బ్రహ్మాండ మహా పురాణము
47 - వసిష్టాగమనము
వసిష్ఠుఁడు చెప్పెను.
అంత అమిత తేజస్వులు, మూర్థాభిషిక్తులునయిన పండ్రెండువేల సంఖ్యగల రాజులను సజీవులయిన వారిని రాముఁడు పట్టుకొనెను. తరువాత ఈ పండ్రెండు వేల సంఖ్యగల రాజులను మునులతో సహా పట్టుకొని మహా తేజస్వీయయిన రాముఁడు తపోమయమయిన కురుక్షేత్రమున కరిగెను. అందు రాముఁడు పంచ సరస్సులను త్రవ్వించి వాని చుట్టును సుఖముగా స్నానమాడుటకు వీలయిన తీర్థములను నిర్మింపఁజేసెను. భార్గవుఁడు రాజుల నందు చంపెను. వారీ శరీరముల నుండి స్రవించు రక్తముతో ఆ పంచ సరస్సుల నింపెను. ప్రతాపమంతుఁడు పరశు రాముఁడు ఆ సరస్సుల యందు స్నానమాచరించెను. పితృతర్పణములచే పితరులకు యథాశాస్త్రముగ శ్రద్దగా తర్పణములు విడిచెను. రాముఁడు ప్రేతలయిన పితరులకు తల్లికి బ్రాహ్మణులతో శాస్త్ర విహితముగా శ్రాద్ధాదికముల నొనర్చెను. (6) తపోమయమయిన కురుక్షేత్రమున నీ వీధముగా తీర్ణప్రతిజ్ఞుండై పితృపూజాపరాయణుఁడై నివసించెను. అది మొదలుకొని, జామదగ్న్యునిచే కురుక్షేత్ర తపోవనము తీర్థముల యందుత్తమోత్తమయినది. ఎందు. పితృదేవతలకు పరశురాముఁడు అక్షయమయిన తృప్తి కలిగించెనో యయ్యది స్యమంతపంచకమని త్రైలోక్య విశ్రుతమయిన పుణ్యస్థానమయినది. అదే స్నానములచే, దానములచే, తపోమహిమచే, ద్విజ భోజన తర్పణములచే పితరులకు ప్రీతిమంతమయినదిగా రామునిచే చేయఁబడినది. ఆతనీ పితరులు అక్షయమయిన తృప్తినీ, శాశ్వత పితృలోకమును చెందిరి. ఆ సమంత పంచక మనుపేర తీర్ధము లోకమున విదితమయ్యెను అయ్యది సర్వ పాపక్షయకరము అనంత పుణ్య సంపాదనతో కూడినది అచ్చటి కరిగిన మర్యులకు వారి యఖిల పాపములు, పెద్దగాలికి ఎండుటాకులు దూరముగా తొలఁగునట్లు, దూరముగా తొలగిపోవును. పాపులయిన మర్త్యులకు తత్క్షేత్ర గమనము బహుజన్మ శతములకయినను లభింపదు. కురుక్షేత్రము నందు సమంత పంచక తీర్థము అతి పావనమయినది, అందు మానవుఁడు స్నానము చేయ సర్వతీర్థముల స్నానమాడినవాడగును. రాముఁడు పూర్ణ మనోరథుఁడయి కృతకృత్యుఁడయ్యెను. (15)
మహామతి రాముఁడు నియమవంతుఁడై కొంతకాలము అందునివసించెను. సంవత్సరాంతమున వశియైన రాముఁడు బ్రాహ్మణులతో గూడి పిండ ప్రదానమునకు గయకు వెడలెను. గయాక్షేత్రములో శత్రు నాశనుఁడు రాముఁడు; శాస్త్రము ననుసరించి సత్కృతులయిన పితరుల నుద్దేశించి, బ్రాహ్మణులను సంతృప్తుల నొనర్చెను. అందు శివ సంబంధమైన స్థానమొక్కటున్నది. దానినీ ‘చంద్ర’ పాద మందురు. పితరులకు అంతటి తృప్తి గలిగించునట్టి క్షేత్రము వేఱొకటీ లేదు. అందు స్వకులజులు యథాశక్తి యొక్క మారైనను పితరులను పిండ దానాదులచే నర్చీంచిన పితరులక్షయమయిన గతిని పొందుదురు. అతఁడు పితరుల నుద్దేశించి, ద్వీజాదులను సంతృప్తి పరుచగా, పితృభక్తి తత్పరుఁడై విధి ననుసరించి పిండముల నొసంగెను. అంత ఆతని పితరులు అందరు జమదగ్ని పురోగతులయి పితృలోకము నుండి వచ్చిరి. ఆతనిచే సమర్పింపం బడిన పూజను వారందరు గ్రహించిరి. వారందరు సంప్రీత మనస్కులయి తత్పితరులు భృగునందనునితో అంతరిక్షము నుండి అదృశ్యులయి యుండి పలికిరి.
