బ్రహ్మాండ మహా పురాణము
46 - అధ్యాయము
వసిష్ఠుఁడిట్లనెను.
ప్రయాణించుచు రాముఁడు మార్గములో మునుల వలన తన తండ్రి యొక్క మరణము రాజకుమారులు తన తండ్రిని చంప ప్రయత్నించుట, తండ్రి స్వర్గతుడగుట, తండ్రి యొక్క శిరస్సును వారు హరించుట మొదలగు వృత్తాంతమును మొదట నుండి వినెను. తండ్రి మరణము వలన తల్లి మరణించుట విని రాముఁడు దుఃఖముచే శోకముచే సమన్వితుఁడై విలపించెను. అతనితో సమానదుఃఖము ననుభవించు అకృతవ్రణుఁడు ఆతని నోదార్చెను. శాస్త్ర నిర్దిష్టమయిన హేతువులచే, వీర సామర్థ్య సూచకములయిన యుక్తులచే, శాస్త్ర దృష్టాంతములచే అకృతవ్రణుఁడు ఆతని శోకమును శాంతింపఁజేసెను. ఊరడింపఁబడి, ధైర్యమవలంబించి, మేధావీయైన భార్గవుఁడు, తన స్నేహితునితో సోదరులను చూడ ప్రయాణించెను (5) దుఃఖ కర్శితుఁడయిన రాముడు వారలను కలిసికొనెను. దుఃఖితులయిన వారలకు నమస్కరించెను శోకము నపనయింపఁజేసికొని, వారలతో నాతండొక మూఁడు దినములుండెను. తండ్రి మరణమును స్మరించుకొను నాతనికి అత్యధికముగ కోపమావహించెను. ఆ కోపము సర్వలోక సంహరణ దక్షమయినది. పూర్వము తల్లి కొఱకు చేసిన ప్రతిజ్ఞను సత్య సంగరుఁడయిన రాముఁడు హృదయమునందు దృఢనిశ్చయము చేసికొనెను. సర్వక్షత్రియవధకై యుద్యమించెను. సర్వక్షత్రియవంశ్యులను సంపూర్ణముగా (అశేషముగా) మిగులకుండ చంపి, వారి శరీరము నుండి స్రవించిన రక్తముచే పితరులకు తర్పణము చేయ నిశ్చయించు కోనెను. తన హృదయ సంకల్పమును తన సోదరులందరకును రాముఁడు చెప్పి, వారి అంగీకారము నొంది గృహముకడ చేయవలసిన పితృ విధుల నన్నింటిని జరిపి, బయలుదేరెను. (10) తరువాత అకృతవణునితో కూడ మాహిష్మతి కరిగెను. ఆ మాహిష్మతీ పుర బాహ్యాద్యానమున నీలంబడి మహోదరుని రాముఁడు స్మరించెను. మహోదరుఁడు రామునకు వెంటనే రథ చాపాదులను సర్వసంహననములతో ‘అశ్వసమ’న్వితముగా పంపెను. శత్రు విజయుఁడైన రాముఁడు రథము నిరోహించెను. శరముతో ధనువును గ్రహించెను. రుద్ర దత్తమయిన శంఖమును పూరించెను, (13) ఆకాశము కంపించునట్లుగా జ్యాఘోషమును చేసెను. సహసాహుఁడు సారథులలో శ్రేష్ఠుఁడు, ఆతఁడు సారథ్య మొనర్చెను. రథము యొక్క గుణము (వారి యొక్క) యొక్క శంఖము యొక్క నాదముతో తండ్రి మరణమున క్రుద్ధుడయిన రామునిచే ఆ మహిష్మతీ నగరము ప్రజలతో ఏనుగులతో సంక్షోభిల్లెను. (15)
సర్వక్షత్రకులాంతకుఁడయిన రాముని ఆగమనము నెఱింగి నృపాత్మజులు సంక్షుబ్ధులైరి. ఆతనితో యుద్ధము చేయుటకు సముద్యోగించిరి, అంత, శూరసేనాదులయిన యైదుగురు శూరులు పంచరథులు తోడి రాజులతో వచ్చి రామునితో యుద్ధమాచరింప నుద్యమీంచరీ, (17) చతురంగ బలోపేతులయి క్షత్రియ శ్రేష్టులు మిడుతలు (పతంగముల) జాజ్వల్యమానముగా దహించు అగ్నిలో సురుకు విధముగా, రామునితో యుద్దమునకుద్యమించిరి. వచ్చి పడునట్టి వారలనందరను ఒకే యొక రథముతో భార్గవుఁడు నివారించి, యుద్దమునందు సర్వపార్దీవులతో యుద్ధము చేసెను. అంత రామునకు రాజులతో సహా యుద్దమయ్యెను. ఆ యుద్ధమున ధీమంతుఁడు రాముఁడు శూరసేనాదులను సంక్రుద్దుం డై