బ్రహ్మాండ మహా పురాణము
40 - చత్వారింశోధ్యాయః
అగస్త్యుడనెను : శ్రీకామకోటి పీఠమున నున్న మహాత్రిపురసుందరి కామక్షియనుపేర ప్రసిద్ధురాలై ఏయే విలాసములు చేసెను-1. ఓ ప్రవక్తలో వరిష్టుడవైన హయగ్రీవా! మహేశ్వరియై త్రిపురసుందరియైన యా మహాదేవి శ్రీకామాక్షియను పేర భూమండలముననున్నదై యేమి చేయును? ఈమె యొక్క దివ్యమైన చరితమును. నాకు జెప్పుము.
హయగ్రీవుడనెనుః- ఓ యగస్త్యా ఇక్కడ నున్నప్పటికిని కామాక్షీదేవి అందరి హృదయములందుండును. ప్రాణులకు వారివారి కర్మానుసారము ఫలితములనిచ్చును(3) లోకములో నడచుచున్నదంతయు ఈమె యొక్క విచేష్టయే. (వ్యాపారమే). ఒకడు ఏదో తలంచును. కాని యీమె స్వేచ్ఛగా చేయును. (తనయిష్టమైనట్లుగ ఫలితమునిచ్చును)-4 త్రీపురాధీ శక్తులు ఆమె యొక్క యవతారములే ఈమెయే మహాలక్ష్మి పూర్వమీమె మూడండములు సృష్టించేను-5. ముగ్గురు శక్తులకు గూడ పురత్రయము నీవాసము. ఒక యండమునుండి అంబికయు పురుషోత్తముడును (విష్ణువు) బుట్టిరీ-6. తరువాత మరొకయండమునుండి. వాయు శివుడును బట్టిరి. మహేశ్వరీ లక్ష్మితో విష్ణువును, - పార్వతితో పరమేశ్వరుని, సరస్వతితో బ్రహ్మను జతగూర్చెను. బ్రహ్మను లోకములను సృష్టించుకార్యము నందు నియోగించెను. వాసుదేవుని రక్షణమున, సంహారమున ముక్కంటిని నియోగీంచెను-8 వారందరు నెల్లప్పుడు సుఖమునిచ్చునా మహాలక్ష్మినీ ధ్యానింతురు. వీరు బ్రహ్మలోకమునను వైకుంఠమునను, కైలాసమునను వసింతురు-9, ఒకానొకపుడు కైలాసశిఖరమున పార్వతీదేవి విహరించుచు వెనుకనుండి మహేశ్వరుని రెండు కన్నులను మూసెను -10. అతనీ నేత్రము చంద్రసూర్యులగుటచే ముల్లోకముఅంధకారము జుట్టుకొనియంతయు వెలుగులేనిదయ్యెను-11. దానివలన సమస్తలోకములు వదలిపెట్టబడిన దేవపితృ క్రియలుగల వయ్యెను. (దేవపిత్యక్రియలు జరుగలేదు). ఏమిచేయుటకును దోషక ప్రజలేమియు దేలియకుండీరి-12. దానిని జూచి భగవంతుడైన రుద్రుడు పార్వతితో నిట్లనెను, దేవి! నీవు నౌకన్నులు మూయుటచే పాపము చేసితివి-15, ఋషులు తమతపములు వదిలిరి. వైదీకులు సంధ్యావందనముచేయని వారైరి. అంబికా! నీచే సమస్త వేదిక. కర్మ నశింపజేయబడినది-14. కావున పాపశాంతి కొఱకు దుష్కరమైన తపముజేయము. కాశీకి వెళ్లి. యచట కొంతకాలము వ్రతము నాచరించపుము-15. తరువాత కాంచీపురమునకు వెళ్లి యచట కామాక్షిని జూచెదవు. నీవు సర్వపాపహారిణియైన యా శివను (పార్వతి) ఆరాధింపుము-16, కంపా నదీతీరమున తులసిని ముందుంచుకొని తపముజేయము. అని యాదేశించి మహాదేవుడచటనే యంతార్థానముందెను-17. ఆ పార్వతియు భర్తయాజ్ఞననుసరించి యట్లేచేసెను. చాలాకాలము ఏకాగ్రహృదయే కష్టపడిన శివ (పార్వతి)-18. యొక్క యెదుట కామాక్షి ప్రత్యక్షమై యిట్లు పలికెను. ఓ సుప్రతియైన వత్సే నీయత్యుగ్రతపమునకు సంతసించితిని-19, తరువాత పార్వతి కండ్లుదెరచీ తనయెదుటనున్న పరాంబికను జూచెను. ఆమె పదివేల బాలసూర్యులతో సమానముగా వెలుగుచుండెను. సర్వాభరణములనలంకరించికొనియుండెను-20. కిరీటము