పితరులిట్లనిరి.
ఓ వీరుఁడా ! ఇతరులచే దుష్కరమయిన మహత్కర్మ నీచే ఆచరింపఁబడినది. మమ్ములనందరను యధాన్యాయము శాస్త్ర సమ్మతముగా తృప్తి మంతులను జేసితివి. అయినను మాకు అక్షయమయిన ప్రీతిని నీ వొసంగలేదు. ఏలయన, క్షత్రియుల నందరను వధించి నీవు నీ లక్ష్యమును సాధించితివి కనుక (24) ఈ క్షేత్రము యొక్క ప్రభావముచేతను, నీ భక్తి చేతను, మమ్ము కలిసికొంటివి పూజించితివి. కాని మేము మాత్రము శాశ్వతమయిన ఫలములను అనుభవింపలేదు. అందుచే నీవు వీర హత్య మొదలగు క్రియలవలని పాష ప్రశనము కొఱకు యథా న్యాయము ప్రాయశ్చిత్తము నాచరింపుము. శాశ్వత ధర్మమాచరింపుము. ఇఁక క్షత్రియవధనుండి విరమించుము. (27) ఈ జగత్తుఅస్వతంత్ర మయినదగుటచే ఆ రాజులు నీ పితరుల కాచరించిన అపరాధమునకు బాధ్యులుగారు. వారు నిమిత్తముగా నీ పితరుల మరణము పూర్వము విహితమయినది. (28) ఎవ్వనిని చంపుటకు ఎవ్వడు సమర్థుఁడు? ఈ ప్రపంచమున నెవ్వఁడు ఎవ్వనిని రక్షించుటకు సమర్ధుఁడు? ఈ రెండు క్రియలలో ప్రతివ్యక్తియు నిమిత్త కారణముగా ఇతరుని గూర్చి యుండును. ప్రతి వ్యక్తియు పూర్వ కృతకర్మ ననుసరించి వర్తించును. ఈ విషయములో సందేహము లేదు. కాలానుగుణముగ ప్రజలు లోకమున బలవంతులగుదురు. (30)
విధి జోక్యము లేక, ప్రపంచమున నేజీవద్భూతము వేఱొక భూతమును హింసించుటకు శక్తిమంతము కాదు. వత్స ! ఏలయన ప్రతి వ్యక్తియు తచ్ఛక్తి ననుసరించియే స్వకర్మ నాచరించును. అందుచే క్షత్రియ జాతిని గూర్చిన కోపమును మాయెడ ప్రీతి దృష్ట్యా పరిత్యజించుము. శమము మంగళము నొందుము. అదియే నిజముగా మా బలము. (32).
వసిష్ఠుఁడిట్లనియెను.
