31 - సప్తకక్ష్యామతంగకన్యప్రాదుర్భవో

అగస్త్యుడనేను:- శ్రీ పురమనునదేమి? ఏ రూపముతో నుండును? పూర్వము ఎవరిచే నిర్మింపబడినది? అదియంతయు నాకు దెలుపుము-1. ఎంత ప్రమాణము గలది? దాని వర్ణమెట్టిది? ఓ ప్రభో! చెప్పుము. నీవే సర్వసందేహములనెడు బురుద మొండగొట్టుటలో సూర్యుడవు-2. .

హయగ్రీవుడనేను :- మహా యాగాగ్నిలోబుట్టిన లలితా పరమేశ్వరి పూర్వోక్త లక్షణములు గల చక్రరథమును బొంది బ్రహ్మాదులచే బ్రార్జింపబడి వివాహలీలను నిర్వహించి లోకకంటకుడైన భండాసురుని జయించేను-1,2,3. అపుడు మహేంద్రాది దేవతలు సంతసించిరి, తరువాత కామేశ్వరునకును, లలితాదేవికిని నిత్యోపభోగాది సమస్తమునకై శోభనమైన మందిరమును నిర్మించుట కుత్సహించిరి. 5. లలితాదేవి యొక్క కుమారులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు దేవశిల్పియు రథకారుడునైన విశ్వకర్మను రాక్షసశిల్పియై మాయా విచక్షణుడైన మయుని బలిచి సత్కరించి లలితాజ్ఞతో నిట్లనిరీ- 5,6,7, అధికార పురుషులనిరీ :- శిల్పమును దెలిసిన యో విశ్వకర్మా! మహోదయుడవైన మయా! మీరు సర్వశాస్త్రజ్ఞులరు. భవనాదులను గూర్చుటలో కోవిదులరు -8. సంకల్ప మాత్రముననే మహాశిల్ప కల్పనా విశారదులరు. మీరు నిత్యజ్ఞానమహోదధియైన లలితాదేవియొక్క శ్రీనగరులను నిర్మింపవలేను. అవి షోడశక్షేత్ర మధ్యములలో సాక్షేత్రసమసంఖ్యలో నుండవలె. నానారత్నములతో నలంకరింపబడి యుండవలె -9, 10. అచట పదునారు రూపముల ధరించి విశ్వరక్షణకై లలితాపరమేశ్వరి నివసింపగలదు-11. ఇది మాకిష్టమైనది. దేవమరుత్తులకుగూడ ప్రియమైనది. సర్వలోకములకు బ్రియమైనది. ఇది యామె పేరనే నిర్మింపబడుగాక, ఈ విధముగా కారణదేవులు చెప్పిన మాటలను విని యా విశ్వకర్మ-మయులు నమస్కరించి యట్లేయగుగాక యని పలికిరి -13, వారు మరల నమస్కరించి యా కారణపురుషులతో నిట్లనిరి. ఏ క్షేత్రములలో నీ మహోదయములైన నగరుల నిర్మింపవలెను? -14. బ్రహ్మాదులు యథోచితముగా క్షేత్రముల వీభాగమును కల్పించుచు ఆ శిల్పులతో మరల బలికిరీ-15.

