19 – చక్ర రాజ రథ జ్ఞేయ చక్ర రథ పర్వస్థ దేవతా నామ ప్రకాశనం

ఆగస్త్యుడనెను: చక్రరాజరథేంద్రము యొక్క పర్వములనాశ్రయించిన ప్రసిద్ధ దేవతల పేరులను జెప్పుము-1, ఓహయగ్రీవా! వారి సమస్త సంఖ్యలను, శోభనములైన వర్ణభేదములను వారి దివ్యాయుధములను జెప్పుము-2 హయగ్రీవుడనెను. దీప్తమైన (ప్రకాశించిన) యారథము యొక్క తొమ్మిదవ పర్వమును (అంతస్తును) ఆశ్రయించియున్నదేవతలు పదిమంది సిద్ధిదేవులు (దేవతా స్త్రీలు) నావల్ల వారి నామముల వినుము-3. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశిత, వశీత, ప్రాప్తి సిద్ధి-4. ప్రాకామ్యముక్తి సిద్ధి. తరువాతిది సర్వకామాభిధ. ఈ స్త్రీ దేవతలు నాలుగు బాహువులు గలవోరు. జపాకుసుమము వలె ఎఱ్ఱనైనవారు-5. చింతామణిని, కపాలమును, త్రిశూలమును, సిద్దికజ్జలమును నాలుగు చేతులలో ధరింతురు. దయతో నిండిన వారు. యోగులతో సేవింపబడినవారు-6. అచట పూర్వార్ధ భోగమున (మొదట సగభాగమున) బ్రహ్మాది (బ్రాహ్మాది) అష్టశక్తులుందురు వారు. బ్రాహ్మీ మహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మహేంద్రీ, చాముండా (ఏడవది)-7. ఎనిమిదవది మహాలక్ష్మి వీరందరును రెండు భుజములు గలవారు. ఎఱ్ఱని యాకారముగలవారు పుట్టెను, కలువను, ధరించినవారు. ఎఱ్ఱని చీర గట్టినవారు-రీ. లేదా! కొందరు వేరొక విధముగా వీరీ ధ్యానమును జెప్పుదురు. బ్రహ్మాదుల బోలిన యాకారములు గలవారు-9. బ్రహ్మాదుల పరమచిహ్నమును ధరించువారినిగా నీప్రీదేవతలను జెప్పుదురు. వారి యొక్క శిరసానముననున్న స్త్రీ దేవతలు మీక్కిలి గోప్పవారు-10. ముద్రా విరచనలతో గూడి కమలకాంతిగల చేతులతో, దానిమ్మపలకాంతిగలిగి పీతాంబరములతోను మనోహరలు-11, నాలుగు భుజములు గలవారు రెండుభుజములలో చర్మమును ఖడ్గమును ధరించినవారు మదముచే నేరుపెక్కివీలోలములైన కన్నులు గలవారు. వారి నామములనానుండి వినుము-12. సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షణకన్ముద్రా {అందరినాకర్షించు ముద్రలు జుషగలది). సర్వవశంకరీ-13. సర్వోన్మాదనముద్రా (సర్వులనున్మత్తులగా జేయుముద్రల జూపగలది). యష్టి కట్టేవలైసన్నగా నున్నది), సర్వమహాంకుశా, సర్వఖేచరికాముద్రా, సర్వబీజా, సర్వయోని (తొమ్మిదవది), సర్వత్రిఖండికా, సిద్దిబ్రహ్యాది ముద్రలుగలవారు. ఈ వీరందరు ప్రకటశక్తులు. (ప్రకటించుకొన్న శక్తులు)-15, భండాసుర సంహారము జేయుటకు రక్తరథమున నున్నవారు, పూర్వము చెప్పబడిన గుప్తనామముగలవారి నామములను వినుము-16, కామాకర్షణీకయైన కళ, బుద్ధ్యాకరణీకయైనకళ, అహంకారాకర్షిణికాకళ, శబ్దాకర్షణీకాకళ, గంధాకర్షణీకాకళ-18, చిత్తాకర్షణీకాకళ, ధైర్యాకర్షణీకాకళ, స్మృత్యార్షణీకాకళ, నామాకర్షణికాకళ-19. బీజాకర్షణికా