బ్రహ్మాండ మహా పురాణము
15 - శ్రాద్ధకల్పమున బ్రాహ్మణపరీక్ష
ఋషులిట్లనిరి.
ఓ సూత ! శ్రేయోదాయకమయిన శ్రాద్దకల్పము నీచే చెప్పబడినది. ఋషులచే ప్రకీర్తితములయిన శ్రాద్దకల్పములు మేము ఏంటిమీ. తచ్ఛాఛకల్పము అతి విస్తృతమయినది. వివరముగా చెప్పఁబడినది. ఓ మహాప్రాజ్ఞ ! ఆ ఋషి యొక్క మతమును పూర్తిగా చెప్పుము.
సూతుఁడిట్లు పలికెను.
ఓ బ్రాహ్మణులారా ! శ్రాద్దమును గూర్చి ఆ ఋషి యొక్కయభిప్రాయ మేదియో వివరించెదను. విస్తరించి చెప్పెదను వినుఁడు. ఇంతకు పూర్వమే శ్రాద్దమును గూర్చి చెప్పితిని. మిగిలినది బ్రాహ్మణ నిర్ణయ పరీక్ష, దానిని చెప్పెదను. (4) బ్రాహ్మణులు అన్ని సమయములందును పరీక్షింపఁబడరాదు. కాని పితృదైవకార్యములందు బ్రాహ్మణ పరీక్ష నియతముగా చేయుట పవిత్రమనీ ఉత్తమ కార్యమని తెలియబడుచున్నది. (5) ఎవని యందు దోషములు కనఁబడినవో యతఁడు కార్యముల నుండి వివర్జితుఁడు. ఆతనితో కలిసి వసించుట వలన నేవని దోషములు తెలియునో ఆతనిని తప్పక ప్రయత్న పూర్వకముగా వర్ణింపవలయును. (6) శ్రాద్ధ విషయమున పండితుఁడు పరిపూర్ణముగా అవిజ్ఞాతుఁడు క్రొత్త వాఁడునగు బ్రాహ్మణుని నిశీతముగా పరీక్షింపరాదు. ఏలయన, చాలమంది సిద్ధులు విప్ర రూపమున భువిని సంచరించుచుందురు. అందుచే, వచ్చిన యతిథిని బద్ధాంజలియై గౌరవముతో యజమాని యెదుర్కొనవలయును, ఆతనిని అర్ఘ్యపాద్యాదులతో అట్లే అభ్యంజన స్నాన భోజనములచే పూజింపవలయును. చతుస్సాగర ముద్రితమయిన యీ భూమియందు, యోగేశ్వరులు, దేవతలు, నానారూపములలో సంచరించెదరు. అట్లు చేయుచు సామాన్య ప్రజలను వారు ధర్మమును నిర్వహింప చేయుదురు, (9) అందుచే, ఆత్మనిగ్రహము గలిగిన వాఁడు (యజమాని, దాంతుఁడు) అతిథిని అధికముగా గౌరవించి, వివిధ వ్యంజనములతో గూడిన భోజనము సమకూర్చవలయును. వారిని గూర్చి, వారినట్లు గౌరవించిన గలుగు ఫలమును గూర్చి చెప్పెదను. అతిథిని పాలతో గౌరవించిన 'అగ్నిష్టోమ' యాగములను జేసిన ఫలితమందును. అతిథిని పాయసాన్నముతో గౌరవించిన ఆ కర్త 'ఉక్త మాచరించిన ఫలిత మొందును. అతిథిని నేతితో గౌరవించిన, షోడశీసత్రఫలీతమందును. అతీథినీ మధువుచే (తేనె) పూజించిన 'అతిరాత్ర' యాగమాచరించిన ఫలిత మందును. (11) బ్రాహ్మణులను గౌరవించి శ్రద్ధతో, వారడిగిన దెల్లనోసంగిన అయ్యది కర్తకు ఐశ్వర్య మొసంగును. ఆ బ్రాహ్మణులను ఆదరించిన గృహస్థు అన్ని యాగము లాచరించిన ఫలితము నొందును. (12)