హారములు భుజకీర్తులు కంకణములు మొదలగువానినలంకరించుకొనెను. పాశము, అంకుశము, చెలకువిల్లు, ఐదుబాణములు చేతులలో గలిగియుండెను-21. కిరీటమువైన ప్రకాశించు. చంద్రరేఖ యలంకారముగా నుండెను, ఆమే బ్రహ్మ విష్ణు-రుద్రులకు ఈశ సదాశీవపదములనిచ్చునది-22 ఇక పైపదములేని సగుణ బ్రహ్మనుగాసామెను జెప్పుదురు. "ఆమె ఇహలోక పరలోకములను రెండు ప్రపంచముల నిర్మాణమును చేయించునది. అట్టి పరాంబికను పార్వతి చూచెను-23. తరువాత .. ఆమహారాణిని జూచి పార్వతి మహానందమున నోలలాడెను. సర్వశరీరమున గగుర్పాటు. నిండెను. సంతోషమున కన్నులు వికసించెను-24 - చండికా మంగళాదులగు తన సఖీజనముతోబాటు సాష్టాంగ ప్రణామము జేసెను. ప్రదక్షిణము జేసి-25. చేతులు జోడించి మరల నమస్కరించెను. తనతోనేక స్వరూపిణియైన యా మహాత్రిపుర సుందరీ దయతో జూచి-26. బాహువులతో కౌగిలించుకొని స్నేహముతో నీట్లనెను. “వత్సే నీ మనస్సు గోరిన రుద్రుని భర్తగా బొందుము-27. లోకమున నీవుగూడ రక్షకై నాయాజ్ఞను నెరవేర్పుము. నేను నీవు అను భేదమెక్కడిది? నిఃసంశయముగా నీవే నేను-26, ఓ కల్యాణీ నీకేమీ పాపము సంభవించినది? నీవే పాపములను ఖండించుదానవు, యోగీంద్రాలు నిన్నే బహురూపిణిగా జెప్పుదురు-29, వత్సే! ఇది లీలామాత్రము. పరలోక విడంబనము. ఈ విధమున చిలికిన మహారాణియైన యంబికకు సర్వమంగళ పార్వతి భక్తితో ప్రణమిల్లీ చూచుచు పరమప్రీతినీ పొందెను-30. పార్వతీ స్తుతింపగనే యాపరాశక్తి యామె హృదయములో బ్రవేశించేను. ఓమునీ ఆమె (పార్వతి) మిక్కిలి సంతసించెను. అంత పార్వతి యాశ్చర్యమంది మాటిమాటికి చింతించుచు అనేను చూచినది స్వప్నమా? లేక భ్రమయా?-32. అని విమర్శించి చుట్టంతట జూచేను, తరువాత చిరునవ్వు నవ్వు జయ-విజయయను సఖులను జూచి ప్రసన్నవదనయై నమస్కరించిన సఖులతో నిట్లనెను-38. ఓ ప్రియసఖులారా! ఇంతకాలమెచటికి బోయితిరి! నేను జూచిన కామాక్షిని మీరు చూచితిరా-34 సఖులు, ఆ మాటలు విని సంతసమున వికసించిన కన్నులు గలవారై పూజింపదగిన పుష్పములను ముందుంచి ఇట్లుపలికిరి-35. నిజముగా మేము గూడ నాపరాశక్తిని జూచితిమి. ఇదీ స్వప్నముగాదు. భ్రమగాదు. ఆ పరాశక్తి సాక్షాత్తుగా నీహృదయమును బ్రవేశించినది. అని పలికి ఆమె ప్రక్క వీనయముతో తలవంచి కూర్చుండిరి-36. ఏకామ్ర వృక్షమూలమున భగవంతుడైన శివుడు. భవానీ విరహముచే పీడితుడై, యా, గౌరీ సంప్రాప్తికై నియతేంద్రియుడై, కామాక్షిని ... ధ్యానించెను-37. అచట గూడ శ్రీవిద్యాదేవతయైన పరాదేవి ప్రత్యక్షమైనది. సంతసించినదై నిశ్చలముగా తన్నుధ్యానించు శివునితో నిట్లనెను-58, ఓ మన్మథుని మదమునణచినవాడా। నీ ధ్యానమును జాలింపుము. సాయాజ్ఞలోనున్న మన్మథుని మరల నంగీకరింపుము. ఇచట నాయాజ్ఞతోనే ఏకామ్రమను సాపీఠమున యెల్లప్పుడుండుచు. నీ ప్రీతికై నీవేవచ్చి యోసువ్రతుడా। నా సన్నిధిలో కంపానీరమున నుండు గౌరిని అనుగ్రహింపుము-40. యోగము వల్లను గౌరీ వియోగము వల్లను గలిగిన