కళ, ఆత్మాకర్షణీకాకళ, అమృతాకర్షణీ కళ, శరీరాకర్షణీకళ-20. ఇవీ పదునారు. చంద్రకలా రూపమైన శక్తులు (వీరందరూ నిత్యలు) అష్టమ పర్వమును జేరి దాగియున్న శక్తులు పేరుతో జెప్పబడిరి-21. పగడపు చెట్టు బోలినవారు (ఎఱ్ఱనీ వారు) చిరునవ్వుతో మనమును హరించువారు. నాలుగు భుజములు గలవారు మూడుకన్నులు గలవారు, చంద్రసూర్యులు కిరీటమున బ్రకాశించువారు-22. ధనువులు, బోణములు, చర్మము, ఖడ్గము వీనిని నాలుగు భుజములలో ధరించువారు. దీవ్యమైన కాంతిగలవారు. ఓయగస్త్యా! వీరుభండాసురవధకై పూనినవారు-23. సాయంకాలమున మండుచున్న (వెలుగుచున్న) దీపముతో. సమానముగానున్న చక్రరథముయొక్కయేడవ పర్వమున నుండి మిక్కిలి రహస్యముగానున్న పేరులుగలవారు-24 అనంగమదనా, అనంగమదనాతురా, అనంగలేభా, అనంగవేగా, అనంగాంకుశా-25. అనగాలింగనపరా- ఈ స్త్రీ దేవతలందరు జపాకుసుమము వలె నెల్లనైనవారు. వీరు చెళకువింటినీ, పుష్పబాణములను, పూలచెండును, కలువపూవును-26. ధరించుచున్న వారై మహాపరాక్రమశాలీనులై లలితా దేవీ యాజ్ఞచే భండాసురినీపై కోపించి మండుచున్నవారి వలెనున్నారు-27. ఆ తరువాత చక్రరథశ్రేష్ఠము యొక్క ఆరవ పర్వమునాశ్రయించినవారు సర్వసంక్షోభిణీ మొదలైన వారు సంప్రదాయ నామముతో గూడినవారు-28. తలవెంట్రుకల నన్నంటిని జడలుగానల్లుకోన్నవారు. సిందూర తిలకముతో నుజ్జ్వలముగా నున్నవారు. మిక్కిలి తీవ్రమైన స్వభావము గలవారు కాలాన్నీ బోలుకొంతులు గలవారు-29. అగ్నిబాణమును, అగ్నీధనువును, అగ్నిరూపమైన ఖడ్గమును అగ్నిచక్రమను ఫలకము (డాలు)ను, ధరించుచున్నవారు. మండుచున్నయగ్నులవంటి యాకారములుగలవారు-30. రాక్షసేంద్రుడైన భండాసురునిపై కోపించినవారు. కాముని భస్మనుండి బుట్టినవారు-వీరు లలితాపరమేశ్వరీయొక్క మహాతేజస్వినులైన శక్తులు-81. సర్వసంక్షోభిణీ శక్తి, సర్వవిద్రావీణీశక్తి, సర్వాకర్షణికా శక్తి, సర్వావోదనికా శక్తి-82. సర్వసంమోహినీ శక్తి, సర్వస్తంభనశక్తి, సర్వజృంభణశక్తి, సర్వోన్మాదనశక్తి-33, సర్వద్వంద్వక్షయంకరీ శక్తి,-34, ఈ విధముగా సంప్రదాయ శక్తి నామములు చెప్పబడినవి. ఆ తరువాత ఐదవ పర్వముననున్న శక్తులు “కులోత్తీర్ణలు” అనుబడిరి-35. వారు స్పటికమువలె నిర్మలకాంతిగలవారు పరశువును, పాశమును, గదను, ఘంటను, మణిని, ధరించినవారు. కాంతితో వెలిగిన విగ్రహములు గలవారు-36, దేవద్వేషియైన భండాసురునిపై మిక్కిలికోపించి కుటిలముగానున్న కనుబొమ్మలుగల ముఖములుగలవారు.