బ్రహ్మాండ మహా పురాణము
73 - విష్ణుమహాత్మ్యవర్ణనము
సూతుఁడిట్లనెను. దేవేశుడు, ఈశానుఁడు, నీలలోహితుఁడయిన ఈశ్వరుని శుక్రుఁడు ఆరాధించి, అతివినయముతో నమస్కరించి, దోసిలి యొగ్గి ఇట్లు పలికెను. కావ్యుని యొక్క శరీరమును ప్రీతిమంతుఁడయిన భవుఁడు హస్తముతో సంస్పృశించి ఆతనికి స్పష్టప్రత్యక్షదర్శన మొసంగి అచ్చటనే అంతర్ధానము చెందెను. తన యనుచరులతో దేవుఁడయిన భవుఁడు అంతర్షితుఁడు కాగా, అచ్చటనే ప్రాంజలి ఘటించి నిలుచుండి యున్న జయంతీతో గురుఁడైన శుక్రుఁడు ఇట్లనెను. “సుభగురాలా ! నీవెవ్వరీతవు? నేను దుఃఖించుచుండ నాతో దుఃఖము ననుభవించుచున్నావు. అఖండమైన తపస్సుతో కూడియున్న నన్ను ఎందులకు అనుసరించుచున్నావు, ఓ శుశ్రోణి, వరవర్లీనీ, సతతము ఈ భక్తిచే, దమముచే, స్నేహముచే, మిక్కిలి ప్రీతుఁడనైతిని. ఓ సుందరాంగి ! ఏమీ కోరుచున్నావు. నీవు ఏ కోరిక పరిపూర్ణముకా గోరెదవు? ఆ కోరిక సుదుర్లభమయిన దయినను నేను దానిని సమకూర్చెదను' అనిన నీ తపస్సుచే ఆనో కోర్కెను తెలిసికొనుట కరుండవు.' నామనోరథమును ఓ బ్రహ్మీష్ణ యథా తథముగా తెలిసికొనుము” అని ఆమె పలికిన దివ్యచక్షువులతో తెలిసికొని శుక్రుడిట్లు పలికెను. “ఓ మహేంద్రుని పుత్రికా ఓవరారోహ! నా హితార్థము నీవిచ్చటకు వచ్చితివి. ఓ సుశ్రోణి ! నాతో పది సంవత్సరములు సర్వభూతములకు కనపడకుండ సంప్రయోగము కోరుదువు. మహేంద్ర నీలరత్నవర్ల తుల్యురాలా ! సుందరవనీతా, సులోచనా, మధురభాషిణీ ! మనోరథమును నా వలన కోరుకొనుము. అదీయట్లు జరుగుగాక, ఓ మత్తేభగామీని ! మనమిర్వురము పోవుదము" అని జయంతితో సహితముగా ప్రభువు స్వగృహమున కేతెంచెను.
ఆ దేవితో, భార్గవుఁడు, సర్వభూతములకు అదృశ్యుండై మాయావృతుఁడై పదిసంవత్సరములుండెను. దితిసుతులైన రాక్షసులందరు, కృతార్థుఁడై శుక్రుఁడు వచ్చియుండుట తెలిసికొనీ, ఆతని చూడవలయునని కోరికతో, సంతుష్టులై ఆతని గృహమున కరిగిరి. జయంతిచే సంవృతుడైన తమ గురువును వారు చూడలేకపోయిరి.” అది “లక్షణ"ముగా (ఆతఁడు వచ్చియుండకుండుటకు సూచనగా) ఆదైత్యులేటింగ్ వచ్చిన విధముగనే తీరిగిపోయిరి. శుక్రుఁడు పదిసంవత్సరములు హితమును కోరునట్టి జయంతి. స్వప్రీతికొఱకు, దేవతల క్షేమము కొఱకు, సంరుద్ధుండై యుండుట బృహస్పతి తెలిసికొనెను. బృహస్పతి, అదియొక మంచి యవకాశమని తలంచి, దేవతల యొక్క రహస్యాలోచనచే ప్రచోదితుఁడయి, శుక్రుని యొక్క రూపమును ధరించి, వచ్చి సమావేశమొందిన అసురులనుచూచి-వారితో నిట్లు సంభాషించెను. “ఎవరి - కొఱకు నేను యజ్ఞమును చేయుచుంటినో అట్టి యాజ్యులయిన మీ కందరకు స్వాగతము. 