29 - భండాసురవధో

 అగస్త్యుడనెను :

ఓ హయగ్రీవ! మహాప్రాజ్ఞ! మంత్రిణీ జలమును వర్ణించితివి. యుద్ధమున చేసిన విషంగ వధను వర్ణించితివి-1. ఇక రణచక్రమున శ్రీదేవి పరాక్రమమును వినదలచితిని. సోదర మరణమును జూచి దుఃఖముతో భండాసురుడేమిచేసెను-2 ఆతని రణోత్సాహమెట్టిది? ఎవరితో యుద్ధము జేసెను. చంపబడిన సోదరులు పుత్రులును గల యాతనికి సహాయకులెవరుండిరి?-3.

హాయగ్రీవుడనేను :- ఓ మహాప్రాజ్ఞా! అగస్త్యా! ఈ లలితా చరితమును వినుము. ఇది సర్వపాపములను గత్తిరించునది. పుణ్యమైనది. అణిమాది గుణములనిచ్చునది-4, విషువత్తునకు సంబంధించిన ఆయన ప్రారంభకాలములందును, (విషువత్తు = రాత్రి+పవలును సమ పరిమాణములో నున్న దినములు) పుణ్యసమయములందును ఐదు పర్వములందును ఈ చరితము సిద్ధినిచ్చును. సర్వపాపముల బోద్రోలును. కీర్తినిచ్చును-5. అప్పుడు రణమున తన సోదరులిద్దరు (విషంగ విశుక్రులు) చంపబడుటను విని భండాసురుడు మిక్కిలి దుఃఖితుడై యేడ్చెను-6. చెదరిన తలవెంట్రుకలు గలవాడై భూమిపై మూర్చిల్లిపడెను. సోదర మరణమున కృశించిన వాడై యే మాత్రమును అశ్వాసమును (ఓదార్పును) పొందలేదు-7. మరల మరల నేడ్చుచు కుటిలాక్షుని చేత ననేక పర్యాయములు ఓదార్చబడుచు శోకముతోనుండియు కోపమును బొందెను-8. ఫాల మతిక్రూరముగా నుండెను. బోమ్మముడులు తిరుగుచు భయంకరముగా నుండెను. కన్నులు నిప్పులవలె నెళ్తానయ్యెను. నల్ల సాగుబామువలె దుసగొట్టుచెండెను-9. వేగముగా మాటిమాటికి కరవాలికను (ఖడ్గమును) దాకి విదిల్చుచుండెను. ఉత్పాత మేఘమువలె కోపముతో హుంకరించుచుండెను. వెంటనే సేనాపతియైన కుటిలాక్షునితో నిట్లనెను-10, 11. యుద్ధమున తనచూపు మాత్రముననే బలాత్కారముగా నా సోదరులు, పుత్రులు వేలకొలదీ సేనానాయకులును, ఈమెచే చంపబడిరి-12. ప్రమత్తయైన యాసీ యొక్క కంఠమునుండి వెడలిన రక్తధారలచే భ్రాతృపుత్ర మహాశోకమనెడి యగ్నిని నేను జల్లార్పుదును-13. ఓరీ! కుటీలాక్షా! నీవు వెళ్లుము. సేనను సిద్దము జేయుము-అని చెప్పి, వజ్రపాతమును గూడ సహించునట్టి కవచమును తొడిగి, భుజముల మధ్యన వీపున రెండమ్ముల పొడులను గట్టుకొని, గొప్పనైన సెరీరంకారముతో కఠినమైన ధనువును ట్రిప్పుచు-15. ప్రళయ కాలాగ్నివల కోపించినవాడై తన పురమునుండి బయలుదేరెను. పురద్వారమున నుంచబడిన తాలజంఘాదులు-16. నలుగురు శస్త్రసమూహములను కవచములను ధరించి యుద్దతులైన వారే యాతనిని వెంబడించిరి. కుటిలాక్షుడు మొదలగు ముప్పది యైదుగురు సేనానాయకులును తోడువెడలిరి. కోపించిన సర్వేసేనా పతీంద్రుడైన కుటిలాక్షుడును గలిసిన భండాసురునితో దీప్తమైన యాయుధములు గలవారు, దీప్తములైన కేశములు గలవారు ఉద్దీప్తములైన రోమాంచములు (పులకలు) గలవారును వెడలిరి. రెండువేల యేనుబదియైదక్షౌహిణుల సైన్యము-19. ఒకే హేలలో శత్రువులను జంపుటకు భండాసురుని వెంబడించినది. సర్వసైనిక సంకులుడై భండాసురుడు