రెండు. తాపములను (బోగొట్టుకొనుము). వదిలివేయుము అని పలికీ యాపరమయైన రమ (పరాశక్తియైన లక్ష్మి) శివుని హృదయమున నంతర్థానమయ్యెను-41. వెంటనే శివుడు లేచెను. మనమున మిక్కిలి సంతసించెను. ఆమె యనుగ్రహమును బొంది సర్వదేవతలచే సేవింపబడెను-4 రెండు ప్రపంచములుగానున్న చరాచరజగమంతయు సామెవిలాసమున నామెలోబుట్టి యామెలోనే లీనమగును. అట్టి యా మహాత్రిపురసుందరినే హృదయమున ధ్యానించేను. వివాహమంగళాలంకారమునలంకరించుకొనుచున్నదియు, కంపానీరవాసినియు, దయార్ద హృదయము, శివయునైన గౌరిని అప్పుడు వివాహవిధితో అంగీకరించి తీసికొనివచ్చి వృషభమునెక్కి కైలాస శిఖరమునకు వెళ్లెను-43,44,45. ఓ పాపరహితుడా! అగస్త్యా! ఆదిలక్ష్మీ ప్రభావమును జెప్పెదను. దానికై మజాక ప్రాజ్ఞుని చరితముజేప్పెదను వినుము-46. బ్రహ్మ యొక్క సభకు వెళ్లి యట త్రిమూర్తులు గూర్చొనియుండిరి. దీక్పాలురు, దేవతలందరును, సనకాదియోగులును-47. దేవరులైన నారదాదులును, వశిషాదీతాపములును అచటకివచ్చిరి. వారందరును గలిసి బ్రహ్మకును శివునకును ఐదుముఖములుండుటచే భేదమును గమనింపలేకుండిరి-48, వారొకరినొకరు బ్రహ్మయెవడు? శంకరుడెవడు? అని అడుగుకొనుచుండిరి. ఆ విధముగ మాట్లాడుకొను వారీ మధ్యన వెంటనే శివుడంతర్షితుడైయుండెను-49. అపుడు పంచముఖుడైన బ్రహ్మ నల్లనైన నారాయణుడు వారిరువురికినీ “నేను బ్రహ్మను నేను బ్రహ్మను” అని వాదముకలిగెను-50. ఓ యజ్ఞానీ నానాభికమలమునుండి బుట్టిన నీవు నాకు బుత్రుడవు అనేను, సృష్టికర్తనైన నేను బ్రహ్మను, పేరులోని సాధర్యమువలన నట్లైనది, నీవును రుద్రుడును మీరిరువురును సృష్టికర్తనైన నాకు బుత్రులు-51. అని మాయామోహితులైన యా యిరువురి మధ్యనవారిరువురికీ తన యొక్క మహాత్యమును 'నేను బ్రహ్మను' అని చూపుచు మహేశ్వరుడు మహా జ్యోతిస్తంభ (గొప్ప వెలుగు స్తంభ) రూపమున ఆవిర్భవించెను-52. తరువాత ఈతని మహేశ్వరునిగా దెలిసియే విష్ణువు ఊరకుండెను. ఐదు ముఖములుగల బ్రహ్మ పారినవమానించి యట్లే యుండెను. ఎదుట బ్రహ్మయొక్క శిరస్సులకు పైన జ్యోతిశ్చక్రము (వెలుగుతో నేర్పడిన చక్రము) ఏర్పడెను-53. ఆ చక్రమధ్యన ఉమతో గూడ శివదేవుడు చక్కగానుండెను. బ్రహ్మపైకి జూచెను. మరల నవమానించి యిట్లుపలికెను-53. అది విని త్రిపురాంతకుడైన శివుడు మిక్కిలికోపమునందెను. అట్లే కోపముతోనే వికారముగా విష్ణువును జూచెను-35. వారిరువురి వికారమువల్లనే కోపముతో గూడిన భైరవుడు పుట్టెను. అపుడాతడు గోటితోనే బ్రహ్మయొక్క ఒక తలనుద్రుంచెను. హాహాయని యచటి యందరును ఏడ్చుచు పరువెత్తిపోయిరి-56. తరువాత భైరవుడు గోటినంటియున్న బ్రహ్మతలను ఎన్నిమారులు విదిలించినను అదీ వదలలేదు-57, ఆ బ్రహ్మ హత్యాపాపవిముక్తికై భూమి మీద తీరిగి సమస్త పుణ్యక్షేత్రములను, గంగాది మహానదులను సేవించెను. దాని వలన గూడ కపాలియైన (బ్రహ్మకపాలమును ధరించియున్న) భైరవుడు బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తుడుగాలేదు. విషాదము