'మీ హితము కొఱకు తిరిగి నేను వచ్చితిని. నేను సంపాదించిన విద్యల నన్నింటిని మీకుపదేశించెదను”. అనెను. అంతవారు సంతుష్ట మనస్కులైరి. విద్యలు సంపాదించుకొఱకు బృహస్పతిని " చేరిరి. అంత నిర్దిష్టమయిన! పదివత్సరముల కాలము పూర్ణమయ్యెను. దేవయాజియైన కావ్యునికి పదేండ్లు గతించెనని ఆకస్మికముగా జ్ఞప్తికి వచ్చెను. వెంటనే తన యాజ్యులను చూడవలయునని బుద్ధి కావ్యునకు కలిగెను. శుక్రుడిట్లనెను. చిరునవ్వుల వెలయించుదానా..! దేవి ! - వీభ్రాంతలోచనా త్రివర్ణాయతలోచన నాయాజ్యులను దర్శించుటకు పోవుచున్నాను." ఇట్లు చెప్పబడి ఆమె యిట్లనెను. “ఓ మహావ్రత ! నీభక్తులను సేవింపుము. ఇదీ యుత్తమముల యొక్క ధర్మము, నేను నిన్ను నీ ధర్మము నుండి దోషమాచరింప చేయను”. సూతుఁడిట్లనెను. ధీమంతుఁ డైన దేవతాచార్యునిచే రాక్షసులు అంత వెళ్లి శుక్రుని ఆకారమున వంచింపబడుట శుక్రుఁడు చూచెను. అప్పుఁడిట్లు శుక్రుఁడనెను.
నన్ను మీరు శుక్రునిగా నెఱుంగుఁడు. ఇతఁడో ఆంగిరసుఁడు (బృహస్పతి). ఓ దానవులారా! నేను మీ యందనురక్తుండనై యుండగా మీరందరీతనిచే వంచితులైతిరి.” దైత్యులాతని వాక్యములు మీనీరి. సంభ్రాంతులయిరి. ఇద్దరు స్థిరాసీనులై చిరునవ్వులు వెలయించుచు కూర్చుండి యుండిరి. వారిరువురను దానవులుచూచిరి. అందరు సంప్రమూఢులైయుండిరి. ఏమియు చేయక కళ్లప్పగించి యుండిరి. ప్రమూఢాత్ములైయున్న వారలఁగని మరలకావ్యుఁడు ఇట్లనెను.” ఈ నేను మీయాచార్యుఁడనైన కావ్యుఁడను. ఆతఁడో దేవతాచార్యుఁడైన బృహస్పతి, మీరందరు నన్ను అనుసరింపరండు. ఆ బృహస్పతిని విసర్జించుఁడు”. ఇట్లు కావ్యుఁడు పలుకగా వారందరు వారిరువురను మరల మరల పరిశీలించి చూచిరి. అసురులు వారిరువురిలో నెట్టి భేదమును గమనించలేకపోయిరి. అంత, ఎట్టి సంభ్రాంతియు లేక బృహస్పతి వారలతో నిట్లనెను. “ఓ దైత్యులారా! నేన శుక్రుఁడను మీ గురువును, ఈతఁడు బృహస్పతి. నా రూపాంతరితుఁడు. నా యీ వేషముతో దానవులారా ! మీమ్ము సంభ్రాంతులను చేయుచున్నాఁడు”, ఈ పలుకులను విని పరస్పరము సంప్రదించుకొని దైత్యులు ఇట్లు పలికిరి”, ఈ ఆచార్యవర్యుఁడు పదియేండ్ల నుండి చూకుపదేశములను చేయుచున్నాఁడు. నిజముగా నీతఁడే మా గురువు. ఈ బ్రాహ్మణుడు ఎవ్వరో మరియొకఁడు ఈ అవకాశమును పురస్కరించుకొన గోరుచున్నాఁడు,” అని దైత్యులందరు ఆబ్బహస్పతికి నేలపడి సాష్టాంగ నమస్కృతులు సలిపి ఆతని పలుకులనే ఆతని విద్యాభ్యాసమున సమ్మోహితులై సత్యములనీ అంగీకరించిరి. కన్నులనుండి నిప్పులు రాల సంక్రుద్దులై శుక్రునితో నిట్లనిరి". ఈతఁడు మాగురువు. వెళ్లి పొమ్ము నీవు మా గురుఁడవు కావు. ఆతఁడు భార్గవుఁడో ఆంగీరసుఁడో కానిమ్ము. ఆతఁడే మాగురువు. ఆతని నిర్దేశముల ననుసరింతుము. మంచిది. నీవింక వెళ్లవచ్చును. ఇంక ఆలసించకుము” అని యిట్లు చెప్పి అసురులందరు బృహస్పతినే తమ గురువుగా నంగీకరించి ఆతనిని చేరిరి.
