బ్రహ్మాండ మహా పురాణము
7 - ప్రపంచ విజ్ఞానము
(భూమియొక్క భౌగోళిక విభాగములు - నాల్గయుగములు - వానీ కాలపరిమితి - ఖండములు - వానీ భౌగోళిక విషయము - నగరములు - గ్రామములు - వృక్షసంతతి - జంతు సంతతి - జనములు, వర్ణములు, జీవితమందలి స్థితులు).
సూతుఁడిట్లు చెప్పెను.
ఒక సహస్ర యుగమునకు తుల్యమైన కాలమానమును ఒక రాత్రిగా ఆ బ్రహ్మభావించెను. బ్రహ్మ ఆ రాత్రి కొంతమునందు, బ్రహ్మ ఉత్సర్గ కారణమున (సృష్టికోటకు) విశ్వము సృజించెను. (1) ఆ సమయమున బ్రహ్మ తదనంత జలములో, వాయువై, అంధకారావృతుఁడై (ఆ సముద్రములో) సంచరించెను. అప్పటికే స్థావర జంగమ వస్తువులన్నీ నశించియుండెను. (2) పృథివీతలము నంతటినీ నీటివరదచేనతఁడు ముంచెత్తి వైచెను. భూతములన్నియును వాని వాని విభాగములతో “సత్య” మాత్ర స్థితములై యుండెను. (3) అప్పుడాతఁడు వర్షాకాల మందలి రాత్రీ యందలి మిణుగురు పురుగువలె (ఖద్యోత) సంచరించెను. అప్పుడాతఁడు యథేచ్ఛముగా వేగముగా ధీప్రచోదితుఁడై, స్థిరీకరించుటకు (ప్రతిష్టాతయై) సంచరించెను. (5) ప్రతిష్టాపించుట కుపాయమునకై భూమీ కొజలికతఁడన్వేషించెను. అప్పుడు భూమి సలిలాంతర్గతమై యున్నదని యెఱింగేను. (5) వానిలో నొకటి గ్రుడ్డిదనీ (అంధం) తెలిసికొని, భూమిసుద్దరించుటకు సమర్ధుఁడైన యతఁడు, పూర్వకల్పము యొక్క ఆరంభ Fమయమును సంస్మరించి, సత్యమైన వరాహరూపమును దాల్చి నీటియందు ప్రవేశించెను. ఆ ప్రజాపతి, నీటిచే సంఛారివైయున్న భూమిని కలియగోరి, పృథ్వీనీ ఉద్దరించి, దానిని మరల తదపత్యముతో నటనుంచేను. (భూమిని ప్రజాపతి యుద్ధరించెను. అతఁడు మరల నీరములను భూతలముననే ప్రవర్తిల్లఁజేసెను). ఆతఁడు సముద్రోదకములను సముద్రములో, నదుల నీరములను నదులలో (8) ప్రత్యేకముగ నుంచెను. భూమీని ఎత్తు పల్లములు లేక సమీకరించి అతఁడు పర్వతములను పైకి తీసి యొకచో సమకూర్చెను. (9) పూర్వము ప్రళయకాలాగ్నిచే (సంవర్తకాగ్ని) పూర్వపు సృష్టి యంతయు దహింపఁబడి యుండుటచే, ఆ యగ్నిచేతనే భూమి యందలి పర్వతములు సంపూర్ణముగా విలీనములయ్యెను. అవి వాయువుచే విశీర్ణములయి వికీర్ణములయ్యెను.(10)
చల్లదనముచే ఆ శిలలు ఘనీభవించెను. కరిగిపోయి యేచ్చటెచ్చట శీలలుపడి యుండెనో అచ్చట పర్వతము లావిర్భవించెను. (11) ఆ పర్వముల స్కంధములు (శిఖరములు) పర్వములచే (కణుపులచే) కదలక అచలములై యున్న హేతువున నయ్యవి పర్వతములుగా స్మరింప బడినవి. (11) “స్కంధాచలత్వాత్ అచలా - పర్వభిః పర్వతా” ('అచల' పదమునకు పర్వత పదమునకు నిర్వచనము లీయబడినవి). వానీకి గిరులనీ పేరు వచ్చినది. కారణము అవి నిగీర్ణములయినవి. నీగీర్ణములు మ్రింగఁబడినవి. “గిరయో హీ నిశీర్ణత్వాత్" - అయసాత్తు శీలచ్చయా - ఆ పర్వతములు ఒకచో నుండి వేశాక చోటునకు ప్రయాణించుటచే (అయనము వలన) శీలోచ్చయనామము లొందినవి. (12, 14) భూమిని నీటినుండి యుద్దరించిన తరువాత, ప్రభువు (బ్రహ్మ) సప్త పర్యాయములు, సప్తద్వీపములను, సప్త వర్షముల యందు సృజించెను. విషమముగా ఎత్తు పల్లములుగా నున్న భూమినీ సమీకరించి (సమతల మొనర్చి) సర్వత్ర శిలలతో ప్రభువు సృజించెను, ఆ వర్పములలో (ప్రతి వరమునకు ఏడు ఉపద్వీపములు కలవు. అందుచే సప్త వర్షములలోని (7x7=49) ఉపద్వీపముల సంఖ్య నలుబది తొమ్మిదియైనది. వీని నామ చరిత్రాదులు మున్ముందు వర్ణింపఁబడును) నలుబది తొమ్మిది ఉపద్వీపములున్నవి, సృష్టికీఁ బూర్వము పర్వతములు సన్నివిష్టములై యున్నవి. అవి కాంతిచే స్వభావ సిద్దముగానే, వేవోక విధముగా కాక, ఆ వృతములై యున్నవి. సప్తసముద్రములు, సప్తద్వీపములు ఒకదాని నొకటి చుట్టుకొని యున్నవి. ఒకదాని నోకటి సహజముగా చుట్టుకొనియున్న పిమ్మట సమవస్థీతములై యున్నవి. (15,16) భూలోకాదులు నాలుగు; యథాపూర్వము బ్రహ్మ చంద్రుని, సూర్యుని, స్థావరములయిన వస్తువులను, ఇతరములయిన గ్రహములతో సహితము అంతటను నిర్మించెను. అంతయేకాక ఈ కల్పమునకు సంబంధించిన దేవతలను, వారి వారి నివాసములతో కూడ సృజించెను. (17) నీటిని, అగ్నిని, పృథివిని, పాయువును, అంతరిక్షమును, దీవమును (స్వర్గమును), దీకులను, సముద్రములను, నదులను, పర్వతములను, ఓషధులను (వాని శక్తులతో) వృక్షములను, లతలను (వానీ ఆత్మలతో), లవ, కాష్ఠ కల, ముహూర్తములు, మున్నగు కొలవిభాగములను, సంధ్యా సమయములను, రాత్రులను, పగళ్లను, పక్షములను, మాసములను, అయనములను, యుగములను, స్థానాభిమానులను, తత్తత్రత్యేక స్థానములను బ్రహ్మ సృజించెను. (20)
ఆయా స్థానములకు జీవులను (వ్యక్తులను సృజించి, బ్రహ్మ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, (తిష్య) కలియుగమును నీర్మించెను. (21) కల్పాదీ యందు కృతయుగములో ముందుగా ప్రజలను బ్రహ్మ సృజించెను. పూర్వ కల్పమందలి ప్రజలను గూర్చి ఇంతకు పూర్వమే నేను వర్ణించి యుంటిని కదా. (22) కల్పము విలయము పొందగా (సమాప్తము చెంద) ప్రజలందరు అగ్నిచే దగ్గులయిరి. ఆ సమయమున తపోలోకమును చేరలేనట్టివారును, భూలోకమును జేరి యందున్నపోరును, పునస్సష్టియందు (ఇది తప్పని, అనివార్యమయిన కర్మ సిద్ధాంతము. కల్పాంతమున యావద్విశ్వము లయము పొందగా, కర్మవిపాకము చెందినట్టివారు తరువాత యుగమున జన్మించెదరు. ఈ విషయ మీ పురాణమున. రూఢముగా వ్యక్తీకరింపఁబడినది) వీక్షార్థము తిరిగి వచ్చిరి. కర్మపరిపక్వమొంది మోక్షము నొందనివారు అచ్చటనే వీక్షార్థము (జన్మకోకు) నిలిచియుండిపోయిరి. వారు వచ్చు సృష్టిలో నుద్భవమొందెదరు. (24) అట్లు సృజ్యమానులయిన వారు, వారి సంతతి కొణుకుండి పోయెదరు. ధర్మార్థ కామ మోక్షములను పురుషార్ధములను వారు సాధించిన వారుగా పరిగణింపఁబడెదరు. (25) పూర్వము దేవతలు, పితరులు, మానవులు క్రమముగా సృజింపఁబడిరి. తరువాతవారు తపస్సాచరించి, ఆయా స్థానములను ఆక్రమించిరి. (26) అట్టి మానవ జీవులు నిజముగా బ్రాహ్మణులగుదురు. వారే సిద్దాత్ములు. ఆధ్యాత్మిక సిద్దిమంతులు. (సంగయుక్తేన - కోరికతో గూడిన దోషయుత మయిన, ద్వేషముచే; ఆసంగద్వేషయుక్తులు - సంపూర్ణమయిన అభిమానము వాంఛ కలుగుట ఆసంగదోషము). సంగము (కోరికతో)తో కూడిన దోషయుక్తమయిన కర్మలచే వారు స్వర్గమును పొందిరి.
