బ్రహ్మాండ మహా పురాణము
6 - కల్పమన్వంతరాఖ్యానవర్హనమ్
సూతుఁడిట్లు పలికెను.
ప్రకృత్యర్థము ముఖ్యముగా వివరింపబడిన ప్రథమ పాదమును వీని కాయుఁడు సంతోషించెను. కానీ కొన్ని సంశయములతనికి కలిగెను. (వాయు పురాణములో కాశ్యపేయుఁడని యున్నది.) (1) ఆతని నాతండు పలుకులతో నారాధించెను. వేతోక కథను సొతని వలన వినఁదలఁచి, అందులకై యతనితో “కల్పజ్ఞ! ఓ ఋషి, నీవు కల్పము నందలి విషయముల నెఱింగినవాఁడవు. 'ప్రతిసంధీ'ని గూర్చి ఇక నా కొలకు వివరింపుము. దానిని వినఁగోరుచున్నాను. అయ్యాడీ రెండు కల్పములకు మధ్యకాలము. గతించిన కల్పము, ఇప్పుడు వర్తమానముగా నున్న కల్పము. ఈ రెండు కల్పముల మధ్య గల పరిణామ కాల సంభవమయిన ప్రతిసంధి వృత్తాంతమును వీనంగోరెదను, నీవీ వృత్తాంతమున కుశలుండవు. (2-3) ఇట్లు కాపేయుని చేనడుగఁబడి, వాగ్విదులలో శ్రేష్ఠుఁడయిన సూతుఁడు శ్రీలోకోద్భవ చరిత్రను సర్వమును చెప్పు నారంభించేను. (4) షూతుఁడిట్లనెను : ఓ సువ్రతులారా! యథాతథము జరిగినది జరిగినట్లు జరిగిపోయిన కల్పమునుగూర్చి, భవిష్యత్కల్పమును గూర్చి ఆ రెండినడుమ ప్రవర్తిల్లిన ప్రతిసంధిని గూర్చి యిఁక వర్ణించెదను. (5) ఓ సువ్రతులారా! కల్పము లందలీ వివిధములయిన మన్వంతరముల గూర్చి వర్ణించెదను. ఇప్పుడు వర్తమాన కల్పము వరాహకల్పము. ఇది శుభంకరమైనది. (6) ఈ కల్పమునకు పూర్వము జరిగిన సనాతనమయిన కల్పము, ప్రస్తుత కల్పము - ఈ రెంటికీని మధ్యగల స్థితిని ఎఱుంగుము. ఓయనఘులారా! ప్రతిసంధి లేకయే గత కల్పము మరలిపోయి (ఈమధ్య కాలము) వేళిక కల్పము జనలోకము మొదలగు వానితో మరల ప్రవర్తిల్లును. (8) కల్పము నుండి కల్పమునకు పరస్పరము, ఒక దానిని వేతాక దాని నుండి విభజించు పరిణామ సమయ స్థితి యుండును. కల్పాంతము నందు సర్వప్రజలు సర్వప్రాణులు పూర్తిగా వినాశన మొందును.
