బ్రహ్మాండ మహా పురాణము
67 - ధన్వంతరిజననాది వర్ణనము
ఆయువు పుత్రులైదుగురు. మహాత్ములు. మహాబలులు. వారందరు రాజులు. స్వర్భానుకూతురయిన ప్రభకు జన్మించిరి. ఆ యైదుగురిలో నహుషుఁడు పెద్దవాఁడు. క్షత్రవృద్ధుఁడాతని తరువాతవాఁడు, రంభుఁడు, రాజు, అనేనసుఁడు వీరు మూడు లోకముల యందును ప్రసిద్ధులు. క్షత్రవృద్ధుని కుమారుఁడు సునహోత్రుఁడు. ఇతఁడు మహాయశుఁడు. సునహోత్రునకు ముగ్గురు కుమారులు. వారు పరమ ధార్మికులు. (3) ఆ మువ్వురు కాశుఁడు, శల్యుడు, గృత్సమదుఁడు. గృత్సమదునీ కుమారుడు శునకుఁడు. ఆతనీ కుమారుఁడు శౌనకుఁడు. వారొనర్చిన విచిత్రములయిన కర్మలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వారి వంశములో పుట్టిరి. ఆస్ట్రీ షేణుఁడు శలుని కుమారుఁడు. ఆతనికుమారుఁ డు. శిశిరుడు. శౌనకుఁడు ఆర్షి షేణుఁడు క్షత్రియులతో గూడిన బ్రాహ్మణులు. కొశ్యునకు కౌశిపతియైన కుమారుడు. అతనిపేరు దీర్ఘతపుం డు. ధన్వుఁడు దీర్ఘ తపసుని కుమారుఁడు. ఆతనికి పండితుఁడైన ధన్వంతరీ పుట్టెను. ఈ ధన్వంతరీ చాల తెలివైనవాఁడు. వృద్ధుఁడయిన రాజునకు ఆతని తపస్సునకు తరువాత కలిగెను. అంత ఋషులు సూతునితో నిట్లనిరి. ఋషీశ్వరులిట్లు అడిగిరి. ధన్వంతరి యెవరు? ఆతఁ డెట్లు మానవులలో జన్మించెను. దానినీ ఎఱుంగగోరుచున్నాము. ఓపరంతప! ఆతని గూర్చి మాకు చెప్పుము. సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ బ్రాహ్మణులారా ! ధన్వంతరి జననమును గూర్చి ఆలకింపుఁడు. పూర్వము సముద్రము అమృతము కొఱకు మధింపఁబడుచుండ, తత్సముద్ర మధ్యమున నాతడు పుట్టెను. మొట్టమొదట కలశమునకు ‘బూర్వమే’ యాతఁడు జన్మించెను. ఆతఁడు సర్వతః శ్రీతో (కాంతి పరివేషముతో) ఆవరింపఁబడియుండెను. ఆతఁడు తన కార్యమును సంసిద్దము చేయుటచూచి, ఆ ప్రక్కనే నిల్చుండియున్నవాఁడు “నీవు నీటి నుండి పుట్టితివి” అనెను. అందుకే ఆతఁడు ‘అబ్దుఁడు’గా పరిగణింపఁబడెను. అబుండు విష్ణునితో నేను నీపుత్రుఁడనయితిని”.