శరీర స్థితియందు పరివర్తమానులయి వారు ప్రతియుగము నందు సంభవించుచుందురు. తామొనర్చిన స్వకర్మ ఫలశేషముచే వారు 'తదాత్మకులు'గా (తత్కర్మజాతులుగా) ప్రసిద్ధులు. (28) నూతనమయిన కల్పము యొక్క ఆగమముచే నిబంధితులయి వారు జనలోకమున సంభవము నొందుదురు. నీటియందుదయించుటకు గల కారణము వారి కర్మచే గ్రహింపనగును. ఈ విషయమే వాయు పురాణమున “ఆసత్యకర్మణాం తత్ర బోద్ధవ్యం కర్మణాం తు సు” అని యున్నది. (వారి నివాస స్థానము కారణముగా నెఱుంగనగును). (29) జన లోకము నుండి వారు శుభాశుభములయిన కర్మలచే భిన్నభిన్న యోనులయందు, భిన్నభిన్న శరీరములను ధరింతురు. (30) దేవాదులతో నారంభమయి స్థావరములతో నంతమొందు జీవులు పరస్పరము, వారి వారి పవిత్రములయిన కర్మఫలములను సాధారణముగా పొందిరి. (31) అందుచే, ఇంతకుఁబూర్వము వారే యే నామరూపములను పొందియుండిరో వానినే పొందేరీ, పునఃపునః వారట్లే ఆ నామరూపులే కల్పములందు పుట్టుచుందురు. (32) ఆ కారణముననే, ఉపసృష్టిని (వేటిక అప్రధానసృష్టిని) సృజింపవలయునను కోర్కె బ్రహ్మకు కలిగెను. సత్య ధ్యానవంతు డగుటచే బ్రహ్మ ధ్యానించుచుండఁగనే, ఆతని ముఖము నుండి సహస్ర మీథునములతో ఆ ప్రజలు పుట్టిరి. వారందరు సత్వోద్రిక్తులగుట వలన ఆ ప్రజలు సతేజస్కులై యుండిరి. (34) ఆ బ్రహ్మ తన నేత్రముల నుండి వేటిక సహస్ర మిథునములను (భార్యా భర్తల జంటలను) సృజించెను. వారందరు రజోగుణోద్రిక్తులు. వారు శుష్మిణులు (శక్తిమంతులు - ఆగ్రహవంతులు, కాంతిమంతులు) అమర్షణులు (క్షమాగుణరహితులు, కోప స్వభావులు) (35) వేటిక సహస్ర మిథునముల జంటలను మరల బ్రహ్మ సృజించెను. వారు అసత్పురుషులు. రజస్తమోగుణములచేనుదీక్తులు. వారు తరువాత గృహశీలురుగా (భోగపరాయణులుగా) చెప్పఁబడిరి. (36)
ఆ యాలుమగల జంటలు తమ తమ జీవితాంతముల వకు పెక్కు మారులు మిథునములనే పుట్టించిరి. (కనిరి) వారు కూటకులను (మోసగాండ్రను) ఆకూటకులను (సజ్జనులను) పుట్టించిరి. వారందరు మృత్యు స్వభావులు. (మర్యలక్షణులు) (37) వారట్టి సంసారులను స్పజీంచీ శరీరములను బరిత్యజించిరి. అప్పటి నుండియే యాకల్పము నందు మైథునత్వము జంటలకు సంభవించినది. (38) కృతయుగమున మనస్సంబంధమయిన ధ్యానముచేతనే ఆ ప్రజానీకమునకు శబ్ద స్పర్శ రస రూప గంధాదుల శుద్ద విషయ జ్ఞానము కలిగినది. అది పంచ లక్షణము. (39) ఈ విధముగా, మానసభావములచే ప్రజలుత్పత్తి చెంది (ప్రేష్టం = ప్రియతమము; పోయుపురాణమున నీ శ్లోకమిట్లున్నది. “ఇత్యేవం మానసీం పూర్వం ప్రాక్ సృష్టి : యా ప్రజాపతిః” ఇట్లే పూర్వము మానసికముగా సాధారణ సృష్టి జరిగినది. అయ్యది మిథునక్రియచే నుత్పన్నము. ప్రపంచమంతయు దానితో నిండియున్నది.) ప్రియులైయుండిరి. వారి సంతతుల యన్వయమే సంభూతమయినది. వారిచే నీలోక మంతయు నిండియ్నుది. (40) ఆ ప్రజాసంతతి నదులను, సరస్సులను, సముద్రములను, పర్వతముల నాశ్రయించిరి. వారప్పుడల్ప సంతోషులు; తరువాత యుద్దములందు పాల్గొనిరి. (రసవతి : నీరుకలది : రసముకలది) పృథ్వీ రసవతి. పారు రసవతిని ఆహారముగా చెప్పుదురు. రసమే దొరికాహారము. మానసికమయిన సిద్దీనీ (ప్రభావమును) గోరుచు వారు (ఆ ప్రజలు) యథేచ్చా కామాచోరులయిరి. (42) కృతయుగమున ఆ ప్రజలు (మర్త్యులకు) సమానమయిన ఆయుర్దాయము, సుఖము, రూపము (సౌందర్యము) కలిగి యుండిరి. ప్రథమ యుగమున, కల్పాదియందు, ధర్మాధర్మములు వారికీ లేవు. (43) ప్రతియుగము నందు వారు వారి వారి అధికారముతో స్వామ్యములతో నుదయించిరి. దివ్య సంఖ్యచే దేవతామీనమున, కృతయుగము ఆరంభమున నాలుగువేలేండ్లు సంధ్యాకాలములు రెండును నాలుగువందల యేండ్లు పట్టినవి.