బయలుదేరగా-20. అచట శూన్యకనగరమున ఒక స్త్రీ మాత్రమే మిగిలినది. భండాసురడెక్కిన రథము ఆభిలమనుపేరుగలది. మహారథము వేయి వాహనములుగానున్న సింహములతో నొప్పినది. దానిని రణోద్దతుడైన భండాసురుడెక్కేను -21. విశేషించి మండుచున్న జ్వాలలుగల ప్రళయ కాలాగ్ని వలె బ్రకాశించుచు చంద్రహాస సమమైన యాకారముగలిగి యాతడు ధరించిన ఘాతకమును ఖడ్గము యుద్ధమునకు త్వరపడెను-22. ఇటునటు కదులచున్న సేనలవల్ల ధూళి పైకెగసినది. అదీ ఆ సేనల భారమును భరింపలేక ఆకాశమునకు పయనమైన భూమియా యన్నట్లున్నదీ-23. కొందరు భూమిచాలనివారైయాకాశమార్గమున గదిలిరి. కొన్ని రథములు కొందరి భుజములపై నెక్కి కదిలినవి-24. దిక్కులలోగాని, భూమండలమునగాని, చివరకాకాశమునగాని ఆసేనలిముడలేదు. ఒండొరుల నొరయుచు నొండొరుల పీడించుచు దుః ఖదుఃఖముగా కదలిరి-25. కొందరు మిక్కుటమైన సేనలతో సమ్మర్గము జెందిరి, కొందరు రథ చక్రములతో పొడిరి. కొందరు ఏనుగుల పాదములతో దొక్కబడి భూమిపై బడిరి-26. ఈ విధముగా సర్వసైనికులతో గదలుచున్న భండాసురని చేత వజ్రఘోషతో సమానమైన మేఘనాదముజేయబడినదీ-27. భండాసురునిముఖమునుండి వెలువడిన యాకోరసింహనాదముతో జగమంతయు బ్రద్దలయ్యెను-28. సముద్రము లెండినవి. చంద్రసూర్యులు పారిపోయిరీ, నక్షత్రములాకాశమునుండి పడినవి, భూమి యూగసాగేను-29. దిగ్గజములు భయము జెందినవి. దేవతలు మూర్చిల్లిరి. శక్తులనగరము అకస్మాత్తుగావచ్చిన భయముతో వివశమైనది-30. అతికష్టముగా యుద్దమధ్యమున ప్రాణముల ధరించుచుండిరి. శక్తులు భయముచే జారవిడిచిన యాయుధముల మరల ధరించిరి-31. వహ్నిప్రాకార వలయము ప్రశాంతమై మరల లేచినది. భండాసురుని సింహనాదముచేతను, సేనానాయకులు ధనుష్టంకారములచేతను-32. యోద్ధల యరపుల చేతను జగమంతయు శబ్దమయమైనది. ఆ మహానాదము చేత భండాసురుడు బయలుదేరెనని నిశ్చయించి శ్రీలలితాదేవి స్వయముగా యుద్ధము జేయుటకు బయలుదేరెను-83. భండాసురునితోడియుద్ధము తక్కిన శక్తులకశక్యమని గమనించినది. స్వయముగనే యుదోద్యోగమునకు బూనినది-34. ఆమె యొక్క మహాభివృద్ధిగల చక్రరాజ రథము కదిలెను. దానికి నాలుగు వేదములు మహాచక్రములు. నాలుగు పురుషార్థములు అభయము (ధర్మార్థకామమోక్షములచే భయము లేనిది)-35. ఆనందమే ధ్వజముగా గలది. తొమ్మిది పర్వములు (అంతస్థులు-భాగములు) గలది. ఆనవపర్వములందు దేవులు బాణమేక్కుపెట్టి లాగి పట్టిన గురుధనువులు గలవారై సంసిద్దముగా నున్నారు-36. వారు పరార్థ సంఖ్యకంటే మించిన పరివారముతో సమృద్ధముగా నున్నారు. వీరిచే అన్ని పర్వస్థానములందన్ని దిక్కులందును రథము రక్షింపబడుచున్నది-37. ఆ రథము పదీయోజనముల యెత్తైనది. నాలుగు యోజనముల విస్తారముగలది. అల్జీ మహారాజ్ఞియొక్క చక్రరాజమైన రథశ్రేష్టము ముందుకు కదులుచు ప్రకాశించేను-38. ఈ విధముగా సేవింపబడిన యారథము దండనాథయైన శ్యాముచేత కదలినది, బాలగేయచక్రరథమును ముందుగను, కిరిచక్రరథమును