భృగునందనుఁడయిన రామునితో నిట్లు చెప్పి పితరులందరును అంతర్ధానము నొందిరి. ఆతఁడును వారి వాక్కుల నెల్లను సాదరముగా ప్రతిగ్రహించెను. అకృత ప్రణునితో కూడి, అత్యంత ముదముతో గూడికొనీ, అచ్చటి నుండి రాముఁడు సిద్దవనాశ్రమమునకు వెడలెను. ఆయా శ్రమమున నుండి, బ్రాహ్మణులతో సహితుఁడై (ఓ రాజా !) మహా మనస్వియయిన రాముఁడు తపస్సాచరింప సంకల్పించెను. సహసాహునితోను తన రధముతో ధనువుతో, ఇతర సంహననాయుధములతో, రాముఁడు పునరాగమ సంకేతము నొనర్చి బయలుదేరెను. అంతనోతఁడు శ్రద్ధతో సర్వ తీర్థముల స్నాన మాచరించెను. అతఁడు సర్వ పృథివీ పర్యటన మాచరించెను. పితృ దేవాది పూజలాచరించెను. లోక సంప్రదాయము ననుసరించి భృగు. నందనుఁడు క్రమముగా నీ విధమున మూఁడు పర్యాయములు పృథీవికీ పరిక్రమణము చేసెను. తరువాత పర్వతశ్రేష్ఠమయిన మహేంద్రగిరికి బ్రాహ్మణులతో అభిసంవృతుఁడై తపస్సుకొఱకరిగెను. మునులచే సిద్ధులచే సేవితమయిన ఆ ప్రదేశమును ధర్మ విదుఁడయిన రాముఁడు తనకు స్థిరవాసము చేసికొనెను. (40) ఆత్వడందు తపమాచరింప, సర్వక్షేత్రముల నివసించు మునులు, బ్రహ్మవాదులు, నియమపూర్ణులు తపస్సాచరించు నాతనిని దర్శింప కోరికతో వచ్చిరీ, తపస్సు నందాసక్తుఁడయిన యాతనికి మునులందరు దర్శించిరి. ఎండిన వృక్షములతో క్షత్రియ రూపమున నున్న ఆరణ్యమును దగ్ధము చేసి శాంతమయిన అగ్నివలె నున్న రాముని ఆ మునులు చూచిరి. ఆగతులయిన దివ్య మునీంద్రులను, తపోయమాది పూర్ణులను చూచి అరాదికములతో ఉత్తమాచారానుగుణముగ భార్గవుఁడు పూజించెను. కుశల ప్రశ్నాదీకములయిన తరువాత, ఆ మునీశ్వర మహోదయులను ఆచార బద్ధమయిన అరాది ఉపచారములతో భార్గవుఁడు ఆహ్వానించెను. (43) కుశల ప్రశ్నాదికములయిన వెనుక మనోహరములయిన కథలతో ఇతివృత్తములతో వారు కాలము గడిపిరి. ఆ కథలు పుణ్యప్రదములు. అంత పవిత్ర హృదయులయిన మునుల అంగీకారముతో యజ్ఞములలో శ్రేష్ఠతమమయిన అశ్వమేధ మాచరించుటకు రాముడు ప్రారంభించెను. (45)
అతఁడు సర్వ సంభోరములను సమకూర్చెను. ఆతఁడు ఔర్వుఁడు విశ్వామిత్రుఁడు భరద్వాజుఁడు, మార్కండేయుఁడు మున్నగు వారితో కలిసి, వారి యనుమతితో కాశ్యపుని తన గురువుగా నిర్ణయించుకొని మహాక్రతువయిన వాజమేధమును రాముఁడొనర్చెను. (47) అందుచే అతనికి కాశ్యపుఁడధ్వర్యుఁడు, ఉద్గాత గౌతముఁడు, హోత విశ్వామిత్రుఁడును, నయిరి. మార్కండేయ మహాముని బ్రహ్మత్వము వహించెను. భరద్వాజుఁడు అగ్నివేశ్యుండు మున్నగు వేద వేదాంగ పొరగులు ఇతర కర్మలను యథాక్రమముగా నాచరించిరి. పుత్రులతో, శిష్యులతో, ప్రశిష్యులతో