బ్రహ్మాండ మహా పురాణము
27వ అధ్యాయము
వసిష్ఠుఁడిట్లు చెప్పెను.
అమరేంద్రుని పట్టణ ప్రభావముతో తులతూగిన యా పట్టణమున మునీంద్రుని యొక్క యాగధేనువు, తరువాత ఆ యా గృహముల యందు వారల కరమైన నారీ బృందజాతమును,విచిత్ర వేషములతో ఆభరణములతో ప్రసూన గంధాంశుకాలంకృతమనోహర విగ్రహములతో హావభావ సహితమైన ఉదార చేష్టలతో, సౌందర్య గుణాన్వీత ముగా, చిరు నవ్వులచే ప్రకాశించు దంత కాంతుల కిరణ జాలములతో భాసించు ముఖ సరోజజీత ఇందుకాంతులతో, ప్రత్యగ్రమయిన యౌవన భరముచే వ్యక్తీకృతములయిన వాక్కులతోడి ప్రేమ మందరకటాక్ష నిరీక్షణములతో నిర్మించెను. ఇంకను వారు ప్రీతిచే ప్రసన్నమయిన హృదయాతిప్రభావిలసితలు, శృంగారకల్పతరుపుష్పవిభూషితలు; దేవతా స్త్రీలతో తులతూగిన సౌభగము, సౌకుమార్యము, రూపము, అభిలాషలుగల, మధురమయిన ఆకృతులతో రంజితలు, వారు కాచిన బంగారుతో నిర్మించిన కలశములతో నుపంపవీలయిన మనోహరములు, పీనములు నయిన స్తనద్వయముల భారములచే వంగీన కటిభాగములు కలవారు, పిఆుందుల భారములే ఆక్రమింపబడుటచే కలిగిన భేద పరిశ్రమవలన రక్తము యొక్క యెట్టిందనముచే పావకరసమువలె అరుణీ మత్వము నొందిన అంఘిభాగము కలవారు, కేయూరములు, హారములు, మణికంకణములు, హేమకంఠసూత్రములు, అమలము లయిన శ్రవణ కుండలములచే మండితులయిన వారు, పుష్పమాలలచే చుంబితములయిన సకుంతల కేశపాశములచే, కాంచీకలాపములచే పరిశింజితములగు {మ్రోగు) కాలినూపురములు కలవారు; వారు, రోషభావము, పరిసాంత్వనము, శృంగార నర్మ హాస కేళీ సమయ ప్రియాలపనము కృత్రిమమయిన భర్త కోప ప్రదర్శనముల వివిధ భావ ప్రదర్శనముల స్వకీయమయిన అనుభవమును సుశిక్షణము కలవారు. వారు రాజ సంబంధమయిన నిజ ప్రీయధైర్య బంధ సర్వాపహారములందు చతురలయినవారు, వారు తంత్రీ స్వరములతో తుల్యమయిన మంజులము, సౌమ్యము, నయిన గేయముల యందు, గంధర్వ స్త్రీల సంగీతమునందలి, తార మధుర రవముల భాషింప ప్రవీణలు. కామ ప్రయోగ నీపుణలు, అధికమైన సంపదలచే ఔదార్యముచే రూపగుణ శీల సమన్వితలు. వీణయందు అధికమయిన ప్రావీణ్యముగల అంగుళులు గలవారు. వారు గంభీరములయిన వాదములందు, వ్యంగ్య చాటు పోదముల యందు, నుత్సాహము కలవారు.
