బ్రహ్మాండ మహా పురాణము
27 - దారువన ప్రవేశము - భస్మస్నావిధి
ఋషులిట్లు చెప్పిరి.
ఓ సూత ! మహాబుద్దీశాలీ ! మహాత్ముఁడయిన మహాదేవుని యొక్క మాహాత్యమును మరల వివరింపుము. వినవలయునని మాకెంతయే కుతూహలముగా నున్నది. దేవతాసంఘములు నివసించి యుండు గోరువనమునందు, మహాదేవుఁడెట్లు వికృత వేషమును చేసెను? దానివలన ప్రబుదులు,మహారులు (2) ఆతనిని మహాదేవు నెటింగీ ఆ ఋషులెట్లు భ్రాంతులై? అచేతునులయిరీ? ఆతని ననుగ్రహించుటకు వారతనినెట్టులారాధించిరి? వారి యెడపునర్భువుడెట్లు సంతుష్టుఁడు కాలేదు? (3) ఆదేవదేవుని యీ చేష్టితమమంతటిని జరిగినది జరిగినట్లుగా నంతయును మాకు చెప్పుము. నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుఁడవు. (4) అన వీనీ, సూతుఁడిట్లు చెప్పిను : అవధానముతో నీధర్మమును (దేవదేవుని చేష్టితమును) చెప్పెదను వినుఁడు. భక్తుల యందలి దయచే దేవదేవునిచే నిదీయంతయు ఘటింపఁబడినది. ఓ బ్రాహ్మణులారా ! పూర్వమందు, కృతయుగమున, పవిత్రమయిన హిమవచ్చంగమున రమ్యమైన యొక దేవదారువనము. దానియందు నానా వృక్షలతాదులు అలముకొనియున్నవి. పెక్కురు మునులు మునివ్రతము నాశ్రయించి అచ్చట తపస్సాచరించిరి. ఆ మునులలో కొందరు శైవాలము (నాచు) భోజనముగా గలవారు; కొందరు నీటియందు కొందరు ఆకాశమున పడుకొన్నవారు వసించిరి; కొందరు కాలిబొటన వ్రేలిపై నాధారపడి నిలువఁబడియుండిరి. కొందరు దంతములనే రోహిళ్లుగా ధ్యానపు పొల్లును దంచి తినెడివారు ఇతరులు కొందరు ధాన్యమును దినుటకు బూర్వము రాళ్లపై ధాన్యములను దంచుకొని పొట్టుతీసికొని భుజించేడివారు.
కొందరు వీరాసనమున నుండిపోయిరీ, ఇతరులు లేళ్లయొక్క ప్రవర్తనములందు రతులయిరి. మహాబుద్దిమంతులయిన యా మునీశ్వరులు తీవ్రమయిన తపస్సుతో కాలమును నడుపుచుండిరి. (9) అంత దేవుదేవుఁడు వారల ననుగ్రహించుట కావనమున కరుదెంచెను. ఆతని శరీరమంతయు భస్మముచే పూయబడి పాండుర వర్ణము వహించెను; ఆతఁడు నగ్న శరీరుఁడు; ఆతని యందు వికృత లక్షణములుండెను. (10)ఆతని జుత్తు వికృతముగా జారివిరిసి యుండెను. ఆతని దంతములు భయంకరముగా నుండెను. ఆతఁడు చేతులతో నిప్పు కొఱవులను దాల్చి కదలించు చుండెను. ఆతని నేత్రములు ఎఱ్ఱని, ఎఱుపు తెలుపు కలిసిన వర్ణములు కలిగియుండెను. (11) అతని శిశ్నము వృషణములు ఎఱ్ఱనిగైరికధాతువును పోలియుండెను. ముఖమంగార వర్ణముచే శుక్లవర్ణములచే నలంకృతము. (12) కొన్నిచోట్ల ఆ దేవదేవుఁడు భయంకరముగా నవ్వును. కొన్నిచోట్ల చిరునవ్వుతో నవ్వి అద్భుతముగా పాడును; కొన్నిచోట్ల శృంగారీగా నృత్యము చేయును. కొన్నిచోట్ల మాటిమాటికీ రోదించును. కేకలు వేయును. (13) ఆ మునుల భార్యలు విమోహితురాండ్ర వెంటనే ఆతనిని అడ్డు పెట్టిరి. అభ్యాగతునివలే