్రముచే శక్తి సైన్యము మథింపబడినది. అపుడు మూడవ యుద్దదివసమున సూర్యుడు ఒక జాము గడచేను. శక్తులు విశుక్రుడు వదిలిన తృషాస్త్రముచే, వ్యాకులితలైరీ-45. అపుడు శక్తులకతీతీవ్రమైన తృషా జ్వరమావరించెను. అది వారీ యింద్రియ సమూహములను క్షోభింపజేసినది. దవడల మూలములను మిక్కిలి ఎండజేసినది. చిట్ట చివరకు చేతి నుండి యాయుధములను జారవిడిచి దేహములు భూమిపై బడునట్లు జేసినదీ-46, 47. దప్పితో తపింపబడిన శక్తి సైన్యమును జూచి యా మంత్రిణి పోత్రిణితో (వారాహితో)బాటు మిక్కిలి చింతించేను-48. అపుడు రథ  స్థితమై మహా భయమునాశంకించుచున్న మంత్రిణితో ఆతృషాస్త్రప్రతీకార కర్మ విషయమును రథ గతమైన దండనాథ యిట్లనెను. చెలీ! . పోత్రిణీ! (వారాహీ) ఇదీ దుష్టుని యొక్క (విశుక్రుని యొక్క తృషాస్త్రమున వచ్చిపడినదీ-49. ఇదీ మన సైన్యమును శిథిలము జేయుచున్నది. అయ్యో! ఇదీ విధి యొక్క క్రమము. ఎండిన తాలుమూలములు గలిగి, విభ్రష్టమైన యాయుధముల తేజములు గలిగిన శక్తుల మండలము యుద్దమును ఉపేక్షించినది-60. ఎవ్వరితో గూడ యుద్ధము జేయుటలేదు, ఆయుధమును ధరించుటలేదు, ఓ. చెలీ! దవడల మూలము లెండి పోవుటచే మాటాడ నశక్తలైనారు-51. ఇటువంటి మన స్థితిని విని మహేశ్వరి యేమి చెప్పునో! దానవు అపకారము జేసినారు. దాని ప్రతీకారోపాయము చింతింపబడుగాక-52, ఓ పోత్రిణీ! ఎనుబది రెండు వేల యాక్షౌహిణీ సైన్యమున దప్పితో బాధపడని యొక్క శక్తి కూడలేదు-53. ఈ విధముగా శస్త్రములను వదలిన సేనను అవకాశముగా జేసికొని రంధ్రమును (లోపావకాశమును) జూచి యపహరించు స్వభావముగల దానవులు అయ్యో! బోణములతో మన సైన్యమును జంపుదురు-54. ఈ విషయమున నీవుపాయమును జేయవలె. నేను సమర ప్రయత్నము జేయుటకును ఉపాయమును జేయవలె. నీ రథము యొక్క ఒక పర్వమున (ఒక భాగమున) శీత మహా సముద్రుడున్నాడు-55. సమస్త శక్తుల దప్పినార్పుటకు అశీత సముద్రు నాదేశింపుము. చిన్న చిన్న పానీయముల ద్రోవుట మొదలగు పోటితో నీ శక్తుల దప్పి శాంతింపదు-56, అదీయే మద్రాసింధువు. శక్తుల సమూహముల దప్పిని శాంతింపజేయగలదు. కావున, సమరోత్సాహమును గలుగజేయు మహాత్ముడైన మదిరా సింధువు నాజ్ఞాపింపుము. అది యందరి దప్పినార్చగలదు. మహాబలమును వర్ధిల్ల చేయగలదు-57. అని చెప్పగా దండనాథ ఆ సదుపాయమునకు సంతసించెను. చక్రేశ్వరీ సుధా సింధుపును బిలువుమని (దండనాథను) ఆజ్ఞాపించెను-58. ఆ సుధా సింధువు మత్తుతో అలసమై యెర్రనైన కన్నులు గలవాడు, బంగరు వన్నెగలవాడు. పూలమాలల నలంకరించుకొన్నవాడు -59. ఆతడు దండనాథకు నమస్కరించి ఆమె యాజ్ఞను పరిపాలించేను-60. లేత. సూర్యునివలే నేనైన తనను బహు విధములుగా