స్త్రీలు మదాలసతరలు; అతి ప్రొఢములయిన భావములచే కాముకుల మనస్సులను ఆకులిత మొనర్చువారు. కామ ప్రయోగ నిపుణలు. అహీనమయిన సంపదచే ఔదార్యముచే, రూపముచే, గుణములచే శీలముచే సమన్వితలు. వారు సంఖ్యాతిగాములు. ఎల్లప్పుడును గృహకృత్య కర్మల యందు ఆసక్తలయిన వారు. వారి పరిచారికలును నట్టివారే. అందు అసమానములు అసంఖ్యేయములు, అనేక రత్నోజ్వలిత విచిత్ర ప్రాసాద సంఘములున్నవి. రథములు, అశ్వములు, మదేభములు, ఖరములు, ఉష్ట్రములు, గోవులు, మేకలు, అంతీయేకాక యోగ్యములయిన వానితో గూడియున్న అనేకమందిరములు విలసిల్లుచున్నవి. అంతీయేకాక, నరేంద్రులకు, సామంతులకు, నిషాదులకు, సాదులకు, పదాతులకు, సేనలకు, సేనానాయకులకు, విప్రులకు, రథసారథులకు, వందిమాగధులకు ప్రత్యేకముగా నియమింపఁబడిన గృహములచే నదీవిరాజిల్లుచుండెను. అందు విశాలమయిన వీధులు, అంగడులు, చిత్రములయిన చత్వరములు, అనేకములయిన వస్తు క్రయ విక్రయశాలలు, శుభ్రములయిన గడికోజనులకు నిర్మితములయిన గృహములు కలవు. అయ్యవి మహాధనములతో గూడి చక్కగా నిర్మితములయిన భవనములు అందు మహారములు, రత్నోజలములు, ఉన్నతములు నయిన గోపురములు కలవు. అందు శునకములకు గట్టిన మందిరములు, గృధవజమునకు నిర్మించిన కేంద్రములు, నర్తనాలయములు. విచిత్రములయిన ధ్వజములు, పతాకములు, పరిశుభ్రములయిన పటములచే నిర్మింపబడిన యున్నతమయిన మండపములు కలవు.
అందు రమణీయములయిన తటాకములు, దిగుడుబావులు, సరోవరము లెన్నియో జలపూర్ణములై కలవు. అందలి జలములు కలార్ధముల, పద్మముల, కుముదముల, ఉత్పలముల పుష్పరేణువులచే వాసీతములు; చక్రవాకములు, హంసలు, హంసకురరులు, ఐకములు, సారసముల యొక్క నానా విధములయిన రకములచే రమణీయములు. అందు వృక్షమూలముల యందు ఆలవాలములతో చూత వృక్షములు, ప్రియాలకములు, పనసలు, ఆమ్లములు, మధూక తరువులు, నేరేడు చెట్లు, ప్లక్ష వృక్షములు అనేకములు కలవు. సరోవర తీరముల నాగములు, కేతకులు, పున్నాగములు, చంపకములు మొదలయిన సుందర వృక్షములు పెంచబడినవి. ఆ వృక్షములపై తరచుగా పక్షులు వసించుచుండును. మందారములు, కుందములు, కరవీరములు, సుందరములయిన యూధీకాతరువులు, జాతి మొదలయిన పుష్పవంతము లయినవి. ఫలవంతము లయినవియు నగు వృక్షములు కలవు. తత్ర్పదేశము విస్మయనీయమయిన ఉపవనములతో సర్వత్ర నిండియుండెను. పరిసర వన సముదాయముచే సో ప్రదేశము చక్కగా శోభితము. అందలి ఉపపనములు సర్వ ఋతు సంబంధ శ్రేష్ఠ సౌరభముతో గూడిన వాయువుల మందమంద ప్రచారములతో గ్రీష్మ ఋతువును బెదరించుచున్నట్లున్నవి. ఈ విధముగానో రాజా ! సురాసుర మనోరమ భోగ సంపత్తులతో సృజ్యమాన విభవవంతమయిన నగరముగా నుండెను. ఆ మునివర్యుని హోమధేనువు అమితమయిన సౌభాగ్య భోగముతో వెంటనే కల్పించి ఆ మహర్షికి నివేదించెను. అంత, మునివరుఁడు, ద్విజ హోమధేనువు వలన నరపతి మనోజ్ఞమయిన ఆతిథ్యమును సంపాదించుట నెటీంగి, వెంటనే గుణశాలియయిన ఆత్న శిష్యునొకనిని పిలిచి, హైహయ సృపతికై (పిలువ) పంపెను. వెడలి ప్రభువును వెంటనే కలిసి వినయ పూర్వకముగా ఆతనితో నీట్లు ఆతడు విన్నవించేను. “మాచే ఉపపాదితమయిన ఆతిథ్యమును గౌరవింప వలసినదని మా కులపతి దేశికుని ఆజ్ఞ” అంతముని వరునిచే కృతాభీష్టుడై తన కొఱకై నిర్మించిన పురవరమును రాజు ప్రవేశించెను.