కారణ పురుషులనిరి :- మొదట మేరు పర్వతముపైన, నిషధపర్వతమున, హేమకూటమున, హిమగిరియందు, బదవది గంధమాదన పర్వతమున -16, నీలర్వతమున, మేషపర్వతమున, శృంగార పర్వతమున, మహాగిరీయైన మహేంద్ర పర్వతమున ఈ తొమ్మిదిక్షేత్రములలో నిర్మింపవలే. ఇవి భూమియందలి క్షేత్రములు అని గుర్తించగవలె -17. ఇక జలక్షేత్రములు సమస్త సముద్రములుగా చెప్పబడినవి. లవణసముద్రము, చేలకురససముద్రము, సురా సముద్రము, నేతిసముద్రము, దధి సముద్రము, పాలసముద్రము, ఏడవది జలసముద్రము, పూర్వము చెప్పిన తొమ్మిది పర్వతములు, తరువాతి యేడు సముద్రములు -19, కలిపి మొత్తము పదునాలు క్షేత్రములు అంబయొక్క శ్రీపుర నిర్మాణమునకై నిర్ణయింపబడినవి. వానిలో మహౌజస్వినియైన లలితా దేవి యొక్క దివ్యభవనములను దీవ్యఘటనాపండితులై శిల్పులైన మీరు నిర్మింపవలెను -20. అవి మహాసురసంహారముచేసిన లలితాదేవి యొక్క నిత్యానామములతోనే ప్రసిద్ధిచెందును. సంశయములేదు -21. ఆమె నిత్యాస్వరూపముతో కాలవ్యాప్తిని జేయు పరాశక్తి, కలనాంకమున సర్వజగమును ఆదేవి.సుఖింపజేయును-22 నీత్యాశక్తులకు మహరాణ్ణి. ఆమె నీత్యాశక్తి స్వరూపిణి. ఆమెకు భేదములేదు. కావున పూర్వము వారి నామముతోనే (నిత్యానామముతోనే) ప్రసిద్ధిచెందినది -63. కామేశ్వరపురి, భగమాలాపురీ, నిత్యక్లిన్నాపురి అను మొదలగు నామములు మిక్కిలి ప్రసిద్ధములు -24. కావున మిక్కిలి యోగ్యమైన పుణ్యదినమున మహాశిల్ప పద్దతిలో రంగుతోగాని,వర్ణముతోగాని నామముల సూచించు శుభమైనపురిని రచింపుడు -25, కారణకృత్యములకింద్రులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పై విధముగా జెప్పగనే యా విశ్వకర్మ మయులు ఆయాక్షేత్రములలో శ్రీపురిని నిర్మించిరి -26. ఇక శ్రీపురము యొక్క విస్తారమును, దానికధిష్ఠాతలైన దేవతలను, జెప్పెద ఓ లోపాముద్రాపతీ అగస్త్యా! వినుము -27. మేరుపర్వతము అఖిలాధారమైనది, ఎత్తైనది. అనంత యోజనవిస్తారము గలది. పదునాలుగు భువనముల మండలముతో నేర్పడిన యాకారముగలది. -28. దానికి నాలుగు శిఖరములు గలవు. అవి తూర్పున నైరుతమున వాయవ్యమున, మధ్యస్థలమున ఉన్నవి. వానియెత్తు జెప్పెద -29. మొదట జెప్పిన మూడు శిఖరములు నూరు యోజనముల యెత్తున్నవి. నూరుయోజనముల విస్తారము గలిగియున్నవి. వానిలో మూడు లోకములున్నవని యందుడు -10. అవి బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకమును. అవసరాంతరమున వీనియొక్క గృహ విన్యాసములను జెప్పెదను -31. మధ్యనున్న శిఖరము యొక్క విస్తారమును ఎత్తును వినుము. నాలుగు వందల యోజనముల యెత్తు, అంతీయ విస్తారము -32. ఆ మహా శృంగమునందే శిల్పులచే