5 - నరసింహావతారము: హిరణ్యకశిపుఁడు చంపఁబడెను - హిరణ్యకశిపునివంశము: మరుత్తులయుత్పత్తి

ఋషి యిట్లు అడిగేను.

దైత్యులయొక్క దానవులయొక్క గంధర్వులయొక్కఉరగులయొక్కరాక్షసుల యొక్క సర్వభూతములయొక్క వస్తువులయొక్క పక్షులయొక్క లతలయొక్క ఉత్పత్తిని,వినాశనమును,మాకు సవిస్తరముగా చెప్పుము. ఇట్లడుగఁబడి, ఆ ఋషి సత్తమునకు సూతుఁడిట్లు. ప్రత్యుత్తర మొసంగెను.

 సూతుడు పలికెను.

‘దితి’కి ఇద్దరు కుమారులు,మహాబలవంతురాలయిన కూతురు కలిగిరి. కశ్యపుని ఆ కుమారద్వయము అందరికంటే ముందుగా పుట్టినవారు. కశ్యపుని ఆశ్వమేధికమున అతిరాత్రయజ్ఞము జరిగెను. అందు హిరణ్యకశిపు" అను పేరుతో ఒక ప్రత్యేకమైన యాసనము విస్తరింపబడెను. అప్పుడే దీతి ఆగర్భము నుండి వెలువడి యాయాసన మందంతటనొకడు గూర్చునెను. అందువలన అట్లు కూర్చున్నవాడు “హిరణ్యకశిపుడు” అనీ పిలుపబడెను.

ఋషులిట్లనిరి :

ఓ ప్రభో ! మహాత్ముఁడు హిరణ్యకశిపుండునైన వానీయొక్క జన్మను గూర్చి నామమును గూర్చి, ప్రభావమును గూర్చి మాకు విస్తరించి చెప్పుము.

సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిడెను.

కశ్యపుని అశ్వమేధము,పుణ్యము, పవిత్రమునైన పుష్కరమున జరిగెను. అయ్యది ఋషులచే, దేవతలచే, గంధర్వులచే నుపశోభితము. (7) స్వేచ్చగా తిరుగుటకు అశ్వము విడువబడెను, 'ఆఖ్యానము' మున్నగు వీధులు యథావిధి జరుపబడెను. ఐదు బంగారపు ఆసనములు సమకూర్పం బడి యుండెను. (8) ఆ విధులు మూఁడు కులస్పదములు, కూర్చము, రెండవది ఫలకము. (కట్టపలక), ముఖ్యఋత్విజులు నలుగురు. వారికి ఆ యాసనములను ఏర్పరచిరి. అందులోనొక బంగారు ఆసనము హోతకోకుగాను ఏర్పరుపబడినది. అచట నదితి గర్భమునుండి వెలువడిన వాడు కూర్చున్నవాడై కశ్యపమహర్షి చెప్పినట్లు ఆనుపూర్వీకముగ మంత్రముల జెప్పసాగెను. అతనిని జూచి ఋషులు ఆతనికి “హిరణ్యకశిపుడు” అను వర్దితమైన పేరు బెట్టిరి. (11) హిరణ్యకశిపుఁడు హిరణ్యాక్షుని తమ్ముఁడు. సింహిక ఆతని చిన్నచెల్లెలు.(12) ఆమె విప్రచిత్తి భార్య. రాహువు యొక్క తల్లిదైత్యుఁడయిన హిరణ్యకశిపుండు శతవర్ష సహస్రములు, నిరాహారుఁడై, అధఃశిరుఁడై ఉత్కృష్టమయిన తపస్సా చరించెను. బ్రహ్మసంతుష్టుఁడయ్యెను. ఆతనిని ఈ వరములు అడిగెను - (1) వధలేని సర్వామరత్వము. (సర్వదేవతాత్వము కలిగియుండుట- ఎట్టి జీవుల చేతను మరణము పొందకుండుట). ఆతఁడు తనయోగశక్తిచే దేవతల నందరను జయించెను. సర్వదేవత్వమును వహించెను.