ఓ సురోత్తమ’ నాకొక భాగమును, స్థానమును ప్రపంచములో కల్పింపుము". అనీ అడుగబడి, ప్రభుఁడైన విష్ణువు ధన్వంతరి మధ్య విషయము నాలోచించి యజ్ఞవిభాగమును దీతీకుమారులచేతను దేవతలచేతను చేయబడినది. మహర్షులు వేదములు విధియుక్తమయిన హోమములు చేసిరి. అందుచే నీకై హోమమును చేయుట ఎన్నటికీన శ్యకము కాదు. నీవు వేదములకు తరువాత జన్మించి యుండుటచే నీకు, నీయుక్తమైన, మంత్రములేదు. ఇంక నీరెండవయవతారమును లోకమున ఖ్యాతిగాంచెదవు. నీకుఅణిమాదియుతమైన సిద్ధి కలుగును. ఓ ప్రభో! నీవీ శరీరముతోడనే దేవతాస్థితిని పొందుదువు. బ్రాహ్మణులు నాలుగు వేదములతో చతుర్విధ మంత్రములతో ఘృతముతో, హోమద్రవ్యములయిన ఆవునేయి, పెరుగు మొదలయిన గవ్యములతో నిన్ను పూజింతురు. (17) నీవుమరియొకసారి ఆయుర్వేదమును కావింతువు. ఈసన్నివేశములు కార్యములు మున్ముందుగనే బ్రహ్మ దర్శించెను. తప్పకనీవు ద్వితీయ ద్వాపర యుగమున జన్మింతువు. అందుచేఈవరమునుప్రసాదించిన తరువాత విష్ణువు అంతర్థానముచెందెను. ద్వితీయద్వాపరమువచ్చినది.రాజయిన దీర్ఘతపుఁడు కాశీరాజయ్యెను. ఇతఁడు సౌనహోత్రుఁడు ఈదీర్ఘతపుఁడు పుత్రకాముఁ డై తపస్సాచరించెను. రాజు ధన్వంతరీని పుత్రునికొఱకు ఆరాధింపదలచేను.అంతధన్వంతరి నీవు ఇష్టమైన వరమును కోరుకొనుమనెను. రాజు ఇట్లనెను. ఓ ప్రభూ ! నాయెడ సంతుష్ఠుఁడవైన నీవు నాకు కుమారుఁడ వగుము, నాకు గతీదాతవగుము, 'అట్లే యని ధన్వంతరి యచ్చటనే అంతర్జానుఁడయ్యెను. తరువాత ఆతని దేహము నుండీ దేవుఁడయిన ధన్వంతరీ సముత్పన్నుడయ్యెను. ఆతఁడు కాశీరాజు సర్వరోగ ప్రనాశకుం డు. ఆతఁడు భరద్వాజునీ కడ భిషక్కీయా యుతముగ ఆయుర్వేదమునేర్చెను. ఆతఁడు ఎనిమిది భాగములుగా ఆయుర్వేదమును విభజించి శిష్యులకొసంగెను. ధన్వంతరిసుతుఁడు కేతుమంతుఁడు. ఆకేతుమంతునకు భీమరథుఁడను కుమారుఁడు కలిగెను.
భీమరథుని పుత్రుఁడు ధీమంతుఁడు. ప్రజాధిపతి యయ్యెను. ఆతఁడు దివోదాసుఁడని ఖ్యాతిపొందెను. ఆతడు వారాణసికి అధిపతి యయ్యెను. ఆ కాలమునందే క్షేమకుఁడను రాక్షసుఁడు శూన్యమయిన వారణాసీ పురినీ నివాసముగా నేర్పరచెను. అంతకు పూర్వము మహాత్ముడయిన నీకుంభునిచే ఆ వారాణసీపురము ఈ పట్టణము వెయ్యి యేండ్లు జనరహితమయిన శూన్యపురముగా నగును” అని పదేపదే శపింపఁబడెను. ఆ నగరము శపింప బడినప్పుడు రాజు దివోదాసు. ఆతఁడు తన రాజ్యపు సరిహద్దులో గోమతీనదీతీరమున రమ్యమయిననగరమును స్థాపించేను. ఋషులిట్లడిగిరి. పూర్వము నికుంభుఁడు వారాణసీ పురము నేల శపించెను? ధర్మాత్ముఁడయిన నికుంభుఁడు సిద్ధక్షేత్రమయిన వారాణసీ క్షేత్రము నేల ‘శపించెను’ సూతుఁడిట్లు సమాధాన మొసంగేను. రాజర్షియైన దివోదాసు అభివృద్ధిమంతమైన ఆ పట్టణమును చేరి యందు నివసించెను. ఆ కాలముననే మహేశ్వరుఁడు భార్యను స్వీకరించెను. తనభార్యయయిన ఉమకు ప్రీతి కలిగింప గోరి మహేశ్వరుడు తన మామయొక్క సమీపమున నివసించేను. (32) పరమేశ్వరుని ఆజ్ఞ ననుసరించి విశ్వరూపులు, తపోధనులు నయిన పారిషదులు (ఈశ్వరకింకరులు)వివిధ రూపములు దాల్చి మహేశ్వరీయైన ఉమాదేవిని సంతోషపెట్టుచుండిరి. (33) వారీవలన మహాదేవుఁడు సంతుష్టుం డయ్యెను కానీ మేనక మాత్రము సంతోషించలేదు. ఆమె మహేశ్వరుని మహేశ్వరిని గుప్పతో చూచెను. ఆమె తన కూతురయిన ఉమతో మహేశ్వరునకు నాయందు ఉత్తమ ఆచారము లేదు. (ఉత్తమ ప్రవర్తనలేదు). దరిద్రుఁడు. ఆతఁడు ప్రతివిషయమున కోపి అయ్యో ! సిగ్గుపడడు అని యనెను. తనతల్లి యిట్లు చెప్పగా పార్వతి ఆ పలుకులను సహించలేదు. అయ్యది స్త్రీ స్వభావలక్షణమగుట వరములిచ్చు ఆతల్లి వీచారవదనయై మహేశ్వరునితో “ఓ ప్రభూ! నేనిక్కడ నివసింపను. నీ సొంత నిపాసనమునకు నన్ను తీసికొనిపొమ్ము” అనెను. (37)
ఆ విధముగా చెప్పబడి, మహాదేవుఁడు సర్వలోకములను పరీక్షించి (ఓబ్రాహ్మణులారా!) పృథివీయందు నివాసమేర్పరచుటకు తలంచెను. మహా తేజస్వియయి మహేశ్వరుఁడు సిద్ధక్షేత్రమయిన వారాణాసి నెఱింగెను. అయ్యది దివోదాసుచే ఆక్రమింపఁబడి యున్నది. అంత పార్వస్టుం డయిన గణేశ్వరుని పిలిచి భవుఁడు గణేశ్వరా ! నీవు వారణసీపురమున కరుగుము, మృదువైన ఉపాయముచే దానిని శూన్యము చేయుము. ఆ నగరపు రాజు అతివీర్యుఁడు అనెను. పూర్వము నీకుంభుఁడు వారాణసీ పురమున కరిగెను. స్వప్నము నందు ‘మంకన’ యను బ్రాహ్మణుని చూచెను. ఆతనితో 'నీకు శ్రేయస్సు నాపాదింతును ఓ పాపరహీత ! నా కొక మంచి ప్రదేశమును చూడుము, మద్రూపముయిన ప్రతీమ నొకదానిని చేసి నగర్యంతమునందు, ద్వారమున స్థాపించుము”. అట్లేస్వప్నములో చూచినటులనా సర్వము నాతఁడొనర్చెను. యథావిధి నగరీ . ద్వారమున ప్రతిమను స్థాపించెను. ప్రతిదినము మహా వీభవమున పూజను గంధ, ధూపములతో, కర్పూరముతో అన్నదానముతో ప్రేక్షణీయములయిన వస్తువులతో పూజ జరిగెను. అత్యద్భుతముగా గణేశ్వరుడు ఈ విధముగా ప్రతిదినము పూజింపబడెను. ఆతఁడు నగరవాసులకు. అనేకములయిన వరముల నొసంగును, పుత్రులను, బంగారమును, ఆయువును, కోరినకోరికచెల్ల నొసంగును, రాజు యొక్క మహిషీ 'సుయశ' యను నామమున విశ్రుతయైనది, సాధ్వి, యోగ్యురాలు రాజుచే ప్రచోదింపఁబడి పుత్రులకోకచ్చటకు వచ్చెను. అత్యధికముగా పూజనాచరించి దేవి పుత్రులనర్థించెను. ఆమె పుత్రార్థము పలుమార్లు దర్శించెను. నికుంభుఁడామెకు (వెనుకనున్న) కారణముచే పుత్రుల నొసంగలేదు. (49)
రాజు కోపించినచో నప్పుడేదో (వినాశకరమయిన) కార్యము చేయవచ్చుననుకొనెను. చాలకాలమునకు రాజును కోపమాశ్రయించేను. “నగర ద్వారస్థమయిన భూతము వందలకొలదీ వరములను నగరవాసుల కొసంగుచున్నది. కాని మాకేమియు నొసంగుటలేదు. (51) ఈ నగరమున నయ్యది నాప్రజలచే నిత్యము పూజింపఁబడుచున్నది. ఆతఁడో రాణిచే పుత్రుల కొఱకు పెక్కు పర్యాయములు పూజింపఁబడెను. పుత్రుల నాకిచ్చుటలేదు. అయ్యది కృతఘ్నము బహుభోజన ప్రియమైనది. అందుచే నా వలన పూజ లొందుట కర్ఘమైనదీభూతము కాదు. అందుచే ఆదుర్మార్గునియొక్క నివాసమును నాశనము చేసెదను.” అనీ రోజు నీశ్చయించుకొని దురాత్ముడు కిల్బిషుఁడైన రాజు గణపతి యొక్క స్థానమును నాశనము చేసెను. తద్భవనము