నీండిన ముఖముగలవాడై శోభాహీనుడుగాగనబడెను. చాలాకాలమునకు పూర్వము బ్రహ్మయుండిన కాంచీనగరమును జేరెను-59.. అచట భిక్షాటనము జేయుచుచుండెను. ప్రతిదినము పంచతీర్ణములలో స్నానము జేసి పరాశ్రీని సేవించుచుండెను. ఆ పంచ తీర్థములు భూలక్షణాంకీతములు-60. ఆ బిల్వలుడైన భైరవుడు మిక్కిలి భ్రమించినవానివలె కొంతకాలమచటనే యుండెను. కాంచీక్షేత్ర నివాసమున క్రమముగా ఆశయములు (కోరికలు) నియమితములయ్యేను-61: సమస్తభయములు విదిలిపోయెను. ఉత్తరమున లక్ష్మితో సేవింపబడినదియు దక్షిణమున వాసుదేవునితో (విష్ణువుతో) సేవింపబడినదియు-62. నైన (విష్ణు-లక్ష్మికుడియెడమల సేవింతురని భావము). శ్రీదేవిని మనసుతో వహించుచు(ధ్యానించుచు) శ్రీకామకోషమునకు (కామకోటి పీఠములోని యంతరహమునకు వచ్చి దాని యెదుటనిలిచెను. ఆత్మను, నిగ్రహించినవాడై యాదీలక్ష్మీపదధ్యానమును విస్తరింపజేసేను-63, కదిలించు గాలిలేనిచోట దీపమువలె, తరంగములు లేని సముద్రమువలె అంతర్వాయువుల నిరోధించుటచే అచలుడుగానున్న యీశ్వరుడు కదలలేదు-64. సర్వాత్ముడైన భైరవుడు తైలధారవలె ఎడతెగకుండగా ననుస్యూతముగా శైలతనయానాథశ్రీధ్యానసంతతినీ (పార్వతీ పతియైన శివుని శ్రీదేవియొక్క ధ్యానసమూహములను) విస్తరింపజేసేను-65. బ్రహ్మగాని, విష్ణువుగాని, సిద్ధుడైన కపిలుడుగానీ, తక్కిన సనకాదులుగానీ, శుకాదిమునులుగాని, ఆ సమాధినిష్ఠయందు ఏవిధముగను సమర్థులుగారు-66. ఆ తరువాత శ్రీభావయోగముతో శివుడు శ్రీభావమును బొందెను. అంత, ప్రభామండలమునందుండు శ్రీదేవి ప్రసన్నురాలయ్యెను. అర్ధరాత్రిలో నెదుట నీలిచి వాకిస్వరూపిణియైన యా శ్రీదేవి పలికెను-67. ఓ శ్రీకంఠ! సర్వపాపముల హరించువాడా! నీకేమీ పాపముగలదు? నీవు నా స్వరూపునివి. దేహమెట్లందువా! అదిలోక విడంబనము (లోకమును మోసగించి యెక్కిరించుటకు)-68. రేపటి దినమునకు బ్రహ్మహత్యనుండి క్షణంలో విముక్తుడవగుదువు-అనిపలికి యటమపోసింహానేశ్వరి అంతర్థానమందెను-69. భైరవుడు గూడ, సంతసించి శ్రీదేవిని జూచుట వలన కృతార్థుడై (ధన్యుడై), ఆ మిగిలిన రాత్రిని శ్రీదేవీ ధ్యానపరాయణుడై గడపి-70. ప్రొద్దున పంచమహాతీర్థములో స్నానముజేసి, సంధ్యోపాసనముగావించి చేతినంటియున్న బ్రహ్మకపాలమును మాటిమాటికి విదిల్చుచుండెను-71 ఐనను అది వదులుట లేదు. దాని వలన మిక్కిలి వీచారమును - బొందెను. - ఇది. స్వప్నమా! మాయయా! మానసభ్రాంతియా! -72. ఈ విధముగ మాటి మాటికి చింతించీ ఈశుడు - శోకవ్యాకులమనస్కుడయ్యెను. తరువాత శివుడు స్వయముగనే శోకమును నిగ్రహించి ధీరశ్రేష్ఠుడై-73. తులసీమండలమునకు నమస్కరించి, ఎదుటనీలిచి పూజించి, ఇంద్రియ సమూహములనన్నింటిని నిగ్రహించి. మరల సమాధిస్థుడయ్యెను-74 ఒక జాముగడవగనే మరల ---- దేవి సన్నిధికి వచ్చెను. (ప్రత్యక్షమయ్యెను) “ఓ శంభో! సమాధి చాలు. ఈ సరోవరములో మునుగుము”, అని, యాదేశించి యంతర్థానమందెను. అతడు గూడ చింతింపసాగెను. ఇది మాయయా! స్వప్నమా? ఇపుడు