            బలవీర్యసమన్వితుఁడనై ఈశ్వరుల యొక్క సకల చర్యలను ప్రభుత్వ యుత క్రియాకలాపముల) నేనే చేసెదను. దానవులు, అసురులు, దేవతలు చారణులతో సహా అందరు నా వశవర్తులగుదురుగాక. వారు మత్సమీపానువర్తులగుదురు గాక. (సాయాజకై ప్రతీక్షించుచుందురుగాక). వారు నా తరువాత భుజింతురుగాక. తడిసినది గాని (ఆర్ధము) శుష్కము (ఎండినదిగాని) యైన ఆయుధముచే నేను చంపఁబడరాదు” పగలున గాని రాత్రీయందుగాని నేను చంపబడురాదు. అని కోరెను.

 బ్రహ్మ ఇట్లనెను :

ఓ బిడ్డా ! దితిసుత ! నీవు కోరిన వరము చాల గొప్పది. ఇటు రమ్ము. నేను ప్రతిజ్ఞానము చేయుచుంటిని ఆవియన్నియునట్లేయగును. అని ఆతని కభిమతములయిన వరములు హృదయపూర్వకముగా నొసంగి బ్రహ్మయచ్చటనే అంతర్జానుఁడయ్యెను. తన మహిమచే దైత్యుఁడు జంగమ స్థారవ రూపకమయిన సర్వజగత్తు వ్యాపించెను. (18) శత్రువులజయించు నాతండనేక రూపములు పొందెను. ఆతఁడు సూర్యచంద్రుల రూపములు దాల్చీ (వ్యోమి) ఆకాశమునందు ప్రకాశించును, ఆతఁడే వాయువై ఎల్లవేళల జగత్తునందు వీచును. ఆతఁడే గోపాలుఁడై ఆవుల కాచుగొల్లపాడు, గొఱ్ఱలకాపరి, కర్షకుండు. అన్ని లోకములయందు అతఁడే సర్వజ్ఞుండయిన జ్ఞాత.మంత్ర వ్యాఖ్యానకరుడును నాతఁడే. ఆతం డే నాయకుఁడు, దక్షకుఁడు, యజ్ఞము దీక్షితుఁడు యజ్ఞమాచరించు యాజకుఁడు. దేవతలు, సురలు అందరు ఆతని వలననే సోమపాయులయిరి. ఈ దైత్యున కొంతటి ప్రభావము కలిగెను. మరియెలుంగుఁడు.(23) అందరు ఆతనికే నమస్కారము చేయుదురు. అంతియేకాక పూజ్యారుండా తఁడు కూడనయ్యెను. పూర్వము హిరణ్యకశిపుని గూర్చి యీ శ్లోకము చదువబడెను. హిరణ్యకశిపుఁడే యేదిక్కు చూచునో ఆ దిక్కునకు మహా ఋషులతో సహా దేవతలు నమస్కరించిరి. పూర్వము విష్ణువు నరసింహుని ఆకృతిలో ఆదైత్యునకు మరణ మాపాదించెను. ఆ ప్రభువు నరుని జన్మ సంది యుండుటచే ఆతఁడు వేదములేటింగిన మహనీయులచే నరసింహుఁడుగా కీర్తింపఁబడెను, ఆ విభువు (విష్ణువు) సాగరతీరమునందు నిలువంబడి తపస్సు ఆచరించెను. ఆతని శరీరము సర్వదేవమయమయ్యెను. ఆతఁడు మహాబలుడు. సుదర్శనుఁడను పేరిచే జగద్విశ్రుతుండు. అంత మహాబలుఁడైన దైత్యేంద్రుని అధికాగ్రహోదగ్రుఁడై నఖములచే చీల్చెను. ఆ నఖములు ఆర్ధములుకాపు, శుష్కములు కావు. బాహుయుద్ధముచే దైత్యేంద్రుని చీల్చేను. హిరణ్యాక్షుని కొమరులు ఐదుగురు, వారు మహాబలులు పరాక్రమవంతులు. వారు, శంబరుఁడు, శకునీ, కాలనాభుఁడు, సురసంతాపనుఁడు.

