బ్రహ్మాండ మహా పురాణము
37 - గృహరాజాంతరకథనం
హయగ్రీవుడనెను : సర్వజ్ఞాద్యంతరాలము యొక్కపైన ఓయగస్త్యా వశిన్యాద్యంతరమున్నదని తెలియవలెను. అది యిరువది మూరల యెత్తెనదీ. పదునారు వందల మూరల విస్తారముగలదీ-1, పూర్వమువలెనే సోపానమందరము. (మెట్లుగల మందిరము) అది సమస్త రోగముల. బోగొటు సర్వరోగహరచక్రము అను పేర ప్రసిద్ధమైనది-2, అచట తూరుపు దక్షిణము మొదలగు దిక్కుల వరుసలో వశిని మొదలగు వారు దేవతలు. వారచట స్వరములు లేని వారు. అందులో మొదటిది వశినీశ్వరి-3. తరువాతది కవర్లతో గూడినది కామేశ్వరుడను వాజ్మయముగలది. ఇక చవర్ధతో గూడిన వాగీశియైన మోదీని మూడవది-4, ట వర్ధతో నలంకరింపబడినది విమలయను సరస్వతి, తవర్గతోనట్లే కూడిన యైదవది వాక్రృధారణ-5, పవరతో పెంపోందిన యారవది జయినీగా సమ్మతము. యకారము మొదలు నాలుగు వర్ణములకోణమున సర్వైశ్యర్యాది వాజ్మయి యుండును. శకారము మొదలు అక్షరములతో నెనిమిదవది కౌలినిగా సమ్మతము. ఈ దేవతలు జపమునందాసక్తలు. ముత్యములసొమ్ముల నలంకరించు కొన్నవారు-7. ఎల్లప్పుడును కదలాడుచున్న గద్యపద్యములనెడి లహరులతో లాలింపబడినవారుగా నిష్టపడినవారు. చెవులకింపైన కావ్యములతోను మధురములైన నాటకములతోను ఓ మునీ! శ్రీదేవిని వినోదింపజేయుచుందురు-8. ఓవాతాపినిజంపీనయగస్త్యా! వీరు తమ రహస్యనామములతోనే ప్రసిద్ధులు. తమ చక్రమునకు నాయిక (స్వామిను)లు. సిద్దనామముతో బిలువబడుదురు-నీ, ఈ చక్రమును సంరక్షించునది ఖేచరియనబడినది. వశిన్యాద్యంతరాలము యొక్కపైన ఓవింధ్యపర్వతగర్వాపహారీ!-10. ఇరువదిమూరల యెత్తె. పదునారు వందలమూరల విస్తారముగల అస్తమను చక్రముగలదు. అచట బాణాదుల దేవతలు-11. ఐదుగురు బాణేశ్వరీదేవతలు, ఐదు కామేశ్వర బాణములు, ఆదిస్త్రీపురుషులైన యిరువురి యొక్క ప్రదీప్తములైన రెండు అంకుశములు రెండు ధనువులును క్రొత్త చేకులలో ప్రకల్పింపబడినవి. (చెఱకు వీండ్లరెండు ధరంచినదని భావము) కాంతులీనురెండు పాశములు, ఓ మునీ! నాలుగస్త్రములును కల్పింపబడినవి-15, కామేశ్వరివి నాలుగు మహేశ్వరునివి నాలుగు, మొత్తము ఎనిమిది యాయుధములు ప్రజ్వలించి ప్రకాశించును-14: ఇవి భండాసురమహాయుద్దమున దుష్టరాక్షసుల రక్తమును ద్రావుటచే మిక్కిలి తృప్తి చెందినవైన దివ్యాస్త్రములు. ఆమెలో నతీజాగరూకములైయున్నవీ-15, ఈ ఆయుధములకు పరీవారాయుధములు చాలినంతగా నున్నవి. ఇంక తక్కిన యస్త్రములు గూడ గలవు. వాటిసంఖ్య కోట్లకొలది-16. వజ్రశక్తి, శతఘ్ని, భుశుండీ, ములసము, కృపాణము, పట్టిశము, ముద్గరము, భిందిపాలకము-17, -ఇవి మొదలగు శస్త్రములు వేనవేలుగలవు. ఇవి మదవివశలైన అష్టాయుధమహాశక్తులను సేవించును-18. ఇక, ఓ మునీ! శస్త్రాంతరాళము (శస్తాగారము 7) పైన ఇరువది మూరలు