కూడి భగవానుఁడగు భృగుమహర్షి ఇతర మునులతో కలిసి “సాదస్య” మాచరించెను. (సాదస్యము - సదసత్పతిత్వము, క్రతువు నకాధ్యక్ష్యము). భృగు పుంగవుఁడు రాముఁడు వారలతో అఖిలమయిన యజ్ఞకర్మను సమాప్త మొనర్చెను. తరువాత గురునితో సహితము యజ్ఞ బ్రహ్మను పూజించెను. ఆచారము ననుసరించి, రూపవతియైన ఒక కన్యగా పృథ్వీని పురగ్రామ శతములతో, సముద్రాంబరమాలినీగా నలంకరించెను. భృగుశార్దూలుం డగు రాముఁడు సశైలకాననమయిన దానినీ తానుండుటకు నుత్తమ శైలమయిన మహేంద్ర పర్వతమును మాత్రము విడిచి, సర్వమును, కాశ్యపునకొసంగెను. రాముఁడు మహేంద్ర పర్వతమును ఆత్మ సన్నివాసము కొఱకు సంకల్పించుకొనెను. (54) తరువాత కాశ్యపుని శాస్త్ర విధి ననుసరించి రాముఁడు పూజించెను. హిరణ్యము, రత్నములు, వస్త్రములు అశ్వములు, గోవులు, గజములు మున్నగు వానిని సమర్పించి యజ్ఞాంతము నందు అవభృథ స్నానమాచరించెను. అంత ఆ మహామునుల అంగీకారముతో ద్రవ్య పరిత్యాగ మాచరించెను. భృగు నందనుఁడు సర్వభూతములకు అభయ ప్రదాన మొసంగెను. అచ్చట ఆ పర్వతశ్రేష్ఠము నందు తపస్సాచరింప ప్రారంభించేను. తరువాత సదస్యులు, ఋత్విజులు, శంసిత ప్రతులయిన మునీశ్వరులెల్లరు వచ్చిన విధముగా వెడలిపోయిరి. వారందరు వెడలగా భగవానుఁడయిన రాముఁడు అకృత ప్రణ సంయుతుడై మహా తపసితి పూని అందే సుఖముగా నుండెను. (59) అంత కాశ్యపియైన భూమి, తరువాత అనేక జననాథులతో కూడికొని సర్వదుఃఖ ప్రశాంత్యర్థము మారీచానుమతితో (కాశ్యపుని అంగీకృతితో)
విష్ణుముఖోదీతము దీప ప్రతిష్ఠాఖ్య వ్రతము నాచరించెను. భూమి సర్వదుఃఖవిముక్తమయ్యెను. ఈ విధముగా జమదగ్ని కుమారుఁడయిన రాముని చరిత్ర చెప్పఁబడినది. దీనిని విన్నవారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. (62) కథా ప్రసంగవశమున లోకమున ప్రథిత తేజస్వియిన కార్తవీర్యునీ ప్రభావము, అంత సంక్షేపము విస్తరము కాకుండ వివరింపఁబడినది. ‘తత్సదృశ పురుషుడు పూర్వమందు లేడు అట్టివాఁడు భవిష్యత్కాలమున నుండదన్నంత కీర్తిని కార్యవీర్యుఁడు సంపాదించెను. పూర్వమాతఁడు ఉత్తమ పురుషుని చేతులలో మృతిని దత్తాత్రేయుని వలన వరముగా పొందియుండుటచే, రాముని వలన మరణము పొంది ముక్తిని గనెను. (65) ఆతనికి ఐదవ పుత్రుఁడు ప్రఖ్యాతుఁడు కలడు. అతఁడు జయధ్వజుఁడు. ఆ జయధ్వజునీ పుత్రుఁడు బాహువీర్యుఁడు తాలజంఘుఁడు. ఆతనికీ నూర్గురు కుమారులు. వారందరుత్తమధన్వులు. వారందరు తాలజంఘులను పేరింటి వారు. వారందరిలో అగ్రజుఁడు వీతిహోత్రుఁడు. ఆతఁడు వీతిహోత్రాదులతో చిరకాలము