వెనుకను కదిలించేను-39. నరులు సింహములు ఒంటెలు సర్పములు మృగములు పక్షులు గుఱ్ఱములు-40. ఏనుగులు  భేరుండములు శరభములు పులులు గాలినెదిరించి పరుగిడు ఇట్టివంటి మృగములు-ఇటువంటి మరికొన్ని మృగములు-ఇటువంటి వేలకొలది వాహనములతో నితరశక్తులు గూడ కదిలిరీ-(40-41) కింద మీద బహుప్రకారముల వ్యాపించిన శక్తులు మాటిమాటికి భండాసుర వధకై యుద్యుక్తలగుచున్నారు. వహ్నిప్రకారచక్ర (మండల)ము యొక్క ద్వారమండలము ఒక యోజనము పొడవు-విస్తారములు గలిగియున్నను సేనాపతికి చాలలేదు-42. జ్వాలామాలినిక యను నిత్యాశిక్షి సైన్యములు బయలువెడలుటకై, ద్వారమును మిక్కిలి విస్తారముగా దేరను-43. ఆ తరువాత జగన్మాతయు, మహాభివృద్ధి గలదీయు, ప్రతాపవంతురాలును ఐన మహారాజ్ఞి అగ్నిపురమునుండి వరద్వారము గుండా బయలువెడలెను-44. దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షములు గురిసినవి. ఆ పెద్ద ముత్యముల గొడుగు ఆకాశమును బ్రకాశింపజేయునదిగా గనబడెను-45, లలితా సైన్యమున జయశ్రీ సూచకముగా నిర్మల శాంతములైన నిమిత్తములు (శకునములు) సంభవించి శత్రుసైన్యమున మాత్రము ఉత్పాతములు గలిగినవి-46.

            ఆ తరువాత ఉభయ సేనలకు యుద్ధము జరిగినది. ప్రసరించు బాణములతో ఒక సమూహముగా యుద్ధభూమిపై చిమ్మచీకటులు కప్పబడినవి-47. గజసమూహములు చంపబడుచుండెను. వానినుండి రక్తబిందువులు ప్రసరించుచుండెను. రాక్షసుల శిరముల పైకప్పుగానున్న తెల్లగొడుగులు హరింపబడుచున్నవి-48. దిక్కులుగాని, ఆకాశముగాని, యేనుగులుగాని, భూమికాని వేయేల నేమియు గనబడుటలేదు. కేవలము అచట అంతట వ్యాపించీ కప్పిన ధూలి కనబడుచున్నదీ-49. యుద్ధము జేయుచున్న యుభయ సేనల రక్తమొక నదియై ప్రవహించినది. తలలు తెగి నాట్యమాడుచున్న మొండెములు ఒడ్లలో కుప్పజెప్పలై చేరుటచే అచట వృక్షముల నవీ యావిష్కరించినట్లున్నవి. రాక్షసులతలెంట్రుకల గుంపులు నాచుగానుండి యానదీని కోమలగా జేసినవి. తెగిపడిన వెల్లగొడుగులు ఆ నదికి తెల్లకమలములవలె బ్రకాశించుచున్నవి. చక్రములచే తెగిపడిన యేనుగుపాదములు ఆనదిలో తాబేళ్ల వరుసల వలె శోభిల్లుచున్నవి-51.శక్తులచే ఖండింపబడిన మహారాక్షసుల గళములు చెక్కిల్బును ఆ నదీలో గండశిలలుగా దొరలుచున్నవి. కాండములు (పట్టుకొను కట్టెలు) తెగిపడిన సైనికుల చామరములు. ఆనది నురగలవలె శోభిల్లుచున్నవి-52. వాడియైన కత్తులనెడి తీగల గుంపులతో దట్టముగా జేయబడిన తీరప్రదేశములు గలిగియున్నది. మృతరాక్షసవీరుల కండ్లవరుసలు మౌక్తిక సంపుటముల వలె నొప్పుచున్నవి. (ముత్యాల మూటలవలేను ముక్తి స్థానములవలేను నొప్పుచున్నవి). రాక్షసుల నూర్లకొలది వాహన సమూహములన్నియు ఆ నదిలో మొసళ్లవలేను మీనముల వలెను బ్రకాశించుచున్నవి. ఈ విధముగా యుద్దము చేయుచున్న యుభయ సేనల రక్తనది ఒక నదివలెనే ప్రవహించుచున్నది-54. ఈ విధముగా చతుర్ధ దీవసయుద్ధము ప్రాతఃకాలము మొదలుకొని