మహానాభుఁడు, వీడు సుతసంతాపనుఁడు - మహావిక్రాంతుఁడు), వీరైదుగురు హిరణ్యాక్షుని సుతులు. దేవతలచే గూడ నెదురింపబడరాని వారు. (31) వారి పుత్రులు పౌత్రులు వారి వారి గణములతో డైతేయులుగా సంస్కృతులు. వందలు వేలుగా ఆ దైత్యులు తారకామయము. నందుఁ (తారకాసురునితోడి యుద్దమున) చంపఁబడిరి.(32) హిరణ్యకశిపుని పుత్రులు నల్వురు. వారు సుమహాబలులు. వారందరిలో పెద్ద వాం డు ప్రహ్లాదుఁడు. తరువాత అనుప్రదుఁడు, సంప్రదుఁడు, ప్రదుఁడు. ప్రదునకు ఇద్దరు కుమారులని యెరుంగుఁడు. వారు సుందుఁడు నీసుందుడు. వారు మహావీరులు. బ్రాహ్మణహంతకులు, ప్రోదుని వారసుఁడు మూకుఁడు, ఆతని దాయాది.సుందుని పుత్రుడు మారీచుఁడు. ఆతడు తాటకయందు పుట్టెను. (35) మహాబలవంతుఁడయిన రాఘవునిచే నతఁడు దండకారణ్యములో హతుఁడయ్యెను. మూకుఁడు సవ్యసాచియైన యర్జునిచే కిరాతునితో (శ్రీవుఁడుకిరాతుఁడుగాయుద్ధము చేసినప్పుడు, చంపఁబడెను. (36) దైత్యుఁడయిన సంప్రదుని కులమున నీవాత కవచులు పుట్టిరి. వారు మహాతపస్సుచేత స్వయముగా పవిత్రీకృతులైరి. వారు దేవతలకు శత్రువులు. జంభునకు,శతజంభుఁడు, దక్షుఁడు, అసురుఁడు, చండుడు - అను నలుగురు దైత్య నాయకులు. వారందరు భాషలుని కుమారులు. కాలనేమీ సుతులగూర్చి వినుము. వారు బ్రహ్మజిత్తు, క్రతుజిత్తు, దేవాంతకుఁడు, నరాంతకుడు అనువారు. (39) రాజైన అజుఁడు, గోముఁడు - వీరిద్దరు జంభుని కుమారులుగా ప్రకీర్తితులు. (40) విరోచని పుత్రుడు బలీ : ఆతఁడు ప్రతాపవంతుఁడు. బలికి నూరుగురు పుత్రులు, వారందరు రోజులు. వారిలో నలుగురు ప్రధానులు. వారు విక్రాంతులు, సుమహాబలురు. సహస్ర బాహుఁడు ప్రతాపవంతుఁడునయిన బాణుఁడు పెద్దవాఁడు. కుంభగర్తుఁడు ఒకఁడు. అతఁడు దయాశూన్యుం డు. భోజుఁడు వేణాకఁడు. కుంచి మొదలయినవారు ఇతరులు. శకుని పూతన అను వీరిద్దరు బలియొక్క కూతుండ్రు. బలియొక్క కుమారులు, మనుమలు వందలుగా వేలుగానున్నారు. వారు “బాలేయులు” (బలికుమారులు)అని విఖ్యాతులు. వారొక రాక్షసగణము పోరు విక్రాంతులు. పౌరుషవంతులు ఇంద్ర ధన్వుఁడు బలికుమారుఁడు. లోహిని యందు పుట్టెను. పుత్రులు చంపఁబడిన దితి కశ్యపుని ప్రసన్నుని చేసికొనెను.