తరువాత సహాస్ర సంఖ్యలో ప్రజలుండిరి. వారు సుప్రథితులు. వారికి పరస్పరము సంఘర్షణముచెందు వ్యతిరేక భావములు లేవు. ఒకరి తరుపోత నొకరు రావలెననెడి క్రమము కూడ లేదు. వారికి నివసించు సక్రమమైన నికేతనములు (గృహములు) లేవు. వారందరు పర్వతములందు సముద్ర తీరములందు వసించెడి వారు. (44,45, 46) వారు సత్త్వగుణ బాహుల్యులు. వారు విశోకులు : ఆ ప్రజలందఱు ప్రత్యేకముగా సుఖవంతులు. వారెప్పుడు యథేచ్ఛా సంచారిణులు. నిత్యము సంతుష్టమనస్కులు. (47) అప్పుడు పశువులు కానీ పక్షులు కానీ, సరీసృపములు : (జెఱ్ఱులు, పాములు మొదలయినవి) కానీ లేవు. వృక్షములు లేవు. త్రాగుఁబోతులు లేరు. ఉద్విగ్నమనస్కులు లేరు. అచ్చటీ ధర్మ ప్రక్రియ యది. (48) అందు విశేషముగాతిని జీవించుటకు, సమూల ఫలపుష్పములు కలవు. కాలము సర్వైకాంత సుఖ ప్రదము. అచ్చట ఎక్కువ ఉష్ణముకాని ఎక్కువ చలికాని లేదు. (49) వారలకు మనోభిలషితములయిన కోరికలు సర్వత్ర సర్వదా ఉపపన్నములు. వారల కవి ధ్యానము వలన పృథివి నుండి రసాతలము నుండి ఉత్నములయి యుండును. (50) ఆ ఫలపుష్ప మూలాది సంపద వారలకు బలమును, శరీర సౌందర్యమును గలిగించును. ముసలితనమును రోగములను నవీయే నాశన మొనరించును. అచ్చటి ప్రజలు శరీరములను సంస్కరించి పరిశుద్ద మొనర్చు కార్యము లొనర్పకయే స్థిర యౌవనులయి యుందురు. (51) వారలకో సంకల్పములు లేకుండగనే మిథునత్వమున సంతానముదయింతురు. వారి జన్మము రూపము వారి రూప జన్మములతో సమానములు. వారందరు సంతుష్టులు. సౌఖ్యవంతులు. (52) అప్పుడు సత్యము, లోభరాహిత్యము, సంతుష్టి, సుఖము, ఇంద్రియ నిగ్రహము కలవు. ఇంక సౌందర్యము, ఆయుర్భాగ్యము, శిల్పచేష్టనములు, అన్నియును నిర్విశేషముగా నుపపన్నములు. (53) బుద్దిచే నూహింపఁ బడక, అబుద్ధిపూర్వకముగనే, ప్రజలకు స్వయముగా జీవనాధార వస్తువులు, వారి జీవన వృత్తికొలకు కలుగును. ద్వారములు వివృతములై యుండుటచే, శుభాశుభ క్రియా చరణములకు యత్నమే లేదు
ఆ కాలమున వర్ణాశ్రమ వ్యవస్థలేదు. తస్కరులు లేరు. ఒండొరుల యెడ ద్వేషముకాని ఇచ్ఛకాని లేకయే పరస్పరము ప్రవర్తించు చుండిరి. (55) కృతయుగమున నెల్లరును తుల్యమైన సౌందర్యము, ఆయుర్భాగ్యము కలిగియుండిరి. వారు అధమోత్తమాది భేదములు వారిలో లేక యుండిరి, వారందరు సుఖప్రాయులు, శోకవీరహితులు. (56) వారికి లాభాలాభములు లేవు. మిశ్రామిత్రులు, ప్రియాప్రియులు లేరు. వారీచ్చోశూన్యులు, నిరీహులు : విషయానుభవము వారికి మనస్సులందే. వారొకరినొకరు హింసించుకొనరు. అట్లని వారిలో పరస్పరము ఒకరొక్కరికీ ప్రీతియులేదు. (57,58) కృతయుగము నందు జ్ఞానము వీస్తారము; త్రేతాయుగమున యజ్ఞాచరణము విస్తారము. ద్వాపర యుగమున యుద్దమధికము. కలియుగమున దొంగతనమధికము. (59) కృతయుగము సత్వగుణ లక్షితము. త్రేతాయుగ లక్షణము రజస్సు; ద్వాపరము రజస్తమోమిశ్రము. ఇక కలి తమోగుణేకలక్షీతము. త్రియుగములందలి గుణలక్షణములిట్టివని యెఱుంగవలయును. (60) ఇది కృతయుగమందలి కాలము. ఇతర యుగముతోడి సంధికాలము నిటైజుంగుము. కృతయుగము నాలుగు వేలేండ్ల (దేవ) సంవత్సరములు. దేవతా సంఖ్యామానమును బట్టి తత్సంధ్యాకాల భాగ పరిమితి ఎనిమిది వందల సంవత్సరములు. (61,62) అయ్యది నాలుగువేల సహసముల మానవ సంవత్సర ప్రమాణము. అప్పుడు వానియందు ఆకస్మికపుటా క్రోశధ్యానములు కాని విపర్యయములు కాని లేవు. అంత కృతయుగమున సంధ్యాంశ కాల పరిమితి గతింపఁగా, అయ్యుగ ధర్మము ఈ శ్లోకార్థమునందు స్పష్టత లోపించినది. వాయుపురాణమున నీయర్థమే పాదవశిష్టమైనది సర్వత్రయగును. (63,64) ఇట్లు సంధిసమయము యొక్క సాంధ్యకాలము జరిగిపోగా సంధ్యాధర్మము మరల మరల, పాదభాగమై మిగిలియుండును. ఈ విధముగనే కృతయుగమున నిశ్శేషముగ అంతర్థానము నొందును. (65)
ఆ సంధికాలము గతింపగా మానసీ సృష్టి యారంభమయ్యెను. ఆయాధ్యాత్మిక సిద్ది కృతయుగానంతరము వచ్చెడు త్రేతాయుగమునను జరుగును. (66) సృష్టికి మున్ముందుగా నాచే ప్రకీర్తితములయిన అష్ట సంఖ్యాకమయిన మన ప్సిద్దులు క్రమముగా సంక్ష: నొందెను. (67) మన్వంతరములన్నింటిలో చతుర్విధముగ విభజనము, కల్పము యొక్క ఆదియందు కృతయుగము నందే మానసిక సిద్ధి కలదు (68) కృత యుగమున కర్మసిద్ధి వర్ణాశ్రమాచార కృతమై యొ ప్పెను. అప్పుడు కృతయుగము యొక్క సంధ్య సంక్షేపముగా పాదయాత్ర మయ్యెను. (నాలుగవ భాగము.) (69) సంధ్యాంశకములయిన తపము, బలము, వేదము శ్రుతము, ఆయుర్దాయము, అనునవి యుగధర్మములు. అవి క్షయము నొందుచున్నవి. (70) ఓ ఋషిసత్తములార! కృతయుగము సంధ్యాంశకాలము గతించిన పిమ్మట, త్రేతాయుగోత్పత్తి తదంశములతో నయ్యెను. (71) కృతయుగాంశము యొక్క భాగము గతించిన పిమ్మట మిగిలిన ఏడు సిద్ధులు, త్రేతాయుగము యొక్క ఆరంభమున కల్పముయొక్క ప్రారంభ దశలో ప్రవృత్తములయ్యెను; కొలయోగముచే మిగిలిన యొకేయొక సిద్ధియు నశించును. ఆ నాశనము కాల యోగము చేతనే కాని ఏ యితర కారణముచే కాదు. ఆ సిద్దీ ప్రణష్టము కాగా ఇతరములయిన సిద్ధులు ప్రసవించినవి. (కలిగినవి) (72,73) నీటీ యొక్క అంశలు అంశలు. ఆయపాంశలు రెండును ఆకాశమున మేఘాత్మము నందెను. (మేఘరూపములందెను.) గర్జించుమేఘముల నుండీ వర్ష సృష్టి ప్రవృత్తమయ్యెను. పృధివీతలము వర్షము వలన సంసిద్ధినీ నొకే పర్యాయము పొందెను. ఆ ప్రజలు ప్రవృత్తులయిరి. ఆ తరువాత వృక్షములు వారలకు గృహ సంజ్ఞికములయ్యెను.
