2 - ప్రజాపతి వంశానుకీర్తనము

సూతుఁడిట్లు వచించెను.

చాక్షుష మన్వంతర సంబంధమయిన ఆవ ప్రజాసృష్టి ముగిసేను. స్వయంభువుఁడయిన బ్రహ్మ స్వయముగా “ప్రజలను సృజింపుము” అని దక్షునినాజ్ఞాపించెను. అంత దక్షుండు, జంగమములు, స్థావరములునయిన సమస్త జీవరాశులను (భూతములను) సృజించెను. గతి గలిగినవి జంగమములు. ధ్రువములు స్థావరములు. జగత్ర్పభువు ముందుగా మానసముగా భూతములను సృజించెను. (2) ఆతఁడు తన మనస్సుచేతనే, ఋషులను, దేవతలను, గంధర్వులను, మనుష్యులను, నాగులను, రాక్షసులను, యక్షులను, భూతములను, పిశాచములను, పక్షులను, పశువులను, మృగములను, సృజించెను. ఆతడు మనసా సృజించిన ప్రజలు వృద్ధిపొందమి, వారందరిని ధీమంతుఁడు, భగవంతుఁడునయిన మహాదేవుఁడు మనసా శపించెను. వివిధ ప్రజా సముదాయమును, మైథున క్రీయచే సృష్టింప గోరి ఆతఁడు ప్రజాపతియైన వీరణునీ కుమార్తెయైన అసిక్నిని వివాహమాడెను. ఆమెకు గొప్ప తపశ్శక్తి కలదు. ఆమెయే లోకధారిణి : లోకమునంతటిని భరించినట్టిది. ఆమె చేతనే చరాచర నీబద్ధమయిన యీ యావత్పపంచము ధృతము. ఈ విషయములో ప్రాచేతసుని గూర్చి వారి సంతానమును గూర్చియు, ఈ క్రింది శ్లోకములు చెప్పును. వైరణియైన అసిక్నిని దక్షుఁడు పెండ్లియాడిన తరువాత- పదిలక్షల నల్లని పొగరుతో గూడిన సర్పములు దక్షుని అనుసరించేను. ఆ దక్షుండు నదులలోను పర్వతములలోను తిరుగుచున్నాడు. అతని వెనుక సర్పములు సాగిపోయినవి. ఆతనిని ఋషులు చూచిరి, “ఇందు మొదటి దక్షుఁడు ప్రజలను ప్రతిష్టించును.” అనిరి. ఇక ద్వితీయ దక్షుఁడు - తనంతట తానే ప్రజాపతి. ప్రజలను సృష్టించువాఁడు. అందుచే పదిలక్షల సర్పములు యథాకాలము (కాలక్రమమున) తొలగిపోయెను. అచ్చటనే వైరణికుమార్తెయైన అసిక్నిని దక్షుఁడు పెండ్లియాడెను. అంత ప్రాచేతసుఁడు ప్రభువునయిన దక్షుడు వైరణియైన అసిక్నియందు సహస్ర సంఖ్య పుత్రులను కనెను. వారందరు అనంతశక్తిమంతులు. వారినీ దక్షుఁడు చూచెను. మహాతేజస్వియైన యతఁడు ప్రజలను వృద్ధి పొందింపవలయునను కోరిక వహించెను. బ్రహ్మసూనుఁడు దేవర్షియునయిన నారదుఁడు దేవతా ఋషులతోడీ సంవాదమున సంతుష్టుఁడయ్యెను. ఆతఁడు కొన్ని పలుకులుచ్చరించెను. తత్ఫలము ఆ సంతాన వినాశనము; అంతీయొక్క ఆతనికి శాపము నయ్యెను. నారదుఁడు పరమేష్టి యొక్క మానసపుత్రుఁడు. అట్టిండు దక్షుని శాపముచే కశ్యపునకు రెండవ మానస కుమారుఁడయ్యెను.(14)

ఆ నారదుఁడు పూర్వము పరమేష్ఠికి (బ్రహ్మకు) సముత్పన్నుఁడు, దక్షుని పుత్రులు హర్యశ్వులని విశ్రుతులు. ధర్మార్థము వారందరు విధిచే నాశనము చేయఁబడిరి అందు సందేహము లేదు. దక్షుండు సంక్రుద్ధుఁడయ్యెను. విధిని (బ్రహ్మను) శపించుటకు లేచెను. బ్రహ్మరులతో పురస్కృతుఁడైన బ్రహ్మ ఆతనిని (దక్షుని) యాచించెను. అంత బ్రహ్మకు దక్షునకు నంధీయయ్యెను. అంత దక్షుఁడిట్లనెను”. నో కుమార్తె వలన నారదుఁడు నీకు కుమారుఁడగుగాక” ఆతఁడంగీకరించెను. అంత దక్షుండు తన ప్రియమైన కూఁతురును పరమేష్ఠికిచ్చెను. ఆ కారణమున, తచ్ఛాపము వలన నారదుఁడు తిరిగి జన్మించెను.