            సమ్యగారాధితుఁడై కశ్యపుండు హృదయమున సంతోషించేను. కశ్యపుడామెనొక వరము కోరుకొనమనెను. ఆమె సంతుష్టురాలయ్యెను. తీరుగ ప్రార్థింపఁబడి భగవానుడయిన బ్రహ్మ ఆమెకు వరమొసంగెను. వరము చెప్పఁబడగా, దీపా సంతోషించి ఆతనితో సంభాషించేను. (47) చేతులు జోడించి తన భర్తయు, మరీచిసుతుఁడునయిన కశ్యపుని గౌరవముగా “ఓ భగవాన్. నీ కుమారులయిన ఆదిత్యులచే నేను పుత్ర హీనురాలనయితిని, ఇంద్రుని చంపగల పుత్రునీ నేగోరెదను ఆతడో నాచే మహాతపస్సుచే పొందబడును. నేను తీవ్రమయిన తపస్సాచరించెదను. నీవు నన్ను గర్బిడిగా నొనర్చ నరుండవు. ఇంద్రుని చంపగల శక్తిగల కుమారుని నాకనుగ్రహింప నీవే అరుఁడవు”. అనెను. ఆమె వచనము మరీచి కొడుకయిన కశ్యపుఁడు వీనీ (50) దీతీతో ప్రతిభాషించెను. ఆ మహాతేజుఁడు విశేషముగా దుఃఖితుఁడయ్యెను. ఓ తపోధనురాలా ! అట్లే యగుగాక. (51) వెయ్యి యేండ్లు నీవు శుచివిగా నున్నచో శక్రుని యుద్దమున జయించు పుత్రుని కనెదవు. మన్మథుని వలె త్రిలోక సుందరుం డయిన పుత్రునీ కండువు”. ఇట్లు పలికీ, యపుడు మహా తేజస్వియయ్యెను. ఆమెను కౌగిలించుకొని భగవంతుఁడయిన ఋషి స్వభవనమున కరీగెను. భర్త యచ్చట నుండి వెడలిన తరువాత దేవియైన రీతి పరమహర్షితురాలయ్యెను. (54) అంత ఆమె కుశప్లవనమున కరీగెను. సుదారుణమయిన తపస్సాచరించెను. శక్రుఁడు దీతీ యొక్క కశ్యపునీయొక్కయు సంభాషణమును వినెను. కుశప్లవనమునకు శక్రుఁడేతెంచెను. దీతితో నీట్లనెను. “నీకు శుశ్రూషను చేసెదను నీవు నా కనుజ్ఞ యీయ గదువు, హోమమునకు సమిధలను తెచ్చెదను. ఫలములను పుష్పములను గోనివత్తును”. “ఓ బిడ్డా ! నీవు తలపోసినట్లే నాకు శుశ్రూషాభిరతుఁడవు కమ్ము. (57) సర్వకర్మల యందు నిష్ణాతుఁ డవై యాత్మహితము లాచరింపుము”, అనెను. తల్లియొక్క యావాక్యమును వరముగా విని శక్రుఁడు ప్రహర్షితుఁడయ్యెను. కలుషమయిన అంతరాత్మతో మాతృ శుశ్రూషాభిరతుఁడై, సర్వకాలము ఆమె ననుసరించుచు సేవచేయుచుండెను. దృఢ వ్రతుఁడై ఫల పుష్పములను సమిధలను తీసికొనివచ్చును. ఆమెకు శ్రమాపనయనము చేయఁగోరి ఆమె వొళ్లు పట్టును. సేవచేయును.

