బ్రహ్మాండ మహా పురాణము
64 - నీమివంశానుకీర్తనము
సూతుఁడిట్లు చెప్పెను.
నీమివంశము నెఱుంగుము. నీమీ వికుక్షి యొక్క అనుజుఁడు, వికుక్షి జయంతమును దేవతానగరోపమమయిన విఖ్యాతనగరమును గౌతముని యొక్క ఆశ్రమ సమీపమున నిర్మించెను. ఈతని యనవాయము నందే నృపసత్తముఁడయిన జనకుఁడు జన్మించెను. మహాతేజస్వియయిన ఇక్ష్వాకునకు నిమి కుమారుఁడు ఆతఁడో ధర్మాత్ముఁడు, సర్వసత్త్వములచే నమస్కరింపఁబడువాఁడు. ఆతఁడు మహారాజయ్యెను. వసిష్టుని యొక్క శాపముచే నతఁడు వీదేహుఁడయ్యెను. (దేహములేనివాఁడు). ఆతనికి మీథియను కుమారుఁడు మూఁడు పర్వణముల కాలములో, కలిగెను. యజ్ఞము కొఱకు అగ్ని మధ్యమానమగుచుండ ‘అరణి’ యందు ఆ మహారాజుదయించెను. (అరణి - అగ్నిమధనముచేయుట కుపయోగించు కట్ట) మథనము చేయునప్పుడు పుట్టుటచే మీథియను నామ మొందెను. ఈ విధమున పుట్టుటచే నతఁడు జనకుఁడయ్యెను. (5) (జననముచే) మీధి చాల పరాక్రమవంతుండైన రాజు ఆతని పేరు ననుసరించియే ఆతని రాజధాని మీథిల యయ్యెను, ఆతనీనామాంతరము జనకుఁడు జనకుని వారసుఁడు ఉదావసువు ధర్మాత్ముఁడైన నందివర్థనుఁడు ఉదావసుకుమారుడు. సందీ వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతువు శూరుఁడు ధార్మికుండును. సుకేతుని కుమారుఁడు దేవరాతుఁడు. ఆతఁడు ధర్మాత్ముఁడు. మహాబలుఁడు దేవరాతుని కుమారుఁడు బృహదుక్తుఁడు బృహదడ్డుని తనయుఁడు మహావీరుఁడు మిక్కిలిప్రతాపవంతుఁడు మహావీరునికుమారుఁడు ధృతిమంతుఁడు, ఈతనికుమారుఁడు సుధృతి. సుధృతికి కుమారుఁడు ధృష్టకేతువు, ఇతఁడు ధర్మాత్ముడు పరంతపుఁడును దృష్టకేతువు పుత్రుఁడు హర్యశ్వుఁడు, చాలవిఖ్యాతుఁడు. హర్యశ్వునకు మరుఁడు, మరువునకు ప్రతిబింబకుఁడు, ప్రతిబింబకునకు కీర్తి రథుఁడు కుమారులు. కీర్తిరధుఁడు దేవమీఢుడుగా ప్రఖ్యాతుఁడు. దేవమీఢునకు విబుధుఁడు, విబుధునకు మహాధృతి, మహాధృతికి కీర్తిరాతుఁడు. కుమారులు కీర్తిమంతునికుమారుఁడు మహారోముఁడు, ఆతఁడు విద్వాంసుం డుగా పేరుగన్నవాఁడు.
మహారోమునకు స్వర్ణరోముఁడు సువిఖ్యాతకుమారుడు. స్వర్ణ రోముని కుమారుఁడు హ్రస్వరోముఁడు. ప్రస్వ రోముని కుమారుఁడు సీరధ్వజుఁడు. ఇతఁడు విద్వాంసుఁడు. రాజు భూమిని దున్నుచుండ సీత .ఐయల్వెడలేను.. ఆమె యశస్విని. ఆమె రాముని మహిషి సాధ్వి, సువ్రత. నియతవ్రత.. వైశంపాయనుడిట్లడిగెను. యశస్వినియైన సీత భూమి దున్నబడుచుండ నెట్లు పుట్టెను? రాజు ఆ క్షేత్రమునెందులకు దున్నెను? సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకై యజ్ఞారమైన యగ్ని (మంటపము) కొకైన స్థలము యజ్ఞవీధిననుసరించి రాజుచే దున్నబడగా సీతఅందుండి బహిర్గమీంచెను. సీరధ్వజుని సోదరుఁడు (తమ్ముఁడు) భానుమంతుఁడను మైథిలేయుఁడు. ఆతఁడే కుశ ధ్వజుఁడు ఆతఁడు కాశీనరగమున కధిపతి ఆ కాశీరాజయిన భానుమంతునకు ప్రతాపవంతుఁడయిన ప్రద్యుమ్నుఁడు పుత్రుఁడు. ఆతని పుత్రుఁ ... డు ముని. ఆతనికి ఊర్జవహుండు జన్మించెను. ఊర్జవహునకు సనధ్వజుఁడు. ఆ సనధ్వజునీ కుమారుఁడు శకునీ . శకుని పుత్రుఁడు స్వాగతుఁ డు. స్వాగతుని పుత్రుఁడు సువర్చసుఁడు, అతని కుమారుఁడు-సుతోయుఁడు, సుతోయునకు సుశ్రుతుఁడు, సుశ్రుతునకు. జయుఁడు, జయునకు వీజయుఁడు వీజయునకు క్రతువు, క్రతువునకు సునయుఁడు, సునయునకు వీతరావ్యుఁడు, వీతరావ్యునకు ధృతి, ధృతికీ బహుళాశ్వుఁడు, బహుళాశ్వునకు కృతి కుమారులు. మహాత్ములయిన జనకుల సంతతి కృతితో సమాప్తి పొందెను. ఈ విధముగా మిథిలావంశము చెప్పఁబడినది. ఇక చంద్రవంశము నెఱుంగుఁడు.
ఇది నీమీవంశానుకీర్తనను అరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 102 of the Brahmānda Mahā Purana is as follows:
Looking ahead into future cosmic time, this section reverently names the seven holy seers appointed to guide humanity in the upcoming Manvantara epochs. It describes their future penances, spiritual qualifications, and the specific wisdom they will preserve for future worlds. The faithful listener takes comfort in knowing that the divine light of spiritual guidance will never be extinguished in any future age.