హిమాద్రి వనగహ్వరమున, హైహయాదులతో కూడీ వసించెను. పూర్వము రామునితో యుద్ధమాచరించి పలాయితుఁడగుచుండ పృష్టభాగమున రాముని బాణముచే గొట్టబడియతడధికమయిన వేదనతో భూమిపై మూర్ఛితుఁడై పడెను. దైవవశాత్ తాను గూడ పలాయితుం డగుచు అతనిని వీతిహోత్రుఁడు చూచెను. వెంటనే ఆతనిని రథముపై నెక్కించుకొని పలాయన పరుఁడయ్యెను. (70) వారందరు భయపీడితులై హిమాద్రి యందు వసించిరి. వారికెన్నియో ఆపదలు. వారికి శాకమూల ఫలములే యశనములయ్యెను. తరువాత రాముఁడు శాంతి నొంది, తపస్సు నందాసక్త మానసుఁడుకాగా, జాలజంఘుఁడు. సపుత్రయుతముగా స్వకీయమయిన రాజ్యమును పొందెను. (72) పూర్వమువలే తన నగరమును ప్రవేశించి ఆ నృపసత్తముఁడు అటనివసించి యరీందముఁడై తన రాజ్యమును పాలించేను. ఆతఁడు పుత్రయుతుఁడై అనుచరులతో సైన్యముతో పూర్వవైరమును స్మరించుచు, నీ పట్టణముపై దాడివెడలెను. చతురంగ బలోపేతుఁడై భూమిని వణికించుచున్నట్లు అయోధ్యకు దండెత్తి గట్టిగా నాదమొనర్చెను. (75)
నీ తండ్రి అల్పాధిక్యము గలియున్నను వెంటనే పురి బాహ్యమునకు వచ్చెను. ఆతఁడు వృద్ధుఁడయ్యును. ఆ రాజులందరీతో యువకుని వలె పోరాడెను. ఆతఁడు పెక్కు ఏనుగులను, గుఱ్ఱములను రథ సైనికులను చంపినను వృద్ధుఁడగుట శత్రువులచే కొట్టబడి పలాయితుం డయ్యెను. ఆతఁడు నగరమును రాజ్యమును సకశోక బలవాహనముగా త్యజించి, గర్భవతియైన నీ తల్లితో వనము ప్రవేశీంచెను. అచ్చట ఔర్వ మహర్షి ఆశ్రమ ప్రాంతమున నివసించెను. అచిరకాలములో శోకామర్ష సంయుతుఁడై స్వయముగా వృద్దుండగుటచే, కన్నీటిచే గద్దదిత కంఠయైన నీ తల్లిచే ఆదరింపఁబడుచు, అనాథునివలె రాజేంద్ర ! మరణించి స్వర్గతుఁడయ్యెను. (80) అంత నీతల్లి ‘ఓరాజా’ దుఃఖశోక సమన్వితయై విలపించుచు తన భర్తృకలేబరమును చితియందారోపించెను. భోజనము లేమిచే భర్త వ్యసనము వలని దుఃఖముచే నీరసించి, తాను చితిలో ప్రవేశించి మరణింప దృఢచిత్తురాలయ్యెను. ఔర్వమహర్షి ఆ వృత్తాంతము నంతటినివిని స్వయముగా తానే యాశ్రమము నుండి బయటికి వచ్చి ఆమెను తన్మరణ ప్రయత్నమునుండి వారించుచు, “ఓ రాణీ ! నీవు ఇప్పుడు మరణింపరాదు. నీ యుదరమున సర్వులకు చక్రవర్తియగు శ్రేషుఁ డు పుత్రుఁడున్నాఁడు”. అనెను. ఆ మహర్షి పలుకులు విని మనస్వినీయైన నీ జనని, మృతి నుండి విరమించెను. ఆ ముని యామెను తన యాశ్రమమునకు తీసికొని వెళ్లాను. అందు సర్వ దుఃఖములను అణచుకొని, నీ ముఖాంబుజమును చూచు కోరికతో ఆశ్రమోపాంతమున సుఖముగ నుండెను. అంత కొంత కాలమునకు ఔర్వాశ్రమమున ఆమే నీన్ను కనెను. నీకు