భగ్నమగుట చూచీ ఈశ్వరుఁడు రాజును శపించెను. (55) “నాయందే దోషములేకయే నీవు నా స్థానమును వినాశన మొనరించితివి. ఓ రాజా ! నీ నగరము ఆకస్మికముగా జనశూన్యము కాగలదు” అనెను. ఆ శాపముచే వారాణసి శూన్యమయ్యెను. తరువాత. నీకుంభుఁడు మహాదేవు నచ్చటకు తీసికొని వచ్చెను, మహాత్ముఁడైన మహాదేవుఁడు, శూన్యమైన నిర్జనమైన యా నగరమును దేవ విభూతితో నైశ్వర్యవంతముగా దేవీనగరముగా చేసెను. దానిని చూచీ. దేవి ఆశ్చర్య పడెను. దానిని. తన భార్యకు తనకు నీవాసమొనర్చెను. దేవి యందు క్రీడించేను. తన మనస్సు నందు లగ్న మొనర్చెను, అంత ఈశ్వరుఁడు దేవితో నిట్లనెను, “నేనీ నీవాసమును త్యజింపను. నీజముగా నా నివాసము అవిముక్తము. నవ్వుచు ఆమెతో నతఁడు నా నివాసము అవిముక్తము. దీనిని విడిచి, ఓ దేవి నేనింకొకచోటున కరుగను. ఓ పూజ్యకాంత్యుజ్ఞలమయిన దేవీ, ఈ క్షేత్రమునందు నాతో నీవు రమించుము. అందుచేతనే భగవానుఁడు స్వయముగా దీనిని అవిముక్త మనీనాఁడు. (61) ఈ విధముగా వారాణసి శపింపఁబడినది. అవిముక్తముగా కీర్తినొందినది సర్వదేవనమస్కృతుఁడయిన దేవుడిందు వసించును. (62)
ధర్మాత్ముడయిన మహేశ్వరుఁడు తనభార్యతో మూఁడుయుగములిందు నివసించేను. ఆ మహాత్ముని పురము కలియుగమున నంతర్ధానము నొందును. (63) ఆ పట్టణ మంతర్షితముకాగా మరల ఆ పట్టణము నిర్మింపఁబడెను. ఈ విధముగా వారాణసి శపింపఁబడి మరల నిర్మిం పఁబడెను. (64) నరాధిపుఁడయిన దివోదాసు ఉత్తముధానుష్కలయిన భద్రసేనుని యొక్క నూర్గురు పుత్రులను చంపి పట్టణమును నిర్మించెను. బలవంతుఁడయిన ఆతఁడు భద్రసేనుని రాజ్యమును హతమొనర్చెను. భద్రసేనుని కుమారుఁడొకఁడు దుర్మదుఁడనువాఁడు బాలుడని దయచే దివోదాసుఁడాతనిని విడిచిపుచ్చెను. దివోదాసునకు దృషద్వతి యందు ప్రదర్ధనుఁడను వీరుఁడుద్భవించెను. ఓ మహారాజ ! వైరమును తీర్చు కొనఁ గోరి బృహత్సేనుని కుమారు డాతనిని ఎదుర్కొనెను. ప్రతర్దనునకు ఇద్దరు పుత్రులు. వారు వత్సగరులు చాల విశ్రుతులు. వత్సుని కుమారుఁడు అలర్కుఁడు. అలర్కునికుమారుఁడు సన్నత. (69) రాజర్షియైన అలర్కుని గూర్చి యీ శ్లోకము. పురాతనులచే చెప్పబడినది. కాశి సత్తముఁడయిన అలర్క్యుడు అరువదివేల సంవత్సరములు, అరువది వందల సంవత్సరములు యువకుఁడు, రూప సంపన్నుఁడు సౌందర్య వంతుఁడు. లోపాముద్ర యొక్క అనుగ్రహముచే నతఁడు పరమాయువునుపొందెను. శాపాంతమునందు మహాబాహుఁడయినరాజు క్షేమక రాక్షసుని చంపీ రమ్యమయిన వారాణసీపురిని మరల నివాసయోగ్య మొనర్చెను. (72) సన్నతుని యొక్క దాయాదుఁడు సునీథుఁడు, అతఁడు చాల ధార్మికుఁడు. సునీథుని యొక్క దాయాదుఁడు క్షేమాఖ్యుఁడు. ఆతఁడు మిక్కిలి ధార్మికుఁడు. క్షేమునకు కేతుమంతుఁడు పుత్రుఁడు. ఆతనికి సుకేతువు పుత్రుఁడు. సుకేతుని కుమారుఁడు ధర్మకేతువని ప్రఖ్యాతుఁడు. ధర్మకేతువుని పుత్రుఁడు మహారథుఁడయిన సత్యకేతువు. సత్యకేతుని కుమారుఁడు వీభువు అతఁడు ప్రజేశ్వరుఁడు. విభుని పుత్రుఁడు సువిభుఁడు. సువిభుని కుమారుఁడు సుకుమారుఁడు.