ఆశ్రమముననాతఁడు మాటిమాటికీ బీచ్చమును యాచించును. (14} భార్యకూడ నారూపముగను తృణాభరణ (గడ్డిరూపముననున్న సొమ్ములతో) భూషితగా జేయబడెను. ఆతఁడు ఎదువలె అంకె వేసెను; గాడిద స్వరముతో ఓండ్రించెను. (15) ఆ విధముగా సర్వ వ్యక్తులను నవ్వించుచు వంచింపనారంభించెను. అంత ఆ మునులందరు క్రుదులై క్రోధమున కలతజేందరి. (16) మాయచే వారందరు మోహితులైరి; ఆతనిని శపించుటకు తత్సమీపమునకు వచ్చిరి. ఏ కారణముచే నీవు గాడిదవలె గానముచేయుచుంటివో ఆ కారణమున నీవు గాడిద పయ్యెదవు. (17) లేక రాక్షసుడవో, పిశాచమవో అథవా దానవుడవో యయ్యెదవు. క్రుద్ధులయిన యీ ఋషులు వారిచ్చవచ్చినట్లుగా వివిధములయిన శాపములచే భువనేశ్వరుఁడు దేవుడునయిన యతనీని శపించిరి. కానీ వారి శాపములన్ని యా శంకరుని యందు ఆకాశమున సూర్యునీ ప్రకాశమున నక్షత్రములు ప్రకాశింపనట్లు ప్రవర్తింపలేదు. అపుడా మునులందరి తపములు శంకరునేడ ప్రతిహతములయ్యెను (నశించెను). కావున ఆ ఋషుల తేజస్సు శంకరుని యందు నిప్రభావ మయ్యెను. (20)
మహాత్ముఁడైన బ్రహ్మ యొక్క పరిపూర్ణమైన శ్రేయస్సునకు కారణభూతమయిన యజ్ఞము ఋషి శాపముచే నాశనమొందేనని వినంబడినది. భృగు మహర్షి శాపముచే, పరమవీర్య వంతుఁడయిన విష్ణువు పదిజన్మల నెత్తవలసి వచ్చెను. అంతియేకాక యాతఁడు సదా దుఃఖితుండుగాం జేయఁబడెను. పూర్వమందు కోపగించిన ఋషియైన గౌతమునిచే, ఇంద్రుని యొక్క శిశ్నము వృషణములతో సహా నేలమీఁదఁబడునట్లు చేయబడెను. (23) శాపముచే వస్తువులు గర్భవాసము నందుండి పోవునట్లు చేయబడిరి. ఋషుల యొక్క శాపముచేతనే నహుషుఁడు సర్పత్వమును పొందెను. (24) బ్రాహ్మణులచేతనే క్షీరసముద్రము త్రాగుటకు యోగ్యము కాకుండ చేయబడినది. యమధర్మరాజు, మహాత్ముడయిన మాండవ్యునిచే శపింపం బడెను. (25) పైని చెప్పఁబడినవారు మరియు అన్యులెందరో దేవదేవుఁడు, మహేశ్వరుఁడు నయిన వీరూపాక్షుఁడు కాక, యాతనల పొందిరి. ఈ విధముగా శంకరునిచే మోహితులయి ఆ ఋషులు శంకరునీ తెలిసికొనలేక పోయిరి. అందుచే ఆ ఋషులందరు ఒకరితో నొకరు పరస్పరమిట్లు మాట్లాడుకొనిరి. (27) “గృహస్థ ధర్ములమయిన మనకు వీధింపఁబడిన ధర్మమిదీకాదు సరికదా బ్రహ్మచర్య ప్రతులైన వారికి, వానప్రస్థులయిన వారికి కూడనిది ధర్మముకాదు. (28) యతులకిది ధర్మముగా నెందుకు గోచరించదు. అందుచే నీ బ్రాహ్మణుడు (శివుడు) మోహింపబడుట గొప్పయన్యాయము. కావున ‘లింగమును ప్రపతింప చేయుము’ (పడవేయుము). ఇది తపస్వులకు, ధర్మము కాదు మధురముగా మాటాడుము. ఏదైన నొక వస్త్రమును ధరించుము. (30) నీవు లింగమును త్యజించితివా పూజింపఁబడెదవు. అనీన ఋషులయొక్క వాక్యములను విని భగుని యొక్క నేత్రములను హరించిన ఈశ్వరుఁడు, నవ్వుచున్న వానివలె, మృదువైన వాక్యములాడెను.