కల్పము సమాప్తమయి, మఱియొక కల్పము ఆరంభించుటకు మధ్య కాలమునకు ప్రతిసంధియందురు. (మూలమున ప్రతిసంధిగ్న విద్యతే యని యున్నది. ప్రతీసంధి యుండకుండుట యసంభవము. అందుచే అనువాదమిట్లు చేయవలసివచ్చినది). మన్వంతరము నందు సంధీ సమయములకు యుగములని పేరు. ఆ యుగములు, యుగసంధులు : అవి అవిచ్చిన్నములు. మన్వంతరములు సంధీ సమయమందలి యుగములతో పరస్పరము కూడి ప్రవర్తిల్లును. ప్రక్రియా పాదమున పూర్వకల్పములు సూక్ష్మముగా పేర్కొనంబడినవి. (10,11) ప్రతి కల్పమునకు పూర్వార్ధము, పరార్థము లుండును. అందుచే నొక కల్పము చనగా దానీ పరార్ధము, వచ్చెడి కల్పము యొక్క పూర్వార్ధముతో ననుసరింపం బడును. అట్లే ఇతర కల్పములు తమ పరార్థ కల్ప భాగములతో ననుసరింపఁబడును. ఓ బ్రాహ్మణోత్తములారా! వర్తమాన మగు నీ కల్పమట్టి వానిలో మొదటిది. దీనికి పూర్వార్ధము పరార్ధము కలవు. ద్వితీయార్థమునకు (రెండవదానికి 'పర' అందురు. అయ్యది సంస్థిత కాలము. తరువాత ప్రలయకాలము (విలీనమగుకాలము) వచ్చునని యెఱుంగవలెను. (12,14) ఈ కల్పమునకు పూర్వమొక పూర్వ కల్పము కలదు. అదీ ప్రాచీనమయినది. అయ్యది మన్వంతరములతో సహా, చతుర్యుగ సహస్రముల యనంతరము గడచిపోయినదీ. (15) కల్పము పరిసమాప్తి పొందుటకు సమయమానన్నము కాగా, దాహాకాలము (ప్రళయకాలము) సమీపించగా, దేవతలు విమానముల సంచరింతురు. (16) నక్షత్రములు, గ్రహములు, తారలు, చంద్రసూర్యాదులు - మున్నగు వారందరు ఇరువది యెనిమిది కోట్ల సంఖ్య వారు. వారందరు సుకృతాత్ములు. పదునాలుగు మన్వంతరములందును వీరి సంఖ్య యొక్కటీయే. అందుచే వారి మొత్తము సంఖ్య (14 X 28) = 392 కోట్లు, (18} అంతీయేకాక, ప్రతికల్పములో, విమానముల సంచరించు దేవతలు 70 వేలు అధికమని గ్రహింపవలెను. (19) పదునాలుగు మన్వంతరములలో దేవతలు, పితరులు, ఋషులు - కలరు. వారు అమృతమును ద్రాగుదురు, వారు స్వర్గమున నుందురు.
వారికి అనుచరులయిన సేవకులు, భార్యలు, పుత్రులు గలరు. ఆ కాలమున ఆకాశమున సంచరించు దేవతలకు వర్ణములు కానీ ఆశ్రమములు కాని లేవు. (21) అందుచే, సర్వజీవులు, వస్తువులతో సహా వినాశనమును సమీపింపఁగా, నెల్లరును తుల్య స్థానులు తుల్యనిషా వంతులు నయిరి. వారందరితో నీ సమాన స్థితిలో వారు సాయుజ్యము నందిరి. సాయుజ్యమనఁగా భగవత్పదార్థముతో నైక్యము నొందుట. (22) పరమాత్మతో సాయుజ్యమును అవశ్యభావిత్వము నొంది (యెటింగి) త్రైలోక్యవాసులు, తత్తతానముల యందు ఒండొరుల గమనించు కొనిరి. పోరు పొందిన వివిధ స్థానముల యందు గర్వము నొందిరి. స్థితికాల మాసన్నము కాగా, పరిపూర్ణమగుడు), పశ్చిమోత్తర కాలము తప్పనిది కాగా, (పూర్వపూర్వతర కాలసమయము), సర్వనాశనము ఉపపన్నమయిన, కల్పము యొక్క తుది దినములలలో నుత్సాహవంతులయిన దేవతలు, కొంతవఱకు తమ నివాస స్థానమయిన సత్యలోకమును విడిచిరి. అటు పిమ్మట వారు తమ స్థానములను క్రమముగా విడిచి, సంవిగ్నులయి, మహర్లోకమునకు తమ మనస్సుల