చంపెను. సబల వాహనములను సంహరించి, క్షణకాలములో రాముఁడు క్షత్రియ సముహమును నేలమట్టము గావించెను. (21) అంత భగ్న సంకల్పులు, హత స్వబటవాహనులు నయిన మిగిలిన రాజులు నలుదిక్కులకును పరువులెత్తిరి. ఈ విధముగా పలాయనము జేయుచున్న సైనికులను, చంపి, వందలాది రాజులను యుద్ధమున వధించి, శూరులను శరాగ్నిచే దహించి, క్రోధపరీతాత్ముడయిన రాముఁడు అఖిల మాహిష్మతీ నగరమును దగ్గపటలము చేయగోరెను. భార్గవుఁడు కాలాగ్ని సదృశమయిన అస్త్రమును విడిచెను. ఆ పావకాస్త్రము జ్వాలలతో పురస్రాకారమాలీనిని కబలీకరించి హస్త్యశ్వనగర సహితముగా నగరమును దహించివైచెను. దహింపబడుచున్న నగరమును చూచి, అస్త్రాన్ని భీతులై యాపురాధిపతి ప్రాకారరక్షణకై పారిపోయెను. అస్త్రముల వలని అగ్నిచే నగరమును పూర్తిగా దహించి, శాత్రవులను వధించి ప్రపంచమును దహించుటకు వచ్చిన సాక్షాత్ కాలాగ్నివలె అకృతవ్రణుడు సహసాహుడు అనుగమింప, రథమౌషమున భూమినీ వణీంకిపఁజేయుచున్నాఁడో యనునట్లు రాముఁడు బయలుదేరెను. సర్వక్షత్రియులను పృథివీతలము నుండి సంహరించి, రాముఁడు శాంతించేను. తపస్సాచరింప రాముఁ డు మహేంద్రాద్రి కరిగెను. (29) ఈ మధ్యకాలములో క్షత్రియులు యుద్ధమునకు వచ్చిరి. అందుచే రాముఁడు తపస్సు నుండి వచ్చి వారిని చంప ప్రతినఁ బూనెను. (30)
నష్టభర్తృకలయిన రాజభార్యల క్షేత్త్రములందు ద్విజులు క్షత్రియుల నుత్పాదించిరి. రాముఁడు మరల భూమి యందు క్షత్త్రయులను శత సహస్రముగా వధించెను. మరల రెండేండ్లలో భూమీనీ నిఃక్షత్రముగా చేసి తరువాత (24) ఇరువది నాలుగు సంవత్సరములు రాముఁడు తపస్సాచరించెను. ద్వీజులచే నుత్పాదింపఁబడిన యుద్దీపితులయిన క్షత్రియులను ప్రళయ కాలాంతకుని వలె రాముఁడు నిశ్శేషముగా వధించెను. తరువాత కాలాంతరమున కొందరు క్షత్రియులుద్బవించిరి. వారందరను చంపుచు పృథ్వినంతటిని రెండేండ్లు రాముఁడు సంచరించెను. ఇక పితృమరణమును రాముడు స్మరింపనక్కరలేదు. కారణము తన తండ్రి మరణమును స్మరించుచు రాముఁడు భూమీని 21 మారు నిక్షత్రియముగా నొనర్చెను. తల్లీ యురము నందు ఇరువది యొక్కమారు కొట్టుకొని దుఃఖించుటచే రాముఁడు 21 మారు క్షత్త్రియహననము చేసెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున తృతీయోపోద్ఘాత పాదమున భార్గవ చరిత్రమున నలుబది యారవ అధ్యాయము.
Summary of chapter 84 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing his warrior mission to a holy conclusion, this chapter describes Parashurāma performing a grand Ashvamedha sacrifice and donating the entire conquered earth to sage Kashyapa and the holy Brāhmaṇas. Having fulfilled his cosmic duty, he retired to the Mahendra mountains to engage in eternal penance and meditation. The devoted soul praises his absolute detachment, observing how he freely gave away the entire world without retaining a single grain for himself.