బలాత్కారముగా నా లింగమును పడునట్లు చేయుటకు బ్రహ్మాది సర్వదేవతలకే శక్యము కాదు. ఇక ఇతర తపోధనులేట్లు చేయగలుగుదురు? ఓ బ్రాహ్మణోత్తములారా ! ఈ లింగమును నేను పడునట్లు చేసెదను.” (53) “ఆశ్రమమునందుండుము లేదా వేడలిపొమ్ము” అని వారనిది. ఈ విధముగా పలుకబడి "మహాదేవుఁడు ఇంద్రియ చేష్టితములచే సంతుష్టుఁడై అందరు చూచుచుండఁగనే యతఁడు (ప్రభువు) అంతర్షితుం డయ్యెను. మహాదేవుండంతర్షితుఁడై భవుఁడు (ఈశ్వరుఁడు) లింగరూపము నొందగా(35) మూఁడు లోకములందును ఏ భూతము ప్రాదుర్భావ మొందలేదు. సర్వము సంక్షుణ్ణమయ్యెను. ఏదియు ప్రకాశింపలేదు. (36) సూర్యుఁడు తపించుటలేదు; అగ్నిహోత్రుఁడు నీఘ్ర్పభావుఁడయ్యెను. నక్షత్రములు గ్రహములు స్వస్థితికి మారి విపరీతములయ్యెను. (37) ఋతుకాలములయందే సంతానార్ణము భార్యలను చేరెడు విభవవంతులయిన ఋషుల ప్రవృత్తులు క్రతువులు ప్రవర్తింపమానినవి. (38) పోరు మమతా రహితులయి, నిరహంకృతులయి మరల క్రతువులను నాచరింప ప్రారంభించిరి. వారు నష్ట ప్రభావులు; గతవీర్యులు, నష్టతేజులు నరీ. (39) ఆ సమయమున వారి మనస్సులు ధర్మమునందు వర్తింపలేదు. వారందరు కలిసికొనిరి. బ్రహ్మలోకమున కరిగిరీ, బ్రహ్మ యొక్క భవనమున కరిగి, పద్మసంభవుఁడయిన బ్రహ్మను చూచిరి. ఆతని పాదముల యందు పడిరి, శివుని వృత్తాంతమును గూర్చి చెప్పిరి. (41) ఆ శివుఁడు వికృతాకారుఁడై వికటుఁడై భయంకరముగ నుండెను. ఆతని శిరోజములు నిగిడి బరుసుగా నుండెను. ఆతని దశనములు భయంకరము; ఆతని హస్తములు ఉలూకవ్యగ్ర హస్తములు. ప్రతి వస్తువును పట్టుకొనం జూచును. ఆతని నేత్రము రక్తములు; పింగళ వర్ణములు. ఆతని శిశ్నము వృషణములతో సహా ఎఱ్ఱగా నుండెను గైరికధాతు మండితము. ఆతం డెప్పుడును మాకోడండ్రు మాకూతుండ్రునున్న ప్రక్కనే యుండుటకాక, ప్రత్యేకముగా యా పిల్లలుగల వారీ ప్రక్కనుండెను. (43)
వారీ పార్వమున నతఁడు విపరీతమైన యభిలాషతో మెలగుచుండెను. ఆతఁడు ఉన్మత్తుఁడు. పిచ్చివాఁడని తెలిసికొని మాచే నతఁడవ మానింపఁబడెను. (44) . ఈవలకు లాగబడెను. కొట్టబడెను. అప్పుడు కూడ ఆతని లింగము ఉద్దతమయి యుండెను. ఆతని కోపమును శాంతింప చేయుటకై మేమతని శరణము నొందితిమీ. (45) ఇది యేమియో యెట్టి కార్యమో మాకు పూర్తిగా దెలియదు. ఓ పితామహ మాకు తెలియఁజెప్పుము. అనిన ఋషుల వాక్యములను విని ధ్యోనము నొంది, పరమేశ్వరుని గూర్చి యెటింగ్ సమాహితమనస్కుడై ద్రహ్మ వారలకు ప్రత్యుత్తరమిచ్చెను. “ఆతడే మహాదేవుడు. ఆతడే మహాదేవుండుగా మీరేంగవలయును. ఆతని స్థానము పదమును సులభముగా పొందుటకు వీలులేదు. ఆతఁడే దేవతలకు, ఋషీశ్వరులకు, పితరులకు ప్రభువు. అధిపతి, సహస్ర యుగముల యనంతరము సర్వదేహలను ప్రళయము కాగా ఆ మహేశ్వరుండే కాలుఁడయి సంహరించును. ఆతఁడొక్కడే స్వతేజముచే ప్రజలనందరను సృజించును ఆతఁడే