శ్రాద్ధ సమయము నందు కాని, దైవ కార్యముందుగాని సంప్రాప్మఁడైన యతిథినీ అవమానించిన వ్యక్తినీ, దేవతలు హతునిగా (శపుండైన యనాథునిగా) నిరసించి అవమానీంతురు. దేవతలు పితృదేవతలు, బ్రాహ్మణులయందతర్షితులై ఆవేశించి లోకానుగ్రహ కారణము వలన భోజన మారగించెదరు. (14) పూజింపఁబడని అతిథి దహించును. పూజింపఁబడినచో సర్వకామముల నొసంగును. అందుచే యజమానీ తనకున్న దెల్ల వ్యయమొనర్చియైన అతిథీనీ సదా పూజింపవలెను. (15) సజ్జనులకు, అభ్యాగతుఁడైన యతిథి, వాన ప్రస్థుఁడగుగాక, గృహస్థుఁడగుగాక - ఆతఁడు 'వాలఖిల్యునితో 'తుల్యుడు' యతి కూడ నట్టివాఁడే. (16) తన కోరిక ననుసరించి సంచరించు వాఁడగుట యతిథి అభ్యాగతి యనంబడును. అతిథి అపావకుఁడు. అతిధి - అతిథిగా పేర్కొనఁబడినవాఁడు ఏలయన నతనికి నిశ్చితమైన తిథి లేదు. ఇది అతిథి శబ్దార్థము. (17) క్రింద పేర్కొనబడినవారు అతిథులుగా హహ్వానింపబడరాదు. 'ప్రతి’ కానివానీనీ (ఆచార ధర్మముల సవలంబింపని వానిని) వర్ణ సంకీర్ణుం డయినవానిని, విద్యా రహితుఁడయిన వానీనీ, ఏ విధమయిన ప్రత్యేక శాస్త్ర జ్ఞానము లేనివానీనీ, సంతాన రహితుఁడయిన పానీని, దేవతల యందు విశ్వాసము లేనివానినీ, పాపరహితుఁడు కానీ వానినీ అతిథిగా గ్రహింపరాదు. (18) దేశములు తిరిగి తిరిగి దాహ పీడితుడయిన వానీని, అలసిపోయిన వానిని, భ్రాంతుఁడయిన వానిని, అధికముగా ఆకలిగొన్న వానినీ సత్కరించి, యజ్ఞ ఫలము కోరునఱఁడు ఆహార మొసం గవలేను. (19) అధికముగా సాకలిఁగొన్న వానితో 'ఏమియులేదు' అనీ యేమాత్రము వచీంపరాదు. అట్టి వానిని సత్కరించి, ఆహార మొసంగవలెను. ఈతఁడు ఎల్లప్పుడును గౌరవింపఁబడనరుఁడు. (20) శ్రాద్ధ క్రియల యందు యజమాని క్రింద నుదహరింపఁబడబోవు నట్టి వారికి ఎల్లవేళల భోజన మీడవలెను. అక్షిష్ణుఁడైన వానికీ (బాధపెట్టఁబడనివానికి) ప్రణ రహితుఁడైన వానికి (పుండ్లు, కురుపులు) లేని వానికీ కృశవృత్తి పరునకు (యోగాభ్యాస శీలికి) యాచింపని వానికి (ఇంతో అంతయో తీనుటకుండి యాచింపని వానికి) ఏకాంత వాస శీలుండయిన వానికి, ధీమంతుం డయిన వానీకి, శ్రాద్దముల యందు భోజనమిడవలయును. (21) “నీకు నేనన్నము పెట్టను - భోజన మీయను” అని చెప్పు దురాత్ముఁడు నూరు జన్మలెత్తినను పాపవిముక్తుఁడు కాజాలఁడు. (22) ఎవ్వఁడు తనతో నేక పంక్తిలో విప్రులకు భోజనమిడునో ఆతఁడు అతిథులాహ్వానింపం బడినను కొకున్నను పాపము నుండి విముక్తుఁడగును. పాపకర్ముని ఆహ్వానించి భోజనం బిడిన ఆతఁడోనర్చిన (యజమాని) ఇష్టాపూర్తి యజ్ఞ ఫలము నశించును. విప్రులందరిలో యతి యగ్రేసరుఁడు. బుద్ధిమంతుఁడు వివేకియు నయిన గృహస్థు (యజమాని) యోగవిద్యా వంతుని తరువాత నాల్గు వేదములను, ఇతి హాసములను జదివిన వాని కాసన మొసంగవలెను. (25)