            అన్ని వేళల యందు ఇంద్రుఁడు దిలీకి పరిచర్య చేసెను. దితి యొక్క వ్రతము ఇంచుమించుగా పూర్తినొంది, యొక కొంచెము మిగిలి యుండగా సంతుష్టురాలయిన యామె శక్రునీతో ఓ దేవతాశ్రేష్ఠుఁడా ! నీవలన సంతుష్టురాలనైతిని. ఇంక పది సంవత్సరములు మత్రమే వ్రతము మిగిలియున్నవి. నీకు భద్రమగుగాక. తదనంతరము నీవు నీ సోదరుని చూడగలవు. (62) ఆతఁడు నీన్ను జయించు కోరిక కలవాఁ డయినను, ఆతని నీ కొఱకు నీ సేవలో నియోగించెదను. అతనితో కూడి ఓ బిడ్డా ! మూడు లోకముల యొక్క విజయము ననుభవింతువు. నీ మనస్సు భక్తిగతమయి నా యందు గతమయిన దని యెఱుంగను." అని పలికెను, అంత సూర్యుఁడు గగన మధ్య భాగమును చేరగా మధ్యాహ్నము నిద్రచే పరీతమయి (కునుకువచ్చి) మోకాళ్ల మీద శిరస్సుంచి, ఆమె శిరోజములు పాదముల మీఁద వ్రేలాడ నిద్రపోయెను.(65) నాభి ప్రదేశమునకు దిగువ భాగమంతయు అశుచిమంతముగా గమనింతురు. అప్పుడామెను అశుచిమతిగా తెలిసికొని అయ్యది తన కార్యమున కనుకూల సమయముగా శక్రుడు దెలిసికొనెను. తత్కారణమున, ఆతనికిట్లు బుద్దీ పుట్టెను, “సత్సవిత్రురాలయిన దేవియందు ఆమె గర్భమును నాశనము చేయుటకు దోషము కనంబడినది.” అని. అంత ఇంద్రుఁడు దితి యొక్క జననేంద్రియము ద్వారా ఆమె గర్భమును ప్రవేశించేను. ప్రవేశించి అందు మహాశక్తిమంతుడయిన బిడ్డనతఁడు జూచెను. ఆతఁడు భయచకితుఁడయ్యెను. ఆ గర్భస్థ శిశువును, ఆత్మీయ శత్రువును, నూరంచులు గలిగిన వజ్రముచే ఏడు ముక్కలుగా (సప్తధా) ఛేదించేను. ఆ గర్భస్థ శిశువు ఛేదింపఁబడి, మాటిమాటికీ కదలాడుచు భయంకరముగా సుస్వరముగా రోదించెను. అంత ఇంద్రుఁడు గర్భస్థ పిండముతో మారోద మారోద' ఏడువకుము, ఏడువకుము' అని చెప్పేను. ఇంద్రుఁడా గర్భ పిండమును సప్తధా ఛేదించి మరల నొక్కొక్క భాగమును తన వజ్రాయుధముచే ఏడు భాగములుగ ఛేదించెను. అంతలో దితి మేల్కొనెను. (71) “నహంతవ్యః, నహంతవ్యం” బిడ్డ చంపఁదగినవాడు కాడు.” అని దితి పలికెను. మాతృవచనముల యందలి గౌరవముచే ఇంద్రుడు మాతృగర్భము నుండి యీవలకు దూకేను. చేతులు జోడించి వజ్రసహితుఁడై ఇంద్రుఁడు దితితో నిట్లు పలికెను. పాదముల యందు శిరోజములు వ్రేలాడునట్లుగా అశుచిమతివై ఓ దేవి నిద్రించితివీ. ఆ సమయమును పురస్కరించుకొని, నీ గర్భమును ప్రవేశించి, యుద్దమున నన్ను చంపునట్టి పొడయిన వానిని నేను పలుఖండములుగా ఛేదించితిని. నన్ను నీవు క్షమింపతగుదువు” అంత గర్భము విఫలము కాగా దీతీ పరమ దుఃఖితయయ్యెను. అంత ఆమె దురాధరుఁడయిన సహస్రాక్షునితో సానునయముగా నాయపరాధము చేతనే నా గర్భస్థమయిన బిడ్డ నీచే విఫలీకృతమయ్యెను. ఓ దేవేశ, మహాబల, ఓ పుత్ర ! నా దోషముచే అపరాధముచే నా గర్భము విఫలీకృత మయిన పక్షమున, నీ అపరాధము కాదు.