సర్వోప భోగనిలయము, మునిహోమధేనువుయొక్క సామర్థ్య సూచకము నయిన నగరమును, అశేష బల సమేతుఁడుడై రాజు ప్రవేశించెను. సమస్త లోకమును సమ్మోహింపఁజేయు భోగైశ్వర్య విభవ సమృద్ధమయిన నగరము నాతఁడు చూచెను. రాజు స్వయముగా మహోదార దాతయు, అత్యధికైశ్వర్యవంతుఁడు నయినను, ప్రీతి ప్రసన్న వదనుడై దానిని చూచి యప్పుడు తన బలగముతో అత్యంత విస్మయ మొందెను. రాజు యొక్క చారుతరమూర్తి దేవతా స్త్రీ నయన సమూహములకు నిరంతర పానయోగ్యమైన దయ్యెను. పుర రాజు మార్గము వంటి పోవుచుండ, హైహయపతి కుబేర నగరమున దేవతా సమూహముతో గూడిన శక్రుని వలె ఆనందించెను. ఆతఁడు రాజ మార్గము వంటి పోవుచుండ, ఆ నగర స్త్రీలు ఇరుప్రక్కల సౌధముల యందుండి, మంచి గంధజలముతో తడిసిన ప్రసూనములచే, పేలాలచే, సేసలు చల్లిరి. తమ హృదయ గత స్వాగతముల వ్యక్తము చేసిరి. ఆగతులయిన అతిధీ ప్రకరమును స్వాగతీకరింప, గౌరవింప, నుత్సాహముతో పొర కాంతల హస్తార విందముల నుండి జారినట్టి అమల లాజ వరముతో రాజు మునింగేను. ప్రతిపదమునకు కాలేయ పంకముచే పరీమళవంతములు, పసుపుతో నిండినవి. నందన వనము నుండి తీసికొని రాబడినవియు, నయిన శుభ్ర ప్రసూన నికరముల చేతను, ప్రతిధ్వనించు తుమ్మెదల రొదలతోడను గూడిన పూవులను పౌరవనితాంజనరత్నసారమౌక్తికములను చల్లిరి. ఇట్లు పౌరాంగనా జనములచే పుష్పాదులచే ప్రతిపదము చల్లబడి రాజు, సర్వత్ర చంద్ర కిరణములచే ఆవరింపఁబడిన మందర పర్వతమువలె ప్రకాశించెను. బ్రహ్మ తేజోమయ మయినది. తపస్సు యొక్క సంపద్విశేషము, ఉదార గుణాంచితమయినదియు, ఏ లోకమునందును పొందుటకు అచింత్యమయినదియు, దుర్లభతరమయినదియు సంస్పృహణీయ శోభోజ్జ్వలమునయిన
పుర సంపదను రాజు చూచి, మనస్సులో, నధికముగా ప్రశంసించెను. వాగ్రూపమునఁ బొగడెను. హైహయపతి ఇట్లు తలపోసెను - బలయుతమయినది, మనోహరతరమైనదియు నగు క్షత్రియ సంపద భూమీయందు దుర్బలమయినది. దీనిలో శతాంశముతోనయినను తులతూగజాలదు. దేవతార్చతమయిన విప్రశ్రీ అతి ప్రభావవంతమయినది”. పురము నందలి మధ్య భాగమందలి విభూతీని, పుర జనోప చితమైన దానిని, పురోహితులతో, మంత్రులతో సహితముగా రాజు దర్శించి, పోపుచు, స్వపార్వమున చరించు వ్యక్తిచే చూపింపఁబడి, నానా వర్ణములతో సుందరముగానున్న సౌధమును చూచి, అత్యంత ముదము నొందెను. పురజనులచే నధికముగా పూజింపఁబడి రాజు, మునివర్యుని సమకూర్పంబడినదియు, ఆత్మాను రూపమయిన దానిని సహానుచరులతో పొందెను. ఇట్లు అశ్రమముగా రాజు సంచరించి తన పరివారముతో గృహాభీముఖుఁడయ్యెను, పౌరులు వివిధారణవస్తుపాణులతో, మార్గమునందంతటను అంజలిబద్దులై అనుపదము, జయ జయ శబ్ద ఘోషములతో, తూర్యారవములతో దిగ్భాగములు విధిరీకృతములౌనట్లు, రాజును సంభావించిరి. కంచుకులు వివిధ జన సంకులములను, దూరముగా తొలగింప, రాజు మెల్లమెల్ల కక్ష్యాంతరముల మూడింటిని సద్భావముతో గూడిన సచివులు ఆదరముతో హస్తములందీయ పుచ్చుకొని, పురోగమించుచుండ, పురకామినీ సంతతులు దీపములతో, పెరుగుతో, దర్పణములతో, గంధ పుష్ప దూర్వలతో అక్షతలతో వెంటరా, రోజు రాజ భవనాంతరము నుండి బయటికి వచ్చెను. వారు వెంటనే బంగారముచే తాపబడిన యొక ఆసనమును సమకూర్చిరి. అయ్యది ప్రశస్తతరమయిన రత్నములచే అలంకరణముచే వీరాజిల్లెను,