నున్ముఖములు గావించిరి. (22, 25) వారు మనస్సమాధానమున యుక్తులై యొక యోగస్థానమును శరీరమున పొందిరి. వారందరు విశుద్ధి బహుళులు నగుట మనస్సంబంధమైన సిద్ధిని పొందిరి. {26) వారందరు కలవాసులతో కూడి బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో, ఇతర జనములలో మహర్లోకమును జేరిరి. (27) మహర్లోకమునకు జేరిన వెనుక, చతుర్దశ దేవసంఘములు ఉద్వేగవంతులయిరి. వారు వారి మనస్సుల జనలోకమును గూర్చి భావించిరి. (28) ఇట్టి క్రమయోగమున కల్పవాసీనులు సాగిపోయిరి. ఇట్లే దేవతా సంఖ్యామానములో సహస్ర యుగములు పరస్పరము జరిగినవి. (29) వారందరు విశుద్ధి విశేషులు. అందుచే మానసికమైన సిద్ధిని పొందిరి. (మానసీం సిద్ధిం - ఆధ్యాత్మిక శక్తిని), కల్పవాసులతో సహితము జనలోకము పొందఁబడినది. (30)
అచ్చట వారు పదికల్పములుండీ, మరల సత్యలోకమునకు పోవుదురు. (బ్రహ్మలోకము సత్యలోకము). బ్రహ్మలోకమున కరిగిన వెనుక వారు పునరావృత్తి రహిత లోకము నందుదురు. (31) అచ్చట పునారవృత్తిరహితత్వము నొందిన జీవుఁడు, బ్రహ్మలోకమున ప్రజాసృష్టి సంబంధి అధికారము తప్ప తక్కిన టైశ్వర్యాదులతో బ్రహ్మతో సమానత్వము వహించును. ఆధిపత్యము నందు తక్క మిగిలిన టైశ్వర్య విషయమున, రూప విషయమున, వారందరు బ్రహ్మతో తుల్యులు అగుదురు. వారు విషయజ్ఞానమున బ్రహ్మ సమానులు అగుదురు. (32) అచ్చట వారు (బ్రహ్మ సంసర్గమున) సంయమముతో ప్రీతియుక్తులై యుందురు. బ్రహ్మవలన వారానందము నొంది, బ్రహ్మతో సహా వారు విముక్తిని పొందుదురు. (33) ప్రకృతీ సంబంధమయిన అవశ్యభావులయిన విషయముల వలన, వారందు గౌరవము, పూజ, మున్నగు వానితో నుండి పోవుదురు. ఈ పూజాదులందు సహజముగా సంబద్ధములు. తత్కాల భావితములు, (వారు బ్రహ్మ లోకమున పొందిన ప్రత్యేకత్వము తోడనే యుండి పోవుదురు. వాయుపురాణము.) (34) నిద్రపోవు వ్యక్తి విషయమై విషయ పరిజ్ఞానము బుద్ధి పూర్వకము స్ఫుటముగా ప్రకాశింపనట్లు, పవిత్రులై సేవా పరులయిన వారి యందు ఆనందము ప్రకాశింప మొదలిడును. (35) పరస్పర భేదభావము లజంగినప్పుడు ఆనందము ప్రకాశింప మొదలిడును, ఈ యానందానుభవము జ్యోతిష్మంతుల విషయమై (తేజస్వంతుల విషయమున) భిన్నభిన్నముగా నుండును, వారి వారి కార్యములతో కరణములతో ఆనందానుభూతి వృద్ధి చెందును. (36) నానోత్వమును పాటించుచు, పోరీవారి అధికారములను నుపసంహరించుకొనిన వారియొక్క స్వధర్మ నిర్వహణులయొక్క బ్రహ్మలోక వాసులయొక్క సిద్ధులు సమాన లక్షణములు కలిగియుండును, పారు పవిత్రాత్ములు. వారి ఆత్మలు పరిశుద్ధములు, నీరంజనములు. వారి ప్రకృతస్థితిలో వారు జ్ఞానేంద్రియముల గలిగియున్నారు. ఈ జ్ఞానేంద్రియములతోవారు తమతమ ఆత్మలయందు పరిపుష్టులై ప్రవర్తించెదరు. (38) తన్ను సుస్థాపించుకొని, ప్రకృతి, పురుషుని కంటే తత్త్వతః భిన్నముగాను, బహుత్వ కలీతముగాను, ప్రవర్తించును. (39) మరల సృష్టి ఆరంభించిన వెనుక, ప్రకృతి విముక్తులయిన ఆత్మలతో సంబంధమున గ్రహింపఁబడవలేను. వారో తత్త్వమును గ్రహింతురు. వారుపస్థితములయిన కారణములతో తాదాత్మ్యము వహించి యుందురు. (40)