మూఁడు వేదములు చదివినవాఁడు, ఆతని తరువాత రెండువేదములు చదివినవాఁడు కూర్చుండవలెను; ఆతని తరువాత ఒక వేదము చదివిన వాఁడు, తరువాత ఉపాధ్యాయుడు కూర్చుండఁవలెను. (26) ఈ సందర్భములో పంక్తిని పవిత్రము చేయు.వారల గూర్చి వివరించెదను. పూర్వము చెప్పబడిన వారందరు నిర్దిష్టమయిన క్రమములో చెప్పబడిన వారని యెఱుంగుము. (27) క్రిందం చెప్పఁబోవు ఐదుగురను పంక్తినీ పావనము చేయువారిగా తెలిసికొనవలయును. వేద సంబంధమయిన షడంగములు తెలిసినవాఁడు, ధ్యానము చేయువ్యక్తి, యోగము నభ్యసించు నతఁడు, సర్వ తంత్ర స్వతంత్రుఁడయిన వాఁడు, యాయవరుఁడు (అనికేతనుడయి ఎల్లప్పుడు సంచరించు యతి), ఇంకను శ్రాద్ధ కల్పము నేటింగీనవాఁడు పంక్తిని పవిత్రీకరించును. పదునాలుగు విద్యలలో నొక్కదానీ నయినను పూర్తిగా గ్రహించి పారమెరిగినవాఁడు (29) యథాశాస్త్రము తమ తమ విధులనునెరవేర్చునట్టివాఁడు వీరందరు పంక్తిని పవిత్రీకరింతురు. నిస్సందేహముగా సౌపర్ణులు (పంచాగ్నులను ప్రత్యహము నిర్వహించువారు), సామవేద పారీణులు, విధి ననుసరించి నడకతో పండ్రెండు సంవత్సరములు తీర్థయాత్రలు జరిపినవారు, త్రినాచికేతులు (నాచికేతాగ్ని నెటింగినవారు లేదా మూఁడు సార్లు నాచికేవాగ్నిని సలిపిన వారు లేదా విరాజస్ అను అను వాకమును జదివినవారు) విద్యులు - మూడు విద్యలు నేర్చినవారు, పవిత్రమయిన ధర్మములను, ధర్మ క్రియలను ఆచరించు బ్రాహ్మణుఁడు, బృహస్పతిచే రచింపఁబడిన స్మృతుల పారవ్యమంటీన బ్రాహ్మణుఁడు - వీరందరు పంక్తినీ పావన మొనర్చు వారుగా పేర్కొనంబడిరి. (32) శ్రాద్ధ భోజనమునకు ఆమంత్రింపఁబడి, సీమైథునమున నీమగ్నుడయినచో ఆ బ్రాహ్మణుని రేతస్సు నందు పితరులు ఆమాస మంతయు పడియుందురు. (33) ధ్యాన సిష్ఠుఁడయిన వానికి, దయాభావ పూర్ణునకు, ధీమంతునకు, దానము నొసంగవలయును. శ్రాద్ధకర్మయందు యతికి కాని వాలఖిల్యునకు కాని భోజనము పెట్టవలయును. (34) వాన ప్రస్థునకు శ్రాద్ధభోజనము పెట్టినచో ఆతఁడు పూజామాత్రముచేతనే సంతుష్టుడగును. గృహస్థునకు భోజనమిడినచో విశ్వేదేవతలు పూజితు లగుదురు. వానప్రస్థుని గౌరవించినచో ఋషులు గౌరవింపబడుదురు. వాలఖిల్యుల వలన ఇంద్రుఁడు గౌరవింపం బడును. సన్యాసులకు శ్రాద్ధమున భోజనమిడినచో బ్రహ్మ స్వయముగా పూజిం పఁబడిన వాడగును. (36) నాలుగు ఆశ్రమముల మిశ్రమము పంచమ ఆశ్రమమగును. ఇదీ పవిత్రీకరించునది కాదు. శ్రాద్ధ విధానముననుసరించి చతురాశ్రమముల వారు పూజింపఁబడవలయును. అట్లే దైవక్రీయలయందును జేయవలయును. చతురాశ్రమ పరిధుల దాటి వర్తించు వారికి ఎట్టి దానములను చేయరాదు. చతురాశ్రమములలో జేరినవాఁడును, వాయుభక్షకుఁడై యుండు వాఁడును, తపస్సు నాచరించువాఁడును, చతురాశ్రమములకు చేరని వాఁడగుట శ్రాద్ధమున కాతనిని ఆహ్వానింపరాదు. ఉగ్ర తపస్సాచరించువారు కొందరుందురు. కొందరు డెహు జ్ఞాన వేదుల వలె నుండి, విచిత్ర వాదముల నాచరింతురు. మరికొందరు బ్రాహ్మణులను నిందించెదరు. వీరందరు పంక్తి బాహ్యులు.
ఔపవస్తులు (ఉపవాసములచే నధికముగా కృశించినవారు) సాంఖ్యులు, నాస్తికులు, వేద నిందకులు, ధ్యాన క్రియను నిందించువారు - వీరందరు పంక్తి దూరులు. (41) ప్రయోజన రహితముగా తలనుగొరిగించుకోనువారు, కారణము లేకయే యూరకే జడలు పెంచుకొనువారు, కార్పటికులు (తీర్ధ సంవాసులు, ఒక తీర్థము నుండి వేటిక తీర్థమునకు పవిత్రోదకములను తీసికొని వెళ్లుటయే వృత్తిగా గలవారు) పంక్తిదూరులు. దయాహీనులయి క్రూరులయిన వారిని, విధులను ధర్మములను విభేదించిన వారిని, విచక్షణ లేక సర్వ పదార్థ భక్షకులయిన వారిని వర్జింపవలెను. (42) హవ్యకవ్యములు దేవతలకు పితరులకు వినియోగించు పదార్థములు. అట్టి పదార్థములతో కొరుకులకు (ఒక విధమయిన శైవులు) ఆచార విధులను బహిష్కరించి వర్తించు వారికి, సంఘ బహిష్కృతులకు, వేద బహిష్కృతులకు, సంగీత వృత్తిచే జీవించు వారికి, జీవికకునై వేదములను విక్రయించి బ్రతుకువారీకి - భోజనము పెట్టరాదు. (దేవ పితృ హవ్య కవ్యములను ఇట్టి వారితో సాంఘికముగా గానీ ఇతరమైనం విధముగగాని సంబంధమును గలిగి యుండువారు కృష్ణవర్లులు (నల్లని శరీరులు) అగుదురు. శూద్రునితో కలిసి యెవ్వఁరు భుజింతురో వారందరు పంక్తి దూరులగుదురు. (44) వ్యవసాయము, జంతువులను వధించుట, భూమిదున్నుట, వాణిజ్య మాచరించుట, పశువులను పెంచుట, శత్రువును సేవించుట, లేక గురువును గాక వేటికని నెవ్వనినైన సేవించుట - ఇట్టి కార్యకలాపాచరణములు బ్రాహ్మణులకు నిషేధింపఁబడినవి. (45) మీధ్యా సంకల్పములు గలిగి, దుర్వృత్తాంతులయిన వారిని విసర్జించవలెను. అసత్య ప్రమాదముల కల్పించు వానిని, ఇతరులనకారణముగా దూషించు వారిని, ఒకరిపై చాడీలు చెప్పు వారిని, పాపాచరణముచే దోషులయిన వారినీ, తమకై యితరులను వేదాధ్యయనమునకు నియోగించువారినీ, లోభులను మోహ పరవశులయిన పోరీని, ఫలములనే కాంక్షించు వారిని, వేదముల విక్రయించు వారిని, వేదములను బ్రాహ్మణుఁడయిన ప్రతివ్యక్తి