ఆ వృక్షముల నుండి వారలకు సర్వ ప్రపంచోపభోగ్యములయిన వస్తువులన్నియు సావిర్భవించెను. త్రేతాయుగము యొక్క ఆరంభమున ప్రజలు ఆ పదార్థములతోడనే తమ్ము పోషించుకొని వసించిరి, (76) తరుపోత బౌలకాలము గతించిన వెనుక, వారలలోని మార్పు కారణముగా (విపర్యయము వలన) ఆకస్మికముగా పరస్పరము సన్నిహితముగా నుండ వలయుననెడి కోరికలతో లోభమయిన భావముదయించెను. (77) (ప్రస్తుత కాలమున) స్త్రీలకు రజోదర్శన కాలము జీవితాంతము వఱకునుండును. కానీ అయ్యది యుగబలమున ఆ స్త్రీలకు కలుగలేదు. (78) తరువాత ఆ స్త్రీలకు మాసమాసమునకు రజోదర్శనము అగుట ఆరంభీంచెను. తత్కారణమున స్త్రీ పురుషులకు మైథునక్రియ. కూడ నప్పుడు కలిగెను. ప్రతిమాసము నందు వారికి కలిగిన సంగభావము వలన స్త్రీ పురుషులకు సంగమము కలిగెను. ఆ కాలము నందు రజోత్పత్తి వలన (ఆర్తనోత్పత్తిచే) వారలకు గర్భోత్పత్తి యయ్యెను. (79,80) ఆ కాలమున స్త్రీ పురుషుల యందుదయించీ విపర్యయభావముల వలన గృహ సంజ్ఞకము ల యొప్పీ వృక్షములన్నియును తరువాత నశించేను. (81) ఆ వృక్షములు నశింపఁగా వారందరు విభ్రాంతులయిరి. హ్యాకులేంద్రియులు నయిరి. (కామసక్తమయిన ఇంద్రియ వ్యాకులత్వము కలిగినది). అప్పుడు సిద్దికొఱకై ధ్యానించిరి. వారు వారి ధ్యానముల యందు సత్యాభి సంధి వహించిరి. (82) పూర్వము వృక్ష సంజ్ఞకములై యొప్పిన వృక్షములు వారి ముందు ప్రత్యక్షమయ్యెను. అయ్యవి పోరలకు వస్త్రములను, ఫలములను ఆభరణములను ప్రసాదించెను. (83) అట్లే రసాన్వితము, మహావీర్యవంతము సయిన మధువు (తేనె) ప్రతిషత్ర పుటము (మూలమున “అన్వీక్షికం” అని యున్నది), అర్థవంతముగా లేదు. వాయు పురాణమున అమక్షికమను పాఠాంతరమున్నది. దానినే గ్రహించితిని, గంధర్వాణాం రసాన్వితము ఇచట గంధవర్ణ రసాన్వితముగా నుండి యుండవలెను. గంధవర్ణ రసాన్వితమను. పాఠమును గ్రహించితిని.) నందు (అమక్షికము) ఈగలు . లేకుండుగ నుత్పత్తి యయ్యెను. అయ్యది గంధవర్ణ రసాన్వితము.
త్రేతాయుగారంభమున వారా మధువు చేతనే జీవయాత్ర గడిపిరి. ఆ సిద్ధివలన వారు సంతుష్టులయిరి. పరిపుష్టులయిరి. విగత జ్పురులయిరి, (గతేంద్రియ సంక్షోభులయిరి). (85) అటు తరువాత, కాలాంతరమున ఇతర సమయములందు ప్రజలు మరల లోభావృతులయిరీ వారా వృక్షముల పట్టుకొని బలాత్కారముగా అమృతమును తేనెను గ్రహించిరి. (86) వారొనర్చిన అపచారము చేతను, లోభాన్వితులగుట చేతను తమ ప్రభువుతో సహితము కోర్కెలనొసంగు ఆకల్ప వృక్షములు అక్కడక్కడ నశించినవి. (87) కాలవశమున సిద్దులు అల్పావశిష్టములై యుండగా, మిగిలిన వానితోడనే వారు ప్రవర్తించిరి. వారలలో ద్వంద్వ భావములు (ఈర్ష్యా ద్వేషాదులు, సుఖదుఃఖాదులు, లాభాలాభ భావములు) ఉదయించినవి. (88) శీతవాతా తపములు తీవ్రములయినవి: వాని వలన ఎండలలో చలిలో గాలులలో మిక్కిలి దుఃఖితులయిరి. వారు పరస్పర విరుద్ధములయిన ద్వంద్వ భావములచే పరిపీడితులయి ఆక్రోశించిరి, బహువ్రణములందిరి. (89) పూర్వము వారు గృహములు లేనివారు. యధేచ్చముగా సంచరించిరి. పూర్వమందు యథాయోగము యథాప్రీతి నదీతీరములందు, మధువుతో నిండియుండు పర్వతములయందు పల్లపు భూముల యందు మెట్టభూములందు, నీరున్న పట్టులందు వారు సంచరించిరి. ఇప్పుడో వాతా తపముల వలన విసిగిపోయి, వాతాతాపముల నుండి రక్షణమునకై గృహముల నిర్మించుకొనిరి. (92) వారి వారికి కావలసిన భాగముల ననుసరించి, వలసిన విస్తీర్ణములతో, వారి వారి విజ్ఞానము ననుసరించి పురములను పల్లెలను నిర్మించుకొనిరి.