జేసెను. ఒకచోట చీకటిమ్రానువలె శ్యాముడు (నల్లనివాడు) ఒకచోట తెల్లని కాంతీ గలవాడు-61. ఈ సింధురాజు వాయువుచే బహంలీకృతుడై వ్యాపించి ఏనుగ తొండముల వంటి కోట్ల కొలదీ మధుధారలను వర్షించెను-62. పుష్కలావర్తకము మొదలగు కల్పాంత కాలమేఘములచే మధ్యన తడుపబడుచున్నవాడై శక్తి సైన్యమున బడెను-63. దాని గంధమును వాసన జూచినంత మాత్రమున చచ్చినవాడు సైతము జీవించి స్పష్టముగా లేచి నిలబడును. దుర్భలుడు ప్రబలుడగును. కావున సురాసముద్రుడు వర్షించెను-64. పరార్ద సంఖ్యకు (సంఖ్యామానములో చివరి సంఖ్య కంటే) మించిన మధు ధారల వరుసలను ద్రాగుచు దప్పితో బాధ జెందిన ముఖములతో శక్తులు లేచిరి-65. ఆ మదిరా సముద్ర వర్షము దానవులపై బడకుండగా ఆశ్చర్య కరియైన కదంబ వనవాసిని తన చురుకైన చేతులతో బ్రయోగించిన వేలకొలదీ బాణ సమూహములతో శక్తి సైన్యము చుట్టును ప్రాకార మండలమును నిర్మించేను-66-67, ఆ పనితో దేవతలందరు నాశ్చర్యపడిరి. ఇక శక్తులు బలోత్సాహముల పెంపొందించు ఏవిధములైన మదిరాధారలను వారి వారి రుచికి, స్వాదమునకు, మనః ప్రీతిడిని అనుగుణముగా రణ మధ్యమున మిక్కుటముగాద్రాగుచుండిరి-68-69. మూడవ యుద్ద దీవసమున రెండు జాముల వరకు సురాసముద్రుడు ఎడతెగకుండ మద్య ధారలను వర్షించేను-70. మద్య భేదములివీ: గౌడి (బెల్లముతో జేసినది) పైష్టి (పిండితో జేసినది), మాధ్వి (ఇప్పపూవుతో జేసినదీ), వరకాదంబరి (గోమంత పర్వతముననొక కడప చెట్టు తొఱ్ఱలో నుండి వచ్చినది), హైతాలీ; లాంగలేయ, తాలజాత (తాటికల్లు). సుర-71. కల్ప వృక్షమునుండి బుట్టినది దివ్య అనేక దేశములందు బుట్టినవి మంచి రుచి, పొసన గలిగి సుఖమును నీచ్చునవి-72. బకుల పుష్పపు వాసనగల ధ్వని జేయుచు నురుగుతో ప్రకాశించునవి. కారము గలవి, ఒగరుగలని, తీయనివి, చేదుగలవి-73. అనేక వర్ణములు గలవి. కోయునవి. దట్టమైనవి. కొద్దిగా పుల్లనివి. కారము పులుపు గలవీ. తీపి, పులుపు గలవి-74. శస్త్రముల దెబ్బతో గలిగిన బాధలను పోగొట్టునవి. ఎముకల నతుకునవి. రణమునందు భ్రమను బోగొట్టునవి. చల్లనీవి. చురుకైనవి (చురుకుదనమును గలిగించునవి) కొద్దిగా వెచ్చనివి-75. బాధలను బోగొట్టునవి. వరుణ దేవుని పుత్రికలైన యీ మద్యములు.  జయప్రదములు. సోనా విధములునైన సురాధారలను మదిరాసముద్రుడు వర్షించెను -76. ఆరణమున ఒక్కొక్క యోగినీ శక్తి జామువరకు ఐరావతమను నేనుగు యొక్క తొండముతో సమానమైన సురాధారను ఎడతెగకుండ సంతోషముతో ద్రాగెను-77. నోరుపైకెత్తి ఆశతో కదులుచున్న నాలుక గలిగి, సంతోషముతో మూసిన కన్నులుగలిగి శక్తులు మదిరనుబాగుగా ద్రావిరి-78. ఈ విధముగా సుధాంబుధి బహువిధ ధారాపాతములచే వచ్చి శక్తి సైనికుల నందరికీడప్పీ దీర్చి తన దివ్య రూపమునందెను-79 ఆ సురా సముద్రడు మరల దండనాథ కడకేగి నమస్కరించి యామెతో (లలితాదేవితో) స్నేహపూర్వకమై గంభీరమైన ధ్వనితో నీ మాటలనేను-80. దేవి! మహారాజ్ఞి! దండమండలనాయికా! ముగ్గరూపమైన శక్తిసేనను దాహముదీర్చి తృప్తిపరచితిని చూడుము-81. కొందరు శక్తులు గానముజేయుచు, మధురముగా మొలనూళ్లు ధ్వనింపగా, నాట్యము జేయుచున్నారు. నాట్యము. జేయుచున్నవారి ముందర  కొందరు తాళములు వేయుచున్నారు-82. కదులుచున్న సుందరములైన స్తనమండలము గలిగి కొందరు శక్తులు నవ్వుతున్నారు. కొందరు ఆనందముచే మెల్లగా బోవుచు ఒండొరుల యంగములపై బడుచున్నారు-83. కొందరు పిరుదులపైన జారుచున్నమొలనూలును వస్త్రములును గలవారై -యెగురుచున్నారు. కొందరు లేచి సన్నద్ధలై ఆయుధములు లేకయే త్రిప్పుచున్నారు-84. ఈ విధముగా మదీరా సముద్రునిచే చూపబడుచున్న యీ శక్తులను జూచి మిక్కిలి సంతసించినదై దండిని యామదరాసముద్రుని నిట్లనెను-85. ఓ మద్యసముద్రుడా! నీవు సహాయము జేసితివి. సంతసించితిని. ఇది దేవకార్యము. ఇది నిర్విఘ్నముగా జేయబడినది-86. ఈ తరువాత సాయనుగ్రహమున ద్వాపర యుగమున యజ్ఞమున యాజ్ఞికులకు సోమపానము వలె. మిక్కిలి యుపయోగపడెదవు-87. సమస్తదేవతలు మంత్రముచేత పవిత్రమైన నిన్ను యాగమున ద్రాగెదరు. మంత్రపూతమైన నిన్ను ద్రాగుటచే జనులు సిద్ధిని, ఋద్దీని (పంపదను), బలమును, స్వరమును, మోక్షమును పొందుదురుగాక.. మహేశ్వరీ, మహాదేవుడు (శివుడు), బలరాముడు, భార్గవుడు (శుక్రుడు), దత్తాత్రేయుడు, బ్రహ్మ, విష్ణువు వీరందరు మహాజనులును నిన్ను ద్రాగెదరు. యాగమున బాగుగా నర్చింపబడిన నీవు వారికి సర్వసిద్ధి నిచ్చెదవు-90. ఈ విధముగా వరమునిచ్చుటచే సురాసముద్రుని సంతోషింపజేసీ-91, దండిని (దండనాథ) మరల మంత్రోసినీ యుద్ధమునకు తొందరపెట్టుచుండెను. శక్తులకు దానవులతో మరల యుద్ధము జరిగెను -92. క్రొత్తకల్లుతో మత్తెక్కి యెని కన్నులు గలవారై శక్తులు తమ పెద్ద నవ్వులతో సినిమీది దిక్కులను పర్వతములను పగులగొట్టుచు ఒకే విలాసముతో ఒక్కసారిగా రాక్షస మండలముపై బడిరి-93. అపుడు మత్తశ్రీలజెలగు శక్తుల యొక్క రెంటిచే రెండు ప్రకాశించినవి. మదరాగముతో నేత్రము లెఱ్ఱనైనవి. రాక్షస రక్తముచే వారు ధరించిన శస్త్రములు నెల్లనైనవి-54. ఆ విధముగా శక్తి రాక్షసులకు తుముల యుద్ధము జరిగెను. మృత్యువేమాత్రము భయపడక స్వయముగా ప్రజలను జంపునట్లు-95. తొట్రుబాటుతో నడచుచు, మదముతో నెళ్ళని కన్నులు గలిగి, తొట్రుపాటు పడుచున్న యక్షరములు గల వీర భాషలు గలవారై రణమున విజృంభించి-96. సమూహముగా