బ్రహ్మాండ మహా పురాణము
16 - భారత వర్ణనము
ఋషి రువాచ :-
సూతుఁడిట్లనెను :
శుభవంతమయిన భారతవర్షమున ఉపవర్షముల సృష్టి క్రమము ఈ విధముగా పరమతత్వజ్ఞులచే దర్శింపఁబడినది. మీకిఁక నేనేమి మరల వర్జింపవలయును."
ఋషి యిట్లనెను :
ఏ భారతవర్షము నందు, స్వాయంభువాదులయిన చతుర్దశ మనువులు ప్రజా సంసృష్టి యందు మరల నుద్భవించిరో ఆ భారతవర్షమును గూర్చి యథకముగా వినగోరెదము. ఓ మహానుభావ! దానిని మాకు వివరించుము. వారీ వాక్కులను విని రోమహర్షణుఁడిట్లనెను. మీకు భారత వర్ష ప్రజల గూర్చి వర్ణించెదను. ఈ భరత వర్షము చిత్రమయినది. ఈదీవియొక్క మధ్యము శుభా శుభకర్మ ఫలముల స్థానము. (4) ఏదీ సముద్రమునకుత్తర భాగమునను, హిమవత్పర్వతమునకు దక్షిణముననున్నదో ఆ వర్షము (దేశము) నకు భరతవర్షమని పేరు. అందలి ప్రజలు భారతులు. (5) ప్రజలను భరించుట జేసి మనువు భరతుడని చెప్పబడెను. ఈ నీరుక్త వచనము ననుసరించి అయ్యది భారత వరము లుగా స్మరింపఁబడుచున్నది. (6) ఇందుండియే స్వర్గము, మోక్షము కలుగుచున్నవి. ఇందుండియే మధ్యలోకములు, అంతిమలోకములు ప్రజలకు కలుగును. ఇంకెచ్చటను భూమియందు మర్త్యులకు కర్మ విధింపఁబడియుండలేదు. (7) ఈ భరత వర్షమున తొమ్మిది భోగములున్నవని గ్రహించుము. అవి సముద్రములచే విడదీయబడినవి, ఒక విభాగము నుండి వేక విభాగమునకు ప్రయాణించుట అసంభవము. (8) ఆ తొమ్మిది విభాగములు - (1) ఇంద్ర ద్వీపము (2) కేశరుమంతము (3) తామ్రవర్ణము (4) గభస్తిమంతము, (5) నాగద్వీపము (6) సౌమ్యము (7) గాంధర్వము (8) వారుణము. ఇవి సముద్రమున మునిగినవి. (9) ఇదీ ఇప్పటి భారతదేశము మూడువైపుల సముద్రములున్నది. ఈ భరతవర్షము దక్షిణోత్తరముగా, గంగానదీజన్మలస్థానము నుండి కన్యాకుమారి వరకు వెయ్యి యోజనములు విస్తరించునది. ఈ విస్తీర్ణము ఉత్తరమున అడ్డముగా తొమ్మిది వేల యోజనములు.(9-11) (ఒక యోజనము = 12 కిలోమీటర్లు).