సుకుమారుని పుత్రుఁడు ధృష్టకేతువు. ఇతఁడు మంచి ధార్మికుఁడు, ధృష్టకేతుని దాయాదుఁడు వేణుహోత్రుఁడు. ఇతఁడు మహారాజు, వేణుహోత్రుని కుమారుఁడు గార్థుఁడు. ఇతఁడు చాల ప్రఖ్యాతుఁడు. గార్థుని కుమారుఁడు గర్గభూమి. ఇదీ ధీమంతుఁడయిన వత్సుని యొక్క వంశక్రమము. వారి కుమారులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వారందరు ధార్మికులు. విక్రాంతులు, బలవంతులు, సింహ తుల్య పరాక్రములు. వీరందరు కాశ్యపులుగా చెప్పఁబడిరి. ఇంక రజి. యొక్క వారసులను కూడ ఎఱంగుఁడు. (79) వీర్యవంతుఁడగు రజికి ఐదువందల కుమారులు. ఈ క్షత్రియ సమూహమంతయు రాజేయమనీ విఖ్యాతము, ఇంద్రుఁడు వీరనిన భయపడెను. ఆ సమయమున భయంకరముగ దేవాసురలకు మధ్య యుద్ధము సముత్పన్నము కాగా దేవతలు అసురులు బ్రహ్మనడిగిరి. “మాకు మధ్య గలిగిన యుద్ధములో నెవ్వరు విజయులగుదురు? ఓ జగ్రత్పభు ! మాకు చెప్పుము. మేము వీనఁగోరుచున్నాము” అనిన బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “ఎవరి కొఱకు రజి ఆయుధములుగ్రహించి యుద్దముచేయునోఆతఁడు మూఁడులోకములను జయించును. ఇందుసంశయములేదు.” ఎందు రజియుండునోఅందులక్ష్మీయుండును. ఎందులక్ష్మి యుండునో అందుధృతియుండును. ఎందుధృతియుండునోఅందుధర్మము. ఎందుధర్మమే యం.జయము, రజియొక్కవిజయమునుగూర్చి వీనినదేవతలు రాక్షసులు రాజసత్తమునికడకనిగిరి. జయమునభిలషించుచు ఆతనినీ స్తోత్రముచేసిరి. ఆదేవతలుదానవులు మనస్సులలో సంహృష్ణులయి ఇట్లనిరి. “మా విజయము కొఱకు నీవు నీవరధనువును స్వీకరింపుమని”పలికిరి. రజి ఇట్లనెను. ఎదురుగా వచ్చిన ఇంద్రుని దైత్యులారా! దానవులారా!నేను జయించెదను.ధర్మాత్ముఁడనై యింద్రుఁడ నయ్యెదను. అందుచే యుద్ధభూమిలో నేను యుద్ధము చేసెదను”.