చక్రహస్తుఁడయిన విష్ణువు; వక్షస్థలము నందును శ్రీవత్సముచే కృతలాంఛనుఁడు. (50) కృతయుగమునందతనిని యోగీయందురు. త్రేతాయుగమున క్రతుపోతం డే ద్వాపరముననతఁడు కాలాగ్ని కలియుగమున నతఁడు ధర్మకేతువు. పండితులు రుద్రుని యొక్క మూఁడు మూర్తులను నెరంగవలయును. తమోభాగము రూపము) ఆగి, రజోరూపము బ్రహ్మ సత్త్వ భాగము విష్ణువు. ఈ మూడింటికి ప్రకాశకుఁడాతఁడే. ఆతని మూర్తియొకటి దీగ్వసనము. దానికే శివుండని పేరు. ఆతని యందే యోగస్థుఁడయి బ్రహ్మయుండును. (53) ఓ బ్రాహ్మణులారా! అందుచేతనే జీతేంద్రీయులయి, జయించిన కోపము గలిగి ఆయీశాననుని ఆరాధించుఁడు. ఆతఁడే దేవదేవుఁడు. అవ్యయుఁడు. ఆ మహాత్ముని లింగమెట్టి దానినిగా మీరు చూచితిరో, తత్రతికృతినిగో శూలపొడి నొనర్చి ఆతనికి ప్రపన్నులు కండు, అప్పుడు అకృత పుణ్యులు అకృతాత్ములు దర్శించుటకు వీలుకాని వానిని చూడుడు, మీయజ్ఞానము అధర్మము నశించును. (56)
తరువాత ఆమిత తేజస్కుఁడయిన బ్రహ్మకు వారు ప్రదక్షిణము చరించిరి. దేవదారు వనమునందు వీతశోకులై వీరుండిరి. బ్రహ్మ చెప్పిన విధముగా నీశ్వరు నారాధించుటకు వారు మొదలిడిధి. వారు అలికి ముగ్గులు పెట్టిన ప్రత్యేకమైన నేలయందు, పర్వతములయందు, గుహలయందు, నదులయందు, విచిత్రములు శుభంకరములయిన పులినములయందు, బ్రహ్మ చెప్పిన చొప్పున ఒక సంవత్సరము ఈశానుని ఆరాధించిరి. ఒక సంవత్సర కాలము పూర్తియైనది. వసంతమాసన్నమైనది. అదే రూపము నొంది దేవుఁడయిన ఈశ్వరుఁడు తద్వనమున కేతెంచెను. పుష్పించిన బహుపాదపములతో లతలతో నొప్పినది, తుమ్మెదల గణముచే జుష్మనీ గానము చేయబడుచున్నది, కోకిలల యొక్క మనోహర శబ్దముతో సుందర శబ్ద ధ్వానమున నొప్పునట్టిదియునగు నో దేవదారువనాశ్రమమును మహేశ్వరుఁడు. ప్రవేశించేను. మునీశ్వరు లందరు సుసమాహితమనస్కుల ఆ దేవుని స్తోత్రము చేసిరి. అప్పుడు ఉదకములచే, వివిధములయిన మాల్యములచే, ధూపములచే, గంధములచే, సపరివారములతో, భార్యలతో పుత్రులతో ఆ మహాభాగులు, మృదువులయిన పలుకులతో ఆగిరీశుని గూర్చి చెట్లనిరి. దేవదేవుని తెలియగమిచే గలిగిన యజ్ఞానముచే కర్మలచే, మనస్సుచే హక్కులచే, ఓ దేవ నీ కేమేమి మేము చేసి యుంటిమో నదీయంతయును క్షమించవరుండవు. ఓ శంకర! నీ చరీతములు. విచిత్రములు, రహస్యములు, దుర్విజ్ఞేయములు, మాకే కాదు బ్రహ్మాది దేవతలకుకూడ ఓ ప్రభూ ! వీకు స్వాగతము. గతియు, అగతియును గూడ తెలియకయుంటిమీ, ఓ విశ్వేశ్వర, ఓ మహాదేవ, నీవెవ్వఁడవో? వానివే అట్టి, నీకు నమస్కారము. మహాత్ముఁడవు మహేశ్వరుఁడవయిన నిన్ను స్తోత్రము చేయుచున్నాము, భపునకు, భపునకు, పుట్టిన వానికి, ఉద్భవించిన వానికి, అనంత బలవీర్యునకు, భూతముల ప్రభువునకు, సంహారునకు, కపిశాంగరూపునకు అచ్యయుసకు, వ్యయాంగునడు, గంగానలీలధార వహించు వానికి, సర్వాధారునకు, గుణాతునకు.