అధ్యయనము చేయవలయునే కాని తమ స్థానమున నింకొకనిని నియోగించి తాను వేదాధ్యయనమును మానరాదు. అట్టి ప్రతినిధిని నియోగించువాఁడు పాపి (46, 48) వక్త వేద ఫలము నుండి భ్రష్ఠుఁడగును. ఇతరుల ప్రేరణచే భృతకాధ్యాపకులయిన వారు (అద్దెకు వేదములు చెప్పువారు) అట్టి వారిచే వేదములు చెప్పఁబడినవారు, శ్రాద్ధమున కొహ్వానింపఁబడ నర్హులు కారు. వస్తువుల క్రయ విక్రయ వృత్తిచే జీవించు బ్రాహ్మణుఁడు శ్రాద్దమున కాహ్వానీంపబడనర్పండు కాఁడు. బ్రతుకు జీవిక కోట్లకు కొనుట అమ్ముట యను క్రియలు బ్రాహ్మణునకు నింద్యములు. (49, 50) ఇది 'వైశ్యుని యొక్క వృత్తి. బ్రాహ్మణుల విషయములో పాతక క్రియ. వేదములను రుసుమిచ్చి చదువుకొనువాఁడు, వేదముల వలన ఏకవిధ వృత్తిచే జీవించువాఁడు - వీరిరువురు శ్రాద్దమునకు భోజనమునకై పిల్వబడనర్తులు గారు. భార్యను వ్యర్థముగా సమీపించువాఁడు, వ్యర్థముగా యాగములు చేయువాఁడు శ్రాద్దమున కాహ్వానింపఁబడరాదు. (నపుంసకుని) వడ్డీ వ్యాపారి బ్రాహ్మణుని తద్దినపు భోజనమునకు పిలువరాదు. (వార్డుషీ - వడ్డీవ్యాపారి) ఇతరులను ప్రేమించు భార్యలఁగల బ్రాహ్మణులను, ఇతరుల భార్యల ప్రేమించు వారలను, అధిక ధనాశకలవారిని, స్త్రీ వ్యసనాభిలాషులను శ్రాద్ధమునకు ఆహ్వానింపరాదు. స్వకర్మలకు వర్ణాశ్రమ ధర్మములకు విరుద్ధులగు వారిని శ్రాద్ధ భోజనమునకుఁ బిలువరాదు. (54)
తస్కరుఁడు, ఇతరుల కొంకు యజ్ఞముల నాచరించువాడు. పంక్తి దూష్యులు, పందుల వలె తిను బ్రాహ్మణులను, చేతిలో అన్నము నుంచుకొనీ భుజించువారినీ, దూషింపఁబడి (నిందింపఁబడికూడ) భుజించువారీని భోజనమునకు పితరులు గ్రహింపరు. శ్రాద్ధము నందు మిగిలిన పదార్థములను (ఉచ్ఛిష్టములను) స్త్రీలకు శూద్రులకును పెట్టరాదు. (56) ఎవరయిన అజ్ఞానముచే స్త్రీ శూద్రులకు శ్రాదోచ్చిష్టమును పెట్టిన ఆ యన్నాదులు పితరులకు ముట్టవు. అందుచే అన్నాదులనుగాని, మిగిలిన పదార్థములను గానీ శ్రాద్ధ కర్మలయందితరుల కీయరాదు, (57) అంతియేకాక, మిగిలిన పెరుగు, నేయి కాక ఇతరములయిన వానిని కుమారునికి దక్క యితరుల కీయరాదు. మిగిలినట్టివి ప్రత్యేకముగా అన్నాదుల నీయవలయును. (58) తుదిని (పితరులు) పుష్పములఫలములచే తృప్తినొందీ వెడలిపోవుదురు. ఆహార పదార్థములు వండబడినంతసేపు ఆ' పదార్థములు ఉష్ణముగా నున్నంత సేపు ఎంతవరకు బ్రాహ్మణులు నిశ్శబ్దముగా భుజింతురో అంతసేపు ఫితరులు ఆహార పదార్ధముల స్వీకరింతురు. (59) దత్తము, ప్రతి గ్రహము, హోమము, భోజనము, బలి సాంగుష్ఠము