శాంశ పాయనుఁడు ఇట్లడిగెను :

దేవర్షియైన నారదునిచేతను దక్షప్రజాపతి సుతులు ఏల వినాశనము నొందింపఁబడిరి. యథార్థముగా వినఁగోరుచున్నాను”. అని.

సూతుఁడిట్లనియెను :

దక్షుని పుత్రులయిన హర్యశ్వులు ప్రజలను (బిడ్డలను) వృద్ధి పొందింపఁదలంచిరి. ఆ ప్రజలెల్లరు నొకచో సమావిష్ణులయిరి. వారలతో సారదుఁడు మాటాడెను. “అయ్యో ! మీరందరు బాలిశులు - కుర్రకుంకలు. మీరు భూమి యొక్క అంతర స్వరూపము నెఱుంగరు. అంతియేకాక దాని పైనేమి యున్నదో దాని యధోభాగమున నేమున్నదో తెలియదు. ఇట్టి తెలివితక్కువ వారెట్లు ప్రజలను సృష్టింతురు?” అనెడు నీ పలుకులను వారు వినిరి. నలుదిక్కులకు పలాయితులైరి. సముద్రములో ప్రవేశించిన నదులవలె వారీప్పటీకీని తిరిగి రాలేదు. వారందరు నశింపఁగా ప్రాచేతసుఁడయిన దక్షుఁడు వైరణి కూతురయిన అసిడ్నీ యందు మరల వేయిమంది పుత్రులను కలిగించెను. వీరందరు శబలాశ్వులు. వీరందరు ప్రజలను వృద్ధి పొందింపగోరిరి. ఇంతకు పూర్వము నారదుఁడేమని పలికెనో ఆ పలుకులే మరల వారలతో నతఁడు పలికెను. ఆ కుమారులందరు పరస్పరము మాట్లాడుకొనిరి. “ఋషి చెప్పినది సత్యము. మన సోదరుల మార్గముననే మనమును పోవలయును. ఇందు సంశయము లేదు. పృథ్వి యొక్క ప్రమాణాదులను తెలిసికొనిన పిమ్మట ప్రజలను సులువుగా మనము సృష్టింపఁగలము. మనము చక్కగా ఉపదేశింపఁబడితిమీ. మన మనస్సులను విషయ పరిజ్ఞాన ప్రకాశితములుగా చేసిన తరువాత మనము స్వస్థమనసులము కాగలము. వారందరు పారీ సోదరులు పోయిన మార్గమునండియే భూమి విస్తారమును, ప్రమాణమును తెలిసికొనంగోరి వెడలిరి. ఇంతదనుక వారు తిరిగిరాలేదు.

అందుచే నొక భాత తన యొక్క భ్రాతను వెదకుటకుఁబోయిన వెంటనే నశించును. ఇది యెఱింగినవాఁడెవఁడు భాత్రన్వేషణాకార్యమును చేబట్టరాదు. (28) శబలాశ్వులు నష్టులయిరి. దక్షుఁడు మరల కుదుఁడయ్యెను. అంతనతఁడు నారదుని “నాశనము పొందుము. గర్భవాసములో వసింపుము అని శపించెను. ఆ విధముగా ఆ కుమారులు అందరు నశించిరి. దక్షుఁడు మరల వైరణి యందు ప్రసిద్ధురాండ్రైన అరువది మంది కుమార్తెలను గనెను. కశ్యపుఁడు, ధర్ముఁడు, సోముఁడు మొదలగు ప్రసిద్ధులయిన ఋషులు ఆ కుమార్తెలను భార్యలనుగా గ్రహించిరి. ఎవ్వండీ దక్షుని యొక్క సృష్టిని యథార్థముగా నెఱుంగునో యాతఁడు ఆయుష్మంతుఁడు, కీర్తిమంతుఁడు, ధన్యుఁడు, ప్రజావంతుఁడగును.

ఇది వాయుక్తమయిన శ్రీ బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున  ప్రజాపతి వంశాను వర్ణనమను ద్వితీయాధ్యాయము.