సూక్ష్మతరమయిన వస్త్రము ఆ ఆసనముపై కప్పబడెను. ఉదార యశస్వియైన రాజు కనకాలంకృతమయిన సువర్ణాసనమును అధిరోహించెను. రాజు అంతఃపురమున ఆ యాసనమునందు కూర్చుండియుండ, తదీయ పురంథి వర్గము రాజు యొక్క ఆనందమును పోద్యములచే, భూషణములచే, గంధ పుష్ప వస్తాద్యలంకృతులచే విస్తరింపఁజేసిరి. అంత హైహయపతి, స్వమతాను సారముగా దీవ సోచిత కర్మనంతను నిర్వర్తించేను. తరువాత రాజు నానా విధములయిన ఆలయ సంబంధమైన చర్మ విచిత్ర కేళీ సంప్రోక్షితుఁడై దినమంతయు గడపెను. దినాంతమున నాచరింప నర్ఘమైన కర్మను స్వమంత్రి సచివానుగతుఁడై సలిపెను. అంత, సమీపమునందున్న భృత్యుల చేతుల యందున్న దీపికా సమూహముచే గృహ మందలి అంధకార మంతయును శాంతించెను. అంత ఆసనమును రాజు అలంకరించెను. పురోహితులు మంత్రులు సామంతులు, నాయకులు అనేకులు వచ్చి రాజును సముపాసించి యుండిరి. దేవగణములతో గూడి యుండిన ఇంద్రునివలే రాజ సమితి యందు రాజు వివిధములయిన వినోదములతో కూడి సంతుష్ఠుఁడయ్యెను. తరువాత వివిధములయిన వాద్యములచే వినోదములచే నృత్యములచే ప్రేక్షకులచే ప్రవృత్తమయిన హసనాదీ కథా ప్రసంగములు జరిగెను. తరువాత గణికాజనుల హాస్యయుత నర్మయుత హాస క్రీడా విలాసములతో రాజు పరితోషిత చిత్త వృత్తుఁడయ్యెను. ఈ విధముగా నృపతి నిశార్దము వరకు నానా విహార విభవాను భవములచే కాలము గడిపి, నరపతులను వారి వారి నివాసములకు నంపెను.
తాను వాస భవనమున కరిగి యందుండెను. ఆతని రాజ సైన్యమంతయు వారి వారి వీర్య శౌర్య సంపత్ర్పభావ మహిమాసుగుణములయిన గృహముల కరిగిరి. ఆత్మాను రూపమయిన రూప విభవములందు, గొప్పవి యైన వస్త్రములు, పుష్పమాలలు, భూషణములు ధరించి అత్యంత సంతోషము నందిరి. ఆ నృపతి సైన్యములు వివిధములయిన అన్నపాన సద్భక్ష్య భోజ్య మధు మాంసములు క్షీరములు, ఘృతములు మొదలగు వానిచే తృప్తిని పొందిరి. దేవతలు స్వర్గమున తృప్తి పొందియుండునట్లు ఆ రాజ నగరమున సైనికులు తృప్తి పొందిరి. ఈ విధముగా ఆ రాజు యొక్క అనుయాయులు నానా విధోచిత సుఖానుభవ ప్రతీతి నొందిరి. రాజాను యాయులు వారిలో వారు అన్యోన్యమిట్లు మాట్లాడుకొని, “మన గేహధనాదులతో నేమి సాధింపఁబడును? మన మందర మిందే యుందము” అనిరి రాజు రాత్రి చేయవలసిన కార్యములు నిర్వర్తించి, తన ఉత్తమమయిన శయనీయము చేరి పరుండెను. ఆ శయనీయము రత్న నీకరణములచే ప్రకాశించుచుండెను. అందు కలలు లేని ప్రశాంతకర నిద్రా భాగ్యమును రాజు పొందెను.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 65 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter chronicles the spiritual dynasty of king Nimi and the illustrious rulers of Mithilā, known for their extraordinary detachment and profound self-knowledge. It describes how these kingly sages ruled vast kingdoms while remaining completely detached from worldly desires, living as liberated souls on earth. The devout reader is guided to practice inner detachment in daily life, realizing that true freedom lies in resting undivided in the supreme reality.