శ్రీపురము నిర్మింపబడినది. ఓ యగస్త్యా! అది నాలుగువందల యోజనముల విస్తారము గలది -33. అచట నీ వీభాగమును నీకు వివరించి చెప్పెదను. మొదటి ప్రాకారము ఉక్కుతో నిర్మింపబడినది. -34, అదీ పదునారువేల యోజనముల పొడవుతో జుట్టినది. నాలుగు దిక్కుల ద్వారములున్నవి. ప్రాకారము నాలుగు యోజనముల యెత్తున -35. అగస్త్యా శాలమూలము యొక్క వైశాల్యము పదివేల యోజనములు, శాలాగ్రము యొక్క ఆయతనము రెండు కోశములు వేరుగా గప్పబడినది .-36. శాల ద్వారము యొక్క యెత్తు ఒక యోజనము. ప్రతి ద్వారమున రెండు తలుపులు. ఒక క్రోశము విస్తారముగలవీ -37. ఒక యోజనమెత్తుగలమీ. ఉక్కుతో నిర్మింపబడినవి. ఆ రెండు తలుపులకు ఏర్పరచిన గడియ అరకోశము పొడవుగలది -38. ఈ విధముగా నాలుగు ద్వారములలోను సమానత పాటింపబడినది. అగస్త్యా! గోపురము యొక్క సంస్థానమును జెప్పెదను -5, మొదటజెప్పిన శాలము యోజన సమ్మితము రెండు ప్రక్కలు రెండు యోజనములు, మధ్యశాలము యోజనము. విస్తారము గూడ నంతీయ. ద్వారగర్బితమై యున్నది, -41. కలిపి ఓ మునీ! కొలతలో. బదు యోజనములు, రెండు ప్రక్కల రెండున్నర క్రోశములతో గలిసినది -42. కలిపి యైదు యోజనముల పొడవు, ఓమునీ! ఈ విధముగా నటగోపురము నిర్మింపబడినది -43. కావున గోపుర మూలము యొక్క చుట్టు ఇరువది యోజనములు పైపై చుట్టు తక్కువగానే యుండును. - -44 గోపురము యొక్క యెత్తు ఇరువదియైదు యోజనములు. ప్రతి యోజనమున తలుపులతో మనోహరమైన ద్వారముండును. -45, భూమికలు గూడనంతటివే. పైపైన తక్కువ గలవి. గోపురాగ్రము యొక్క విస్తారము యోజనము-46. పొడవు గూడ నంతియ. అట మూడు ముకుటములున్నవి. ముకుటము యొక్క విస్తారము ఓ యగస్త్యా! ఒక కోశము కొలత -47, రెండు క్రోశముల యెత్తు, గోపురమువలెనే పైపైన తక్కువగా నుండును. ముకుటము యొక్క మధ్యన భూమి క్రోశార్దము (అరకోశము) -48. ముకుటము పశ్చిమమున, తూర్పున, దక్షిణమున, ద్వారగోపురమున గలదు. పశ్చిమ ద్వార గోపురమున దక్షిణోత్తరముగా ముకుటములున్నవి -49. దక్షిణద్వారమువలెనే ఉత్తర ద్వార ముకుటములున్నవి. పశ్చిమ ద్వారమున వలెనే తూర్పు ద్వారమునను ముకుటములున్నవి -50. కాలాయసమను (ఉక్కుదైన) శాలము యొక్క మధ్యన మారుత యోజనములు (గాలి వచ్చుమార్కమలు} గలవు. కాంస్య (కంచు)శాలము యొక్క మధ్యన పూర్వమునందు వలెనే గోపురమున్నది -51, శాలమూల ప్రమాణము పూర్వమువంటిదే, ఈ కాంస్య (కంచు) శాలము గూడ పూర్వాది దీక్కులలో ద్వారములు గలవు. -52 ప్రతీద్వారమున గోపురములు. అవి పర్వ(అంతస్తుల) లక్షణములు గలవి. కాలాయస-కాంస్యశాలలమధ్యన నున్న ప్రదేశము నందంతట-58. అనేక వృక్షములుగల