ఈ ద్వీపము యొక్క సరిహద్దు ప్రదేశములు అన్నియును, సర్వత్ర మ్లేచ్చులచే అధివసింపఁబడినవి. తూర్పు సరిహద్దులలో కిరాతులు, పశ్చిమ సరిహద్దులలో యవనులు నున్నారు. (12) మధ్య ప్రదేశములలో బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైశ్యులు నివసింతురు; అక్కడక్కడ చదురముదురుగా శూద్రులుందురు. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులతో, క్షత్రియులు ఆయుధములతో, వైశ్యులు వర్తకవ్యహారములతో స్థిరపడి వ్యవహరింతురు. (13) ఈ వీవీధ వర్ణముల వారికి పరస్పరము ధర్మార్థకామ విషయములపై ఆధారపడి స్వకర్మలయందు సంబంధములు కలవు. ఆశ్రమ చతుష్టయము నందు, పంచముల విషయమున, యథావిధి ఆచారము నిర్వహింపఁబడుచుండును. ఇయ్యది స్వర్గాపవర్గార్థ ప్రవృత్తి. మానవ సంబంధమయినది. (15) తొమ్మిదవ విభజనముగా చెప్పుఁబడినది ఒక ద్వీపము. అయ్యది తిర్యక్కుగా (అడ్డముగా వ్యాపించినది. దానీనీ సంపూర్ణోముగా నెవ్వఁడు జయించునో అతనిని సమ్రాట్టు అందురు. (16) యథార్థముగా ఈ లోకము సమ్రాట్టు. అంతరిక్షమును విరాట్గా స్మరింతురు. ఈ లోకమును స్వరాట్టుగా స్మరింతురు. తరువాత వీనినీ గూర్చి విస్తరించి చెప్పెదను. (17) ఇందు విశ్రుతములయిన ఏడు కుల పర్వతములున్నవీ, అవి :- మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋష్య పర్వతము, వింధ్యము, పారియాత్రము - ఈ యేఁడు కుల పర్వతములు. పోనీ సమీపమున వేలకొలది ఇతర పర్వతములు కలవు. (18) అవీ అవిజ్ఞాతములు. అవి మిక్కిలి సారవంతములు; మిక్కిలి విపులములు; వాని శిఖరములు చిత్రములయినవి. అవి పర్వతశ్రేష్ఠమయిన మందరము, వైహారము, దుర్జురము, కోలాహలము, ససురసమయిన మైనాకము, వైద్యుతము, వాతంధమము, నాగగిరి, పాండుర పర్వతము, (21) తుంగప్రస్తము, కృష్ణగిరి,
గోధన పర్వతము, పుష్పగిరి, ఉజ్జయంతము, రైవతకశైలము, (22) శ్రీ పర్వతము, చిత్రకూటము, కూటశైలము. వీనికంటె అన్యములయిన పర్వతములున్నవి. అవి వీనికంటే. హ్రస్వములు (చిన్నవి). అపరిజ్ఞాతములు; వానీపై నాధారపడి జీవించు వ్యక్తుల సంఖ్య స్వల్పము. (23) వీనితో వ్యాప్తమయిన ప్రదేశములు మధ్యమధ్య ఆర్యులచే అందందు మ్లేచ్చులచే నివసింపఁబడుచున్నవి. గంగా, సింధు, సరస్వతీ నదుల జలములు వీరిచే త్రాగుటకుపయోగీంపఁబడుచున్నవి. (26) శతద్రు, చంద్రభాగ, యమున, సరయు, ఇరావతి, వితస్తా, విపాశా, దేవికా, కుహు, గోమతి, ధూమపాప బుద్బద, దృషద్వతి, కౌశికి, త్రిదివ, నిఫ్టీవి, గండకీ చక్షుర్లోహిత " మున్నగు నదులు, పామవత్పాదము నుండి నిస్సతములు (పుట్టి ప్రవహించునవి) (27) వర్ణాశ, నందన, సదానీర, మహానది, వేదస్మృతి, వేదవతి, వృతఘ్ని, సింధు, పాశ, చర్మణ్వతి, నూష, వీదీశ, వేత్రవతి, క్షిప్ర, అవంతీ - అనునదులు పారియాత్ర పర్వతముల నాశ్రయించుకొని యుత్పన్నములయినవి. శోణ, మహానదము, నర్మదా, సురస, క్రియ (29) మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, శ్యేన, కరమోద, పిశాచిక, చిత్రోపల, విశాల, వంజుల, పోస్తు వాహినీ, సనేరుజ, శుక్తిమతీ, మంకుతి, త్రిదివ, క్రతు - అను నదులు ఋక్షవంతము నుండి పుట్టి ప్రవహించునవి. అవి శివంకరములు. పవిత్రములు; వాని జలములు స్ఫటికమణులవలె ప్రకాశించు స్వచ్ఛనీరములు, (31)