వారికి గొప్ప వీతమును గూర్చు తన పలుకులను వారు అంగీకరింపక, భార్గవుడు వారి యొక్క అవలేపమునకు మౌఢ్యమునకు సంక్రుద్ధుఁడయ్యెను. శుక్రుడిట్లనెను. “నేను వారికి విషయము చెప్పి బోధించినను, దానవులే కారణమున నన్ను సేవించి ఆశ్రయించిరో, తత్కారణమున నష్టవివేకులై పరాభవమును (అపజయమును పొందెదరు. అనికావ్యుఁడుచెప్పి వచ్చినదారినే వెడలిపోయెను. అసురులు శుక్రునిచే శపింపఁబడుట తెలిసికొని హస్పతీ, తన్ను కృతార్థునిగ గ్రహించి సంహృష్ణుఁడై తన నిజరూపము ధరించెను. బృహస్పతి అసురులు భ్రష్టులగుట తెలిసికొనీ ఆప్రదేశము నుండి వీరోహితుడయ్యెను. బృహస్పతి తిరోహితుఁడయిన వెనుక దానవులు విభ్రాంతులైరి. వీరొకరితో నొకిట్లు మాట్లాడుకొనిరి” ఎంత పనిజరిగినది. హాధిక్ మనము స్నేహమువలన బృహస్పతిచే వంచితుల మైతిమి. బ్రహ్మ వలన మనము ధర్మము నుండి విముఖులమయితిమి. మనము మన కార్యకలాపముల యందు మాయచే దగ్గులమయితిమి”, అంత అసురులు దేవతలనిన మిక్కిలి భయపడిరి. వారు కావ్యుని అనుగమించుటకు వెంటనే ప్రహ్లాదుని పురస్కరించుకొని శుక్రునికడకరిగిరి. వారు కావ్యుని సమీపించిరి. తలలువంచుకొని ఆతని... చుట్టును నిలబడిరి. మరల తన యాజ్యులు (అనుచరులు) వచ్చుటచూచి కావ్యుఁడు వారితో నిట్లనెను. “అర్హమయిన తరుణమున నేను మీకు బోధించి హెచ్చరించితిని, మీరు నా పలుకుల గౌరవించితిరికాదు. నన్ను అభినందింపరైతిరి. అందుచే తరువాత అవలేపముచే వెడలిరి. పరాభవమును పొందితిరి. ప్రహ్లాదుఁడాతనితో నిట్లనెను. “ఓ భార్గవ! నీయాజ్యులము మమ్ము విసర్జింపకుము. 'మేము నిన్నాశ్రయింప వచ్చితిమీ. నీ దివ్యదృష్టిచే నంతయు తెలిసికొనీ మమ్ము రక్షించుట కరుఁడవు.