ముక్తులయిన యట్టివారు పూర్వమార్గమును బట్టియే (సంసారమార్గము) తిరిగిరారు. పారభావులు. ఉత్పన్న స్థితిలేనివారు. వారు చల్లారిపోయిన అగ్నిహోత్రమును పోలినవారు. (41) ఆ మహాత్ములు త్రిలోకములందు నూర్థ్వమునకు వీరందరితో కలిసిపోయిన వెనుక, హరిచే మహర్లోకము ఆక్రమింపబడదు. (42) కల్పము యొక్క దాహము (ప్రళయము) ఉపస్థితముకాగా, గంధర్వులు, పిశాచములు, మనుష్యులు, బ్రాహ్మణులు మొదలగు వారు వారి శిష్యులగుదురు. (ఇందు శిష్యులను పదము కంటే 'శిష్ట' అను పదముండిన సమంజసమనిపించును, (43) అట్లే పశువులు, పక్షులు, స్థావరములు, సరీసృపములును (ప్రాకుసవి - పాములు నలికిల పాములు మొదలయినవి). ఆ సమయమున పృథివీ తల వాసులందే యుండిపోగా, (44) వేయి రూపముల (కిరణములతో, ప్రత్యక్షమయిన) నొప్పు సూర్యరశ్ములు (కలిసిపోయి, కేంద్రీకృతములై) ఏడు కిరణములుగా నగును. (సప్తరశ్ములు). ఒక్కొక్కరశ్మి యొక్కోక్క సూర్యుఁడగును. (45) (కల్పదాహము) క్రమముగా ప్రజ్వరిల్లి మూఁడు లోకములను దహించును. స్థావరములు, జంగమములు, నదులు, సర్వ పర్వతములు, మున్నగునవి యెవ్వి అనావృష్టి చేతను శుష్కములయినవో, సూర్యులచే బాధితములు ప్రధూపితములయినవో యవి సూర్యరశ్మిచే పూర్తిగా దగ్ధములైనవి. నిస్సహాయములయినవి. ఉత్తమ గుణ ధర్మవంతములు, దుష్ట గుణ ధర్మవంతములునయిన ప్రకృతి స్థమయిన స్థావర జంగమ రూపవస్తువులు దగ్గ శరీరములగును. రెండు యుగములకు గల మధ్యకాలములో నవి పోయిన పాపములు కలిగినవగును. (46,48) అవి యన్నియు ఖ్యాతములు. అవి సూర్యుని ఆతపము నుండి శుభవంతమయిన వర్షముచే . వినిర్ముక్తములు. తమతో సమాన రూప ధర్మములు గలిగిన జనములతో నీ జనములు కలియుదురు. (49) అవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ యొక్క యొక రాత్రి కాలము నచ్చట వసించి, తరువాత సృష్టి క్రమములో వారు బ్రహ్మ యొక్క మానస సుతులయిరి.
ముల్లోకవాసులయిన జనములతో (కూడియుండ) దగ్గపటలముకాఁగా, సప్త సూర్యులచే లోకములన్నియు భస్మీభూతములు కాగా, (51) భూమియంతయు వర్షముచే సంస్లావితము (నిండినది) కాగా, సముద్రములు నిర్జనము లయ్యెను. సముద్రోత్పన్నములయిన మేఘములు, నీరును, భూమినుండి పుట్టిన సర్వవస్తువులు (52) ముక్కలు ముక్కలై శరముల వలే చెదరిపోయెను. అప్పుడవి 'సలీల' నామధేయములయ్యెను. వరదలు ఒండొంటితో కలిసికొని బహుళములయ్యెను. (53) నీరు భూమినంతను ఆవరించియుండ, అప్పుడీ భూమి ‘అర్జవ'మను పేరొందెను. 'భా' ధాతువునకు వ్యాప్తి దీప్తుల యందు అర్థము. (54) నీటికి అంభస్సులని పేరు - ఏలయన - అవి ప్రకాశించు; వ్యాపించును నీరు సర్వత్ర వ్యాపించెను, (55) ప్రపంచమందంతటను, తనలో తానును, నీరు వ్యాపించి యుండుటచే ఈతనువః” వ్యాపించునవి {తనుః) అను పేరొందెను. “తను” అనుధాతువు వ్యాపించుట యను అర్థమున నుపయోగింపబడును. 