 శత్రువును వధించుటలో నీ దోషము లేదు. నీవు భయపడవలసిన పనిలేదు. నీకేది యో యొక ప్రియమును చేయగోరుచున్నాను. కానిచో నా గర్భస్థ శిశువునకు శ్రేయమెక్కడిది? స్వర్గము నందు నా కుమారులకు సప్త స్థానములుండుగాక. నా కుమారులు ఈ సప్తవాత స్కంధముల యందు సంచరించెదరుగాక. (వాతస్కంధములు - వాయు మార్గములు - వాయు పథములు). వారందలు మరుత్తులుగా వీఖ్యాతి నొందుదురుగాక. ఒక్కొక్క వర్గమున (గణమున) ఏడుగురుగా, ఏడుగణములుండును (7x7=49). మొట్టమొదటి స్కంధము పృథివీ యందుండుగాక, రెండవది సూర్యునియందు, మూఁడవస్కంధము చంద్రుని యందు, నాలుగవది ఆకాశమందలి జ్యోతిషాంగణము నందు, ఇక నైదవది గ్రహముల యందు, సప్తర్షి మండలమున ఆరవది, ధ్రువునియందు సప్తమ స్కంధము. నా కుమారులీ సప్త స్కంధముల ఆయా వివిధ కాలములలో సంచరింతురుగాక. (81) నా కుమారులు వాత స్కంధాధిపతులై సంచరింతురుగాక. ప్రథమ స్కంధము పృథివీ యందున్నది. అయ్యది మేఘముల పర్యంతము వ్యాపించును. దాని పేరు “ఆవహము” (82) మొదటి స్కంధమునకు (వాతపథమునకు) సంబంధించిన నా పుత్రులేడ్లురు ఈ భూ స్కంధపు పథమునందే సంచరింతురు. రెండవ వాత స్కంధము మేఘముల కుపరి సూర్యుని వరకు నున్నది. దానికి ప్రహవము' అని పేరు. నా కుమారులలో ద్వితీయగణమీ 'ప్రవహ' మను రెండవ పథమున సంచరింతురుగాక. మూఁడవ వాత స్కంధము సూర్యుని కుపరితలమున చంద్రునకు అధస్తలమున నుండును. అయ్యది ‘ఉద్వహము' అను నామముతో ప్రసిద్దము. నాకుమారులలోని మూడవ గణము మూఁడవ వాతస్కంధమున సంచరింతురు. (85) నాలుగవ వాత పథము చంద్రునకుపరి భాగమున, నక్షత్రముల కధోభాగమున నున్నది. దీనికి 'సంవహము” వాతపథమని పేరు. ఇఁక నైదవదీయగు నా కుమారుల వాయుపథము నక్షత్రములకు పైగా, గ్రహముల పర్యంతము వ్యాపించియుండును. దీనికి 'వివహము' అని పేరు. నా కుమారులలో పరిచయ గణమీ వాయు పథమున సంచరింతురుగాక. ఆవ వాత స్కంధము గ్రహములకు పై భాగమున నుండీ సప్తర్షి మండలము వరకు వ్యాపించును. అయ్యది 'అనువహము' నా కుమారులలో ఆరవగణమీ వాయు పథముగంటి సంచరింతురుగాక, ఇక ఏఁడవ వాయు స్కంధము సప్తర్షులకు పైన నున్నది. అందుండి ధ్రువమండలము వరకు వ్యాపించును. దీనికి 'పరివహము' అని పేరు. నా కుమారులందుండుదురుగాక. నా కుమారులు విభిన్న కాలములలో నీ వాయు పథముల సంచరింతురు గాక, వారందరు నీ వొసంగిన నామముచే మరుత్తులుగా నగుదురుగాక. ఓ శతక్రతూ ! నాకుమారుల నామములను తెలిసికొనుము. ఆ నామములు వారి వారి వివిధ కర్మలచే వేరువేరుగా నున్నవి. మొదటి గణము శక్రజ్యోతి (2) సత్య, (3) సత్యజ్యోతి.