ఓభృగునందన!నీవు మాయెడ ప్రసన్నుండవు కాకపోయినచో,మేమందరము నీచే శపింపఁబడితిమీ, ఇప్పుడే మేము రసాతలమున కరిగేదము." అంత సూతుఁడిట్లనెను. కావ్యుఁడువిషయములనుఅధికమయినకారుణ్యము చేయథాతత్త్వము(జరిగినవీజరిగినట్లుగా) తెలిసికొనెను.ఈవిధముగా శుక్రుఁడు కోసోపశమనముచే అనునీతుండై కోపమును పరిత్యజించేను, పొరీతోనిట్లనెను, “మీరుభయపడవలసినదిలేదు. రసాతలమునకు పోవలసి నదియులేదు, ఇదితప్పకజరుగవలసినసంఘటనము. అందుచే నేను జాగరూకతవహించియున్నను, ఇదీసంభవించినది. ఇదీబలవత్తరసంఘటన. కర్మ బలవత్తరమైనది. వేరువిధముగాచేయుటకుశక్యముగానీది.మీసంజ్ఞావివేకముపోయినదికదా.దానీనిమీరుకావలసినప్పుడుపొందవచ్చును. రాజ్యప్రాప్తికి పర్యాయకాలము(వారసత్వసమయము) వచ్చినది. అనీబ్రహ్మచెప్పెను. నాయనుగ్రహముననూర్జితమయిన (తేజోవంతమయిన) త్రైలోక్యపుటధికారము మీరనుభవించితిరి. మీరుదేవతల నాక్రమించి వారితలలుతన్నిరాజ్యాధికారమువహించి పదియుగములకాలముసంపూర్ణమైనది. అంతకాలముమాత్రమే రాజ్యముచేసెదరనీబ్రహ్మఆనతిచ్చెను. సావర్ణిక మన్వంతరమున మరలమీకురాజ్యాధిపత్యము కలుగును. నీపౌత్రుం డయినబలి లోకములకన్నింటికి ప్రభువుకోగలడు. నీపౌత్రునియొక్కఆధిపత్యము, ఈకాలపరిమితిబ్రహ్మయేనిర్ణయించీ చెప్పెను. లోకములుమీవద్ద నుండిసంహృతములైనప్పుడుమీరు విచారింపపనిలేదు. బలియొక్కకార్యములులోభముచేగాని ఆశచేగానిప్రచోదితములైనవీ కానందున బ్రహ్మమిక్కిలి ప్రీతుఁడయ్యెను. దేవతలరాజ్యము బలికి సంక్రమించునని ఈశ్వరుఁడు నాతోచెప్పెను. అందుచేతత్కాలమునునీరీక్షించుచుభూతములకదృశ్యం డైయుండును. నీకోఅమరత్వమును (అమృతత్త్వమును) ప్రీతుండైబ్రహ్మయొసంగెను. నిరుత్సుకత్వము వలదు. రాజ్యవారసత్వము పర్యాయముగా వచ్చును. మీరుసంక్షోభముచెందకుండు.
ముందుగా దీనినీసంఘటిపచేయగలశక్తి,నాకులేదు. బ్రహ్మచే నేను ప్రతిషిద్ధింపబడితిని.భగవన్నిర్ణీతమయినది ముందుగా జరుగును. ఇది తెలిసియే బ్రహ్మ నన్ను ప్రతిషేధించెను. వీరిద్దరు నాకు శిష్యులు, బృహస్పతితో సమానులు, దేవతలతోడి సంరబ్దముతో మునిగియున్నపుపడు. వారు మీకు సహకరించెదరు.