రెండుజాముల వరకు మృత్యుభయంకరమై యుభయ సేనల మధ్య జరిగెను-55. ఆ తరువాత భండాసురునకు లలితాదేవితో యుద్దమయ్యేను. అస్త్ర ప్రత్యస్తముల సంక్షోభములతో దీకుల తటములు దొమ్మీగానైనవి. దిక్కులు విడివిడిగా తెలియనంతగా గలిసినవి-56. ధనువుల సొరీరంకారములచేతను హుంకారముల చేతను రణము మిక్కిలి భయంకరముగా నున్నది. లలితాదేవియొక్క చేతి నైపుణ్యమున ప్రాణహారి బాణములు అమ్ములపొదీయను ముఖము నుండి ప్రయోగింపబడుచున్నవా? లేక ధనువునుండి ప్రయోగింపబడుచున్నవా? అనిపించు చున్నది. ఆ వేగమున నేదియు స్పష్టముగ దెలియుటలేదు-57. ఓ యగస్త్యా! యుద్ధమున ఆమే శరప్రయోగ నైపుణ్యమంతయు జెప్పేద వినుము-58. ఆమె బాణమునెక్కుబెట్టినపు డొకటీగనే యుండును. ధనస్సు నుండి విడివడినపుడు పదియగును. పోవునపుడు నూరగును. ఇక దైత్య సైన్యమును జేరినపుడు వేయియగును. దైత్యుల శరీరములదాకినపుడు ఆబాణములు కోటి సంఖ్యలే తాకును-59. మహారాజ్ఞియైన లలితాదేవీ తనబాణములచేత గాఢాంధకారమును సృజించినది. ఆకాశమును, బ్రద్దలుకొట్టినది. తరువాత ప్రచండుని యొక్క మర్మములను ఛేదించినది-60. తరువాత భండాసురునీ కన్నులు కోపముచే నెఱనైనవి. వాడు మహేశ్వరిపై శరజాలమును వర్షించెను-61. వాడు అంధతామిస్రమను వస్త్రమును ప్రయోగించెను. మహేశ్వరి దానిని మహాతరణి (సూర్యుడి) అను బాణముచేత నివారించేను-62. మహావీరుడు భండుడు రణమున ఖండాస్త్రమును ప్రయోగించెను, జగదంబ దాని నివారణమునకై గాయత్ర్యస్తమును సృజించి ప్రయోగించెను-63. భండుడు శక్తుల దృష్టి వినాశకమైన యధాస్త్రమును సృజించి ప్రయోగించెను. లలితాదేవి చాక్షుష్మతమను మహాస్త్రముతో దానిని శమింపజేసెను-64. భండుడు మహారణమున శక్తినాశమను వస్త్రమును బ్రయోగించెను. లలితాదేవి విశ్వావసువను (సూర్యుడను) సస్తముతో వాని మదమును బోగొట్టేను-65. కోపించిన భండాసురుడు గోప్పదైన అంతకాస్త్రమును సృష్టించి ప్రయోగించెను. లలితాదేవి మహామృత్యుంజయాస్త్రముతో దానిని నశింపజేసెను-66. భండుడు సర్వాస్తస్మతీ నాశనను నస్త్రమును బ్రయోగించేను. చక్రేశ్వరియైన లలిత ధారణాస్త్రమును (మేధా-అనునస్త్రమున)దాని బలమును నశింపజేసెను-67. శక్తులకు భయమును గలుగుజేయుటకు భండుడు భయాస్త్రమును బ్రయోగించెను అంబిక అభయంకరమైన టైంద్రాస్త్రమును ప్రయోగించి యాభయమును నివారించేను-68. భండాసురుడు - శక్తి సేనలలో మహారోగాస్త్రమును ప్రయోగించెను. దానివల్ల రాజయక్ష్మ మొదలగు వేలకొలది రోగములు శక్తిసేనలో గలిగినవి-69. దాని నివారణ సిద్ధికై లలితాపరమేశ్వరి సామత్రయమహామంత్రమహాస్త్రమును ప్రయోగించెను-70. అపుడు బాణమునుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడును బయలుదేరి హుంకారమాత్రమున రోగములనన్నింటిని దహించి ముదమును బొందించెను-71. వారు మహేశ్వరికి నమస్కరించి ముల్లోకములో ఆమెభక్తుల రోగముల నశింపజేయుటకై