మొదటవారు వారి వారి విస్తీర్ల ప్రమాణములను తమ జ్ఞానము ననుసరించి అంగుళులతో కొలిచీకొలిచి నిర్ణయించుకొనిరి. తరువాత పరిమాణముల నెఱుంగు. మానము కొంకు ప్రమాణముల నేర్పరచుకొనిరి. (95) అంగుళము - ఒక ప్రమాణము. అంగుళము అనగా ఒక బొటన వ్రేలి వెడల్పు గలది. వారి కొలమానములివి. అంగుళము, ప్రాదేశము, హస్తము, కిష్కువు, ధనువు. (96) పది అంగుళుల పర్వములు ప్రాదేశము; అనబడును. ప్రాదేశమనఁగా బొటన వ్రేలు చూపుడు వ్రేలు - విడదీసి చాచి పట్టగా, బొటన వ్రేలి తుదినుండి తర్జని (చూపుడు) వ్రేలి చివర కొనవలకు గల దూరము. అట్లే బొటన వ్రేలి శిఖరము నుండి మధ్యమాంగుళి తుదివఱకు ‘తాల’ము అందురు. అట్లే బొటన వ్రేలి తుదినుండి ఉంగరపు వ్రేలి చివరకొన వలకు గల దూరము “గోకర్ణము”, అట్లే బొటన వ్రేలి తుదినుండి చిటిగెన వ్రేలి చివరవరకు గల దూరము 'వీతస్తి'. 'వీతస్తి'కి 12 అంగుళములు. (97) 20 అంగుళములు ఒకరతి 24 అంగుళములు ఒక ‘హస్తము’. రెండు ‘రత్నులు’ లేక 42 అంగుళములు ఒక ‘కీషువు’, నాలుగు హస్తములొక 'ధనువు'. దానినే దండమందురు. ఈ ధనుః ప్రమాణమునే నాళికాయుగము (రెండు నాళికలు), రెండు వేల ధనువులు ఒక గవ్యూతీ. ఇట్టి ‘పరిమాణ’ సన్నివేశము లానాఁడు సమకూర్చుకొనఁబడినవి. (100) (8000) ఎనిమిది వేల ధనువులు ఒక యోజనము. అని వారు నిశ్చయించుకొనిరి. ఈ యోజన ప్రమాణ నిర్ణయమయిన వేనుక వారు ఈ యోజనము కొలమానముగా తమ వసతుల భూవిస్తీర్ణములను నిర్ణయించిరి. (101) నాలుగు విధములయిన దుర్గములలో మొదటి మూడు ప్రకృతి సిద్ధములు : ఇంక నాలుగవది కృత్రిమము. ఆ దుర్గమును గూర్చి ముందు చెప్పెదను. (102) ఈ దుర్గమునకు ఉన్నతమయి (కుడ్యములు గల) ఎత్తయిన మట్టిగుట్టపై కట్టబడిన ప్రాకారముండును. ఆ ప్రాకారము నందు రంధ్రములుండును. దాని చుట్టును కాలువ వంటి అగడ్డ (పరిఖ) యుండును. దానికి సుందరమయిన ద్వారము అది కుమారీపురము.(103) అగర్తలు రెండు హస్తముల వెడల్పుతో నుండి కుమాపుర విషయమున శ్రేష్ఠములయినవి. కందకములోని నీటి ప్రవాహపు వెడల్పు ఎనిమిది లేక తొమ్మిది లేక పది హస్తములుండ వచ్చును.
పల్లెల, నగరముల, ఆయతనములను, శ్రీవిధములయిన సహజ దుర్గములయొక్క అనఁగా పర్వత, నదీ, మరుభూమి, వాలుకా ప్రదేశాల యొక్కయు, కృత్రిమ దుర్గమముల యొక్కయు ఆయతనములను కూడ వివరించెదను. కానీ వ్యాసమొక యోజనము. దాని యొక్క నిడివి (1 1/8) యోజనముపై యోజనము నందలి అష్టమ భాగము. (105,106) పట్టణము యొక్క విస్తీర్ణము దొని పొడవులో సగము? దానికి తూర్పు దిశగానో ఉత్తర దీశగా ప్రవహించే నది యొకటుండవలయును. ఆ ప్రదేశమును భిన్నకర్ణముగానీ వికర్ణముగా గానీ 'వ్యజనాకృతితో నొప్పుచు, నుండవలెను. (107) నగరము దీర్ఘమైనది కానీ, వృత్తాకారముగా నున్నది కాని, వజ్రాకారముగ నున్నది కాని ప్రశస్తమైనది కాదు. చతురస్ర యుతము, స్వర్గ సదృశమైనది, సమముగా వ్యాపించిన భాగములు గలిగినదియునయిన పురము వారు నిర్మించుకొనిరి. (108) (వాస్తు = భవన ప్రదేశము, నివాస స్థలము) 24 హస్తముల కంటే నధికము కానిది ప్రస్వము, 108 హస్తముల ప్రమాణము కలిగిన నీవాసన స్థలము ఉత్తమమైనది; వీనిలో ప్రస్వమై దారు నిర్మితమైనది కాని దానిని మధ్యమ వాస్తుగా కొనియాడెదరు. (109) ముఖ్య నివేశనము 800 కిష్కువుల ప్రమాణముండవలేనందురు. పల్లె (లేక పేట) నగరము యొక్క అర్ధవ్యాసము గలిగియుండవలెను. పాన (పానశాల) అంతకు మించి యుండ వలెను. (110) (ఖేటము - పట్టణానుబంధీ భాగము - లేకపల్లె). పట్టణము నుండి భేటము యోజనదూరమునను గ్రామము. పట్టణము నుండి అర్ధయోజన దూరమునను నుండవలెను. పట్టణపు సీమ (యెల్ల) రెండు కోశములలో నుండవలెను. ఆ సీమ నాలుగు ధనువుల ప్రమాణముండవలెను. (111) వారు ఇరువది ధనువుల వెడల్పుగల, మార్గమును నలు వైపుల నేర్పరించుకొనిరి. గ్రామ మార్గము 20 ధనువుల వెడల్పు, సీమా మార్గము పది ధనువుల ప్రమాణము. (112) శుభంకరమయిన రాజపథము దశధను విస్తీర్ణము చేయబడినది. అందు మనుష్య, వాజీ, రథ నాగాదుల సంచారమునకు ఎట్టి ఆటంకముండ రాదు. (113) వానీ ఆంతర వీథులు, నాలుగు ధనువుల వెడల్పుతోలిచి వారు నిర్మించుకొనిరి. రాజ పథములకు కలుపు వీడులు మూడు ధనువుల వెడల్పు, వాని యుపవీథులు (సందులు) రెండు ధనువుల వెడల్పు గలిగియున్నవి. (114)
జంఘా పథము 4 పాదముల వెడల్పు. గృహాంతరముల మార్గములు మూడువదముల వెడల్పు. ధృతి మార్గము ఆరుపదములకు పైగా నుండును. ఇట్లు క్రమముగా 'పద' లేక పదిక మెఱుంగవలయును. (115) జంఘాపథము ఘంటా పథము కావచ్చును. వ్రాతలో తప్పుగా వ్రాయబడి యుండవచ్చును. ఘంటా పథము గ్రామమున ప్రధాన మయిన వీధి. అది గ్రామము నందంతట వ్యాప్తి చెందియుండును. పదము అనఁగో 15 అంగుళముల పరిమితీ. (అవస్కారము - మల విసర్జనమునకైన బాహ్యప్రదేశము) గ్రామము చుట్టు అవసారము తగ్దాము పరిమితిలో సొలుగవ భాగము విస్తీర్ణము కలిగి యుండును. ఈ విధముగా వీధులు పేటలు, రాజమార్గములు, ఉపమార్గములు, అవస్కార ప్రదేశములు - నిర్మించుకొనిన పిమ్మట నివేశన గృహములు నిర్మించుకొనషలెను. (116) పూర్వము వృక్షములు, గృహాదులెట్లున్నవో, వారు పదే పదే ఆలోచించి తద్విధముగా నిర్మింప నారంభించిరి. (117) వృక్షముల శాఖలు క్రిందికి వ్యాపించినవి. మిగిలినవి వేటిక విధముగా వ్యాపించినవి. కొన్ని పైకి వ్యాపించినవి. ఇట్లు వృక్షశాఖలు కొన్నీ ప్రక్కకు నడ్డముగా వ్యాపించినవి. (118) వారు తమ బుద్ది సుపయోగించి వృక్షశాఖ లేట్లు వ్యాపించినవో శోధించిరి. అదే విధముగా నివేశన భవనములు నిర్మింపబడినవి. అందుచే ఆ భవనములు (గృహ నిర్మాణములందు 'సాల’ (మద్ది) వృక్షములు ముఖ్యపాత్ర వహించి యుండుట గమనింపఁదగినది) 'శాల'లని స్మరింపబడుచున్నవి, (119) ఈ విధముగా భవనములు (నివేశనములు) శాఖల నుండి ప్రసిద్దము లైనవి. అందువలన వానినుండి సాలలు స్మరింపఁబడినవి. గృహములకు శాలత్వము వానీవలన వచ్చినది. (120) వానియందు ప్రజలు సంతోష ప్రసన్నులైరి. అందుచేతనే గృహములు, శాలలు, ప్రాసాద సంజ్ఞలందినవి. (121)
కల్పవృక్షములు మధువుతో సహితము నష్టము కాగా, సుఖదుఃఖాది ద్వంద్వ బద్ధులయిన ప్రజలు, జీవీతోపాధికి, వ్యవసాయమును గూర్చి ఇతర విధమార్గముల గూర్చి ఆలోచింప మొదలిడిరి. (122) సృజింపఁబడిన ప్రజలు విషాద వ్యాకులులయిరి. అందుచే త్రేతాయుగములోవారికి సిద్ధి కలిగెను. (123) వేడొక విధమయిన వృష్టి సర్వార్ధ సాధనమునకు ఒక సాధన మయినది. ఆ వృష్టి వలన జలములు మధురములు: అంతియేకాక జలములు వారెంత కోరిన నంత వర్షించినవి. (124) ద్వితీయ విధమయిన వృష్టి సృజింపఁబడ, క్రొత్త జీవితము చరిత్రయు నారంభమైనవి. (124) భూమిపై పడిన వర్షపు నీరు కొద్దికొద్దిగా నేల పై గుంటలలో నిలువగా, తద్వర్షపు నీటితోడి భూమీయొక్క సంసర్గమున ఓషధులు పుట్టి వృద్ధి పొందనారంభించెను. ఆ యోషధులు పుష్పింప మొదలిడినవి. ఫలము లొసంగ దొడఁగినవి. దుంపలను నొసంగీనవి. (125,126) పదునాలుగు విధములయిన గ్రామములయందలి నేలలు, వనముల యందలి నేలలు, దున్నఁబడకయే, విత్తనములు చల్లం బడయకయే ఫలింప (పంటలురాల) మొదలిడినవి. వృక్షములు పొదలు ఆయా ఋతువుల యందు ననుకూలములయిన పుష్పములను ఫలములను ప్రసవించేను. (127) త్రేతాయుగమున ఓషధులు, వృక్షములు భూమియందు తమంతతామే ప్రాదుర వింప మొదలయినవి. త్రేతాయుగారంభమున ప్రజలు తదోషధులతో జీవించిరి. (128) అందుచే, విషయప్రవృత్తి లేనందువలన, త్రేతాయుగ ధర్మవశము వలన, ప్రజలకు రాగము (ప్రీతి) లోభము (ఆశ) కలిగినవి. (129) అప్పుడు వారు, నదులను, క్షేత్రములను, పర్వతములను వృక్షములను, గుల్మములను, ఓషధులను, స్వస్వబలను గుణముగ బలాత్కారముగ పరిగ్రహించిరి. (130)
ఇంతకుబూర్వము కృతయుగమున సిద్దాత్ములయిన వారిని గూర్చి నేను వ్యాఖ్యానించే యుంటిని. వారందరు బ్రహ్మయొక్క మానస పుత్రులుగా నుదయించిరి. వారీచ్చటకు జనలోకము నుండి వచ్చిరి. వారు శాంతులు, కామపర తంత్రులు. వైదిక కర్మపరులు; దుఃఖవంతులు. జనలోకము నుండి తిరిగి వచ్చుచు త్రేతాయుగమున వారు మరల జన్మించిరి. (131,132) వారి వారి శుభ పాపకర్మల ననుసరించి, వారు పూర్వజన్మలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులుగను, ద్రోహ జనులుగను భావింపఁబడిరి. (133) అంత వారిలో కొందరు శక్తిమంతులు (ప్రబలులు) సత్యశీలురు, అహింసాపరులు, వీతలోభులు, ఇంద్రియ నిగ్రహము కలవారును. (వారు స్మృతుల ననుసరించిరి.) (134) వారు పరిగ్రహము చేసెడివారు కారు. (అపరిగ్రహులు). వారికంటే బలహీనులయిన వారు వారి కార్యముల నొనరించెడివారు. ఆ (బలహీనులయిన) ప్రజలు వారిని చేరెడి వారు. వారితో భాషించేడివారు. (135) వారీకంటే అల్పశక్తిమంతులు (అల్పతేజస్వులు) వారికి పరిచర్య చేయుచు జీవించుచుండిరి. ఇట్లు వారు అన్యోన్య సంబంధములు కలిగినవారు; పరస్పరము ఆశ్రయించుకొని యుండెడివారు. (136) ఆ కారణముచే (వారల యందలి దోషముచే) పూర్వము కంటే ఓషధులు ప్రశాంతములయినవి తగ్గిపోయినవి). పిడికిళులతో పట్టిన ఇసుకవలె వారు ప్రనష్టులయిరి. (నశించిరి.) (136, 137) అంత, యుగబలముచే, చతుర్దశ సంఖ్యాకమయిన గ్రామ్యారణ్యముల వలన మాటిమాటికీ పుష్పములను, ఫలములను, దుంపలను ప్రజలు గ్రహింప మొదలిడిరి. ఆ వృక్షములు నశింపఁగా ప్రజలు వీభ్రాంత హృదయులైరి. వారందరు ఆకలిచే బాధపడిరి. స్వయంభువుం డైన బ్రహ్మకడకు వారరిగిరి. (139) త్రేతాయుగారంభమున నా ప్రజలు జీవనోపాధిని కోరిరి. స్వయంభువుఁడైన బ్రహ్మకు వారి కోర్కె తేలిసేను.(140)
సర్వము ప్రత్యక్షముగఁ జూడఁగల బ్రహ్మ, తచ్ఛక్త్యా ఈ విషయమును గూర్చి ఆలోచించేను. ఓషధులు భూమిచే మరల గ్రసింపం బడినవని యతఁడు తెలిసికొనెను. వానిని మరల వృద్ధిపొంద చేసెను. (141) మేరు పర్వతమును వత్సగాజేసి, పృథివిని గోవుగా జేసి అతఁడు పాలు పిదీకెను. ఆ ధేనువు దుగ్గరూపమున బీజములను పృథివీతలమున కొసంగెను. (142) ఆ బీజములను ప్రభువయిన బ్రహ్మ ఓషధులుగను, ఇతరములైన మొక్కలుగ వృద్ధి పొందించెను. ఓషధులు ఫలపాక స్థితికి వచ్చి నశించేను. ఆ వృక్షములు ఓషధులు ఒకే యొకమారు ఫలించెను. తరువాత నశించెను. అయ్యవి పదియేడు విధములయిన ధాన్యములు. (143) అవి వడ్లు, గోధుమలు, యవలు, తిలలు, శనగలు, ప్రియంగువులు, ఉదారములు, కోరదుష్టములు, వామకములు, మినుములు, పెసలు, మసూరలు, నీవారధాన్యములు, ఉలవలు, హారికలు, కారీకలు. (145) (గ్రామారణ్యకములు : అడవులయందు గ్రామములయందు వృద్ధి పొందు ధాన్యములు (ఓషధులు మున్నయినవి) ఇయ్యవీ గ్రామ్య జాతులనం బడు ఓషధులు. శ్యామాకములు, నీవారములు, జర్తీలలు, గవేధుకలు కురువిందలు, (ఒక విధమయిన బార్లీ ధాన్యము). వేణుయవలు. (వెదురు బియ్యము) తామాతులు టకములు మొదలయినవి పదునాలుగు విధములయిన ఓషధులుగా స్మరింపఁబడినవి. (147) ఈ పదునాలుగు విధములయిన గ్రామ్యారణ్యక ధాన్యములు త్రేతాయుగారంభమున నుత్పన్నములు. ఆ గ్రామ్యారణ్య ధాన్యములు దున్నక చల్లకయే ఫలించినవీ. (148) వృక్షములు, లతలు, తీగెలు, పొదలు, పాదులు, మున్నగు తృణజాతులు పుష్పములను, ఫలములను, దుంపలను, వేళ్లను - ఒసంగెను. ప్రజలు తత్పలముల గ్రహించిరి. (149) స్వయంభువునిచే పూర్వము పీతుకబడిన బీజములు, మున్నగునవి ఓషధులుగ వృక్షములుగ వృద్దీ నొందెను. అయ్యవి సకాలములో ఆయా ఋతువుల పుష్పఫలముల నొసంగెను.