నేనేమి చేయవలెను-76. రేపటికల్ల క్షణములో బ్రహ్మహత్యనుండి ముక్తుడవగుదువు -అని శ్రీపరాదేవి చెప్పినది. ఇప్పుడు దినములో : జాము గడిచినది-77. ఇదియంతయు మిథ్యయే (అబద్దమే)-అని - భగవంతుడు మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. ఆకాశవాణి మాత్రము నీటిలో మునుగుము అని గర్జించేను-78. అదివినీ సందేహము వదిలి నీజమును నిశ్చయించి శంకరుడు గంగా సరసిలో మునిగెను. మునిగిలేచినవాడై యచటి కాళిని జూచీ “ఇదియేమ'ని చింతించుచు గోటినంటిన కపాలముతో క్షణకాలమూరకయుండెను-80. తరువాత బాలచంద్రధరుడైన శివుడు నుదుటిపై యెండగాయు సూర్యుని జూచేను, వశియైన (ఇంద్రియనిగ్రహము గలవాడైన) శివుడు భిక్షణకై యా నగరిలో ప్రవేశించెను-81, కొన్ని గృహములకు వెళ్లి . మార్గమధ్యన దిరుగుచు ఆ భవుడు ఎదుట శ్రీదేవతాకృతిలోనున్న ఒక మొలనూలును, కాంచిని జూచెను-82 ఆమె యాతనికి జ్యోతిర్మయభిక్షనిచ్చి వెంటనే యంతర్భావమందెను. ఆక్షణముననే అతనిగోటి చివరనుండి బ్రహ్మకపాలము జారిపడెను-83. ఈశానుడు ఆయద్బుతమును, ఉత్తమమైన కామాక్షీలమును జూచి ప్రసన్న (శాంతి వహించిన) ముఖముగలవాడై - పరాదేవిని మాటిమాటికి బహుమానించేను. (పలుమారులు తలంచెను)-84. కాంచీపురియనుపురి పుణ్యమైనది. కంపానదియనునది పుణ్యమైనది. ఆ కనబడినదే. కామాక్షీ దేవత-అనుసంభావన (మంచిభావన) ప్రత్యక్షముగా గలిగినది-85. ఈ విధముగ దేవీ కటాక్షమున హరుడు సంకటమునుండి విముక్తుడై స్వస్థుడై పరాశ్రీని కొనియాడుచు స్వస్థానమునకు వెళ్లాను-86.
ఓ కుంభజా: మరొక దేవీవిలాసమును జెప్పెద వినుము. శ్రీమహాదేవీప్రభావము వినువారికెల్లప్పుడును కోరికలను దీర్చునది-87. దశరథుడు అను పేరుగలవాడు అయోధ్యకధిపతియైన రాజు, సంతానములేని వాడై చాలాకాలము శోకాకులుడై యుండెను-88. బుద్ధిమంతుడైన రాజు తన పురోహితుడైన వశిష్టుని రహస్యస్థలమునకు బిలిచి ఆచార సంశుద్ధుడై సర్వశాస్త్రార్ధములను దెలిసిన యాతనితోనిట్లనెను-89. శ్రీనాథుడా! (బృహస్పతీ! విద్యానాథా) ఎన్నోకాలములుగడిచినవి. పుత్రుడు గలుగలేదు. సంతతికొకైన తాపమునాకు మిక్కిలి వృద్ధిచెందుచున్నది. ఏమిచేసిన సంతానసంపద కలుగునో జెప్పుము-90
వసిష్ఠుడనేను :- ఓరఘువంశములోని మహారాజా! నీకురహస్యము జెప్పెదను. అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచి, అవంతిక,-ఇవి పట్టణములలోనుత్తమోత్తమములైనవి. మిక్కిలి పుణ్యవంతములైనవి-1, ఈ నగరి యొక్క సాంనీధ్యమాత్రమున (ఈనగరిలో నున్నందున) మహాత్రిపురసుందరినీ అర్చింతురు. అయోధ్యయందు ఈమె అధిదేవతను అర్చింతురు-92, ఈమెతో సమానురాలైన యే పరదేవతయు లేదు. ఓ రాజా! ఇతరులందరు ఈమెనే అర్చింతురు-95. బ్రహ్మ-విష్ణు-మహేశాదులు తమ స్త్రీలతోబాటు ఎల్లప్పుడు ఈమెను బూజింతురు. కొబ్బరికాయల వరుసలతోను, పనసపండ్లతోను, అరటి పండ్లతోను-94. పెద్దపెద్ద పాత్రలకొలది తేనెలతో, నేతులతో, శర్కరలతోను, గోప్పపాయసరాశులతోను, సిద్ధద్రవ్యవిశేషములతోడను