తాపీ, పయోష్టి, నిర్వీంధ్యా, సృపా, నిషధానదీ, వేణీ, వైతరణీ, క్షిప్రా, వాలా, కుముద్వతీ, తోయ, మహాగౌరీ, దుర్గా, (దుర్గా - తరించుటకు కష్టమయినది, అన్నశిలా (అంత శీలాయై యుండవచ్చును. అంత - లోన - శిలా రాళ్లు కలిగినది) ఈ దుర్గా అన్నశీలా నదీ ద్వయము మహాగౌరీనది యొక్క యుపనదులు.) అన్నశిలా అను నదులు పవిత్రములయినవి, పుణ్యజలములు; శుభకంరములు. వింధ్య పర్వత పాదముల నుండి పుట్టినవి. (33) గోదావరి, భీమరథి, కృష్ణవేణి, బంజులా, తుంగభద్ర, సుప్రయోగ, బాహ్య, కావేరి - అను నదులు సహ్య పర్వతముల పాద పర్వతముల నుండి పుట్టి ప్రవహించునట్టివి. అవి దక్షిణముగా ప్రవహించును, దక్షిణ ప్రవాహములు, (34, 35) కృతమాల, తామ్రపర్ణీ, పుష్పజాతీ, ఉత్పలావతి - అను నదులు మలయ పర్వతముల నుండి పుట్టినవి. ఆవి శుభములు, శీతజలములు (36) త్రిసామ, ఋషికుల్య, బంజుల, త్రిదివా, బలా, లాంగూలీని, వంశధర నదులు మహేంద్ర పర్వతతనయలుగా స్మరింపఁబడుచున్నవి. (37) ఋషి కుల్యా, కుమారీ, మందగ, మందగామినీ, కృపా, పలాశినీ నదులు శుక్తిమంత పర్వతము నుండి పుట్టినవిగా స్మరింపఁబడుచున్నవి. (38) ఈ నదులన్నియు గంగా సరస్వతీ తుల్యములు. ఇవీ యన్నియును సముద్రగాములు. (సముద్రమును చేరును. ఇవి యన్నియు విశ్వజననులుగా భావింపం బడుచున్నవి. ఇవి జగత్పాపములను హరించును. (39) ఈ నదుల యొక్క ఉపనదులు, ఇతరము లనేకములు వందలుగా వేలుగా నున్నవి. కురు, పాంచాల, శాల, మాద్రేయ, జాంగల, సౌరసేన, (శూరసేన) భద్రకార, బోధ, పటచ్చర, మత్స్య కౌశల్య (కుశల్య), సౌశల్య, కుంతల, కాశి, కోశల, గోధ, భద్ర, కళింగ, మగధ, ఉత్కల - మున్నగు దేశములు రాజ్యములీ నదీ తీరముల స్థాపింపఁబడినవి. అవి యన్నియు కీర్తిమంతములు. (42)
సహ్య పర్వతము యొక్క యుత్తరాంతమునందు ఎచ్చట గోదావరీ నది ప్రవహించుచున్నదో, ఆ ప్రదేశము సర్వ పృథివీ భాగమునందును మనోహరమైన ప్రదేశము. (43) అచ్చట గోవర్ధనమను పేరు గల నగరమును రాముఁడు నిర్మించెను. అచ్చట దివ్యములు, అమరములైన వృక్షములు, రామునకు ప్రియమైన ఓషధులు, రాముని ప్రీతి కొఱకు భరద్వాజ మహర్షి యిచ్చట నాటెను. (44) ఆందుచేతనే ఆ గోవర్ధన నామక పురోద్దేశము మనోహరమయినది. (45) తదుత్తర ప్రాంత దేశమున బాహ్లికులు, వాటధానులు, ఆభీరులు, కాలతోయకులు, అపరాంతులు, సుహ్ములు, పాంచాలురు, చర్మమండలులు, గాంధారులు, యవనులు, సింధు సౌవీరకుండలులు, చీనులు, తుషారులు, పల్లవులు, గిరిగహ్వరులు (47) శకులు, భద్రులు, కులిందులు, పారదులు, వింధ్య చూళికులు, అభీషాహులు, ఉలూతులు, కేకయులు, దశమాలికలు (48) బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రకులములు, కాంభోజులు, దరదులు, ఇతరులు ఆంగలెరాకులు, భరద్వాజులతో సహా ఆత్రులు, ప్రస్థలులు, దశేరకులు, లమకులు, తాలులు, శాలులు, భూషికులు, ఈజికులు - కలరు. ప్రాచ్యదేశస్థుల సఖుంగుము :- అంగులు, వంగులు, చోలులు, భద్రులు, కిరాతజాతులు, తోమరులు, హంసభంగులు, కాశ్మీరులు, తంగణులు, ఋల్లికులు, ఆహోకులు, హూణదర్వులు, ఆంధ్రవాకులు, ముద్గరకులు, అంతర్గిరులు, బహిర్గిరులు, ప్లవంగులు, మలదులు, మలవర్తికులు,