ఓ యగస్త్యా! వీరి నామములను గూడ వినుము-37. సర్వసిద్దప్రదాదేవి, సర్వసంపత్ర్పదోదేవి, సర్వప్రియంకరాదేవి, సర్వమంగళకారిణీదేవి-38. సర్వకామ ప్రదాదేవి, సర్వదుఃఖవిమోచనీదేవి-39 సర్వమృత్యుప్రశమనీదేవి, సర్వవిఘ్ననివారిణీదేవీ, సర్వాంగసుందరీదేవి, సర్వసాభాగ్యదాయినీదేవి-40. ఈ పదుగురు స్త్రీ దేవులు. దయతోనిండిన యాశయములుగలవారు. చక్రమున నాలుగవ పర్వమున నున్నవారు ముత్యాలహారములపంటి కాంతులు గలవారు-41. నిగర్భయోగినీ నామముతో ప్రసిద్ధులైనవారు పదుగురనబడినారు. సర్వజ్ఞాదేవి సర్వశక్తిదేవి, సర్వైశ్యర్యప్రదాదేవి-42. సర్వసర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీదేవి, సర్వాధారస్వరూపాదేవి, సర్వపాపహరాదేవి-43. సర్వానందమయాదేవి, సర్వరక్షాస్వరూపిణీ దేవి, పదవదేవత సర్వేప్సిత ఫలప్రదాయినియని తెలియవలె-44. వీరు నాలుగుభజములు గలవారు, వజ్రమును, శక్తిని, తోమరమును, చక్రమును సాలుగుభుజములలో ధరించినవారు, భండాసురుని వధింపబయలుదేరిన వారు-45, ఆ తరువాత చక్రరథష్టము యొక్క మూడవ పర్వమునాశ్రయించిన వారు రహస్య యోగినీ నామముతో ప్రసిద్ధలు. వాగధీశ్వరులు-46. రక్తాశోకపుష్పముల వంటి కాంతి గలవారు. బాణములు, ధనువులును చేతులందుగలవారు, సర్వాంగములను కవచములతో గప్పికొన్నపోరు. వీణా-పుస్తకములు ధరించి ప్రకాశించుపొరు-47. వశీని, కామేశ, భోగినీ, విమలా, అరుణా, జవినీ, సర్వేశీ, కాలినీ-48. ఈ యెనమండుగురు రాక్షస సంహారకారణలైన స్త్రీదేవులనబడిరి, ఆ తరువాత చక్రరథశ్రేష్ఠము యొక్క రెండవ పర్వమునాశ్రయించినవారు-49. ధనుర్బాణములను పానపాత్రమును మాదీఫలమును, ఖడ్గమును ధరించినవారు. ముగ్గురు మూడు పీఠములపై గూర్చున్నవారు. ఎనిమిది బాహువులుగలవారు-50. ఫలకమును(డాలు) సాగపాశమును మహాధ్వనిగల ఘంటసు, ధరించినవారు, మదిరచే మత్తెక్కిన వారు, మిక్కిలిదాచిపెట్టబడిన రహస్యముగలవారు-51, కామేశీ, వజేశీ, భగమాలనీ, ఈ మువ్వురు భండాసురునిపై కోపముగలిగిన స్త్రీ దేవులు-52. లలితా దేవితో సమానమైన మహాత్మ్యముగలవారు. లలితా దేవితో సమానమైన తేజముగలవారు. వీరు నిత్యము శ్రీదేవికి అంతరంగులుగా బిలువబడిరి-5. ఆ తరువాత ఆనందమహాపీఠమున రథమధ్యమ పర్వమున నంతటను ఆవాసము నేర్పరచుకోన్నవారు, పంచదశాక్షరులుగా జెప్పబడిరీ-54. తీథులందు నీత్యస్వరూపలు. కాలస్వరూపలై విశ్వమంతయు పోషించియున్నోరు. భండాసురాధీ రాక్షసుల విషయమై కోపముతో మిక్కిలి క్షోభనుజెందిన కనుబొమ్మలు గలవారు-55. లలితాదేవితో సమానమైన నిజాకారములుగలవారు. ఆమెతో సమానమైన తమయాయుధములు గలవారు, ప్రతియుగమున జగములకుపకారముజేయుటకే (యిచట) ఉంటున్నవారు-56. ఓయగస్త్యా! వారిపేరులను సానుండి వినుము, కామేశీ, భగమాలా, నిత్యక్లిన్నా-57: భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, దతీ త్వరితా, కులసుందరీ (తొమ్మిదవది)-58. నిత్యా, నీలపతాకా, విజయా, సర్వమంగలా, జ్వాలామాలినికా, చిత్రా-అని పదియైదుగురు-59, ఎల్లప్పుడు సేవైకతత్పరటైన యీ దేవతలతో గూడిన లలితా పరమేశ్వరి భండాసురుని జయించుటకు బయలుదేరినది-60.