దానవులనిరీ :-
మాయొక్క ఇంద్రుఁడు ప్రహ్లాదుడు. ఆతని కొఱకు యుద్దమును జేసి మేము జయించెదము. మా ప్రభువుచే నంగీకృతమయిన యంగీకారము (సమయము)ననుసరింపుము. ఆతఁడింకను “తథేతి” అట్లేజరుగుగాక యని యనక పూర్వమే అతఁడు దేవతలచే నభిమంత్రితుఁడయ్యెను”, యుద్ధమున జయించి ఇంద్రుఁడవయ్యెదవు”. అని. ఆతఁడు దేవతలచే కూడ నాహ్వానింపఁబడెను. వజ్రపాణులయి అవధ్యులయిన దానవులనెల్లరను నాతడు చంపెను. ఇంద్రియ నిగ్రహుఁడు సర్వశ్రీమంతుఁడునయిన రజిరాజు దానవులను చంపి విప్రనష్టమయిన దేవతలయొక్క సంపదను పరిగ్రహించేను,దేవతలతోకూడి ఇంద్రుఁడు రజీతో ఇట్లనెను. నేను రజియొక్క కుమారుడను” అనీ మరలనిట్లుపలికెను, “ఓ రాజా! సర్వదేవతలకు నీవు ఇంద్రుండవు.. అందు సందేహములేదు. ఓశత్రునాశకా! ఓ రాజా! నేను నీకుమారుఁడనగుట ఇంద్రపుత్రునిగా ఖ్యాతి గాంచెదను”. ఆతఁడు ఇంద్రుని వాక్యములు విని ఆతనీమాయచే వంచితుఁడై అట్లే యగుగాక” యని ప్రీతమనస్కుడై రాజు ఇంద్రునితోననెను. అంత, దేవతలతో సమానముగా రాజు స్వరమును పొందగా, రజియొక్క ఆచార్యుని తనయులు ఇంద్రభాగములో తమవంతు భాగమును గ్రహించిరి. తరువాత ఆతని శతసంఖ్యపుత్రులు శచీపతి స్థానమును అనేక పర్యాయములు త్రివిష్టపమయిన స్వర్గలోకమును సమాక్రమించిరి. తరువాత, చాలకాలము గడిచినది. మహాబలుఁడు, హతరాజ్యుఁడు, అయిన ఇంద్రుండు బృహస్పతితో ఇట్లు పలికెను”. బదరీపత్ర ప్రమాణమంతయైన పురోడాశమును నాకు విధించుము. ఓ బృహస్పతీ ! తిరిగి తేజస్సుచే రాజ్యమును పొందు వరకు జీవించి యుండెదను. ఓ బ్రాహ్మణ ! నేను మిక్కిలి కృశించితిని. విమనస్కుండ నైతిని రాజ్యము పోయినది. ఆసనము (ధర్మాసనము) హతమైనది. రజి కుమారులచే నేను యుద్ధమున దుర్భలుడనయితి?. హత తేజుఁడను. నా యందు ప్రసన్నుఁడవు కమ్ము”. అన బృహస్పతి ప్రత్యుత్తరమిట్లిచ్చెను. ఓ ఇంద్రా! నీవే యింతకు పూర్వము నన్నర్ణించియుండిన నీకొఱకై చేయబడనీ పని నాయందేదియును లేదు.
ఓ మహాద్యుతీ దేవేంద్ర ! నీహితార్థము నేను ప్రయత్నించేదను. యజ్ఞభాగమును, రాజ్యమును, అచిరకాలములో పొందెదను. అందుచే, ఇంద్ర ! ఇంక నేను వెళ్లేదను. నీ మనస్సు విక్లబము చేసికొనకుము”. అంత ఆతనియొక్క తేజస్సును వృద్ధి పొందించు గొప్ప కర్మ నాచరించెను. బుద్ధిసత్తముఁడయిన బృహస్పతి, రజి యొక్క కుమారులకు వృద్ధిమోహమును (అజ్ఞానమును) చేసెను. వారు ఎప్పుడు సమ్మూడులయిరో అప్పుడే రోగాన్మత్తులు, విధర్మిణులు, బ్రాహ్మణవిరోధులు ద్వేషులు నయి హతవీర్యులు, హతపరాక్రములునైరి. తరువోత దేవతలు అసురైశ్వర్యములను ఉత్తమమైన ఇంద్ర స్థానమును పొందిరి. కామక్రోధపరాయణులయిన రజికుమారుల నెల్లరను చంపి పూర్వ స్థానమును దేవతలు పొందిరి, ఎవ్వరీశతక్రతుని యొక్క పరిచ్యుతిని పునఃప్రతిష్టానమును విందులో వినిపింతురో వారిరువురు దౌరాత్యస్థానమును పొందరు.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున ధన్వంతరిసంభవాదీవర్ణనమయిన అరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 105 of the Brahmānda Mahā Purana is as follows:
This technical yet deeply spiritual chapter calculates the exact mathematical durations of Manvantaras, Yugas, and divine years, demonstrating the vast mathematical precision underlying creation. It teaches that human lifespans are but tiny sparks within these vast cosmic ages governed by the divine will. The devoted soul absorbs this wisdom to cultivate profound humility and detachment from worldly timelines.