బ్రహ్మాండ మహా పురాణము
43 - భార్గవచరితమ్
వసిష్ఠుఁడిట్లు పలికేను :
ఓ రాజా ! వారందరు ప్రేమార్ధ హృదయములలో నచ్చట నుండగా, రాముఁడు భవాని యొడి నుండి లేచి, కృతాంజలుఁడై, నియమ బద్ధుఁడై మనో నిర్మలత్వముతో, ఎట్టి విశేషములు లేక, విశేషములు కలిగినట్టి వారిని, ద్వైతమును బొందియున ద్వయమై సంపూర్ణమై నిర్గుణమయ్యు సగుణాత్మయయిన పరమాత్మను భక్తియుక్తుఁడై స్తోత్రము చేసెను.
రాముఁడిట్లు స్తుతించెను :
ఈ విశ్వము సప్త ప్రకృతి వికృతుల పుట్టినది, తద్వైభవమును కొలుచుటకు, (ఎలుంగుటకు) నాకెంతటి అనుభవమున్నది. (లేదు) అవిదితమయిన తనువు నామము గల (ఈశ్వరుని) స్వరూపము ప్రపంచమున సర్వాభీష్టములయిన వస్తువుల స్థితికి ఆధారమయినది. అందుచే పూర్ణకాముఁడ నయిన నన్ను భగవద్భక్తుని, సర్వకామములను దీర్చిన పార్వతి రక్షించుగాక. ఏ ప్రధానము ప్రకటిత గుణభావము గలిగినది, కాలసంఖ్యావిధానము కలిగినది, సకలభవన నిదానమయినది, ఏయది ప్రధానము దానిని స్తోత్రము చేయుదును. ప్రపంచమందలి సర్వకృతక దృక్పాతములకు ఏనీ దృక్పసారము హేతువో, ఓ జననీ ! అయ్యది నన్ను ఇప్పుడు రక్షించుగాక. దనుజ కుల సముదాయమును వినాశనము చేయునది, దేవతల దుఃఖ తాపమును పోగొట్టునదియు, ఎయ్యది ప్రథమ కులములను వికసింపజేయునదియు, ఏయది సర్వశాస్త్రముల వికసింపజేయునది, ఎయ్యదీ కాశీ నగరమును తక్షణము నిర్మించేనో, ఏయది భక్తులకెల్లకోర్కెల నిచ్చునదియో, ఎయ్యది వరుణుని జయించెనో ఆ భగవంతుఁడయిన కార్తికేయుఁడు షణ్ముఖుఁడు, నన్ను సర్వదా రక్షించుగాక,ఈశ్వరుని సమీపమునందు నివసించువాఁడు, ఎవఁడు శ్రీకృష్ణుని సేవయందు విలసించువాఁడు తనకు నమస్కరించిన భక్తజనులను ప్రకాశింపచేయువాఁడు, ఎవఁడు గోపకన్యకలను నవ్వించువాడో, ఎవఁడు ఈశ్వరునిచే గౌరవింపఁబడునో గోపీప్రాణనాథుని యందేవఁడు ఏకైకభక్తివిభవుఁడో, ఎవఁడు విదిత బహువిధానుండో (ఔచిత్యక్రియాకలాపముల నెఱింగినవాఁడు) అట్టి విఘ్నేశ్వరుఁడు కీర్తిహరుఁడు కాకుండుగాక.ఎవ్వడు తన మనస్సును నియమించుకొనెనో, తన మనస్సును సర్వప్రభుఁడయిన ఈశ్వరునియందు లగ్నమొనర్చెనో, తన భక్తుల యొక్క విఘ్నముల నెవ్వఁడు పారద్రోలెనో, అనేకములయిన దురిత సమూహమును ఎవ్వడు హరించెనో, ధనహీనులకు ఎవ్వఁడు జ్ఞానమును ప్రసాదించునో, ఎవఁడు సకలగుణ గరిష్ణుండో, ఎవఁడు రాధికారకమున నివిష్ణుఁడో యతఁడు శ్రీకృష్ణుఁడు, అగాధమయిన మత్కృతాపరాధమును తొలగించుగాక. జగత్తు యొక్క ఉద్బవ స్థితి, లయముల యందు ఎవ్వతే ఆరాధింపఁబడునో, ఎవ్వతే, ప్రభుఁ డయిన కృష్ణుని ముఖము నుండి