ఎత్తైనదియు, పదునాఱువందల మూరల విస్తారముగల ఒకనివాస భవనము గలదు. అదీ మువ్వురు సమయేశీ శక్తుల స్థానముగా జెప్పబడినదీ-19. కామేశాదులు ముగ్గురు అచట దేవతలు. తక్కినది చతుర్థిక. ఆమెయే సమస్త విశ్వములను సృష్టించు లలితేశ్వరి-20. ఆ ముగ్గురి నామములను వినుము. అందులో కామేశి మొదటిది. తరువాత వారు వజ్రేశి, భగమాల, వారు వేలరీతులలో సేవింతురు-21. సమస్త దర్శనములకు వివిధ దేవతలైన కామేశ మొదలగు మహోదయలు ఆమెను (లలితను) అటసేవింతురు-22. వీరి ప్రస్తావమును నీత్యాశక్తుల ప్రస్తావమున చక్రిణులకును యోగినులకును శ్రీదేవీ పూరణుస్వరూపిణీ-23. కామేశ్వరదేవుని తొడపై పరుండు లలితాంబిక కాశమేశ్యాదులలో నాలుగవది. ఆమె నిత్యాశక్తులలో పదునారువది అనబడినదీ-24. యోగిని చక్రదేవతలలో తొమ్మిదవదనబడినది. ఓ ఇల్వలసంహారీ! సమయేశియంతరాల (మద్యదేశము)ముపైన నాథాంతరమను భవన ప్రదేశముగలదు. అదీ యిరువది మూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. పూర్వభవనములవలెనే మెట్లతో నలంకరింపబడినదీ-25, 26, అచట, కామేశదేవునిచే నీ లోకముల రక్షించుటకై సృష్టించబడిన నలుగురు యోగనాథులున్నారు. అచటి నాథలు మహాదేవి యొక్క యోగశాస్త్ర ప్రవర్తకలు. అందరికిని మంత్రగురువులు. సర్వవిద్యలకు మహా సముద్రమువంటివారు (నిధులు). వారి నామములను వినుము-27.28. మిత్రి, శోడిశుడు, చర్యుడు, ఓ మునీ! వారిచేత రక్షకోజకై పాదుకాత్మకములైన యనేకలోకములు సృష్టింబడినవి-29. దివ్యవిద్యలుగలవారు, మానవ సమూహములు సిద్ద సమూహములు, సురులు, తాపసులను సాలోక్య సిద్ధిని, సారూప్యసిద్దీని, సాయుజ్యసిద్ధిని బొందిన వారును-30. గొప్పగురువులు, వీరనేకులై గురువులను సేవింతురు. తరువాత నాథాంతరాలముయొక్కపైన యుత్తమనివాస గృహము గలదు-30,31. అదీ కూడ నీరువదీమూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. అదీ నీత్యాంతరమనబడిన నిత్యాశక్తీ, మందిరము. ఇచటి నీత్యాశక్తులు పదునైదుగురు-32. ఇక కామేశ్వరి నిత్య, భగమాలినీ నిత్య, నీత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసినీ-33. మహావజ్రేశ్వరి, దూతీ, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినిక, చిత్ర-వీరు పదునైదుగురు అనబడిరి. వీరు దేవీ స్వరూపలు, మహాబలపరాక్రమవతులు-35. ప్రథమనే (ప్రతిపదనే) ప్రధానతిథిగా బొందినవారు, ముల్లోకములను వ్యాపించినవారు, భూత-భవిష్యత్-వర్తమాన కాలస్వరూపలు, కాలమును మ్రింగు పండితలు (యమునీ మ్రింగుపండితలు)-36, చాలాకాలమును బొందగోరు బ్రహ్మాది సమస్తులకు వారివారి శతాయుష్యరూపలై దేవియాజ్ఞచే నుండిరి-37. నిత్యప్రయత్నశీలలు, నిర్భయలు, శ్రీదేవి పరాంగమునుండి బుట్టినవారు-వీరు జగముల సంపద్వధీకై