'సర్' లేదా 'సృ' అనుధాతువు బహ్వర్థములలో ప్రయోగింపబడును. దాని యర్థము “వికీర్ణము” చెందుట, “ముక్కలగుట"... విశీర్ణము చెందుట. (56) ప్రపంచమంతయు నీరు నిండగా నీరు ప్రవహించుట మానెను. (శీఘ్రగతి నొందలేదు.) అందుచే వానికి నీరాః అను పేరు వచ్చినది. సహస్ర యుగముల యంతమందు, బ్రహ్మయొక్క 'దీవా' కాలము (పగటికాలము) సమాప్తము కాగా, మరల అంతకాలమే రాత్రి సమయముగా, సలిల మందు వ్యాప్తముకాఁగా, అగ్నులు చల్లారెను. యావత్ జలప్రపంచములో భూభాగమంతయు నష్టమయ్యెను. అప్పుడు వాయువు ప్రశాంత మొందెను. చలనము లేక యుండెను. అప్పుడెచ్చటను వెల్లురను మాట లేక అంధకారము అంతటను వ్యాపించెను. అప్పుడే ప్రపంచమంతయు 'పురుషునిచే అధిష్టితమయ్యెను. అతఁడే ప్రభువు. బ్రహ్మ, (59) ఆతఁడు మరల ప్రపంచమును విభాగము చేయఁగోరెను. ఆ యనంతజలములో, స్థావరములు, జంగములయిన వన్నియును ప్రలయమును చెందెను. (60)
అప్పుడు ఆ బ్రహ్మ సహస్రాక్షుఁడు, సహస్రపాదుఁడు, సహస్ర శీర్షుఁడు, బంగారు వర్ణములు కలవాఁడు, జితేంద్రియుఁడు నయిన పురుషుఁడగును. (61) ఈ సందర్భమున నారాయణుని గూర్చి యీ క్రింది శ్లోకము చెప్పుఁబడినది. “జలములు సారములు. అవియే 'తనవము’లు వ్యాపించునవి. (అవియే శరీరములదాల్చును). అవి నింపబడును (ఆఫూర్యమాణములు) వానియందు ఆతఁడుపసించుటచే “నారాయణడు”అనీ స్మరింపఁబడెను, (62) ప్రథముడయిన ప్రజాపతి (ప్రజలకు ప్రభువు) సుమనస్కుడు. (మంచి మనము కలవాఁడు). ఆతనికి సహస్ర శీర్షములు, సహస్ర పాదములు, సహస్ర నేత్రములు, సహస్ర వదనములు సహస్ర బాహువులు, కలవు. ఆతఁడు సహస్ర కార్యములనొనర్చును. ఆతనినే త్రయీమయుడనీ (వేదమయుఁడని) నిర్వచింతురు. (63) ఆతఁడాదిత్యవరుఁడు; సూర్య సమానవర్ణుఁడు; సర్వ విశ్వ రక్షకుఁడు; ఆతఁడు కేవలుఁడు. ఒక్కడే. ఆతఁడు మూర్తి రహీతుఁడు; ఆతఁడే ప్రథముఁడయిన విరాట్ (విశ్వరూపుఁడు). ఆతఁడే హిరణ్యగర్భుడు; మహాత్ముడు, ఆతఁడు మనస్సుచే గ్రహింప శక్యుఁడు కాఁడు. (64) కల్పారంభమునందు, ఆతఁడు రజోగుణ విరాజితుఁడయిన బ్రహ్మ అప్పుడు ప్రపంచమునతఁడు సృజించెను, కల్పాంతమందోతఁడే తమో గుణావిష్ణుఁడు. ఆతఁడు కొలుఁడై (సంహర్తయై) సర్వమును గ్రసించును. (65) ఆతఁడే నారాయణుఁడై సత్త్వగుణోద్రిక్తుఁడై జలాశయమున (జలమయ ప్రపంచమున) స్వయముగా త్రివిధముల విభక్తుఁడై మూఁడు లోకములందు ప్రవర్తించును. (66) స్వకీయమయి త్రివీధ లక్షణములచే అతఁడు సృజించును. గ్రసించును (నాశనము) చేయును. చూచును (పరిరక్షించును - పాలించును.) (67) చతుర్యుగములు ఒకవే జరుగగా, అంతటను జలమయమై యుండఁగా (స్థావర జంగమాదులు నశించగా), బ్రహ్మ , నారాయణాఖ్యతో స్వయముగా విశ్వమున ప్రకాశించును. (68) స్వేదజ, అండజ, ఉద్బీజ్జ, జరాయుజములనెడి చతుర్విధ సృష్టి, బ్రహ్మశక్తిచే తమోవృతములు. మహర్లోకమున మహర్షులు నిద్రించుచున్న 'కాలు'నీ (యముని) చూచెదరు.