గొప్పయుద్యానము. అట. ఉద్భిజాదు లెన్నియున్నవో యన్నియు గలవు -54, వేయికి మించిన వృక్షములు, అవి సర్వకాలపుష్పములు, సర్వకాల ఫలములు, సర్వకాల పల్లవములును గలవై శోభిల్లుచుండును. సర్వకాలముల సుగంధములు వెదజల్లుచుండును -55, మామీళ్లు, కంకోలకములు, బొద్దుగుచెట్లు, బకులములు, కొండగోగులు, శింశపములు, దిరిసెనలు, దేవదారువులు, సురపొన్నలు, -56, పున్నాగములు, నాగభద్రములు, ముచుకుందములు, కట్పలములు, ఏలకులు, లవంగములు, తక్కోలములు, కర్పూర గౌఖులు -57. పీలువులు, కాకతుండులు, శాలకములు, అసనములు, కాంచనారములు, లకుచములు, పనసలు, హింగులములు, 58. పాటలములు, ఫలవృక్షములు, జడలుగలవృక్షములు, జఘనమున ఫలము గాయునవి (మేడి) గణికములు, కుండములు, బంధుజీవములు, దాడిమములు -59. అశ్వకర్ణములు, హస్తికర్ణములు, చాంపేయములు, కనకద్రుమములు, యూధీకలు, తోలపర్లులు, తులసులు, సదాఫలములు -60.. తొలములు, తమలములు, హింతాలములు, ఖర్జూరములు, శరబర్బురములు, ఇక్షువులు (చెరకులు) క్షీర వృక్షములు, శ్లేష్మాంతకములు, విభీతకములు (జీడి) - 61. హరీతకులు, అవాక్పుష్పములు, హోంటాలులు, స్వర్గపుష్పికము, భల్లాతకములు, ఖదిరములు, శాఖోటములు, చందనములు -62. కాలాగురువులు, కాలస్కంధములు, చీంచములు (చింత) వటములు, ఉదుంబరములు, అర్జునములు, అశ్వత్తములు, శమీవృక్షములు ధ్రువద్రుమములు, -63, రుచకములు, కుటజములు, సప్తపర్ణములు, కృతమాలకములు, కపిత్తములు, తింత్రిణులు, - ఇవి మొదలుగా గల వేలవృక్షములు -64. నానా ఋతువులలోజేరునవి. దేవి యొక్క శృంగారమునకు సాధనములు. అనేక వృక్షములవలే మహోన్నతములైన, శాఖలు గల వృక్షములు అందుగలవు -65, కాంస్యశాలము యొక్క మధ్యన ఏడు యోజనముల దూరముగా చతురస్రమైన తామ్రశాలముగలదు. అది. ఏడు యోజనములయెత్తెనదీ-66. ఈ రెంటిమధ్యనున్న భూమి కల్పవటీక. కల్పవృక్షఫలములు కర్పూరగంధముగలవి. రత్నముల వంటి బీజముగలవి -67. బంగారు బెరుడుతోనందమైనవి. బంగారు వన్నెగల ఫలములతో నిండుగా. బండిన వృక్షములున్నవి. ఆ వృక్షములకొమ్మలు చివురింపగా దివ్యమైన పీతాంబరములు గలిగినట్లున్నవి -68. అమృతమే వాని మధురసము: (మకరందము) పువ్వులు అలంకారము. ఇటువంటివనేక కల్పవృక్షములిచటగలవు -69. ఇదీ రెండవకక్ష్య పేరు కల్పవాషి, తామశాలముయొక్క మధ్యన నాగశాలమున్నది -70. ఈ రెంటికడ్డముగానున్న ప్రదేశము ఏడు యోజనములు, అచట కల్పవాపికి సమాకారములో సంతాన - వాటియున్నది. ఆరెంటి మధ్యభూమి హరిచందనవాటిక. ఇదీ కల్పవాటిక సమాకార. ఫలపుష్పముల నిండినది.