త్రిపురాంబికను బూజింపవలెను. ఆమె మనకు వెంటనే కోరిన దాని నొసంగును-95. ఈ విధముగా తన పుత్రప్రాప్తికైచెప్పిన గురువైన వసిష్టునికిష్టమైన కానుకలిచ్చి దశరథమహారాజా తనిని పంపించేను-96. తరువాత రాజేంద్రుడైన దశరథుడు గురువు చెప్పిన విధముగనే లలితా పరమేశ్వరిని పరమభక్తితో బూజించెను. -97. ఈవిధముగా ప్రతిదినము పూజించి ప్రీతమనస్కుడై అయోధ్యాదేవతలకు నెలవైన కాంచీలోనుండి కామాక్షిని సేవించెను-98. నీశ్చలమైనయుల్లాసమును దీపింపజేయు (ప్రేరేపించు) అర్థరాత్రి గడపగనే కొద్దిగా నిద్రాలసుడైన దశరథుని యెదుట త్రిపురాంబిక ప్రత్యక్షమయ్యెను-99. అపుడామెయిట్లున్నది. నాలుగుభుజములలో పాశము, అంకుశము, ధనువు, బాణములు అలంకరించియున్నవి. వేషము సర్వశృంగారముతోనొప్పినది. సర్వాభరణభూషితయైయున్నది. అట్లుండి ఇందుమతీపుత్రుడైన దశరథునితో నీమాటలు పలికెను-100. ఓ శ్రీమంతుడవైన దశరథా! పాపరహితా! నీకు పుత్రభాగ్యమున్నది. కాని నీవు పూర్వము చేసిన విశ్వాసఘాత కర్మలు (నమ్మకద్రోహమున చేసిన పనులు) ఉన్నవీ-101. ఆ పాపకార్యముల శాంతికై కాంచీపురవరమునకు వెళ్లి కంపాసరసిలో స్నానముజేసి యట పవిత్రురాలనైన నన్ను జూడుము-102 కాంచీపురము యొక్కమధ్యన గుహాకాశమధ్యనుండి ఏడు ద్వారములుగల బిలముతోగూడిన కామకోష్ఠమను అంతర్గృహముండును. అది సామ్రాజ్యమును సూచించునది, అది త్రీపురుషులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకును) సిద్దులనిచ్చునది. దానిని విపాపుడెవై (పాపములేనివాడవై) ప్రవేశింతువు. అచటనే మహాసింహాసనేశ్వరియైన నేను తూర్పుముఖము గలదాననై యుందును-104 స్వరూపము మహాలక్ష్మీస్వరూపము. రెండు భుజముల పద్మములధరింతును. చక్రేశ్వరిని. మహారాజ్ఞిని, స్థూలచక్షువులకు (సూక్ష్మమును జూడలేనివారికి) కనబడను-105. నౌకన్నునుండి పుట్టిన గౌరి నాకుడివైపుననుండును. ఆమె సౌందర్యమునకు హద్దు. (అంతకన్నమించిన సౌందర్యములేదు) సర్వాభరణములనలంకరించికొన్నది-106. నాచేత కల్పింపబడిన నివాసముగలది. రెండుభుజముల పద్మముల ధరించినది. మహాలక్ష్మీరూపములో కృత్యరూపమాయన్నట్లున్నదీ-107. ఆమెను పీఠమునుండి శిరస్సువలకు నాయంశమునబుట్టిన దాని జూచువానికి మహాపాతకములు వేగముగా నశించును. ఉపపాతకవిషయము చెప్పవలెనా? -108. చెడు సంస్కారముగాని, చెడుబుద్ధిగాని, చెడు తర్కముల సమూహముగాని, చెడుదేహముగాని, చెడు భావముగానీ దేవుడులేడను బుద్ధి (నాస్తికత్వముగానీ ఇవియన్నియు నశించిపోవును-109. శర్కర, తేనె, నేయి, దీనితోగూడిన పాయసములతోను, వివిధములైన భక్ష్యభోజ్యములతోను, షడ్రసములతో గూడిన పదార్థములతోను నాకు మహాపూజను జేయుము-110. అచటనే నేను సుప్రసన్నురాలనై నీపరమును (కోరికను) పూర్తీచేయుదును-అని ఉపదేశిచి సామ్రాట్టియైనయపరాదేవి యంతర్థానమందెను-111. రాజు (దశరథుడు) కూడ వెంటనేలేచి 'ఇది యేమని యాశ్చర్యమంది, శుభలక్షణముతో గనబడుకౌసల్యాదేవిని మేలుకొలిపి-112. యామేకాదరముతో