బయల్పడు ప్రేమ ను గ్రహించుటకు ఆధారమయిన శబ్దమును ప్రజలు అవగాహన చేయునట్లోనరించునో, ఎవతే రాసక్రీడా సామ్రాజియో, ఎవతే రసికేశ్వరియో రసికులకు అధిపతురాలో) ఎవతే, తన భర్తయొక్క హృదయసంసక్తురాలయి, తన యందు ప్రీతి గలిగిన వారలకు ఆనందమును కలిగించునో ఎవ్వతె రాధయనీ కీర్తింపం బడునో యట్టీ నాయకురాలు అవనతుఁడనయిన నన్ను రక్షించుగాక.(8)
ఎవతేయొక్క గర్భము నుండి అతివిరాట్ సముద్భవించేనో, విరాట్ యెవతే యొక్క ఆంశయగునో, ఆమె నా యెడ ప్రసన్నరాలగుగాక, సర్వచరాచర ప్రపంచము ఎవని నాభి కమలము నుండి యుద్భవించిన బ్రహ్మ సృష్టింపబడెనో, ఆ బ్రహ్మ ఏకాంత ప్రదేశమున నుపదేశింపం బడెనో, ఎవని యొక్క రోమకూపముల యందు బ్రహ్మాండములు ప్రకాశించునో, తత్ర్పభువు యొక్క జననియైన యామె యెల్లప్పుడు నాకు ప్రసన్నురాలగుత. సమస్తమైన చరాచర జీవరాశులకు జగద్వ్యాపి, విభుఁడు నయిన కృష్ణుఁడు ప్రభువు, ఎవఁడు సర్వవ్యాపియో, ఎవఁడు భవదల్జియో, ఎవడు విజ్ఞానమో, యెవఁడు ఆనందమో, ఎవ్వడు ప్రేమాంధయైన రాధతో విలసిల్లునో, ఎవఁడు పూర్వతముఁడో, అట్టి కృష్ణుఁడు నా యందు దయాపూర్ణుండగుగాక, తన్మూలమున నేను సుకృతి నగుదును, అంతియేకాక ఆనందమున లీనుండనగుదును.
వసిష్ఠుఁడనేను :-
పరమాత్మ నీవిధముగా స్తుతించి పరశురాముఁడు ఆగెను. విజ్ఞాతాఖిలతత్త్వార్థుఁడు వెండ్రుకలు గగుర్పొడువ తన కోరికలు సఫలీకృత ములయినట్లు తలంచెను. అంత, కమలలోచనుఁడు కృష్ణుఁడు, భక్తితో నమస్కరించీ ఎదుట నిల్చిన కృపాపాత్రుఁడయిన భార్ణవునితో నిట్లనెను.
కృష్ణుఁడనెను :-
ఓ భార్గవేంద్ర ! నా ప్రసాదము వలన నీ వీపుడు సిద్ధుఁడవైతివి. ఓ వత్స ! ఇప్పటి నుండి నీవు లోకమున శ్రేష్ఠతముఁడవు కమ్ము. పూర్వము విష్ణుపదాశ్రమమున నాచే నీకు వర మీయఁబడినది. తత్సర్వము క్రమముగా కాలక్రమమున సంపన్నమగును. దీనుల యందు శ్రేయము ఉత్తమము కోరువానియందు దయావిధేయుఁడవు కమ్ము. నీవు యోగము సాధించుము, శత్రువుల నీగ్రహ మొనర్చుము. తేజస్సు, బలముచే, జ్ఞానముచే, యశస్సుచే లోకమునందు త్వత్సముఁడు లేడు. నీవు సర్వశ్రేష్ఠతముఁడవు కమ్ము ! ఇంక స్వగృహమున కరుగుము, పితృ శుశ్రూషయొనర్పుము. అర్ఘకాలమున తపస్సాచరింపుము. తన్మూలమున సిద్ది నీకరస్థితమగును. రాధికేశ్వరుఁడు రాధిక తొడనుండి లేవదీసి గణేశ్వరుని, గాఢముగా ప్రేమతో కౌగిలించుకొని రామునితో మైత్రి నొనర్చెను. అప్పుడు రామ గణేశ్వరులిర్వురు కృష్ణాజ్ఞచే సంప్రీతులయిరి. ఆ సమయములో కృష్ణుని ప్రియసతి రాధ ప్రసన్నాస్యయు ముచొన్వితయునై వారిరువురకు వరము లొసంగెను.