పూర్వము సృష్టింపఁబడిన ఓషధులు, మరల వృద్ధి నొందీ పలింప మానినపుడు, వారి జీవయాత్రోపాధిగ స్వయంభువు వార్తోపాయము నొనర్చెను. వార్తోపాయము వ్యవసాయము. (151) స్వయముగా భగవానుఁడయిన స్వయంభువు, వారికి స్వహస్తములతో బనిచేయునట్లు, అధికమయిన ఫలితములను సిద్ధిని వారు పొందునట్లైశీర్వదించెను. అప్పటి నుండియు ఓషధులు కృష్ణ పచ్యములయినవి. అనఁగా దున్నబడుటచే వృద్ధి పొందినవయినవి. (152) వ్యవసాయ వృత్తియందు తన ప్రయోజనమును ప్రజాపతి కల్పించనయనంతరము వారలకు కొన్ని మర్యాదల నియమించేను. తన్మూలమున వారు పరస్పరము రక్షించుకొందురు. (153) అట్లు కృషీవలత్వోపాధి గ్రహించిన వారు బలవంతులయిరి. అట్టి వారలను బ్రహ్మ క్షత్రియులనుగాఁ జేసెను. వారి ధర్మము ఇతరులను (బలహీనులను రక్షించుట. (154) ఎంతకాలము వారు క్షత్రియుల నాశ్రయించుకొని లేదా గౌరవించుకొనుచు నుందురో యంతకాలము వారు భయము లేనివారు. యథాభూతం” జరిగినది జరిగినట్లుగా, సత్యమును నిశ్చయముగా జెప్పినవారు బ్రాహ్మణులు, (155) కొందఱు అబలులయిన వారిని రక్షించు కర్మయందు సంస్థితులై యుండిరి. (క్రీతాని) క్రిములను వారు నాశన మొనరించిరి. వారు భూస్థలమున ప్రతిష్టితులైరి. (156) వృత్తి సాధకులను (వ్యవసాయము చేయువారిని) వైశ్యులనిరి. వారు వ్యవసాయము చేయుదురు. ఇతరుల సేవలో రతులయినవారు, ఇతరులకు పరిచర్య చేయువారు, (157) నిస్తేజస్కులు, అల్పవీర్యులయిన వారిని ప్రజాపతి శూద్రులని వ్యవహరించెను. వారి ధర్మములను కర్తవ్యములయిన కర్మకలాపమును బ్రహ్మ నియమించెను. (158) అట్లు బ్రహ్మచే నియమింపబడినవారై చతుర్వర్ణములవారుండిరి. కాని క్రమేణ ఆ ధర్మములను వారు పాలింపకబోయిరి.
ప్రజలు వారివారి వివిధ వర్ణధర్మముల నాచరించుచు జీవించుచున్నను, వారు పరస్పరము విరోధులయి వివాదించుకొనెడివారు. యథా తథముగా వారి విరోధములను బ్రహ్మ యెటింగెను. (160) బ్రహ్మా క్షత్రియులకు బలమును, దండనముల నొసంగుట, యుద్ధ జీవితమును నాదేశించెను. బ్రాహ్మణులకు యజ్ఞములనాచరించుట, వేదములను గఱపుట, దానములను పరిగ్రహించుట - మున్నగు కర్మలను ప్రభుఁడైన బ్రహ్మ ఆదేశించెను. పశువులను పెంచుట, వాణిజ్యము, కృషి - మొదలగు కర్మలను వైశ్యుల కొసంగెను. (162) శూద్రులకు శీల జీవనమును జీవన భృతికై బ్రహ్మ శాసించెను. బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు, యజ్ఞముల నాచరించుట, వేదమును అధ్యయన మొనర్చుట, దానముల నొసంగుట బ్రహ్మ సామాన్య కర్మములుగా నియమించెను. (163) ఇతరులకు జీవనోపాధికి పై వర్ణత్రయము వారికి కర్మల నాచరించుట నియమించెను. (164) ఈ కర్మల నాచరించిన తరువత, బ్రహ్మ లోకాంతరము నందు క్రింది స్థానములను విధించెను. (ప్రాజాపత్యమనఁగా బ్రహ్మకు సంబంధించినది), తమ పవిత్ర విధులను నిర్వర్తించిన బ్రాహ్మణులకు ప్రజాపతిలోక నివాసము స్మరింపఁబడినది. (విధింపబడినది), (165) యుద్దభూమీ నుండి పలాయనము చెందని క్షత్రియులకు ఇంద్రలోకమున స్థానము, స్వకర్మోప జీవులయిన వైశ్యులకు మారుత లోకమున స్థానము నియమింపఁబడినవి. (వాయు సంబంధమయిన లోకము మారుత స్థానము. (166) (ఇతర వర్ణముల వారికి) పరిచర్య. చేయుట యందు నిష్టులయిన శూద్రులకు గాంధర్వ లోకవాసము విధింపఁబడినది. (మరణానంతరము) సుకృతులైయుండి, యోగ్యచార ప్రతులను సజ్జనులకు (తత్తద్వర్ణోచితకర్మ లొనరించిన వారికి) ఆయా స్థానములు విధించబడినవి. (167) చాతుర్వర్య వ్యవస్థ వివిధ కర్మలతో వ్యవస్థితమై యుండ, వారు, దండన భయమున తమతమ వర్ణముల యందు స్థిరముగా నిష్ఠులైయుండిరి. వర్ణ వ్యవస్థ స్థిరీకరింపం బడిన పిమ్మట బ్రహ్మ చతుర్ధాశ్రమములను స్థాపించేను.