4. చిత్రజ్యోతి, 5. జ్యోతిష్మంతుఁడు; 6. సుతపుడు., 7. చైత్యుఁడు. ఇది మొదటి గణము చెప్పితిని. ద్వితీయగణము నందలి పారల . నామముల నెఱుంగుము, 1. ఋతజిత్తు, 2.సత్యజిత్తు; 3.సుషేణుఁడు; '4, సేవజిత్తు, 5.సుతమిత్రుఁడు, 6.అమిత్రుఁడు, 7. సురమిత్రుఁడు. ఇం క తృతీయగణము యొక్క నామముల నేణుంగుము. ధాతువు 2,ధనదుఁడు, 3. ఉగ్రుఁడు, 4.భీముఁడు, 5.వరుణుఁడు, 6.అభియుక్తాక్షికుఁడు; 7. సాహ్వయుఁడు. ఇది మూఁడవ గణము వివరింపఁబడినదని యెఱుంగుఁడు. (95) పంచమగణము : ఈ దృక్కు 2. అన్యాదృక్కు 3.సరిత్, 4.ద్రుమ, 5.వృక్షకము, 6.మితుఁడు, 7.సమితుఁడు. షష్టమగణము ; 1. ఈఋక్కు 2,పురుషుఁడు 3. నాన్యాదృక్కు 4. సమచేతనుఁడు, 5. సమ్మితుండు, 6. సమవృత్తుడు, 7.ప్రతిహర్త. (సప్తస్కంధములోని మరుద్గణముల పేరులీయబడలేదు), మనుష్యలెల్లరు ప్రజలెల్లరు యజ్ఞముల నాచరించిరి, వారెల్లరును స్తోత్రపారము చేసిరి. ఈ విధముగా వీరు దైత్యదేవతలు చెప్పఁబడిరి. ఈ విధముగా (7x7=49) మరుత్తులు వారి వారి నామధేయములతో జ్ఞప్తి యందుంచుకొనంబడుదురు, వారు నలుబదితొమ్మండు, వారు దితిచే శక్రునిచే గణింపఁబడిరి. (9) ఈ నామములను వారి కొసంగిన తరువాత దితి శక్రునితో ఈ నీ సోదరులు వాత స్కంధముల (పథముల సంచరింతురుగాక. నీకు భద్రమగుగాక. దేవతలతో సహితము నా కుమారులీ వాయుపథముల సంచరింతురుగాక, అనెను. ఈ మాటలను సహస్రాక్షుఁడయిన శక్రుఁడు వినెను. ప్రాంజలిబద్ధుఁడై పురందరుఁడు సగౌరవముగా ఆమెతో ఓ అమ్మా ! అట్లేయగుగాక. నీవు పలికినట్లే యగును. ఇందెట్టి సంశయములేదు. నీవు చెప్పినట్లు ఈ మహాత్ములయిన కుమారులు లోక సమ్మతులగుదురు. దేవతలతో కూడి వారు యజ్ఞ భాకులగుదురు. అందుచే ఈ మరుత్తులందరును దేవతలు. వీరందరుకూడ ఇంద్రునియొక్క తమ్ములు, శక్తిమంతులు, వేగవంతులు నయిన యీ దితి సంతతులు శాశ్వత వ్యక్తులు అగుదురుగాక” అనెను. తల్లి కుమారుం డు- ఇరువురు నీ అంగీకారమునకు ఆశ్రమమున వచ్చిరి. వారు స్వర్గమమునకు సంతోషముగా జనిరి. శక్రుఁడు గత జ్వరుఁడయ్యెను. ఎవడీ పవిత్రమైన మరుత్తుల యొక్క జన్మను చదువునో, వాదము నందతఁడు విజయము నొందును. అతఁడు లబ్దాత్ముఁడగును.

ఇదీ వాయుప్రోక్తమయిన మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమందలి మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున మరుదుత్పత్తి వర్ణనము.