బ్రహ్మాండ మహా పురాణము
60 - వైవస్వత మనువు సృష్టి
సూతుఁడిట్లు చెప్పెను.
చాక్షుష మన్వంతరము దేవతలతో సహితముగా గడచినది. మహాత్ముఁడైన వైవస్వతునకు బ్రహ్మ పృథ్వీరాజ్యమొసంగెను. ఆ వైవస్వతునకు - తత్తుల్యురయిన పదిమంది కుమారులు. వారు-ఇక్ష్వాకుడు, నృగుఁడు, ధృష్ణుఁడు, శర్యాతి, నరీష్యంతుఁడు, ప్రాంశుఁడు, నాభాగుఁడు, దిష్ణుఁడు, కురూషుఁడు, పృషధ్రుండును. వీరు మానవులుగా సంస్కృతులు (3) బ్రహ్మ పూర్వము ప్రచోదనము మొనర్చి, ప్రబోధ చేసిన యట్లు తన యభిప్రాయము ననుసరించి వైవస్వతుఁడు అశ్వమేధయాగముచేయ సంకల్పించెను. పుత్రుకాముఁడై ప్రభువు మిక్కిలి యిష్టమైన యజ్ఞము నాచరించేను. మిత్రావరుణులకు తదుద్దీష్ట స్థలమున అనలాహుతి నాచరించెను. అందు, దివ్యాంబరధరయు, దివ్యాభరణ భూషితయు, దివ్య సంహననయునగు ‘ఇల’ పుట్టెను, అనీ శ్రుతియందున్నది. దండ ధరుఁడయిన మనువు ఆమెతో మాటలాడెను-నీకు భద్రమగుగాక నన్ననుసరించి రమ్ము. ఇల -పుత్రకాముఁడయిన ప్రజాపతీతో ధర్మ యుక్తమయిన యీ వాక్యమును పలికెను. “ప్రాజ్ఞులలో శ్రేష్ఠుఁడా ! మిత్రావరుణుల యంశమున పుట్టితిని. వారి సన్నిధికి పోయెదను. అందుచే ధర్మము హతము కాకుండు గాక”, ఈ విధముగా పలికి ఆ. దేవీ మీత్రా వరుణుల కడకేగెను. వారి దగ్గరకు వెళ్ళి దోసిలొగ్గి యిట్లు పలికెను,” “నేను మీ యిర్వుర యొక్క యంశవలనఁబుట్టితిని. మీకు నేనేమి చేయుదును”. మనువు నాతో నన్ననుసరించుమని చెప్పెను”. ఇట్లు ‘ఇల’ పలికిన వేనుక, మిత్రావరుణులిద్దరు ఈ వాక్యము పలికిరి. “ఓ సుశ్రోణి ! ఓ వరవర్ణిని !. ఓ ధర్మజ్ఞురాలా ! భవదీయ వినయము చేతను; ఇంద్రియ నిగ్రహము చేతను, సత్యము చేతను సంప్రీతులమయితిమి.
నీవు ఖ్యాతిని పొందెదవు. నీవు సుద్యుమ్నవుగా మూఁడు లోకముల యందు వీఖ్యాతవు పూజితవు నగుదువు. నీవు జగత్రియవు, ధర్మశీలవు, మనువంశ వివర్ధినివియుఁకాగలవు (14) అనిరి. మీత్రావరుణుల నుండి వరమును పొంది ఆమె తండ్రి కడకరిగెను. మనువు కుమారుఁడయిన సుద్యుమ్నుడు మరల స్త్రీ భావమును పొందెను. తరువాత బుధుఁడామెను వచ్చి కలిసి మైథునమునకు ఆమంత్రిత నొనర్చెను. సోమ (చంద్రుని) పుత్రుఁడగు బుధుని వలన ‘ఇల’ పురూరవుని కనెను. బుధుని వలన కుమారునిఁగనిన తరువాత, ఆమె సద్యుమ్నునీ రూపము సందెను. సుద్యుమ్నునకు మువ్వురు వారసులు, వారు పరమ ధార్మికులు. వారు - ఉత్కలుఁడు, గయుఁడు, వినతుఁడు. ఉత్మలుఁడు ఉత్కల రాష్ట్రమును, పశ్చిమదేశమును వినతుఁడు, పొందిరి. పూర్వ దిశయందున్న, గయా పట్టణమును రాజర్షియైన గయుఁడు పొందెను. ప్రజలను సృష్టించిన తరువాత మనువు సూర్యుని ప్రవేశించీ, భూమీ నంతటీని దశభాగముల వీభజించెను. ఈ పృధివిని దశధాక్షత్త మొనర్చెను. దాయాదియయిన ఇక్ష్వాకుఁడు పదవ భాగమును పొందెను. (20) సుద్యుమ్నుడు కన్యగా నుండుటచే యీ రాజ్య విభాగమున నెట్టి భాగమును పొందలేదు. వసిష్టుని వచనమున మహాద్యుతియైన ప్రద్యుమ్నుఁడు ప్రతిష్టానమున ప్రభువయ్యెను. మహాత్ముఁడు ధర్మరాజునునైన సుద్యుమ్నుని ప్రతిష్ఠను గూర్చి విని ఋషులు సూతజుని “మానవుఁడయిన సుద్యుమ్నుఁడు స్త్రీ భావమెట్లు పొందే నని యడిగిరి. సూతుఁడిట్లు చెప్పెను. పూర్వము వృషభద్వజుఁడయిన మహేశ్వరుని దర్శింప సనకాదికుమారులు ఇలా వృతమునకు వచ్చిరి.
వృషభధ్వజుఁడయిన శివుఁడు ఉమతో వివిక్త ప్రదేశమున రమించు చుండుట చూచిరి. అందరు వెనుకకు మరలిపోయిరి. వారిని చూచి శివ(పార్వతి) సిగ్గునొందెను. ప్రియురాలయిన ఉమ ప్రియునితో తనకు ప్రియము కారణముగా నిట్లనెను. “ఓ ప్రభూ ! పురుషుడెవ్వడీ యాశ్రమమును ప్రవేశించునో, ఆతఁడు అప్సరఃకన్యాతుల్యయయిన స్త్రీ యగును”, అనెను. అందుచే అచ్చటి పిశాచములు, సర్వభూతములు, జంతువులు స్త్రీలయిరీ, వారందరు రుద్రునితో అప్సరసలవలె క్రీడించుదురు. ఆరాజు వేటకై ఉమా వనమును ప్రవేశించే పిశాచములతో సహా సర్వభూతములు రుద్రునితో సహితముగా స్త్రీ భావమును పొందగా, అప్పుడు ఆ హేతువు వలన సుద్యుమ్నుండు స్త్రీ భావమును పొందెను. మరల మహాదేవ ప్రసాదము వలన ఆ ప్రభువు మానవత్వము పొందెను.
ఇది మహాపురాణము వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున, మధ్యమభాగమున, వైవస్వతమనువు సృష్టి యనెడు అరువదవ అధ్యాయము.
Summary of chapter 98 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter focuses specifically on the Naimittika Pralaya, the periodic dissolution that occurs when lord Brahmā enters his night of cosmic rest. It explains how all living beings are temporarily re-absorbed into the unmanifest state, resting safely within the supreme lord's body until the next dawn of creation. Contemplating this divine rest, the faithful reader loses all fear of death and destruction, trusting entirely in the lord's eternal protective care.