పూర్వము వలెనే బ్రహ్మ గృహస్థ, బ్రహ్మచర్య, వానప్రస్థసన్యాస - ఆశ్రమ చతుష్టయమును స్థాపించెను. (169) నాలుగు వర్ణముల వారు వారివారి కర్మల నాచరించుచుండిరి. ఆ వాసముల నెలకోలుకొనిరి. ఆశ్రమ స్థితుల నిర్వహించిరి. సుఖించిరి. (170) ఈ ఆశ్రమ చతుష్టయమును బ్రహ్మ స్థాపించేను. ఈ ఆశ్రమముల విడనాడి భ్రమించు వారినీ, 'ఇట్లుండవలేననీ' నిర్దేశించెను. వారలకు ధర్మములను ప్రవచించెను. (171) బ్రహ్మ యమము, నియమము - మున్నగు ఇంద్రియ నిగ్రహ సోపాన క్రియులను ప్రవచించెను. చతురా శ్రమములలో ముఖ్యముగా గృహస్థాశ్రమము మిగిలిన మూఁడు ఆశ్రమములకు వృత్తియందు నీతియందు ఆధార భూతమయినందున ఇక యథాక్రమమున ఆ చతురాశ్రమస్థుల వ్రతములను నియమములను చేప్పెదను. (173) సూక్ష్మముగా నీ క్రిందివి గృహస్థాశ్రమ విధులు : ధర్మ క్రియలు, వివాహము, అగ్నిహోత్ర సంరక్షణము, అతీధి జనాదరణము, యజ్ఞాచరణము, స్వప్రజావృద్ధి యొనర్చుట. (174) బ్రహ్మచారి ధర్మములు ; మేఖల (మొలనూలు) ధరించవలెను, దండమును దాల్చవలయును; లేడి చర్మమును ధరింపవలెను. నేల పరుండవలెను; గురు శుశ్రూష యొనర్చవలెను. భైక్ష్యమున జీవింపవలెను. విద్యార్థి కావలెను. (175) వాన ప్రస్థ వ్రతదీక్షితులకు - నార చీరలు ధరించుట, వనమూల ఫలౌషధుల ఆరగించి జీవించుట, ఉభయ సంధ్యలయందు స్నానము లొనర్చుట, హోమ మాచరించుట, ఇఁక సన్యాసులకు (యత్యాశ్రమ ధారులకు) : ధాన్యమును దంపుటచే గలుగు రోకంటి పోటు ధ్వని అణగిన వెనుక బిచ్చమెత్తుట, అస్తేయము (దొంగతనము లేక యుండుట), శౌచము నూనీయుండుట.
ప్రమాదము (తప్పిదము) లాచరింపకుండుట; అత్యవాయిత్వము (స్త్రీ సంపర్క రహితముగ నుండుట), భూతముల యందు దయ, ఓర్పులు కలిగియుండుట, వేదాంత శ్రవణ మాచరించుట, గురు శుశ్రూష, సత్యపాలనము - ఇవి పది లక్షణములు : ఈ పది లక్షణములు సన్యాసి ధర్మములుగా బ్రహ్మవచించెను. (178) భైక్ష్య వేద ప్రతాదులైదును భిక్షువుని యొక్క ధర్మములు. వారికి ఎనిమిది స్థానములు మరణానంతరము వచింపఁబడినవి. (179) ఊర్థ్వరేతస్కులయిన శిష్టులయిన ఋషులు ఎనుబది వేలమంది కలరు. వారికేట్టి స్థానములు (మరణానంతరము) నిర్ణయింపఁబడినవో, (అస్పష్టముగా నున్నది). అట్టి స్థానములే గురు శుశ్రూషాయుతులయి గురువులతో నుండు వారికిని స్మరింపఁబడినవి. (180) వనౌకసులయిన వానప్రస్థులకు సప్తర్షి స్థానము, ప్రజాపతిలోక స్థానవాసము గృహస్థులకు, బ్రహ్మలోకవాసము సన్యాసులకు నియమింపఁబడినది. [181) యోగులకు స్థానము నిర్ణీతము కాలేదు (యోగమున పిద్ధులయిననే కాక స్థానములు నిర్ణయింపం బడువు. వారిం కను యోగ సాధకులే). వివిధములయిన ఆశ్రమస్థులయిన వారికి స్థానము బ్రహ్మ స్థానమగును. (182) నాలుగు పథములే (మార్గములే) దేవయానములు నిర్మితములు, దేవయానములు, దేవతల యొక్క మార్గములు). పితృయానములనీ నాలుగు మార్గములే స్మరింపం బడినవి. (పితృయానములు పితృదేవతల మార్గములు,) (183) పూర్వము మొదట మన్వంతరమున లోకతంత్రమును నిర్వహించిన బ్రాహ్మణులు, దేవయానముల మార్గములకు సూర్యుఁడు ద్వారముగా స్మరింపబడినాఁడు. పితృయానములకు చంద్రుఁడు ద్వారముగా చెప్పబడెను. (184)
ఈ విధముగా వర్ణాశ్రమముల యొక్క విభాగము. తత్తద్ధర్మములతోఁ జేయబడినను, వర్ణ ధర్మముల యందు సంసక్తులయిన ప్రజలు వృద్ధి పొందలేదు. (185) అప్పుడు త్రేతాయుగ మధ్యలో తనయొక్క శరీరముల నుండి, మరియు తనతో తుల్యములయిన శరీరముల నుండి, స్వమనస్సంబంధమయిన అన్యమయిన సృష్టిలో ప్రజలను ప్రజాపతీ సృజించెను. (186) మొట్టమొదటిదైన త్రేతాయుగ మధ్య కాలము క్రమముగా, సంప్రాప్తముకాగా, ఇంతకు పూర్వము సృజించిన దానికంటే వేటయిన మానస సంబంధమయిన ప్రజాసృష్టి నొనర్ప బ్రహ్మ యంతట ప్రారంభించేను: (187) అంత ఆ బ్రహ్మయే సత్వ రజోగుణములచే నుద్రిక్తులయిన ప్రజలను సృజించెను. వారు ధర్మార్థ కామ మోక్షములకు, వార్తలకు (జీవితోపాధి కొకయిన వృత్తులకు) సాధకులయిరి. (188) వారు దేవతలు, పితరులు, ఋషులు, మనువులు. వారి వారి లక్షణము విషయములలో వారు యుగాను కూలములయిన ధర్మములతో ప్రజలు అభివృద్ధి నొందిరి. (189) అప్పుడు ఆ సృష్టి వర్గముప స్థితము కాగా స్వయంభువుఁ డయిన బ్రహ్మ ధ్యానించి, నానా వీర్యవంతులయిన ప్రజలను స్వమన సృష్టిచే కల్పించేను. (190) గతించిన కల్పములో జనలోకము నాశ్రయించిన ప్రజలను గూర్చి నీకు వివరించితిని. అందు పూర్వమే దేవతలు ప్రజానీకమిందుండిరి. (191) బ్రహ్మ వానిని గూర్చి ధ్యాన మొనరించెను. సృజింపఁబడిన వారందరు, (తిరిగి) జన్మించుట. కొఆకాతనిని సమీపించిరి. మన్వంతర క్రమములో మొదటి వారిని 'కనిష్ఠు'లనుగా జేసెను. . ప్రజావంశ్యులలో వారు ప్రఖ్యాతులు. వారికి తెలివి, తదితరములు కలవు. వారీవారి క్రియలచే నుత్పన్నములలన ఫలితములచే వారికి కొన్ని సామాన్యములయిన, బాధలుండెను.
అందున్న వారిలో, దేవతలు, అసురులు,, పీతరులు, యక్షులు; గంధర్వులు, మానవులు, రాక్షసులు, పిశాచులు, జంతువులు, పక్షులు, నేల బ్రాకునట్టి సరీసృపములు, వృక్షములు, నారక కీటకములు మొదలయినవి. యుండెను. ప్రజల కాహరార్ధము (సర్వవిదులలో శ్రేష్ఠుఁడు) బ్రహ్మ నిర్మించెను. (195)
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు పూర్వభాగమున అనుషంగపాదమున లోకజ్ఞానవర్ణనమును సప్తమాధ్యాయము.
Summary of chapter 7 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter beautifully expands the seeker's cosmic vision, providing sacred insights into the diverse phenomena that constitute the wondrous universe. It lovingly elaborates on the philosophical truths underlying physical existence, teaching the faithful to see the divine presence woven into the very fabric of nature. The devout soul is thus encouraged to walk the earth with reverence, recognizing the entire creation as a magnificent temple of the supreme lord.