చిత్స్వరూపిణియైన లలితను సేవింతురు-కర్. వారి భవన రూపములనంది ప్రకాశించినవారు పదునైదుగురైన ఈశ్వరలు. సృష్టి బిందుచక్రమున షోడశియొక్క భవనమున్నది-39. ఇక, ఓ మునీ! నీత్యోంతరాలము యొక్కపైన అంగదేవ్యంతరము (అంతరము=భవనములదు. అదీ యిరువది మూరల యత్తైనది-40, పదునారు వందల మూరల విస్తారముగలది. పూర్వమువలె సోపానము గల మందిరము. ఓ మునీ! దానియందు హృదయదేవి మొదలగు శక్తులుండును-41. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి, దృష్టిదేవి, శస్త్రదేవి, అని హృదయదేవ్యాదులు ఆరుగురు అనబడిరి-41, 42, ఆ కామేశ్వర స్త్రీలు మిక్కిలి దగ్గరివారు, కొత్తయందము నిండిన యంగములు గలవారు. సావధానలు, ఆయుధములు ధరించినవారు-43. బిందు పీఠమున చుట్టును తిరుగుచున్నవారు మదించినయాకారముగలవారు. లలితాదేవి. యాను . ప్రవర్తింపజేయువారు; ఇంద్రియములను వశమునందుంచుకొన్నవారి యొక్క పీఠములందుండువారు-44 ఇక అంగదేవ్యంతరమునకు పైన మండలాకారమున బిందునాదమహా పీఠము గలదు. అది పదీ మూరల యెత్తైనది-45. ముప్పది రెండు వందల మూరల విస్తారముగలది. ఉదయించు సూర్యుని బోలినదీ.. దీనిని బిందుపీరమని తెలియవలె, అదీ శ్రీపీఠమని కూడా పిలువబడును-46, మహాపీఠమని తెలియవలె. విద్యాపీఠమని కూడ బిలువబడును. ఏబది పీఠములు ధరించునానందపీఠమనీ కూడాచెప్పబడును-47, పంచబ్రహ్మమయమైన యాయానందపీఠమున ముల్లోకములకు మూలమైన పంచరత్నము (ఐదు రత్నములుగల గొప్ప మంచము వెలుగుచుండును-48. ఆమంచము (సింహాసనము) యొక్క కాళ్ళు : నాలుగు. అవి పది మూరల యెత్తైనవి. మూడు మూరల విస్తారముగలవి-49. అవి బ్రహ్మ-విష్ణు-మహేశాన-ఈశ్వర రూపములు. ఎల్లప్పుడు శ్రీదేవియొక్క ధ్యానయోగము చేత శక్తిభావమును బొందినవి-50, అందులో నొకటి మైదుపాదములుగలది. మందార పుష్పములతో సమానముగా నెల్లనైనదీ. అది బ్రహ్మాత్మకమనీ యెరుగవలెను. అదీ ఆగ్నేయదిగ్భాగముసాశ్రయించియుండును-51. నాలుగవ మంచపాదము- కొండగోగుపూవుసారవుకాంతి గలది. (వచ్చనైనది). అదీ. ఈశ్వరాత్మకమని యెఱుగవలె.. ఈశాన్యదిగ్భాగమునాశ్రయించినది-52. వీరందరు సర్వాయుధులు: సర్వాభరణభూషితులు. పై భాగమునను క్రిందుభాగమునను. స్తంభరూపముగలిగి మధ్యన పురుష రూపములుగలవి-53. వారు శ్రీదేవి ధ్యానమున మూసుకొన్న కన్నులుగల వారు. శ్రీదేవీ ధ్యానముననే నిశ్చలమైన శరీరముగలవారు. వారిపైన మంచముయొక్క ఫలకము సదాశీవుడు-54. విచ్చినదానీమ్మ (పండు) కాంతిగల ఫలకము) అదీ పదునారు వందల మూరల విస్తారముకలది-ఇరువది నాలుగు వందల మూరల పొడవైనది. ఎల్లప్పుడు ప్రకాశించునా కారముగలదీ-55. అంగదేవతల యంతర(భవనము మొదలుకొని మంచము యొక్క ఫలకము వరకు చింతామణులతో నిర్మింపబడి తత్త్వరూపములైన (చింతామణి రూపములైన) మెట్లు ముప్పదియాఱు వినివేశములతో (ద్వారములతో) వెలుగుచుండెను. ఆరోహక్రమముననే (ఎక్కునప్పటిక్రమముననే) మెట్లను జెప్పుచున్నాను-57. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, - స్పర్శము, శబ్దము; ఉపస్థ, పాయువు, పాదములు-58, చేతులు, వాక్కు ఝణము, జిహ్వ, త్వక్కు నేత్రము, శ్రోతము, అహంకారము, బుద్ధి, మనస్సు, ప్రకృతి, పురుషుడు-59. నియతి, కాలము, రాగము, కళ, విద్య, మాయ, శుద్దవిద్య, ఈశ్వరసదాశివశక్తి శివ-అను-60. నీ ముప్పదియాఱు తత్త్వసోపాన పంక్తులుగా జెప్పబడినవి, మంచమునకు తూరుపు దిక్కున పూషసోపానపంక్తియని చెప్పబడినది-61. ఇక మంచము యొక్క పైన హంసతూలికాతల్పముగలదు. అది ఒక మూరెడు మాత్రమెత్తైనది. పదునారు పందల మూరల విస్తారముగలది-62 రెండేసి కాళ్లదిండ్లతోను తలదిండ్లతోను ఒప్పినది. అరువది నాలుగు గడ్డకముల యొక్క (బంగారు పాత్రలయొక్క-చెక్కిన చేపపిల్లల యొక్క యెళని కాంతితో బ్రకాశించినది-63, దానికి పైన కుసుమపూవు రంగుగల వస్త్రముచే నుత్తరీయము గలదు. అది పద్మరాగమణీ కాంతిగలది. పవిత్రమైనది. మెత్తనైనది-64. దానికిపైననుండుచు భగవంతుడై యాదిదేవుడైన కామేశ్వరుడను శివుడు. వెలుగుచుండును. అతడు తూరుపుమొగమై యుదయముతో గూడినపోడు శృంగారవేషమున మెరయుచున్న వాడు, ఎల్లప్పుడును పదునారేండ్ల ప్రాయమువాడు-65. ఉదయించు సూర్యబింబము వలె వెలగువాడు. నాలుగు చేతులు మూడుకన్నులు గలవాడు. హారములు, భుజకీర్తులు, కిరీటము, కంకణములు మొదలైనవానితో నలంకరింపబడినవాడు-66, మనోహరమై చిరునవ్వు వెన్నెల నిండిన చెంపలు గలవాడు-67. అతని తొడపై కూర్చొని పాపఘ్నియై భగవతీయైన లలితాంబిక ప్రకాశించుచున్నది. ఆమె బాల సూర్యునివలై నెల్లగా నున్నది. ఎప్పుడును పదునాండ్ల ప్రాయముగలది. నవయౌవనమునముదించిన-68. అమలిన పద్మరాగమణి కాంతిగలది. ఎట్టకమలమువంటి నఖకాంతులు గలది, లత్తుక శోభయవసరములేక సహజముగనే యెలుపును ప్రవహించు పాదములుగలది-69. మధుర ధ్వనిగల చిరుగజ్జిల బడుచున్న కంకణములతో మోహింపజేయునది, మన్మధుని శ్రేష్టమైన యమ్ములపొదుల మదమడంచు పిక్కలు గలది-70. ఏనుగతొండమువంటి చేతులు, అరటిస్తంభముల వంటి తొడలును గలది. మెత్తని యెఱని చిన్నని పట్టు వస్త్రముచే నలంకరింపబడిన పిరుదులుగలది. మణికట్టుయొక్క వైశాల్యముతో బ్రకాశించినదీ-71. సగముతోడలను గప్పు వస్త్రపుముడి గలది. రత్నముల మొలనూలుతో ప్రకాశించినది. ఆమె లోతైన నాభియను సుడిలో తీవకులను నలలకాంతీయను ప్రవాహము(నదిXగలది-72. మొగ్గవంటి చనుమొనలపై తూగాడు నూర్ణముతాల్యహారములు గలది-73. దిరిసెనపూవు రేకు కాంతి వంటికాంతీ గల నాలుగు భుజములు గలది. ఆ భుజములు భుజకీర్తులతోను, కంకణపంక్తులతోను అలంకరింపబడినవి. ఉంగరములుగల