-72. ఈ యన్నీ శాలములలోను పూర్వము వలే ద్వారముల కల్పనము, గోపురముల కల్పనము, ముకుటముల కల్పనమును జరిగినవి -73. ప్రతిద్వారమున గోపుర ద్వారద్వారముల యేర్పాటు కలదు ఇత్తడిశాల మధ్యన ఏడు. యోజనములు దూరముగా పంచలోహ మయశాల యున్నది. అది పుర్వశాల సమాకారము. ఆరెంటి మధ్యనభూమి మందార వృక్షవాటిక -75. పంచలోహశాలము యొక్క మధ్యన ఏడు యోజనములు దూరముగా వెండిశాలము నిర్మింపబడినది. అదీపూర్వోక్తశాలముల లక్షణములతో గూడినదీ. -76. ఆ రెండి మధ్యభూమి పారిజాతవక్షోద్యానము. అది దివ్యసుగంధముతో నిండినది, ఫలపుష్పముల భారముతో నుజ్వలమైనది -77 రౌష్య(వెండీ) శాలము యొక్క మధ్యన ఏడు యోజనముల విస్తారముగల హేమ (బంగారు) శాలము పూర్వమువలె ద్వారశోభితమైయున్నది -78, ఆరేంటి మధ్యభూమీ కదంబ వృక్షవాటిక. అచట దివ్యములైన నీప వృక్షములు. రెండు యోజనములున్నతములు -79, ఎల్లపుడు మచీర (కల్లు) తో కదలాడుచున్నవి. దట్టమైన పూవులతో మెరయు చున్నవి. వాటినుండి యోగినులకు భోగమునిచ్చు కాదంబరి (పుష్పప్రసవమైన యాసవము) వచ్చును -80. అది విశిష్టమైన మదిరోద్యానముగా మంత్రిణ్యంబకు ఎల్లప్పుడు ప్రియమైనది. ఆ నీపవృక్షములు సుఖచ్చాయ గలవి. - దట్టమైన యాకులుగలవీ.. చిగురాకులతో నిండినవి. సుగంధమున కాకర్షింపబడిన తుమ్మెదల దండు యొక్క ఝంకాములు నిండిన యుదరములు (లోపలి భాగములు) గలవి -81. అచటనే మంత్రిణీనాథయొక్క మనోహరమైన మందిరము కలదు కదంబవనవాటి యొక్క విదిశలలో ఆగ్నేయ దిక్కు మొదలుకొని కలదు -82. ఆది శిల్పిచే నెతైన నాలుగు మందిరములు కల్పింపబడినవి. ఒక్కొక్క మందిరము యొక్క విస్తారము ఐదు యోజనములు -83. ఐదు యోజనములు పొడవు, ఏడు. ఆవరణములతో వానియునికి, ఇట్లే యితర విదిశలలోగూడ నంతట ప్రియక వృక్షములుండును. ఇది శ్యామాశక్తి యొక్క నివాసనగరి -84 సేనకొఱకు మహాపద్మాటవీస్థలములో మరొక నగరి కలదు. ఇచట బహుజన దూరమున నామె గృహముండుటచే -85. మంత్రిణీచే శ్రీదేవి యొక్క నిత్యసేవ ఘటింపదు. అందువలన చింతామణిగృహసమీపమున ఆ శ్రీమంత్రినాథ యొక్క భవనము త్వష్టచేతను మయునిచేతను నిర్మింపబడినది -86. శ్రీపురమున మంత్రీడీదేవి మందిరము యొక్క బహుగుణములను రెండువేల నాలుకలుగలిగి (యాదీశేషుడై) ఎవడు వర్ణింపగలడు?-87. మాన్యలైన మాతంగకన్యకలు కాదంబరి (ఆసవ) మదముచే పూర్తిగా నేఱు పేక్కీన కన్నులు గలిగి, మధురవీణతో లలితాగుణముల గానముజేయుచు నాడుదురు -88. అగస్త్యుడనెను, మాతంగుడనవెవరు? ఆతని కన్యలెవరు? వారెట్లు కలిగిరి? వారు మధుమదముతో అలసలై మంత్రిణీనాథనెట్లు సేవింతురు? -89. హయగ్రీవుడనేను:- మతంగుడనువాడు తపస్సులన్నింటికి సేకరాశియైన తపోథనుడు. మహాప్రభావ సంపన్నుడు. జగమును సృజింపవలెనను నత్యాశ గలవాడు. 