బ్రహ్మాండ మహా పురాణము
29 - హోమధేనువు కొఱకు పోరాటము - జమదగ్ని చంపఁబడెను హోమధేనువ దృశ్యమయ్యెను
వసిష్ఠుడు చెప్పెను.
మంత్రియైన చంద్రగుప్తునితో క్రోధోదగ్రుఁడయి జమదగ్ని మరల పలికెను. “బ్రాహ్మణస్వము బుద్ధిమంతుఁడైన వానిచే నపహరింపం ఐడరాదు. ఓ దురాత్మా ! బలాత్కారముగా నా గోవును తీసికొని పోవుటచే పాపము నొందుదువు. నీకు జీవిత సమాప్తి వచ్చినదని తలంతును. కానిచో నీ పని నీవు చేయవు, చెప్పుచుంటిని. ఆలకించుము, బలాత్కారముగా గోవును తీసికొని పోవనెంచినచో ఎన్నడును అయ్యదీ నీకు శక్యము కాదు. ఒకవేళ ఆ ధేనువే స్వయముగా వచ్చి కలిసినచో రాజు నశించును. దానమిచ్చుటకు బదులుగా తపస్వులయిన బ్రాహ్మణుల ధనము యొక్క అపహరణమున శతవర్షములు, జీవింపఁదలంచిన వాఁడెవఁడు, అర్జునుఁడు దక్క కోరును? ఈ విధముగా పలుకబడి, మరణ కాలమాసన్నమయి కాలచోదితుఁడయిన ఆ మంత్రి సంక్రుద్దుఁడయి, ఆ ధేనువును దృఢమయిన పాశములచే బంధించి బలాన్వితుఁడై లాగెను. భవిష్యత్కర్మ ప్రచోదితుఁడయి జమదగ్ని క్రోధావిష్ణుఁడయి ధేనువును పట్టి కట్టి లాగుచున్న మంత్రిని అడ్డగించెను. కంఠములో ప్రాణముండగా నీ ధేనువును విడువను అని కోపముతో జమదగ్ని మహాముని ఆ ఆవును కంఠమునందు బాహులతో గట్టిగా పట్టుకొనెను. అంత చంద్రగుప్తుం డు క్రోథావిష్ణుఁడయ్యెను. ఆతఁడు సహజముగా అతిక్రూరుఁడు. దయారహితుఁడు. తన సైనికులకు “ఆతనిని గెంటివేయుఁడని ఆజ్ఞాపించెను. రాజాజ్ఞచే రాజకింకరులు ఋషి అప్రధృష్య శరీరుఁడయినను (ప్రపంచమున నెవ్వరిచే జయింపబడని శరీరము కలవాడయినను) ఆతని చుట్టును అంతటను చుట్టిముట్టి బలాత్కారముగా భాగిరి. వారా మునీని దండములతో మాదిరి. కశలతో (కంచీకర్రలతో) బాదిరి, కత్తులతో కొట్టిరీ, పీడికిలి పోటులతో పొడిచిరి. అంతియేకాక ఆ మునీంద్రుని ధేనువు దగ్గర నుండి దూరముగా లాగుకొని పోయిరి. ఆ ముని తద్విధముగా కొట్టబడినను, ఎక్కువగా వ్యధితుఁడయినను, క్రోధోదగ్రుఁడు కాలేదు. క్షమాన్వితుఁడై యుండి పోయెను. క్రోధమునకు తావీయ కుండుటయే కదా మహామునుల పరమధనము. ఆతఁడో తన తపశ్శక్తిచే ప్రపంచము నంతటినీ రక్షించుటకు కానీ సంహరించుటకుకానీ సమర్థుఁడు. ఆతఁడు తన తపోనాశనమును నెంచుకొనీ యట్టిపనీ చేయలేదు. పూర్వము జమదగ్ని అత్యంత క్రోధనుఁడు. కాని తన తల్లి కొఱకు రాముడోతనిని ప్రసాదితుని చేసెను. అందుచే ఆ మహాతపస్వి శాంతి మంతుఁడయ్యెను.
శరీరమంతయు ఎముకలతో చూర్ణీతమగునట్లు అత్యధికముగా కొట్టఁబడి మహాతేజస్వియయిన జమదగ్ని అచేతనుఁడై భూమిపై పడెను. ఆ ముని నేల కొరగగా శంకారహితుఁడై ఆ చంద్రగుప్త దురాత్ముఁడు “బలాత్కారముగా ధేనువును తీసికొని రండు” అని సైనికుల కాజ్ఞాపించెను, అంత వారు పాశములతో దూడతో కూడ ధేనువును దృఢముగా బంధించిరి. కంచీ కర్రలతో కొట్టిరి. 'దానిని తీసికొని పోవందలంచి లాగుకొని చనిరి. చాలమందిచే బలాత్కారముగా నీడ్వబడి కశాదుల లగుడములచే కొట్టంబడి ఆ ధేనువు కోపోద్రిక్తయయ్యెను. కశాఘాతములచే వ్యధనొంది అత్యధిక కోపముతో గూడి ఆకర్చించు త్రాళ్లను తెంచుకొని తన్ను తావిమోచన మొందెను. ఆ ధేనువు విముక్త పాశములు గలదైనదీ, దానీని రాజసైనిక బలములు సర్వత్ర చుట్టుముట్టిరి. అంత ధేనువు 'హుంహారవము' చేయుచు, కోపముతో, వారందరిపై పడెను. కొమ్ములతో, తోకతో, డెక్కల చిగుళ్లతో. పొడవబడి, కొట్టబడి, పిప్పిగా తొక్కబడి రాజసైన్యమంతయు పలాయన మంత్రము పఠించెను, ఆ ధేనువు వెంటనే సైనికుల నెల్లరను పరుగిడఁజేసి, అందరు అన్ని భూతములు కండ్లప్పగించి చూచుచుండగనే ఆకాశమున కెగసెను. అంత భగ్న సంకల్పులు, గాయముతో పుండ్లు పడిన శరీరములు గలవారయిన సైనికులు దయాశూన్యులై బలాత్కారముగా వత్సమును బంధించుకొని వెళ్లిరి. హోమధేనువు లేకుండగా వత్సము నొక్కదానినే తీసికొని పాపియైన (చంద్రగుప్త) మంత్రి తన సైన్యముతో త్వరగా రాజసన్నిధికి వచ్చేను. రాజు దగ్గరకు వెళ్లి ఆతనికి నమస్కరించి, జరిగినదంతయు మంత్రి భయముతో విన్నవించెను.
ఇది వాయుప్రొక్తమైన బ్రహ్మాండపురాణములతో మధ్యమభాగమున తృతీయోపాద్ఘాతమున అర్జునోపాఖ్యానము నంధు ఇరువధి తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 67 of the Brahmānda Mahā Purana is as follows:
In deeply evocative narrative prose, this chapter narrates the famous romantic legend of king Purūravas and the celestial nymph Urvashī. It explores the themes of divine love, separation, and eventual spiritual realization, showing how intense earthly affection can be transformed into sacred devotion to the divine fire. The devout reader is inspired to redirect all human longing toward the ultimate, eternal beloved, the supreme lord of all worlds.