జాతకర్మాదికములను ఆ ముని యాచరించెను. నీ ఈ వ్రత నౌర్వాశ్రమమున పెరిగితివి. నీ యందా మహర్షి అనుకంపాన్వితుఁడు. ఓ శత్రుందమా! మిగిలిన దంతయు నీవెజబుంగుదువు. ఈ విధముగా కార్తవీర్యుఁడు ప్రభావవంతుఁడు భూమియందాయెను. ప్రభావమున నతఁడు సర్వలోకముల యందు విశ్రుఁడయ్యెను. నీ తండ్రి ఆతని వారసులచే నోడింపఁబడెను, వనమునకు పలాయనము చేసెను. ఆ వృత్తాంతమంతయు సంపూర్ణముగ నీకు చెప్పితిని. ఇయ్యది సర్వము చెప్పబడినది. ఇది ఉత్తమమయిన వ్రతకథనము. (90)
మంత్ర తంత్రములతో నీ పవిత్ర కథ చెప్పఁబడినది. ఇది సర్వలోక ఫలప్రదము. ఎవ్వడీ పవిత్రక్రియ ఆచరించునో చతుర్విధ పురుషార్థముల యందు కోరిక యుండదు, అయ్యది పురుషార్థ సాధనము కష్టతరమయినను సులభముగా సంపన్నమగును. ఓ హైహయభూభుజ! ఈ వ్రతము సంక్షేపముగా చెప్పితిని. జామదగ్ని చరితము చెప్పితిని. ఇంకేమి చెప్పవలయును?
జైమిని ఇట్లనెను.
అంత, సగరుఁడు చేతులు జోడించి మునివర్యునితో “భగవన్ ఏతద్ర్వతమును నేను చేయగోరుచున్నాను. నాకు ఉపదేశింపుఁడు, అనుజ్ఞను ప్రసాదింపుఁడు. ఈ పవిత్ర కర్మచే ఓ విప్రర్షి! నేను నిస్సంశయమున కృతార్థుఁడనయితిని” అనెను. ఇట్లు రాజు చెప్పగా! అట్లే యని మహాముని, శాస్తోక్తమయిన వీధీ విధానమున రాజును దీక్షితుని చేసెను. రాజ సత్తముఁడయిన సగరుండు వసిష్ణునిచే దీక్షితుఁడయి ద్రవ్యములను తీసికొనివచ్చి ఆ శుభవ్రతమును వీధివత్ ఆచరించెను. విధవంతముగా. జగన్నాథుని పూజించి రాజు గురువర్యునీ ఆజ్ఞను స్వీకరించి యథాయోగ్యముగా వ్రతమును సమాప్తము చేసెను. “నా జీవితాంతమీ మహావ్రతము ఆచరించేదను.” అనీ మహామతియైన రాజు ప్రతీన పూనెను. వసిష్ఠ మహర్షి ఆశ్రమమునుండి రాజును తిరిగి యరుగ నాజ్ఞాపించి నిజాశ్రమమునకు వెడలెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున వసిష్టాగమనమను నలుబది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 85 of the Brahmānda Mahā Purana is as follows:
Returning to the royal chronicles of the Lunar Dynasty, this chapter details the expanding lineages of Yayāti's other noble sons: Turvasu, Druhyu, Anu, and Puru. It traces their migrations, the kingdoms they established, and how their descendants spread sacred culture across various regions of the world. The devout reader observes the vast, unfolding plan of providence, weaving diverse nations into the grand tapestry of human history.