రాధ ఇట్లనెను (పార్వతితో)
నీ కుమారు లిర్వురు సర్వ జగత్తునకు నమస్కారార్హులు. దురోథరులు ప్రియావహులు. అంతకు మించి నా భక్తులు. మీ సొమముల నుచ్చరించి యెవ్వరే కార్యముల నాచరింతురో వారా కార్యముల సిద్ది పొందెదరు. మత్రసాదము వలన సర్వము సిద్ధించును. 'బిడ్డా ! రామ! నీ వలన ప్రసన్నాత్మురాల నైతిని. నీకేమి వరమిచ్చెదను? ఆమెతో పరశురాముఁడు దూరముగా భయమును పారద్రోలి ఇట్లనెను. ఓ తల్లీ ! జస్మొంతరసహస్రములందు నేను ఏ జన్మల నుద్భవించినను కృష్ణునకు, మీకును భక్తుండను కావలయును. కృష్ణుని మిమ్మిద్దరను ఎట్టి భేదము లేక దర్శించెదను ఇట్టి వరమొసంగుము.
పార్వతీ ఇట్లు పలికేను :
అట్లే యగు గాక. భవులకు కృష్ణునకు నీవు భక్తుండవు. చిరంజీవ, మా ప్రసాదమున ఓ సువ్రతా. ఆయుష్మాన్ భవ. అంత ధరాధీశుఁడు (పరమేశ్వరుఁడు) ప్రసన్నాత్ముఁడై నమస్కరించిన వరారుఁడగు భార్గవేంద్రునితో ఇట్లనెను.
శివుడనేను
రామ ! నీవు నాకు భక్తుఁడవు. అందుచే వరమిచ్చితిని. నేనిచ్చిన వరము నీకు ఫలవంతమగును. అది సత్యము అది ఎన్నడు అన్యథా కాదు. ఇప్పటి నుండి ప్రపంచమున నీకంటే బలవత్తరుఁడు లేడు. నీకంటే తేజస్వియును లేఁడు.
వసిష్ఠుఁడనెను :
దామోదరుఁడు ఈశ్వరుని యొక్క నగనందీని యొక్క సెలవుగైకొని రాధతో గోలోకమున కరిగెను. అంత ధర్మాత్ముఁడయిన రాముఁడు, భవానీ భవులను పూజించి నమస్కరించి ప్రదక్షిణమాచరించెను. గణేశునికి కార్తికేయునికి నమస్కరించి వారినడిగి, అకృతణునితోకూడ గృహము నుండి రాముఁడు బయలుదేరెను. నిష్క్రమించివేడలుచు భవానీభవుల కభివాదన ప్రదక్షిణలను జేసెను. తరువాత నందీశ్వరాదిగణములచే రాముఁడు నమస్కరింపబడెను. అత్యంతముదమున స్వగృహమున కతడరిగేను.
ఇదీ వాయుప్రోక్తబ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవ చరితమున నలుబదిమూడవ అధ్యాయము.
Summary of chapter 81 of the Brahmānda Mahā Purana is as follows:
In a dramatic climax, this chapter details the fierce battle between Parashurāma and king Kārtavīrya Arjuna after the king's sons unlawfully stole the sage's sacred cow. It describes Parashurāma vanquishing the thousand-armed king in mortal combat, liberating his soul and punishing royal arrogance. The narrative powerfully reminds the reader that even the most powerful monarch cannot escape divine justice when violating the sacred principles of righteousness.