నీయోగింపబడి తమస్థానములకు వెడలిరి-72. భండాసురుడు ఆయుర్నాశనాస్త్రమును బ్రయోగించెను. దానికి కాలసంకర్షణీ యనునస్త్రమును దేవి ప్రయోగించెను-73. భండాసురుడు గొప్పనైన మహాసురాస్త్రమును సృజించి ప్రయోగించెను. దానినుండి వేలకొలది  మహాకాయులు మహాబలులు నైన-74. మధువు, కైటభుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండముండాది రాక్షసులు. పుట్టిరీ-75. చిక్షుభుడు, పామరుడు, రక్తబీజరాక్షసుడు (తన రక్తమునుండి రాక్షసులననేకుల బుట్టింపగలవాడు), శుంభుడు, నిశుంభుడు, మహాబలులైన కాలకేయులు-76. ధూములను వారు, మరికొందరు. ఆయస్త్రమునుండి బయలుదేరిరి. వారందరు రాక్షసశ్రేష్టులు, వారు తమకఠినములైన శస్త్రసమూహములతో-77. శత్రు సేనను మర్ధించిరి. భయంకరముగా గర్జించిరి. దైత్యులచే మగ్గింపబడి సేనాశక్తులు హాహాయని యరచుచు వేగముగా రక్షింపుము రక్షింపుము అని లలితాదేవిని శరణము పొందిరి. అంత దేవి మీక్కిలి కోపించినదై కోపముతో పెద్దగా నట్టహాసము చేసేను-79. ఆయట్టహాసమునుండి దుర్గయను నొక యశస్విని (కీర్తిగలది) బయలుదేరినదీ, ఆమే సమస్త దేవతేజములతో నిర్మింపబడిన విశ్వరూపిణి-80. ఆమెకు శూలి (ఈశ్వరుడు) శూలమునిచ్చెను. చక్రి (విష్ణువు) చక్రమునిచ్చెను. వరుణుడు శంఖమునిచ్యెను. అగ్ని శక్తినిచ్చెను-81. మహాయుద్ధమునకై మరుత్తు (వాయువు)ధనువును అక్షయ తూణీరములను (అమ్ములపొదులను) ఇచ్చెను. వజ్జీ (ఇంద్రుడు) వజ్రాయుధమునిచ్చెను. కుబేరుడు . చషకమును (పానపాత్రము)ఇచ్చెను-82. యముడు కాలదండమును, మహాదండమును, పాశమును పాశధరుడు (యముడు)ఇచ్చెను. బ్రహ్మ కుండికను (కమండలువును) ఇచ్చెను. బరావతము ఘంటనిచ్చెను-83. మృత్యుదేవత ఖడ్గమును డాలును ఇచ్చెను. సముద్రము షోరము నిచ్చెను. విశ్వకర్మ భూషణములనిచ్చెను. ఆమె యంగములు సూర్యుల పంక్తులా యన్నట్లు కిరణములతో ప్రకాశించుచు తాను ధరించిన సమస్తాయుధములను ప్రకాశింపజేయుచున్నవి-85. ఇంకను ఇతరులు ఇతరములైన పరికరములనిచ్చిరి. వీటనన్నింటిని ధరించి దుర్గ యుజ్వలముగా బ్రకాశించేను. సింహవాహనమునెక్కి నారాయణీ యుద్ధముజేసెను -86. ఆమె మహిషాసురుడు మొదలగు దానవులను జంపెను. చండీక పూర్వము సప్తశతిలో జేసినట్లే-87. యిచటగూడ మహిషాది దానవుల జంపెను. ఆ దుష్కరమైన పనిని నిర్వహించి యా లలితకు నమస్కరించెను -88. ఇంతలో దుష్టుడే భండాసురుడు శక్తిసేనలో మూకాస్త్రమును బ్రయోగించెను. జగజ్జనని దానికి మహా వాగ్వాదీని యనునస్త్రమును సృజించి ప్రయోగించెను-89. అట సమరమున భండాసురుడు విద్యారూపమైన వేదమును దొంగిలించు రాక్షసాధములను సృజించెను -90. మహారాజ్ఞి కుడిచేతి యంగుష్ఠనఖము నుండి తిరస్కరించెను. అప్పుడు భండాసురుడు మహావీరుడు రణమున అర్ణవాస్త్రమును సృజించెను-91. అట గొప్పనైన జల ప్రవాహమున శక్తి సైన్యము మునిగెను. అంత, లలితాదేవి కుడిచేతి చూపుడువ్రేలి