త్ర్యంబకునకు, త్రినేత్రునకు, త్రిశూలధారికి, కందర్పునకు (సుందర విగ్రహునకు) పరమాత్ముఁడవయిన శంకరునకు, వృషాంకునకు, ప్రమథగణపతికి, దండహస్తునకు, పాశహస్తునకు కౌలునకు నీకు నమస్కారము. వేదమంత్రములలో ప్రధానుడైనవానికి సహస్ర జిహ్వుఁడవైన నీకు నమస్కారము. గతించినట్టి భూతము, జరుగుచున్న వర్తమానము, జరుగబోవు భవిష్యత్తు స్థావరములు, జంగమము గల ఓ దేవ ! ఈ సర్వజగత్తు నీ దేహము నుండి సముత్పన్నమైనదీ, ఓ శంభో ! రక్షించు; నీకు భద్రమగుగాక! ఓ భగవాన్! ప్రసన్నుఁడవు కమ్ము, అజ్ఞానము వలనఁగాని లేక జ్ఞానముచే గానీ, మానవుఁడే కొంచెము మాత్రము చేసినను, దానినంతటినీ భగవానుఁడయిన ఈశ్వరుఁడే యోగమాయచే నొనరించును. (73) ప్రహృష్ట మనస్సులతో నీ విధముగా మునులు సోత్రముచేసి, భగవానునిట్లు ప్రార్జింతురు. తపఃప్రభావయుక్తులమయి మేము పూర్వమువలె నీన్నుఁదీలకించెదము గౌక. పూర్వమువలె నీ లింగము స్వస్థానమున ప్రకృతస్థమై యుండును గాక. చిరుమువ్వల కింకణీ జాలములు గలిగి దగంబరుడవయిన నీకు నమస్కారము. వికటునకు (అసహ్యరూపునకు) క్రూరరూపునకు, స్వాహాకారునకు, సర్వప్రాణాత్మునకు, రూపరహితునకు, సురూపునకు, విశ్వరూపునకు, గుణరూపునకు నీకు నమస్కారము. కటంకటునకు (బంగారు రూపునకు) నమస్కారము. (77) దుర్గంధునకు, సుగంధునకు, శూలహస్తునకు, నల్లని శీఖ కలిగిన శిఖండునకు, నీలకంఠునకు, శ్మశాన భస్మమే యంగరాగముగా గల వానికి, దేవునకు, గుణత్రయాత్మునకు, సర్వవిశ్వ స్వరూపుఁడైన వానికి, బ్రహ్మకు. నిత్యము శ్మశాన వాసికి, ప్రేతరూపునకు, నీకు నమస్కారము. నీవు దేవతలలో బ్రహ్మవు; నీవు రుద్రులలో నీల లోహితుఁడవు. సర్వ భూతములకు ఆత్మవు. నిన్ను సాంఖ్యులు పురుషుఁడందురు. నీవు పర్వతములలో మహామేరువవు. నక్షత్రములలో చంద్రముఁడవు. ఋషులలో నీవు వశిష్ఠుఁడవు. దేవతలలో వాసవుండవు.