90. తపఃశక్తితోను, చక్కని బుద్ధితోను అంతట తనయాజ్ఞను ప్రవర్తింపజేయువాడు. ఆతని పుత్రుడు మాతంగుడు. ధీరధీమంతుడైన యాతడు మంత్రిగాయికమైన ముద్రిణిని -91. ఘోరతపములచే మిక్కిలి పూజించెను. మతంగముని పుత్రునిచే తపముతో సముపాసితయైన -92 మంత్రిణి సుప్రసన్నమై వరమడుగమని శాసించెను. తపోనిధియై సర్వమునులలో శ్రేష్ఠుడైన యా మాంతగుడును తనయెదుట ప్రత్యక్షమై నిలిచియున్న శ్యామలాంబికతో నీట్లనెను. -93. మాతంగమహాముని యనెను:- ఓ దేవీ! నీ స్మరణ మాత్రముననే అజీమాది సమస్త సిద్ధులు తక్కిన విభూతులును నాకు సిద్ధించినవి. అంబా! నేను పొందదగినది త్రిభువనములోను ఏదియులేదు. నీ చరిత స్మృతి మాత్రముననే నాకు అణిమాది సర్వసిద్ధులును తక్కినయన్ని విభూతులును కలిగినవి, ముల్లోకములలో నేను పొందదగినదేమియు లేదు. -95. ఐనను నీ ప్రసన్నత నాకు నిష్పలము గారాదు. ఈ వరమును గోరుకొందును. అంబా! దానిని పూరించుము -96. పూర్వము నేను హిమవంతునితో సౌహార్దముగ నుండి పరిహాసమాడితిని. క్రీడామదముతో నాతడు అవాచ్యములు పలికి తనగొప్పతనము జూపెను -97. తాను గౌరీ గురువునని (తండ్రినని) ఆత్మలో కొనియాడుకొను చుండెను. అతనికి నాకన్న అధిక గుణముగలదు ఆ స్థితి నాకు కలుగలేదు -98. అన్ని గుణములలో సామ్యముగల యిరువురు మిత్రులలోనొకరికి ఒక కారణమున గుణాధిక్యము వచ్చినచో తక్కినవానీకి సామ్యమునకై యది కావలెనను కోరిక కలుగును, -99. ప్రాక్తకాముడనైనను నేను గౌరీ గురుత్వ ప్రశంసకై తపము జేసితిని. కావున ఓ మంత్రిణీనాథురాలా! శ్యామలాంబా! నాకు నీవు పుత్రివీగమ్ము-100. దానివలన నా పేరు ప్రసిద్ధమగును. సంశయములేదు. మాతంగముని యొక్క వచనమును విని అట్లే యగుగాకయని మంత్రీకి అంబ! అంతర్ధానమయ్యెను, ఆముని కూడ సంతుష్మడయ్యేను-101. ఆమంత్రిణ్యంబ మాతంగమునికి స్వప్నమున తాపిచ్చమంజరిని (చీకటి మ్రాని (కానుగచెట్టు) పూగుత్తిని) చేవి అలంకారముగ నిచ్చెను-102. ఆస్వప్న ప్రభావమున మాతంగముని భార్య సిద్దీమతి (పేరుగలది) లఘుశ్యామను గర్భమున ధరించెను -103. ఆతని నుండి పుట్టినందున మాతంగి యనబడినది. లఘుశ్యామయని కూడ అనబడినది. కారణము ఆమెకు మూలకంధమైన భూమీ శ్యామయగుట -104 మాతంగకన్యకలు మనోహరలు. వారు కోట్లకు కోట్లలో గలరు. లఘుశ్యామలు, మహాశ్యామమాతంగీ బృందముతో గూడినవారు, వీరు అంగశక్తులై ప్రియకప్రియను సేవింతురు -105. ఓ అగస్త్యా! ఇది మాతంగకన్యలయుత్పత్తి, లోహాదినిర్మిత సప్త కక్షశాలలు చెప్పబడినవి. -106.

ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున సప్తకక్ష్యామతంగకన్యాప్రాదుర్భావవమను ముప్పదియొకటవయధ్యాయము.