గోటినుండి ఆదీకూర్మము (తాబేటి రూపమునున్న విష్ణువు) ఒక యోజనము పొడవు వెడల్పు గలదై పుట్టెను-92. దాని విశాలమైన చిప్పచే ధరింపబడిన వారై శక్తులు హర్షమును బొంది భయమును వదలిరీ-94. కూర్మరూపియైన భగవంతుడు ఆ సముద్ర జలమునంతయు ద్రాగివైచెను. అంతదుష్ట రాక్షసుడు హైరాణ్యాక్షమను మహాస్త్రమును వదిలేను-94. దాని నుండి గదాయుధులైన వేలకొలదీ హిరణ్యాక్షులు బుట్టిరి. వారిచే కొట్టబడుచున్న శక్తి సైన్యము భయముతో వివశమైనది. ఇటునటు పరుగిడి యుద్దకర్మలో శిథిలమైనది-95. తరువాత శ్రీలలితాదేవి కుడిచేతి నడిమీ వ్రేలిగోటి నుండి కైలాసమువలే తెల్లనైన మహా వరాహము పుట్టినదీ-96, ఆ వజ్రసమానమైన వరాహముతో చీల్చిబడినవారై కోట్లకొలది. హిరణ్యాక్షులు మర్ధింపడుచు నశించిరి-97. అంత భండుడతిక్రోధమున కనుబొమ్మల ముడిచెను. దాని నుండి కోటి సంఖ్యలతో హిరణ్యులు (హిరణ్యకశిపులు) పుట్టిరి-98. వారు మండుచున్న సూర్యుని వలె బ్రకాశించువారు. దీప్తాయుధములు గలవారు. వారు శక్తిసైన్యమును ప్రహ్లాదుని మర్థించిరి-99. వాస్తవముగా శక్తుల యొక్క ప్రహ్లాదమే ప్రహ్లాదభోలకరూపమున హీరణ్యునిచే పీడింపబడేను-100. లలితను శరణుబొందీ యామెకృపను బొందెను. తరువాత, శక్త్యానంద రూపుడైన ప్రహ్లాదుని రక్షించుటకై-101. మహేశ్వరి కుడిచేయి యుంగరపు వేలిగోటిని విదిలించేను. దానినుండి పైకెగసిన జూలుగలిగి, మండుచున్న మూడు కన్నులుగలిగి-102. క్రూరముఖము గలిగి, కంఠము క్రింద పురుషాకారుడై విష్ణుని యవతారమైన నరసింహుడు జనించెను. అతనికి గోళ్లు ఆయుధములు. ప్రళయకాలరుద్రరూపుడు, భయంకరముగా నట్టహాసము జేయువాడు-103. వేయిభుజములు గలవాడు. లలితాదేవీ యాజ్ఞను పాలించువాడు. అతడు భండభ్రుకుటినుండి పుట్టిన-104. హిరణకశిపులందరిని క్షణములో వజ్రమువలె కఠినములైన గోళ్లతో చీల్చెను. అపుడు భండమహాసురుడు లలితాదేవిపై దైవత వినాశకమూ భయంకరమైన బలీంద్రాస్త్రమును ప్రయోగించెను-105. అంత, మహారాజ్ఞి యొక్క కుడిచేతి చిటికెన వ్రేలికొననుండి గొప్ప ఓజోవంతులైన నూర్లకొలది వామనులు ఆ బలీంద్రాస్త్రదర్పమును నశింపజేయుటకై పుట్టిరీ-106. పోరు క్షణక్షణము వృద్ధిబొందుచు మహాబలులై పాశహస్తులై అస్త్రమున బుట్టిన బలీంద్రులను, పాశములతో బంధించిరి-107. లలితాదేవి కుడిచేతి చిటికెన వ్రేలికొననుండి పుట్టిన మహాకాయులు మహోత్సాహలు మహాకామేశ యోషితులు (మహాకామేశుని స్త్రీలు) ఆ బలీంద్రాస్త్రమును నశింపజేసిరి-108. భండాసురుడు రణరంగమున హైహయాస్త్రమును సృజించెను. దాని నుండి వేలకొలది కోట్ల కొలది సహస్రార్జునులు (సహస్రహస్తములుగల యర్జునులు) పుట్టిరి-109. అపుడు శ్రీ లలితాదేవి యొక్క యెడమ చేతిబోటన వేలిగోటినుండి పరశురాముడు పుట్టెను. అతడు కోపముతో మండిపడుచు సింహనాదము జేయుచు కఠినమైన తన గండ్రగొడ్డలి యంచున నీ వేలకొలది కార్తవీర్యార్జునులను చీల్చి చంపెను-111. అపుడు