సూతుఁడిట్లనెను: అక్లిష్టకర్ముఁడయిన ధర్మకార్యనిర్వహణ దక్షుండైనకావ్యుఁడిట్లు చెప్పగా, ప్రహ్లాదుఁడు, మొదలగువారు , ఇతర దైతేయులతో ఆయిరువురి ఆచార్యులతోవెళ్ళిరి. అవశ్యంభావ్యమైన, (తప్పనిదైన)విషయమును గూర్చి దైతేయులు, దానవులు, విని కావ్యఁడు చెప్పిన విజయమును ప్రశంసించిరి. కవచములధరించీ, ఆయుధములను సిద్ధముచేసికొని వారందరు దేవతలను యుద్ధమునకు రమ్మని సవాలు చేసిరి. సంగ్రామమునకు వెంటనే పురోగమించుచున్న అసురులనుచూచి, దేవతలు సంవృతసన్నాహము కలవారై వారితో: . యుద్ధము సలిపిరి. దేవతలకు అసురులకు మధ్య యుద్ధము ఒక వంద సంవత్సరములు జరిగెను. ఆ యుద్ధమున అసురులు దేవతలను పరాజితులను చేసిరి. సంక్షుబులైన దేవతలు వారిలో మంతనములు సలిపిరి. దేవతలిట్లనిరి. శండుని యొక్క మర్కునీయొక్క గొప్ప ప్రభావముచే,మనలనుఅసురులు జయించిరి. అందుచే యజ్ఞమునొకదానిని సముద్దేశించి,మనయొక్కహితముకోటకు ఏదియో యొకకార్యము చేయవలయును. వారినీ యజ్ఞమనకుసమాహ్వానము చేయుదము, తరువాత అసురులనుజయించెదముగాక. అంతవారు శండుని, అమర్కుని యిరువురనుయజ్ఞమునకునాహ్వానించిరి. వారితోనిట్లనిరి. ఓబ్రాహ్మణులారా! అసురలనుమీరుపరీత్యజింపుఁడు. దానవులను జయించిన తరువాత మీకొకవంతు నిచ్చేదము. ఈవిధముగాషండామార్కులు రాక్షసులను పరిత్యజించిరి. అంత దేవతలు జయించిరి. దానవులు పరాభవమునొందిరి. అసురులను జయించి, దేవతలు శండామార్కులను సమీపించిరి.
దానవులునిరాధారులు. కావ్యునియొక్కశాపముచే అభీభూతులు. దేవతలచే మరలనొకసార బాధింప బడిరి.అందుచేర సాతతలమును ప్రవేశించిరి. ఈవిధముగాకావ్యునీశాపముచేఇంద్రునిచేదానవులునీరుద్యమవంతులుగాచేయబడిరి. యజ్ఞసంప్రదాయముశీధీలముకాగా ధర్మ వ్యవస్థాపనమును,అధర్మవీనాశనమునొనరించు విష్ణువు మరల మరల అవతరించెను. ప్రహ్లాదునియొక్కనిర్దేశమును ఏదానవులు అంగీకరించి యుండలేదో, వారుమనుష్యులచే వధింపఁబడుట తథ్యమని బ్రహ్మచెప్పెను. అందుచేచాక్షుషమన్వంతరమున ధర్మమున నారాయణుఁడు ద్భవించెను. పృథు కుమారుఁడైన వేనుఁడు వైవస్వంతమన్వంతరమున యజ్ఞమును నిర్వర్తించేను. వైన్యుఁడుప్రాదుర్భవింప బ్రహ్మ స్వయముగా పురోహితత్త్వము వహించెను. నాలుగవదైనయుగమునందుసురలాపన్నులైయుండ(విష్ణువు సముద్రాంతరమునందు సంభూతుఁడయ్యెను హిరణ్యక. శివుని వధ యందు(విష్ణువు నరసింహుఁడయ్యెను. అతఁడు రెండవరుద్రుడయ్యెను.హిరణ్యకశిపుడు సుతపురస్సరుడయ్యెను. దైత్యప్రభువు,విరోచనునీ యొక్కకుమారుడునునైన బలి యజ్ఞమునాచరించుచుండెను. అదితీవంశానందకరుడైన విష్ణువు ద్విజత్వమువహించి,శుభసమయమున వైరోచనుఁ డయిన బలితో నీట్లుపలికెను. నీపు త్రిలోక ప్రభుఁడవు సర్వము నీయందుప్రతిష్టితమైయున్నది. ఓప్రభూ!మూఁడడుగులు నాకీయ నీవు సమర్థుఁడు అనీ. 'తప్పకఇచ్చెదను'అని బలి పలికెను. ఆతఁడువట్టివామను (పొట్టివాడనీతలంచియాతఁడు సంతోషించెను. అంతఓబ్రాహ్మణులారా. " ఆవామనుండుదివమును,పృథ్విని,ఆకాశమును మూఁడు పాదములచే నాక్రమించేను, భూతాత్ముఁడైనవిష్ణువు, తనతేజస్సుచే భాస్కరుని మించి , వెలింగెను. తేజస్వంతుఁడయిన ప్రభువు.దిక్కులనన్నింటిని అంతర ప్రదేశములనన్నింటిని ప్రకాశవంతమొనర్చెను.
అసురులయొక్కసంపదనంతటినిఆహరించి,మహాబాహుడైనజనార్దనుఁడుసర్వలోకమును ప్రకాశింపఁజేసెను.ఆతఁడుపుత్రపౌత్రాదులతో సహితముగా అసురులను పాతాళ లోకమునకు తరిమెను. వారు నముచి శంబర ప్రహ్లాదులు మొదలగువారు. వారలలోక్రూరులయిన వారిని విష్ణువు చంపేను.రాక్షసులందరునిర్దూతులై దిక్కులకు ప్రాణరక్షణార్థముపరుగిడిరి. సర్వభూతాత్ముఁడైనమాధవుఁడు, ఓబ్రాహ్మణులారా! వివిధములయిన రూపములతో పంచభూతములకును, సబలుఁడయినబలికి అద్భుత క్రియలను ప్రదర్శించెను. సర్వప్రపంచము తన శరీరమున తమ్ముతాముదర్శించిరి. మహాత్ముడైనయాతనిచే వ్యాప్తము కాని దేదియును లేదు. ఉపేంద్రునియొక్క ఆరూపమును చూచి దేవదానవ మానవులు సమ్మోహితులైరి.విష్ణుని తేజస్సుచే వారువిమోహితులయిరి. బలి, ఆతనిబంధువులతో, సుహృద్గణములతో మహాపాశములచేబంధితుడయ్యెను.విరోచనునికులమంతయు పాతాళలోకమును ప్రవేశింపచేయబడినది, తరువాత విష్ణువు మహాత్ముఁడైయింద్రునకు దేవతలకు సంబంధించిన సర్వైశ్వర్యసంపద నొసంగేను. అంత మహాబాహుండైన విష్ణువు మనుష్యులయందు ప్రాదుర్భవించెను, ఈమూఁడు అవతారములు జనార్ధనునీ దీవ్యావతారములుగా శుభవంతములుగా, స్మరింతురు. ఆతనికి మనుష్యసంబంధమయినయేడుఅవతారములు కలవు. వానినీ వానిపూర్వములయిన వానీతో సహా అవగాహన చేసికొనుఁ డు. పదియవ దయిన త్రేతాయుగమున ధర్మము నష్టము కాగా, ఆతఁడు నాలుగవదయిన మార్కండేయుఁడు ముందుగా(?) దత్తాత్రేయునియొక్క అవతారమునొందెను. ఐదవదయిన త్రేతా యుగమునందు, చక్రవర్తియైన మాంధాతగా విష్ణువ తరించెను. ఆతనీగురువు ఉతథ్యుఁడు. పందొమ్మిదవ త్రేతాయుగమున విష్ణువు జమదగ్నికుమారుడుగా పుట్టెను.ఆతనిగురువు విశ్వామిత్రుఁడు. ఆతడుసర్వక్షత్రియులను అంతమొందించెను. ఇది ఆరవ యవతారము. ఇరువదినాలుగవ త్రేతాయుగమున విష్ణువు రామునిగా ఏడవ అవతారము దాల్చెను. ఆతఁడు దశరథుని తనయుఁడు రావణుని వధార్ధము జన్మించెను. వసిష్ఠుని గురువుగా పొందెను. ఇరువది యెనిమిదవ ద్వాపరయుగమున విష్ణువు వేదవ్యాసునిగా ఎనిమిదవ అవతారమనేను, ఆతఁడుపరాశరునకు పుట్టెను.జాతుకర్యుఁడాతనిగురువు.