నా రాత్రి వృత్తాంతమును జెప్పెను. అది విని యాకౌసల్య యపుడు సంతోషమునందేను-113. సంతసించిన రాజు ప్రొద్దుననే భార్యతోబాటు అనేక మంత్రులతో గూడి కాంచీపురమునకు వచ్చెను-114. రాజు కౌసల్యతోబాటు కంపానదిలో స్నానముజేసి పావనియైన యామహదేవిని దర్శించి తరువాత పంచతీర్థములలో స్నానముజేసి-115. యా తీర్థక్షేత్ర నివాసులను ఆమెను భక్తితో పూజించువారీని ఆవులు, భూమి-వస్త్రములు-బంగారము మొదలగువస్తువులదానముచే సంతోషపెట్టెను-116. తరువాత నారాజశ్రేషుడు భక్తితో నాలయ మున బ్రవేశించి, వినయముతో మూడు ప్రదక్షిణలుచేసి-117. తరువాత కౌసల్యతోసహ మూలసంనిధికి వచ్చెను. శ్రీకామ కోష్ఠముననున్నట్టియు, త్రిమూర్తులకు తల్లియైనట్టియు, శ్రీచక్రస్వరూపిణియై మహాత్రిపురసుందరియైన యంబను భార్యతోబాటు భక్తిమంతుడై సాష్టాంగముగా (జాగిలి) మొక్కేను-119. అది స్వపురమై త్రిపురమైనధామము, దానిని పూర్వమిక్షాకరాజులు ప్రవర్తింపజేసిరి, అదీ సశిష్యుడైనదుర్వాసునిచే పూజకొఱకై ప్రకల్పితమైనది-120. దాసీదాసులతో ధ్వజారోహోత్సవముతోను గృహోత్సవముతోను గూడినది. అచట తనగురువు చెప్పిన విధముగా స్వాత్మారపూజను జేసెను -121. రాత్రి స్వప్నములో జూచీన రూపముచేయా స్వపురమున తేజోరూపమున జూచెను. రాజసత్తముడైన దశరథుడు అక్కడ గూడ నారూపమునే ధ్యానించెను -122. పౌలకాలము ధ్యానించి మహారాజు మంచి వస్త్రములను పెక్కింటిని దీవ్యములైన ఆయతనములను (యజ్ఞశాలలను) ఆమెకిచ్చిస్తోత్రము జేసెను-123. పాదముల చీవరవ్రేలాడునుత్కుృష్టమైన యాభరణములతో సుందరమైనదానా! కాలిగజ్జెలపైని రత్నకాంతులతో మనోహరమైన పాదపద్మములు గలదానా! పీతాంబరమునందు మెరయు సుకుమారమైన బంగారు మొలనూలు గలదానా, భుజకీర్తులతోను కంకణములతోను అలంకరింపబడిన తీవవంటి బాహువులుగల దానా-124. పుండ్రమనుశ్రేష్టమైన చేలకు వింటితో బ్లాకాశీంచు మృదువైన యెడమ చేయిగలదానా! రత్నాంగుళీయకములతోను పుష్పబాణములతోను ఒప్పిన కుడి చేయిగలదానా! స్తనమండలమున విశేషముగ బ్రకాశించు తెల్లనిహారములుగలదానా! పాశము, అంకుశము, భుజభూషణములు-వీనిచే బ్రకాశించిన భుజములతో నందమైనశరీరముగలదానా! -125. ముఖకాంతిచే శరత్కాల చంద్రబింబమును జయించినదానా! కమ్మలరత్నకిరణములచేనలంకరింపబడిన చెక్కిళ్ళగలదానా! ఎడమచేతిలో చక్కని తామరతూడుగల కమలమునుధరించినదానా! కరుణా ప్రవాహమును బ్రవహించు కనుకౌలుకులు గలదానా! మహేశ్వరి! -126. మణిహారపుమణులతో బ్రకాశించు శంఖముబోలికంఠముగలదానా! నుదుటనున్నచంద్రరేఖతో వెలుగెత్తిన ముంగురులతో శోభించుదానా! చిరునగవు మెఱుగులనొప్పినదానా! మనోహరమైన ముక్కుగలదానా! నేత్రశోభతోజయించిన కమలదళములు గలదానా! -127 చక్కని తీవ వంటి కనుబొమలుగలదానా! చక్కని ముఖముగలదానా! చక్కని నుదుటి చిత్రముగలదానా! యోగీంద్రులమనముల నెడికమలములనుండు హంసిస్వరూపిణి రత్నములు వరుసగా బొదిగిన బంగారు మహాకిరీటముగలదానా! సర్వాంగ సౌందర్యవతీ దేవాధిపునిచేత (ఇంద్రునిచేత) నమస్కరింపదగిన దానా!