మహాచక్రరథోత్తమమున మంత్రినాథ గానమును జేసినది. అచట దేవి యొక్క సప్తద్వారములు చెప్పబడినవి. వానిని వినుము-61. గేయ చక్ర రథమున పర్వమధ్యనున్న పీఠమును నివాసముగా జేసికొన్నది సంగీతయోగిని యనబడినది. ఆమె శ్రీ దేవికి అతిప్రియురాలు.-62. అదే మొదటి పర్వము. మంత్రిణికి నివాసస్థానము. ఇక గేయచక్రరథశ్రేష్ఠమున రెండవ పర్వముననున్నవారు. రతీ, ప్రీతి, మనోజ వీరు వీణను ధనువును చేతులలో ధరించినవారు. కానుగ చెట్టు వలె నల్లనియాకారములు గలవారు, రాక్షసులను న్మీలించుటకు సమర్థలు-64. మూడవ పర్వముననున్నవారు. మన్మథబాణ దేవతలు. ద్రావిణీ, శోషిణీ, బంధినీ, మోహినీ-65, ఐదవది ఉన్మాదినీ వీరు వెలుగుచున్న ధనువును చేత ధరించినవారు. అచటి పర్వమున క్రిందుగా నున్నవారు. మహాతేజములుగలవారును-66, కామరాజు, కందర్పుడు, మన్మథుడు, మకరధ్వజుడు ఐదవవాడు మనోభవుడు. వీరు త్రైలోక్యమోహనులు-67. ముల్లోకములలో తిలకాయమానముగా (శ్రేష్ఠముగా) నున్న మాలలతోడి ముత్యములతో ప్రకాశించినవారు, శరీరమంతయు కవచమును గప్పికొన్నవారు, మోదుగు పూవు కాంతిగలవారు-68. వీరిని పంచకాములందురు. భండాసురుని వధింపగోరుదురు. ఇక గేయచక్రరథ శ్రేష్ఠము నాశ్రయించిన వారు-69. బ్రాహ్మీ మొదలగు పూర్వము చెప్పబడినవారు. ఎనిమిదవయామె చండిక శ్రేష్టమైనది. అచటి పర్వమున క్రిందుగా లక్ష్మీ, సరస్వతీ (20) రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి - అనుశక్తులు, వీరు కోపమున నెఱ్ఱనైన కన్నులు గలవారు. ఓయగస్త్యా మహా బలుడైన భండాసురుని జంపుటకు-71. బల్లెములను చక్రములను ధరించిన కుమారికలు (కన్యలుగా చెప్పబడినారు. ఇక ఐదవ పర్వమును జేరిన “వామా” మొదలగు పదునారుగురు మరొకవారు-72. వారు రథశ్రేష్టమునకు గీతమును జేసిరి. వారి నామములను నా నుండి వినుము. వామా, జ్యేషా, రౌద్రీ, శాంతి, శ్రద్దా, సరస్వతీ-73. శ్రీభూశక్తి, లక్ష్మీ, సృష్టి, మోహినీ, ప్రమాథినీ, ఆశ్వసినీ, వీచి-74. విద్యున్మాలిని, సురానందో, నాగ బద్దీకా వీరు తుంగముస్తల రంగుగలవారు. జగమును క్షోభింపజేయుటలో నిమగ్నలు-75. అడుగడుగునను మహా సరసమైన అన్నాహమును (ఖాద్యవి శేషమును) తీసికొనువారు. వజ్రకవచముచే కప్పబడినవారు. కొందరు పెద్ద పెద్ద నవ్వులతో గొప్పగా నొప్పినవారు. వజ్ర దండములను, శతఘ్నిని (నూరుగురనుజంపునాయుధము) -భుశుండికలను (ఆయుధ విశేషము) ధరించినవారు-76. ఇక, గేయచక్రరథ శ్రేష్ఠముయొక్క యావ పర్వము నాశ్రయించినవారు- అసితాంగుడు మొదలగు భైరవులు. వారు శస్త్రములచే భయంకరులు-77. త్రిశీఖమును (త్రిశూలమును) పాన పాత్రమును, ధరించినవారు. నీలకాంతి గలవారు. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధుడు, ఉన్మత్త భైరవుడు-78. కపాలీ, భీషణుడు, సంహారుడు - అని యేనమండుగురు భైరవులు. ఇక, గేయచక్రరథ శ్రేష్ఠము యొక్క యేడవ పర్వము నాశ్రయించిన వారు-79. మాతంగీ, సిద్ధలక్ష్మీ, మహామాతంగీకా, మహతీ సిద్ధలక్ష్మీ, శోణా - వీరు బాణ ధనుర్ధరలు-80. ఆ పర్వము యొక్క క్రిందనే గణపుడు, క్షేత్రపుడు, దుర్గాంబ, బటుకుడు నుందురు. వీరందరు శస్త్ర పాణులు.-61. అచటీ పర్వము యొక్క . క్రిందనే లక్ష్మి, సరస్వతియు, శంఖుడు, పద్ముడు, నిధియును. ఉందురు. వీరందరు శస్త్రములు చేతగలవారు-82. లోకద్వేషియైన భండాసురునిపై కోపము గలవారు. ఇంద్రుడు మొదలు విష్ణువు వరకు గల దేవతలు పది దీక్కులయధిపతులు-83. శక్తి రూపులై అచటి పర్వము క్రింద నాశ్రయమునందినవారు. వజ్రము నందలి శక్తిని, కాలదండమును, ఖడ్గమును, పాశమును, ధ్వజమును-64. గదను, త్రిశూలమును, దర్భాస్త్రమును, వజ్రమును వీరు ధరింతురు. నిత్యము భక్తి సమన్వితలై మంత్రినాథను సేవింతురు-85. వీరు మిక్కిలి { దౌష్ట్యమును వహించి విశ్వకంటకులైన భండాసురులను జంపుటకు మంత్రి నాథాశ్రయముద్వారా లబితా పరమేశ్వరికి జ్ఞాపకము చేయుటలో మిక్కిలి యుత్సాహపడుచున్నవారు.-66. గేయ చక్ర రథ సమీపమున దీక్పాలురు ఆశ్రయమునిచ్చిరి. సర్వ దేవతలకును మంత్రిణి ద్వారముగా జేయబడినది-67. మంత్రిణి ద్వారా మహాదేవికి జేసిన దేవతల విజ్ఞాపనము కార్య సిద్ధినిచ్చును. సేవకులు తమ రక్ష కొఱకై ప్రధాన ద్వారమున చేసిన విజ్ఞాపన సఫలమగును. అట్లే మంత్రిణి ద్వారమున జేసిన తమ రక్షకొకైన విజ్ఞాపన కార్యసిద్ధిని బొంది సఫలమగును. అట్లుగానిచో ప్రజ్వలితతేజస్కుడై తిరస్కరింపరాని ప్రభావముగల శ్రీదేవి యొక్క సమిపము జేరుటకు దేవతలకు సామర్థ్యమెక్కడిది? ఆమె మంత్రిణీ) సంగీత విద్య. కావున శ్రీదేవికి అతి ప్రియురాలు-87-90. ఆమె చెప్పినది కార్యసిద్ధిలో నెక్కడను ఉల్లంఘింపబడదు. శ్రీదేవి యొక్క శక్తి సామ్రాజ్యమున సమస్త కార్యములు మంత్రిడియే-91. ఒక కార్యమును జేయుటకును, చేయమికిని, వేరొక తీరుగా జేయుటకును మంత్రిణి సమర్గురాలు. కావున సర్వదిక్పాలురు శ్రీదేవి యొక్క జయమును గోరువారై ఆమెకు ప్రధాన భూతురాలైన మంత్రిని సేవింతురు.-92. ఈ విధముగా శ్రీ లలితా దేవి యొక్క చక్రరాజరథ శ్రేష్ఠమున పర్వములలో నున్న స్త్రీ దేవతలయొక్క నామములు చెప్పబడినవి-95. భండాసురుని సంహారమున నామె యొక్క దివ్యాయుధములు చెప్పబడినవి. గేయ చక్రముయొక్క పర్వదేవతలు గూడ చెప్పబడిరీ-94. ఈ సర్వ స్త్రీ దేవుల యొక్క నామములు విన్ననరులు సర్వపాప వినిర్ముక్తులై విజయులగుదురు -95.

ఇది శ్రీ బ్రహ్మాండ మహా పురాణముననుత్తర భాగమున హయగ్రీవాస్యసంవాదమున లలితోపాఖ్యానమున శ్రీ చక్రరాజరథ జేయ చక్రరథపర్వస్టదేవతానామప్రకాశనమను పందొమ్మిదవయధ్యాయము.