కోపించిన భండాసురుడు హుంకరించెను. దానినుండి చంద్రహాస ఖడ్గమును గలిగి-112. సహస్రాక్షాహీణుల రాక్షససేనతో గూడి కనిష్ఠుడైన కుంభకర్ణుని మేఘనాధుని నందనుని దీసికొని రావణుడు శక్తిసైన్యమును చాలావరకు మర్ధించెను-113. తరువాత లలితాదేవి ఎడమచేతి చూపుడువ్రేలి గోటి నుండి లక్ష్మణునితోబాటు కోదండరాముడు పుట్టెను -114. జడలే కిరీటముగా గలిగి, తీవలతో వీపున నమ్ముల పొదలు గట్టుకొని, నల్ల కలువరేకు వంటి చాయగలిగీ మాటిమాటికీ ధనువును అగుచు-115. దివ్యాస్తములతో క్షణకాలముననే రాక్షస సైన్యమును నశింపజేసెను. తరువాత రావణుని, అతనీతమ్ముడైన కుంభకర్ణుని మర్ధించెను. లక్ష్మణుడు మహావీరుడైన మేఘనాదునీ నశింపజేసెను-116. అంత, భండాసురుడు మహాభయంకరుడైన ద్వివిదాస్రుని సృజించెను. అతని నుండి పింగళలోచనములుగల కపులు అనేకముగా జనించినరి-117. వారు కోపముతో మిక్కిలి యొనైన ముఖములుగలిగి, వారిలోనొక్కక్కరు హనుమంతునితో సమానముగా నుండగా, క్రూరమైన క్రేంకారములజేయుచు శక్తి సైన్యమును నశింపజేసిరీ-118. అంత, శ్రీలలిత ఎడమచేతి నడిమిట్రేలిగోటినుండి బలరాముడు పుట్టెను, ఆతని కన్నులు క్రోధముతో నెఱనైనవి-119. నల్లని వస్త్రములు గప్పుకోన్నవాడు, కైలాసపర్వతమువలే నిర్మలధవళుడు. అతడు ద్వివిదా సంభూతులైన కపులందరిని నశింపజేసెను. మహాబలుడైన భండుడు రాజాసురమను మహాస్త్రమును సృజించెను. అయస్త్రము నుండి యనేకులు రాజరాక్షసులు పుట్టిరి-121. వారు శిశుపాలుడు, దంతవక్రుడు, శల్వుడు, కాశీపతి, పౌండ్రకుడు, వాసుదేవుడు, రుక్మి, డింభకహంసకులు-122. శంబరుడు, ప్రలంబుడు, బాణాసురుడు, కంసుడు, చాణూరమల్లుడు, ముష్టికోత్పల శేఖరులు-123. అరిష్ణుడు, ధేనుకుడు, కేశి, కాళీయుడు, యమలార్జునులు, పూతన, శకటుడు, తృణావర్తుడు మొదలగు రాజరాక్షసులు-124. మహా వీరుడైన నరకుడు, విష్ణురూపియైన మురాసురుడు అనేకులు సేనలతోబాటు శస్త్రపాణులై బయలుదేరిరి-125. వారినందరిని జంపుటకు శ్రీదేవి యొక్క యెడమ చేతియుంగరపు వేలిగోటినుండి బుట్టినవాడు, సనాతనుడైన వాసుదేవుడు-126. చతుర్వ్యూహమును విస్తరింపజేసెను. దాని నుండి నలుగురు పుట్టిరి. వాసుదేవుడు, రెండవవాడు సంకర్షణుడనబడెను-127. ప్రద్యుమ్నుడు, అనిరుద్దడును. వీరందరు ఆయుధముల నెత్తినవారై దురాచారులు, భూమికీ భారమును బెంచినవారును-128. రాజవేషమున దాగియున్న మహాసురులను నశింపజేసిరి-129. వారు నశింపగా కోపించిన భండాసురుడు ధర్మవిప్లవము జేయు భయంకరమైన కల్యస్త్రమును వదిలెను-130. ఆ కల్యస్తము నుండి రాజులైన ఆంధ్రులు , పుండ్రులును పాపకృత్తులైన కిరాతకులు, శబరులు, హూణులు, యవనులును-131. వేదవిప్లొవకులు, ధర్మద్రోహులు, ప్రాణహింసకులు, వర్ణాశ్రమములతో సాంకర్య కారకులు, మలినములైన యంగములు గలవారును బుట్టిరి, వారు లలితాసైన్యములను మాటిమాటికి మర్ధించిరి-132. అంత, ప్రకాశించుచున్న