సమంతరులు, ప్రావృషేయులు. భార్గవులు, గోపపార్థివులు, ప్రాగ్త్యోతిషులు, పుండ్రులు, విదేహులు - వీరందరు ప్రాక్టీశీయులుగా నెంబింగ వలెను. ఇక దక్షిణాపథవాసులు. పాండ్యులు, కేరళులు, చోళులు, కుల్యులు, సేతుకులు, మూషికులు, క్షపణులు, వనవాసికులు, మహారాష్ట్రులు, మహిషికులు, కాళింగులు, ఆభీరులు, జంషీకులు, ఆటప్యులు, సారవులు, పుళిందులు, వింధ్యులు, మౌళీయులు, వైడర్బులు, దండకులు, పౌరికులు, మౌళికులు, అశ్మకులు, భోగవర్ధనులు (58) కొంకణులు, కంతలులు, ఆంధ్రులు, కుళిందులు, అంగారులు, మారీషులు, వీరందరు దక్షిణ దేశీయులు ఇంక ఇతరులను పశ్చిమదేశీయుల సైజుంగుము. (59) సూర్యారకులు, కలివనులు, దుర్గలులు, కుంతలులు, పౌలేయులు, కిరాతులు, రూపకులు, తాపకులు, కరీతులు, సర్వకరంధరులు, నాసికులు, నర్మదా నదీ లోయల యందుండు ఇతరులు, (సహ) కచ్చులు, సమాహేయులు, సారస్వతులు, కచ్ఛిపులు, సురాప్తులు, ఆనర్తులు, అరుదులు (62) వీరందరు పశ్చిమ దేశీయులు. ఇక వింధ్య వాసినులను గూర్చి దెంగుము. మలదులు, కురూపులు, మేకలులు, ఉత్కళులు. (63)
దశార్ణులు, వారిలో ఉత్తములు భోజులు, కిష్కింధకులు, తోశలు, కోశలులు లేపరులు, వైదీశులు తుహరండులు, బర్బరులు, షట్పురులు, నైషధులు, అనూపులు, తండికేరులు, వీతిహోత్రులు, అవంతులు (65) వీరందరువింద్య పర్వతవాసులన జానపదులు ఇంక పర్వతాశ్రయుల గూర్చి చెప్పెదను. (66) నివీరులు, హంసర్గలు, కుపధులు, తంగణులు, శకులు, అషప్రాపరణులు, ఊర్డులు, దుర్వులు, హూహుకులు, (67) త్రిగర్తులు, కుండలులు, కిరాతులు, తామరులు. భరత వర్షమున నాలుగు యుగములున్నవని ఋషులు చెప్పిరి. కృతయుగము, ద్వాపర యుగము, తీష్యయుగము (కలియుగము) ఇక ముందు వానిని గూర్చి విశేషముగా చెప్పెదము.
ఇది పాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున హార్వభాగమున ద్వితీయానుషం పాదమున భారతవర్ణన నామక షోడశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 16 of the Brahmānda Mahā Purana is as follows:
In a deeply reverent tone, this chapter sings the glories of Bhārata, the sacred land of virtue where mortal souls are blessed to perform pious deeds and attain spiritual liberation. It highlights the unparalleled sanctity of its holy rivers, venerable mountains, and the righteous nature of its inhabitants, framing the land as the ultimate theater for divine grace. The devout reader is filled with immense gratitude and love for this sacred geography, which eternally nurtures the seeds of dharma and ultimate salvation.