అదితికశ్యపులకు వామనుఁడుగా పుట్టిన విష్ణువుతొమ్మిదవ యవతారమున దేవకీవసుదేవులకు పుత్రుఁడయినకృష్ణునిగా,గార్గ్యపురస్సరుం డై పుట్టేను, అతఁడప్రమేయుఁడు,ఒకరిచేనియోగింపఁబడువాడుకాఁడు.వశీకృతేంద్రియుఁడు, అతఁడు తన కామమును నిగ్రహించెను, పిల్లవాండు ఆటవస్తువులతో ఆడునట్లు భగవానుఁడు లోకమందు క్రీడించును, శక్తిమంతుడయిన విష్ణువు దురవగాహుడు, విశ్వరూపుఁడైన ఈప్రభువుకంటే . ఉత్కృష్టమైనది వేడొకటీ లేదు. ఇరువదియెన్మిదవ ద్వాపరయుగమున ధర్మసంక్షయము కలుగగా, విష్ణువు వృష్టి వృశ్నకులమునకు ధర్మవ్యవస్థాపన మాచరించుటకు,అసురులనాశనము చేయుటకు,పుట్టెను. యోగాత్ముడయిన విష్ణువు యోగమాయచేతను,సర్వభూతములను మోహపెట్టుచు, మానుషమైన యోనియందు ప్రవేశించి ప్రచ్ఛన్నుఁడై భూమియందు సంచరించును. మనుష్యుల యందు విహరించుటకు సాందీపనిపురస్సరుం డై పుట్టెను. ఈ యవతారములో కంసుని, శాల్వుని,ద్వీవీదుఁడైనరాక్షసుని,అరిష్టమైన వృషభమును, పూతనను, అశ్వరూపమునవచ్చినకేశినిని, కువలయా, పీడమను ఏనుగును, మల్లుని (చాణూరునిరాజగృహాధిపతియయిన జరాసంధుని, చంపెను. వీర్యవంతుఁడైనవిష్ణువు మానుషదేహస్థులయిన దైత్యులను చంపెను. సహస్ర బాహుఁడయినబాణుని ఆశ్చర్యకర్మచే చంపెను. యుద్దముననరకుని చంపెను. మహాబలుడయినయవనుని చంపెను. మహీపాలురయొక్క సర్వ రత్నములను తన తేజస్సుచే నతఁడు గ్రహించెను. కురువీరులందరు చంపఁబడిరి. అట్లే రసాతలమందున్న రాజులు చంపఁబడిరి. ఇవీ మహాత్ముం, డయిన మహానుభావునియొక్క లోకతీర్థమయినకార్యములు.
ఈ కలియుగమున సంధికాలము క్షీణించుటకు పూర్వము విష్ణుయశ నామమున కల్కిపుట్టును. ఆతఁడు పారాశర్యవంశమునకుచెందిన వాడు చాలప్రతాపవంతుఁడు. ఇది పదియవ అవతారము. ఇంకను జరుగవలసియున్నది,యాజ్ఞవల్క్యుఁడాతనిగురువు. ఆతనివెనుక ఏనుగులతో, గుఱ్ఱములతో రథములతో సంకులమైనసేనను తీసికొని వచ్చును. ఆతఁడు ప్రగృహీతాయుధులయిన శతసహసబ్రాహ్మణులతో కూడికొని, ఎచ్చటెచ్చట ధర్మమునకు శత్రువులుండిరో వారలను ఆ విష్ణురూపకల్కి నాశనముచేయును (వారు మ్లేచ్చులు). ఉదీచీదిశయందున్న వారిని, మధ్యదేశీయులను, వింధ్యపర్వత ప్రాంతమునందలి వారలను దాక్షిణాత్యులను, ద్రావిడులను, సీంహళీయులతోసహా, గాంధార దేశీయులను, పారదులను, పహ్లవులను, శకులను, తుబరులను, పులిందులను, బరదులను,వసులను లంపాకులను, ఆంధ్రకులను, పుండ్రులను, కిరాతులను - కలిసికొని, వారి మధ్య సంచరించును. వారిని చుట్టుముట్టి బలవంతుఁడై మ్లేచ్ఛులను వధించిన బలవంతుడగును. సర్వ భూతములకు కాన రాకుండ సర్వప్రపంచమున సంచరించును. ఆతఁడు ధీమంతుఁడయిన దేవ సేనునకు మానవ రూపమున జన్మించును. కలియుగము సమాప్తముకాగా, పూర్వజన్మమున వీర్యవంతుఁడై ప్రమతినామధేయమున పుట్టిన విష్ణువు చంద్ర గోత్రమున పుట్టును. ఈ విధముగా ఆ ప్రభుని యొక్క దశావతారములు వర్ణింపఁబడినవి. ఆ ప్రభువు, ఆయాకోలమున ఆయాశరీరములను, వివిధ ప్రయోజనముల కొఱకు, వివిధకారణములతో వివీధావతారముల పూనీ జనించును. భగవదంశతో ఆ యా యోనులను పొందును. ఆతఁడు 25 వ కల్పమున ఉదయించును. ఇరువదియైదు సంవత్సరములు . సర్వభూతములను మనుష్యులను నెల్ల యెడల నాశనము చేయును. తన క్రూర కర్మచే భూమిని బీజము మాత్రము మిగిలిన దానిని జేసి వృషలులను శాంతపరచి, (బహుశః వారప్పుడున్న ధార్మికులు కావచ్చు) ససైనికుఁడై కల్కి చరితార్థుఁడగును.