గుండ్రని యాకారము గలవారై, చూచిన సర్వాంగ దృష్టులు గలవారై (వేయి కన్నులు న్నట్లు చూచి) శక్తులు యువరాజ సైన్యమును ధ్వంసము జేసిరి-97. దండిని నూరక్షౌహిణులసైన్యమును చీల్చివైచెను. నూటయేబది యక్షౌహిణుల సైన్యమును మంత్రిణి నశింపజేసెను-98. అశ్వారూఢ మొదలగు పొరు మదముతో నెరుపెక్కిన కన్నులు గలవారై నూటయేబదియక్షాణుల సైన్యమును యమ భవనమునకు బంపిరి-99. తురగారోహిణి రణమున వాడియైన యంకుశ (బల్లెముతో ఉలూకజిత్తుని (రాక్షసునీ) పరలోకమునకు బంపించెను -100. సంపత్కరి మొదలగు శక్తి దండాధినాయికలు పరుషముగా శత్రువుల ముఖములను నిరోధించి చీల్చివైచిరి-101. సూర్యుడస్తమించు వరకు సమస్తసైన్యమును జంపీరి-ఆ తరువాత కోపశాలినీయైన శ్యామల విశుక్రునితో బోరాడెను-102. దేవతల యస్త్ర ప్రత్యస్త్రములను భయంకరముగా వదులుచు, మంత్రిణి గొప్ప రణకృత్యములతో యుద్ధము జేసెను-103. ఆమె మహాతేజస్వియైన విశుక్రుని మిక్కిలివాడియైన యాయుధములను బాణములతో ఖండించుచు క్రమముగా నాతని ధ్వజమును రథసారధిని-104 ధనువునారినీ, ధనువును ఖండించెను. మండుచున్న యగ్నీ కాంతిగల బ్రహ్మశిరోనామకాస్తముతో విశుక్రునీ మర్ధించెను. వాడును చూర్ణమైన యాకారముతో బడెను. మహోద్దతయైన. దండనాథ మహారాక్షసుడైన విషంగునీ-106. భయంకరమైన ముసలాయుధముతో మోదుచు యుద్దముజేసెను. ఆదుష్ట రాక్షసుడును యమదండమువంటి గదనెత్తీ బాహువుతో మిక్కిలి భయంకరమైన  యుద్ధమును జేసెను. -107. గదోయుద్దమున ఒండొరులు దేహములను మర్ధించుచుండిరి. తిరుగుచు భయంకరాట్టహాసము జేయుచుండిరి-108. అనేక గదా యుద్దచారముల జేయుచుండిరి, తిరుగుచుండిరి. వేగముగా జుట్టుకొనుచుండిరి. ఒండొరుల దండముల  దెబ్బలకొండొరుల మాటిమాటికి మార్చిల్లజేయుచుండిరి-109. అవకాశము జూచి గొప్పగా విజృంభించి ఒండొరుల గొట్టుచుండిరి. వారి మహాముసల గదా దండాగ్రములయొళపీడికి ఆకాశము క్షోభిల్లుచుండెను. ఈ విధముగా దండినీదానవశ్రేషులు యుద్ధము జేసిరి-110. అర్థరాత్రి వరకు యుద్ధముజేసి దండనాయిక కోపించినదై విషంగుని జంప మొదలిడేను-111. ఆ తరువాత ప్రోత్రిణి విషంగుని శిరమున హలాయుధమును దగిలించి లాగి ముసలాయుధముతో గట్టిగా శిరముపై మోదైను-112. తరువాత ముసలాయుధపు దెబ్బతో విషంగ మహాసురుడు ప్రాణములు వదిలెను. చూర్ణమైన రథముతో బాటు భూమిపై బడెను. 113. ఈ విధముగా మంత్రిణీదండనాయికలు విషంగవధమను మహాకార్యమును జేసి, తక్కిన రాత్రిని గడుపుటకు అచటి శిబిరమునుజేరిరి-114.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున విషంగవధమను నిరువదియెనిమిదవ యధ్యాయము. తృతీయదివసయుద్ధము సమాప్తము.