-128, కోరికల కనువైన వరములిచ్చుదానా! దయతో తడసిన (మెత్తనైన) చిత్తముగలదానా! సామ్రాజ్య సంపదచే అభిమానముగలదానా! చక్రమునకు సాథమైనదానా! ఇంద్రాదిదేవతలచే పూర్తిగా సేవింపబడిన పాదకమలములుగల దానా! సింహాసనమునకీశ్వరి! (మహాత్రిపురసుందరీ!) నాయందుచక్కగా నీలువుము -129, అని భక్తితో స్తుతించి యారాజు వెలుపలికి వచ్చి యామెకుడిభాగముననున్న మహాగౌరినీ జూచెను-130. భూమిపై సాష్టాంగదండ ప్రణామము జేసి, మరల నామెనుస్తుతించి, యామెకు గూడ గొప్ప విలువైన వివిధములైన వస్త్రములను-131. గొప్ప విలువగలిగివెలగలలేని గొప్పభూషణములను, ఇచ్చెను. ప్రదక్షిణము జేసి భార్యతోబాటు బయటికి వచ్చి-182. తనగురువు చెప్పిన రీతిలో మహాపూజను జేసి, యామెనే ధ్యానించుచు ఏడు రాత్రులుండెను-133. ఎనిమిదవదినమున దేవికి నమస్కరించి భక్తితో చూచుచు మనమున తల్లీ! నాకోరికనిమ్ము అని ప్రార్థించెను-184 దానికి సుప్రసన్నురాలైన ... కామాక్షి ఆకాశవాణి ద్వారా ఇట్లనెను. “ఓరాజా నాయంశగల నలుగురు కుమారులు నీకు గలుగుదురు”-134, అనుపలుకును విని సంతసముతో వికసించినముఖముగలవాడై అనన్య శరణుడై మాతయైన ఆపరాశ్రీదేవికి సాష్టాంగముగ ప్రణమిల్లి-136. మనస్సుతోనే వెళ్లివచ్చెదనని శలవుదీసికొనీ, భార్యలతోను. మంత్రులతోను ఆ యిందుమతీపుత్రుడైన దశరథుడు అయోధ్యానగరికి జేరెను -187. ఇట్టి ప్రభావముగల శ్రీకామాక్షి సర్వలోకములహితమును గోరును. సమస్త భక్తులయొక్క కోరికలను మిక్కిలి సంపూర్ణముగ నెరవేర్చును-138. . లోకములలో పెక్కురు ఈ పరదేవతయైన కామాక్షిని శాస్త్రీయముగా భక్తితో నుపాసించి న్విశేషముగా కోరికలను బొందిరి-139. ఓ మునీ, ఇప్పుడు గూడ భక్తిమంతులు తమకోరికలను బొందుచునేయున్నారు. కామాక్షియొక్క దయాదృషులకు పాత్రులగువారు ముందు {భవిష్యత్కాలమున) గూడ అనేకులుగాగలరు. ఈశ్రీదేవి మాహాత్యమును వర్ణించుటకు ఎవడు సమర్థుడు? నేనుగాను, శంభువుగాడు, భ్రహ్మకాడు, విష్ణువుకాడు. తక్కినవారి విషయమై చెప్పనేల?-141. ఈ విధముగా మహాలక్ష్మియొక్క ఉజ్వలమైన శీలమును కొంచెము చెప్పితిని. అది వినువారికిని చదువువారీకిని సర్వపాపములను హరించునది. అనియనబడినది-142.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీయవయధ్యాయము.40
Summary of chapter 152 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the daily routine and spiritual disciplines to be followed by a devout worshipper of the supreme mother from dawn until sleep. It outlines morning meditations, purificatory baths, mental worship, chanting, and night contemplation, turning every moment of daily life into an ongoing act of worship. The devout reader is inspired to live a life of constant divine awareness, offering every breath to the lotus feet of goddess Lalitā.