వ్రేళ్ళుగలవి. ఇట్టి భుజములు గలది. పతిచేయితాకి యున్న శంఖము వలె సుందరమైన కంఠముగలది-75. ముఖమనునద్ధమున గుండ్రముగానున్న గదువగలది. ఎట్టుని పెదవులు గలది. శుభ్రములు, వరుసలో శుద్దములు, విద్యాస్వరూపములునై ప్రకాశించునవి, మల్లెమొగ్గల శోభలో మెరయుచున్నవియు నైన పండ్లచే (దంతములచే) వెన్నెలల విరజిమ్మునది-76. లావైన ముత్యముల గ్రుచ్చినయనేకాభరణములతో ఐకాశించినది. మొగిలిపూవులోపలి దళముల వరుసలవలె మిక్కిలి పొడవైన కన్నులుగలది-77. అర్ధచంద్రునివలె సుందరమైన ఫాలభాగమున చక్కగా వాలిన ముంగురుల సమూహము గలది. చెవికమ్మలతోడి మణికుండలములతో నలంకరింపబడిన చెవులుగలది-78. కొత్త కర్పూరకస్తూరీలతోనెల్లప్పుడు సుగంధముగల తమలపాకు విడేము గలది. తిలకముగానున్న రత్నమువలె బ్రకాశించు ఫాలనేత్రముతో విరాజిల్లినది-80. గాఢాంధకారమువలె దట్టమైన సన్నని, వెంట్రుకల సమూహములుగలది. సీమంతరేఖలో నిడిన సిందూరరేఖతో వెలుగుచున్నది-81. తలపై మెలియుచున్న చంద్రకళ నలంకరించుకోన్నది. మదముతో చంచలములైన కన్నులుగలది. సమస్త శృంగారవేషములలో నొప్పినది, సమస్తాభరణములనలంకరించికొన్నదీ-82. సమస్త - లోకములకు " తల్లియైనదీ. సదానందమును వర్ధిల్లిచేయునది. బ్రహ్మ-విష్ణు-గిరీశ-ఈశ-సదాశివులకు మూలకారణమైనది-83. తనకడకన్నులలో జాలుపోరు-కరుణాప్రవాహముననందరినీ: సంతసింపజేయునది. ఇట్టి లలితాంబ కామేశ్వరాంకమున బ్రకాశించుచున్నది-84. ఇతర దైవతముల పూజలకు ఆమె (లలితా) పూజ ఫలమని పెద్దలు తెలియుదురు. ఆమె పూజకు ఫలము ఆమె పూజయేయని కూడ అందురు-85 కోట్ల వేల యేండ్లలో గూడ సామ్యొక్క ఒక్కయంశము గూడ వర్ణింపనలవిగాదు. ఇక లలితాదేవిని సంపూర్ణముగా నేనెట్లు వర్ణింపగలను-86. ఆమె వాక్కులకు మించిన రూపముగలది. ఇక ఆమెను వర్ణించుటకు వాక్కులెట్లు సమర్థమగును? వేదము “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (అన్నీ వాక్కులును. మనస్సుతో సహా ఆమెను పొందలేక మరలి వచ్చినవి). అనీ, వేదము జెప్పినదిగదా! -87. పెక్కులు చెప్పనేల! తత్వ(నిజ)మైన విషయమును వినుము దీనిని పక్షపాతమునగాని, స్నేహమునగాని, మోహమున (భ్రాంతితో గానీ నేను చెప్పుటలేదు-86, ఓ తపోనిధీ! కల్పతరువు శాఖలు లేఖలు (కలములు)అగుగాక. ఏడు మహాసముద్రములన్నియు మషీషాత్రములు (సిరాబుడ్లు) అగుగాక-89. ఏబది కోట్ల యోజనములు) విస్తీర్ణముగల భూమి పత్రము (కాగితము) అగుగాక, దాని లేఖన కాలము సంఖ్యలో చివరి సంఖ్యతో లెక్కించిన కాలము వరకు (సంఖ్యాప్రమాణము ఏకాది పరార్ధ పర్యంతము అని ఆంతవరకు శాస్త్రకారులు చెప్పుదురు) అగుగాక-90. సమస్తలోకములు ప్రత్యేకముగా కోటి (అనంత )బాహువులు వ్రాయుగాక, ఓ యగస్త్యా! చెప్పువారందరు బృహస్పతి సమానులైనను సరే!-91. ఐనను ఆ శ్రీదేవి యొక్క కమలము.వంటీ. పాదములోని ఒక్క వ్రేలి వెలుగుయొక్క వేయి యంశలలో ఒక చిన్ని యంశము యొక్క వర్ణనము గూడ వర్ణింపబడదు. మొత్తముపైన ఆమె గుణములను స్తుతించుటలో ప్రవృత్తియంతయు నిష్పలము. (ఇచట పుష్పదంతకృత శివమహిమ్నస్తోత్రపద్యము స్మరింపనగును)