ఆ కాలమున చెప్పఁబడిన ఋషులు భృగ్వాదులు. కల్పము సమాప్తము నొందుసరికి ఉన్న మహర్షులు సత్య, మొదలగు వారు ఎనమండ్రు. పరిభ్రమమాణులైన వారిచే పరిగత పరీవృతమైనది. మహత్. (70) 'ఋ' ధాత్వర్థము 'గతా కదలిక యందు రూఢము. ఆ 'ఋ' ధాతువు నుండియే “ఋషి' అన్న నామ నిష్పత్తి కలిగిన దందురు. “యస్మాత్ ఋషత్ సత్తేన తస్మాత్ మహత్” వారు వారి సత్త్వముచే సంచరించు చుందురు కొన వారు మహాత్ములు. మహరులునైరి. (71) నిద్రపోవుచున్న కాలుఁడు సత్యాదులచే (సత్త్వాదులచే) చూడబడెను. ఆ ఋషులు ఏడుగురు. వారు గతకల్పమున మహర్లోకమున నుండిరి. (72) ఇట్లు బ్రహ్మ ఆయా సహస్ర సంఖ్యాక రాత్రులు మానక పనిచేయును, ఆతనిచే ఆనీతులయిన యా మహర్పులు కాలుఁడు (యముఁడు) నిద్రించుచుండగా చూచిరి. (73) కల్పము యొక్క ఆదియందు బ్రహ్మ పదుషాలుగు సంస్థలను (భువనములను) కల్పించేను. అవి విధములయినవి, అయ్యది (కల్పింపఁబడినదగుటచే) కల్పమని నిర్వచింపఁబడినది. (74) ఆతం డే పునః పునః మరల, మరల, సర్వజీవద్భూతములను కల్పముల యొక్క ఆరంభమున సృజనకర్త. సష్ట, ఆ మహాదేవుఁడు వ్యక్తుఁడు (తెలియ బడువాఁడు) అవ్యక్తుఁడు, (తెలియబడనివాఁడు - మూర్తిమంతుఁడు మూర్తి రహితుఁడు). ఏతద్ విశ్వమంతయు నాతని చేతనే సృజింపం బడినది. (75) ఈ రెండు కల్పములకు మధ్యగల సంబంధ మీ. వీధముగా వర్ణింపబడినది. ఇప్పటి యీ కల్పము ఆ రెండింటి కల్పముల మధ్య ప్రాగవ స్థితమైనది, (76) ఉన్నదున్నట్లుగా, జరిగినది జరిగినట్లు పూర్వకల్ప స్థితి సూక్ష్మముగా వర్ణింపఁబడినది. ఇప్పుడు, ఇంక, ప్రస్తుత కల్పమును గూర్చి చెప్పెదను. దానిని చక్కగా గ్రహించుము.
ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున, పూర్వభాగమున అనుషంగ పాదమున కల్పమన్వంతరాఖ్యాన వర్ణనమను ఆరవ అధ్యాయము.
Summary of chapter 6 of the Brahmānda Mahā Purana is as follows:
With majestic reverence, this section introduces the boundless cycles of cosmic time, outlining the immeasurable epochs known as Kalpas and Manvantaras. It instills a sense of profound humility in the mortal heart by detailing the vast, rhythmic breaths of the cosmos during which universes are born, sustained, and dissolved. The devoted mind is guided to look beyond transient earthly existence and meditate upon the eternal, unchanging nature of the supreme lord who governs these infinite temporal waves.