లలితాదేవి ఎడమచేతి చిటికెన వ్రేలిగోటినుండి బుట్టిన జనార్దనుడు (విష్ణువు)-133. అశ్వారూఢుడై ప్రదీప్తమైన సీరిగలగీ అట్టహాసమునుజేసెను. వజ్రము యొక్క యొరపిడికి బంధువైన యాయట్టహాస ధ్వనికి కిరాతులందరు మూర్చితులై యుద్ధము జేయనశక్తులైరి. శక్తులు గూడ సంతసించిరి. దశావతార సాథులైన వారందరు (నరసింహాదులందరు) ఈ దుష్కరమైన శత్రునాశనకర్మను జేసి-135. లలితాంబకు నమస్కరించి చేతులు జోడించి నిలిచిరి. లలితాంబ వారిని ప్రతికల్పములోను ముత్యాది (ముత్స్యావతారాది) జన్మలతో ధర్మరక్షణము జేయుటకు నియోగించెను. తరువాత వారు వైకుంఠమునకు వెడలిరి-136. ఈ విధముగా అన్ని యస్త్రములు నశింపజేయబడగా, దురాశయుడైన భండాసురుడు మహామోహాస్త్రమును సృజించెను. దానివలన శక్తులు మూర్చిల్లిరి-137. అంబ శాంభవాస్త్రమును వదలి యా మహామోహాస్త్రమును నశింపజేసెను. ఈవిధముగా అప్రత్యస్త్రధారలచే మహాయుద్ధము జరుగగా, సూర్యుడెఱనై యస్తాది. జేరుటకు మొదలిడేను-138. ఆ పిమ్మట లలితాంబిక నారాయణాస్త్రముతో భండాసురుని సమస్తాక్షౌహిణుల సైన్యమును రణమున భస్మముజేసెను-139. తరువాత మండుచున్న కాలాగ్ని కాంతి గల పాశుపతాస్త్రముతో లలితాంబా మహారాజ్ఞి యిరువది నాలుగు సేనానాయకులను హతమార్చెను-140. ఇకదుష్టుడైన భండాసరుడొక్కడే మిగిలెను. సమస్త బొంధవజనము హతమయ్యెను. అపుడు జగద్విప్లవకారియు, కోపముచే మండుచున్నవాడును-141. మహారాక్షసుడు, మహాబలుడు, భయంకర పరాక్రమముగలవాడునైన భండాసురుని వేయిసూర్యులవతే ప్రకాశముగల మహాకామేశ్వరాస్త్రముతో మాతయైన లలితా పరమేశ్వరీ చంపివైచేను-142. అతని పట్టణమైన శూన్యకనగరము స్త్రీ-బాల-గోష్ఠధన ధాన్యములతోబాటు ఆకామేశ్వరాస్త్రజ్వలలచే వెంటనే యాక్రాంతమై-143. నిర్దగ్ధమయ్యెను. కేవలము స్థలము మాత్రము మిగిలినది. భండాసురుని మరణముచే ముల్లోకములు హర్షించి నాట్యముజేసెను-144. అనింద్యశీలయు, శ్రీచక్రరాజ రథమండలమున కలంకార సంపదయైనదియు, త్రిజగత్తుల జననియు, ప్రకాశించు వైభవముగలదియు నైన కామేశ్వరీదేవి యీవిధముగా దేవకార్యమైన భండాసుర వధమును నిర్వర్తించి విజయశ్రీతో నొప్పినదై-145 మహాప్రభావముగలదై సూర్యుడస్తమింపగనే యుద్దచర్యలచే భిన్నమై, భండాసురుని ప్రబలబాణాగ్నితో తపించిన సమస్త సైన్యమును తన శ్రీదేవతా శిబిరమునకు దీసికొనివచ్చెను-146. ఓ తపోధనశ్రేష్టా! క్లుప్తముగానున్న ఈ బంధాసుర వధమును ఒక్కమారైనను పరించిన వానికి యుద్ధములు నశించును. అష్టసిద్దులు సిద్ధించును. భుక్తియు ముక్తియు వినియరచేతిలో నుండును-147. ఈ పవిత్రమును, సమస్త పాపనాశకమును, సమస్త సిద్ధులనిచ్చునదియు నైన లలితా పరాక్రమమును పుణ్యదినములలో పఠించువారు ఉత్తమ భాగ్యసమృద్ధిని బొందెదదరు-148.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండాసురవధమను నిరువదితొమ్మిదవ యధ్యాయము-  యుద్ధఖండము సమాప్తము.