ఈ రెంటిలో దేనికేది మూలమో నిక్కముగా దెలియదు, పౌరాణికమే మూలముగా నోపును. ఇందులోని ఐృహస్పతి సములను శారదగా సంస్కరించుట జరిగినది. శారద లిఖించుట మహోన్నత భావన. అదియు, పారమునందదనుట మరింత మహోన్నతము.) బిందుపీఠముచుట్టను చదరముగా మహామాయాజవనిక వ్రేలాడుచుండును. అది నల్లని కాంతిగలది-93. దేవియొక్కపైన నలుబది మూరలయెత్తున ముల్లోకములలోను దుర్లభమైన ఇంద్రగోప వీతానము (ఆర్ల పురుగుల రంగుగల చందుకటు, చాందినీ, దోమతెర) కట్టబడినది-94.. అచటనున్న యలంకార సమూహము ముల్లోకములలో దుర్లభము. వానీని వర్ణింపబోవుచునా వాడి సిగ్గున కంఠముననే అడ్డీ రాకున్నది-95, అచటి సమస్తమును ఆమెయే తెలియును, అచటి సౌభాగ్యమునెవడు వర్ణింపగలడు?-96. ఈ విధముగా లలితాంబిక భండదైత్యవధకోఱకై జ్ఞానాగ్నినుండి బుట్టినది. ఆమె సమస్తదానవులను నిశ్శేషముగా దహించివైచినది-97. దివ్యశిల్పులచే నిర్మింపబడిన పదునారు క్షేత్రములు గల భవన రూపమైన శ్రీ నగరమును అధిష్టించి యెల్లప్పుడు జగమును రక్షించును-98 ఈ విధముగనే తక్కిన శ్రీపురములు గూడ గలవు. ఆపురములలో భేదము లేదు. పేరు మాత్రమే వేరు-99. నానా వృక్షములుగల మహోద్యానము మొదలు క్రమముగా శ్రీపుర కథను జెప్పువారు పరమగతిని బొందుదురు-100. వినువారు, అడుగువారు, వెదకువారు ఆమెస్తోత్రచరిత్రాది పుస్తకములను ధరించువారును పరమగతి- బొందుదురు-101. శ్రీపుర పద్దతిలో ఆయాసాన విభేదములు - జూపుచు శిల్పిజనులచే శ్రీదేవియొక్క మహాభవనమును నిర్మింపజేయువారును పరమగతిని బొందుదురు-102.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవోగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున గృహరాజాంతరకథనమను ముప్పది యేడవ యధ్యాయము॥ 37
Summary of chapter 149 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the immense spiritual and temporal benefits accrued by regularly reciting or hearing the Śrī Lalitā Sahasranāma with unshakeable faith. It promises freedom from disease, poverty, fear, and negative karmic impressions, ultimately bestowing supreme wisdom and liberation from rebirth. The devout reader cherishes this divine promise, adopting the daily recitation of these thousand names as a precious spiritual lifelong practice.