సర్వవేదములకు ఓంకారమవు. సామములందు జ్యేష్ఠ సామమవవు. ఆరణ్య వస్తువుల యందు నీవు అన్నింటికి సింహమవు. (82) ఓ పరమేశ్వర! గ్రామ్య జంతువులలో వృషభమవు. సర్వలోక పూజితుఁడవయిన భగవంతుడవీవు, నీవు సర్వథా అన్ని విధములుగ, విధానములుగ నున్నను బ్రహ్మ చెప్పిన విధముగా మాకు గలిగిన భావనలనన్నింటిలో (83) నిన్నే గాంచేదము. కామము, క్రోధము, లోభము, విషాదము, మదము వీనినన్నింటిని నిగ్రహింపనెంచెదము. ఓ పరమేశ్వర ! ప్రసన్నుఁడవై అనుగ్రహించుము. మహా సంవరణము (సర్వ ప్రళయము) ప్రాప్తించగా ఓ నాథ, నీవు నీచేతినీ ఫాలమున రాయగా సర్వకృతాత్ముఁడవయిన నీచే వహ్ని ఉత్పాదితమయినది. . ఆయగ్ని యొక్క జ్వాలలచే అప్పుడాలోకములన్నియు వహ్ని పరివృతములయినవి. (86) ఆ కారణమున నవియన్నియును అన్నీ సమానములే సమములే. వికృతమయిన యగ్నులనేకములు, తక్కిన చరాచరములయిన భూతములన్నియు, (ప్రాణులు సకలము) సముళ్లితమయిన యావహ్నిచే, దహింపఁబడుచున్నవి. ఓ సురేశ్వర ! దహింపఁబడుచున్న మాకు త్రాతవు రక్షకుడవు కమ్ము. (88) నీవే, లోకహితము కొఱకు సర్వభూతములపై అమృతమును చల్లుదువు. ఓ మహేశ్వర ! ఓ మహాభాగ! ఓ ప్రభూ ! ఓ శుభ నిరీక్షక ! ఓ నాథ ! మమ్ము ఆజ్ఞాపింపుము. నీ ఆజ్ఞావచనము నొనరించు కర్తలము మేము. నీయొక్క రూపకోటి సహస్రములకు, రూపకోటి శతములకు అంతమును గననశక్తులము. ఓదేవ! నీకు నమస్కారము. అంత భగవానుం డీ వాక్యమును పలికేను. (91) విద్వాంసుఁడెవ్వఁడును నా భస్మనిరతులయిన వారిని, భస్మముచే దగ్గపటలములయిన పాపములు కలవారిని, శాస్త్ర విధి ననుసరించి వర్తించువారిని, ఇంద్రియ నిగ్రహము కలవారిని విప్రులను, ధ్యాన పరాయణులను, అవమానకరముగా, పరిహసింపరాదు. ఎగులాడరాదు. పొరీ నతీక్రమింపరాదు. ఐహికా ముష్మికలోకముల హితము కోరునట్టివాఁడు మద్భక్తులం గూర్చి యప్రియములాడరాదు. (93) ఎవ్వఁడు వారిని నిందించునో అట్టి మూఢాత్ముఁడు మహాదేవునే నిందించును. ఎవ్వఁడు నిత్యము పొరలను పూజించునో, అతఁడు శంకరునే పూజించును. ఇట్లు మీరు ఆచరింపుఁడు. మీకు భద్రమగును, నావలన సిద్ధిని పొందుదురు.
మహాజ్ఞాన తిమిరమును ప్రణాశనము చేయునది, అద్వీతీయమయినది ఉత్కృష్టమయినది, శివునిచే కథితమయినదియునగు విధిని తెలిసికొని వారందరు భయమోహలోహచింతాదులవీడిరి. ఆతని పాదములపై ప్రణామ పురస్పరముగా పడిరి. వెంటనే ఆ పాదముల తమ ! శీర్షములపై మోసిరి. వెంటనే ఆ ప్రభువును తమ శీర్షములపై దాల్చిరి. అంత మహేశ్వరుడు ప్రకృతిస్థుడుకాగా, ఆ బ్రాహ్మణులందరు సంతోషించిరి. మహేశ్వరుని, ప్రశుద్దములయిన గంధములచే, ఉదకములచే దర్భలు పుష్పములతో కూడిన ఉదక మహా కుంభములతో స్నానము చేయించిరి. అభిషేక మొనర్చిరి. వివిధములయినవి, రహస్యములైనవియునగు హుంకారములతో సుస్వరయుతముగా గనము చేసిరి. ఓదేవ! ఓదిగంబరా! చిరుమువ్వల గముల ధరించినవాడా అర్ధనారీశరీర, సాంఖ్య యోగ ప్రవర్తక ! నీకు నమస్కారము. మేఘములు పొహనముగాగలిగి నల్లని వర్ణము కలవానికి, గజచర్మవాసికి, కృష్ణాజినము (లేడిచర్మము) ఉత్తరీయముగా గలవానీకి, పాములు యజ్ఞోపవీతములుగా గలవానికి, చక్కగా నిర్మింపఁబడిన చిత్రవిచిత్ర