తోడి పాద్యము, అసురలకు (రాక్షసులకు) ముట్టకుండునట్లు చేయవలయును. దానము లన్నియును నివ్వి వీని నిట్టోసంగవలెను. (61) యజమాని (దాత) తన చేతులను మోకాళ్ల నడుమ నుంచుకొని నేలపై ఆసీనుఁడు కావలయును. ఇట్లే ఆచమనము చేయునపుడు కూర్చుండవలెను), తల గొరిగించుకొని మొండి తలతో నుండు ముండులను, జటలు కట్టిన శిరోజములఁగల వారిని, కాషాయ వస్త్రములఁ దాల్చిన వారినీ, శ్రాద్ధ కర్మయందు పరివర్జనము చేయవలయును. (62) ఎవ్వరు నిత్యము సత్ర్పవర్తన వృత్తిలో నుందురో వారిని, జ్ఞానులకు, ధ్యానులకు, దేవభక్తులకు, మహాత్ములకు, దర్శన మాత్రముచే పవిత్రులనుగా జేయు వారికి, శీర్షమున శిఖలను గలవారికీ, ధాతురక్తులగు వారికి, దండములు గలవారికీ, పెట్టవలయును. ఈ లోకత్రయమంతయును నిరంతరము యోగేశ్వరులచే వ్యాప్తమయి యున్నది. (62) అందుచే వారు ప్రపంచమందున్నట్టి దానినెల్లను చూచెదరు. వ్యక్తమయిన దానిని అవ్యక్తమయినట్టి దానిని వారు వారి స్వాధీనములో నుంచుకొందురు. అన్నిటికంటే పరమయిన దానిని వారు గ్రహించెదరు, సత్యము అసత్యము ఆ మహాత్ములచే చూడబడినదెల్ల గ్రహింపఁబడును. వారు సత్ అసత్తుల దర్శించిరి. సర్వజ్ఞాన సముచ్చయము, మోక్షము మొదలయినవి మహాత్ములయిన వారిచే సృజింపఁబడినవి, అందుచే వారియెడ నిరంతరము భక్తియుక్తుఁడైనవాఁడు ఉత్తమమయిన ఫలము నొందును. (67) ఋక్కులను (వేద మంత్ర సూక్తములను) ఎఱింగినవాఁడు అన్ని వేదముల సెలుంగును; యజుర్వేద మంత్రముల నెఱింగిన యతఁడు యజ్ఞముల గూర్చి యెఱుంగును. సామవేద మంత్రముల నెఱింగినయతఁడు బ్రహ్మ' నెఱుంగును, మానసము (మనస్సు) నెటింగిన యతఁడు సర్వము నెఱుంగును.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము, అయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున బ్రాహ్మణ పరీక్ష యను పదియైదవ అధ్యాయము.
Summary of chapter 53 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply moving section explains the profound mystical meaning behind offering consecrated rice balls, known as Piṇḍas, to departed parents and ancestors. It portrays this simple yet potent act as a vessel of unconditional gratitude that nourishes ancestral spirits in higher realms. Contemplating this sacred mystery, the heart of the devotee is filled with overflowing love and devotion toward ancestors and the supreme lord who governs all life.