తన క్రూరకర్మచే చంపఁబడినవారు, సిద్ధులయినవారు యుద్ధముతోనేది సాధించినవారు, స్వయముగా, ఆకస్మికముగా మోహితులై కుపితులై యన్యోన్యము యుద్ధము నాచరించెదరు. తప్పని సరియై యనివార్యమైన భావిచే చోదితుఁడయి వారలనెల్లరను చంపును. తాను తన్ననుసరించినవారితో గంగాయమునా మధ్యప్రదేశమున నీష్టను నెలకొల్పును. (అందువసించును) కల్పము అంతము చెందగా (తుదితీరాగా) సహ సైనికులతో రాజులను నాశనము చేయును. అప్పుడు ప్రజలు అపగత ప్రగ్రహులగుదురు. కళ్లేములేని గుఱ్ఱములగుదురు. రక్షణ సంబంధక్రియ వీనీవృత్తముకాగా, వారు ఒకరొకరిని యుద్ధమున చంపుకొందురు. ఒండొరుల ధనమును పరస్పరమపహరింతురు. నిర్గతానందులగుదురు. సుదుఃఖితులగుదురు. వారు పురములనుగ్రామములను విడిచి యెందోయుందురు వివాహవిధులుండవు. వేద ధర్మాదులు ప్రనష్టములయినవి. అట్లే ధర్మా శ్రమములు పోయినవి వారు. ప్రస్వము అల్పమయిన ఆయుస్సుకలవారగుదురు పెక్కురు నదులను పర్వతములను సేవింతురు. పత్రమూలఫలాశనులగుదురు. చెట్లబెరడు, పత్రములు, జంతువులచర్మములను ధరింతురు. సాంకర్యము నొంది ఫోరమయిన బాధాస్థితి పొందుదురు. అల్పాయుష్కులు, నష్టమైన వార్తలు కలవారు. అనేక బాధలు దుఃఖములొందుదురు. ఈ విధముగా కలిసంధ్యలో ప్రజలు క్షయము పొందుదురు. వారు కలియుగముతో సహా క్షయము పొందుదురు. కలియుగముపోయి కృతయుగము మరల ప్రవృత్తమకాగా యధాన్యాయముగా, స్వభావ సిద్దముగా నన్నియును పొందుదురు. వేరు విధమునకాదు.
బ్రహ్మాండ మహాపురాణమున వాయుప్రోక్తమున మధ్యమభాగమున తృతీయోపాధౌత పాదమున విష్ణుమహాత్మ్యవర్ణనమను డెబ్బదిమూడవ అధ్యాయము.
Summary of chapter 111 of the Brahmānda Mahā Purana is as follows:
This illuminating section reveals the deeper allegorical and spiritual meanings hidden within the genealogical chronicles and cosmic stories of the Purāṇa. It teaches that outward historical narratives are outer vessels holding the inner nectar of Vedāntic wisdom and soul-realization. The seeking mind is elevated from literal understanding to deep intuitive contemplation of the divine self within.