కుండలములు కలవానీకి, మనోహరముగా సమకూర్చఁబడిన దండలు (మాలలు) విభూషణములుగా గలవానికీ, శ్రేష్ఠమయిన సింహచర్మము వస్త్రముగా గలవానీకి, పెద్ద గండ్ర గొడ్డలి కలవానికి శంకరుఁడవయిన నీకు నమస్కారము. (100) లోకముల యొక్క హితము కొఱకు మరల లింగము స్థాపింపఁబడగా, వర్ణధర్మ పరాయణులయిన యాముని సత్తములు తత్తద్ధర్మములను నిర్వహించి సేవించిరి. అంత ఆ మునులయందు సంప్రీతుడై మహేశ్వరుఁడిట్లు ప్రత్యుత్తర మొసంగేను. “మీ తపస్సుచే సంతుష్టుఁడనయితిని. ఓ సుప్రతులారా! వరమును కోరుకొనుడు, అంత ఆ మునులందరు మహేశ్వరునకు నమస్కరించిరి. ఆ మునులలో గౌతమి, ఆ, అంగీరసుఁడు, భృగువు, వశిష్ఠుఁడు, విశ్వామిత్రుఁడు, సుకేశుఁదు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, మరీచి, కశ్యపుడు, సంవర్తుఁడు మొదలయిన మహా తపస్వులు కలరు. వారు మహేశ్వరునకు ప్రణామములు చేసి యిట్లనిరి. “భస్మస్నానము, నగ్నత్వము, వామత్వము (ఎడమ చేతితో కార్యము లాచరించుట) ప్రతిలోమత్వము (వ్యతిరేకముగా చేయుట) సేవ్యాఽసేవ్యత్వము (సేవింపదగిన స్థితి, సేవింపఁదగని స్థితి) వీనిని గూర్చి తెలిసికోనఁగోరుచున్నాము.
భగవానుఁడిట్లనెను:
మీకది చెప్పెదను. ఇప్పుడా కథా సర్వస్వము వివరములతో చెప్పెదను. సోమునీతో గూడియున్న అగ్నిని నేను. సోముఁడగ్ని నుపొశ్రయించు కొని యున్నాడు. (106) మరల లోకములన్నియు కృతాకృతమైన అగ్నిని ఆశ్రయించి యున్నవని చెప్పుదురు. స్థావర జంగమాత్మకమయిన జగత్తు అనేక పర్యాయములు అగ్నిచే దగ్డమయినది. (107) భస్మముచే తత్సర్వమును సాధ్యము. ఇది పవిత్రమైనది. ఉత్తమమైనదీ భస్మముచే వీర్యమునందీ సర్వప్రాణులను ఆ భస్మముచే పరిషేచనము చేయును. భూతములపై చల్లును. (ఎవఁడు - భక్తుఁడు) పవిత్రమయిన యగ్నికార్యముల నాచరించి, వానిలో “త్ర్యాయుష” మను కర్మ సొచరీఁచును, త్ర్యాయుషమన జీవితకాలమును (ఆయువును) కల్పింపజేయుట. నా వీర్యమయిన భస్మముచే వ్యక్తి సర్వకిల్బిషముల నుండి పరిచ్యుతుఁడగును, (109) శుభమును భాసింపఁజేసి దానినీ వసింపచేయునది యగుట అదీ భస్మమయినది, అయ్యది వెంటనే సర్వపాపములను భస్మీకరించునదగుట భస్మమని కీర్తింపబడుచున్నది. (110) పితృదేవతలను ఊష్మపులుగా నెఱుంగవలయును. దేవతలందరు సోమసంభవులు : (సోమరసము లేక చంద్రుఁడు) స్థావర జంగమాత్మకమయిన జగత్సర్వము అగ్నీషోములచే నిర్మింపబడినది. (111) మహాతేజుడయిన అగ్నీని నేనే. ఈ నాయంబిక సోమము. నేను అగ్నిని, సోముఁడను, నేను ప్రకృతిచే స్వయముగా పురుషుడను. ఓ మహాభాగులోరా ! అందుచేతనే భస్మము నా వీర్యమని చెప్పఁబడుచున్నది. నా వీర్యమును శరీరముతోగూడ ధరింతును. ఇది స్థితి. అదీ మొదలుకొని, అశుభముల యందు, రక్షణార్థము, సూతికా గృహములందు భస్మముచే రక్షాక్రియ చేయఁబడును. భస్మస్నానమున విశుద్దాత్ముఁడు జిత క్రోధుఁడు జితేంద్రియుఁడునయినవాఁడు నా సమీపమును చేరి మరల తిరిగిపోఁడు. (115) పాశుపతమొక యోగము. కాపాలవ్రతము యోగముచే నిర్మితము. ఈ పాశుపతవ్రతము. పూర్వము నిర్మితము. ఆయ్యది అత్యుత్తమమైనది. వివిధములయిన ఆశ్రమములకు సంబంధించిన వారు తరువాత బ్రహ్మచే సృజింపఁబడిరి. లజ్జ మోహ భయాల్మీకమయిన యీ సృష్టి.నాచే కల్పింపఁబిడినది. (117)
దేవతలు మునులు నగ్నులుగానే (వివస్తులు) పుట్టెదరు. ఇతరులు, లోకమునందలి మానవులందరు వస్త్రములు లేకుండగనే పుట్టుచున్నోరు. (118) ఇంద్రియముల జయింపనీచో సవస్తులైనను వివస్తులేయగుదురు. వస్త్ర ముండియు మానగోపనము జరుగదు. కామముద్రిక్త మగును, ఇక ఇంద్రియముల జయించినచో కామముద్రిక్తము గాదు. కావున మానగోపనమునకు వస్తావరణ మవసరము లేదు. (119) క్షము (ఓర్పు), ధృతి (ధైర్యము), అహింస, సర్వ వస్తువులయందు వైరాగ్యము, మానావమానములయందు తుల్యప్రవృత్తి ఇయ్యవియే ఉత్తమమయిన ఆవరణములు. (120) భస్మముచే పూయఁబడిన అంగము కలవాఁడు పరమేశ్వరుని మనసా ధ్యానము చేయును. చేయకూడని కార్యములోక సహస్ర మాచరించియును భస్మ స్నాన మాచరించినవాడు, అగ్ని తన తేజస్సుచే వనమును దగపటలము చేయునట్లు, ఆ పాపముల నన్నింటినీ భస్మముగా దహించును. అందుచే యత్నపరుఁడయి, త్రికాలములందుఁగూడ నెవ్వఁడు భస్మముచే స్నాన మాచరించునో ఆతఁడు గాణపత్య మును (శివుని ప్రమథ గణములకాధిపత్యమును) పొందును, అన్ని క్రతువులను సోచరించిన పిమ్మట, ఉత్తమమయిన అమృతమును సేవించిన పిమ్మట (128) మహాదేవుని యందు నిమగ్నమయిన మనస్సుతో తద్బావ భావితులయి ఎవరు ధ్యానము చేయుదురో, ఉత్తర మార్గమున వారు అమృతత్వమును (మోక్షమును) పొందెదరు. (124) ఎవ్వరు దక్షిణాయనమున (దక్షిణ మార్గమున) శ్మశానమును చేరుదురో వారు అమా, మహిమా, లఘిమా, ప్రాప్తి, గరీమా యైదవ లక్షణము) ప్రాకామ్యము (ఆరవది) ఈశత్వం, వశిత్వము, అమరత్వము అను అమానుష శక్తులను పొందెదరు. (126) ఇంద్రాదులు, ఇతరదేవతలు, కామికములయిన వ్రతముల నోచరించి, ఉత్కృష్టమైన యైశ్వర్యము నంది ప్రధిత తేజస్వులయిరి. మీరందరు పోయిన మదమోహాంగులరై, తమోగుణ రజోగుణ దోష వర్జిత స్వభావులునయి, ఈ యుత్తమమయిన విధి నెటీంగీ, పశుపతికి ప్రియతమ మయిన యీ వ్రతము సాచరించి సంచరింపుఁడు. ఎవ్వఁడు, పరిశుద్ధుఁడై, శ్రద్ధావంతుఁడై, స్వాధీనేంద్రియుఁడయి, దీనిని పఠించునో అతఁడు సర్వపాపముల నుండి విముక్తాత్ముఁడయి రుద్రలోకమును చేరును.
ఇది శ్రీ బ్రహ్మాండపురాణమందలి, పాయుప్రోక్తమయిన పూర్వభాగమందలి, ద్వీతీయానుషంగపాదమున దేవదారువన ప్రవేశము, భస్మస్నానవీధి, యనేడు ఇరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 27 of the Brahmānda Mahā Purana is as follows:
In a tale of divine play and ultimate realization, the text describes how lord Śiva wandered the Dāruvana forest, testing the ascetic sages who, in their ignorance, cast a curse upon him. It beautifully resolves with the sages realizing his supreme divinity, leading to the holy installation of the Śiva Liṅga and the sacred injunctions for purifying oneself with holy ash. The devout are thereby taught the virtues of humility, the destructive nature of spiritual pride, and the purifying power of absolute surrender to the divine.