41 - ఏకచత్వారిoశోధ్యాయః

అగస్త్యుడనెను:- ఈమెయంత్రమెట్టిది? శ్రేష్టమైన యీయెమంత్రమెట్టిది? ఉపదేశించువాడెట్టి వాడుగావలెను? శిష్యుడెట్టివాడుగావలెను? -1. ఓహయగ్రీవ! నీవు సర్వజ్ఞుడవు, సాక్షాత్తు పరమపురుషుడువు, స్వామీ! నాయందుకృపజూడుము. ఇదియంతయు దెలియజేయుము.

హయగ్రీవ ఉవాచ:

అగస్త్యుడనెను: ఈమె యొక్క మంత్రమెట్టిది? ఎట్టి మంత్రము శ్రేష్ఠము? దీని నుపదశించువాడెట్టి వాడు గాను, నుండవలె? అట్లే శిష్యుడుగూడ నెట్టివాడుగానుండ వలె? హయగ్రీవుడనెను: ఈమె యొక్క మంత్రము శ్రీ చక్రమే. ఆమె యే యాత్రిపురాంబిక. ఆ మెయే యీ మహాలక్ష్మీ పూర్వమాత్మనుండి స్ఫురించుచునే జ్యోతిర్మయముగా విజృంభించిన చక్రము నెల్లప్పుడు చూచుచుండెను-3. ఈ చక్రము యొక్క మాహాత్మ్యము తెలియనలవికానిదే కదా-4 సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే శ్రీచక్రమని నిజముగా దెలియవలె. దాని నర్చించి కమలలోచనుడైన మహా విష్ణువు సర్వ లోకములను మోహింపజేయునదై, కామునే మోహింపజేయు రూపమును బొందెను-5, ఆమె నర్చించీ యీశానుడు సర్వ విద్యలకీశ్వరుడయ్యెను, దానిని విశేషముగా నారాధించి బ్రహ్మ బ్రెహ్మాండములను గనినవాడయ్యెను. దాని సేవ చేత మన్మథుడు మునులనుగూడ మోహింపజేయువాడయ్యెను-6. బంగారు - వెండి - మొదలగువానిచే నిర్మింపబడిన చక్రమును శ్రీదేవి యెదుట నుంచవలె, గంధములతో-7. షోడశాక్షర విద్యతో (పదునారక్షరములుగల మంత్రముతో) నర్చింపవలె. మంగళమైన యాకారముగలవాడై ప్రతి నిత్యము వేయి తులసీ పత్రములతోను మూలమంత్రములతో శ్రీ దేవీ ధ్యానము జేయుచు నర్చింపవలె-8, తేనె, నేయి, శర్కరలతోగూడిన శుభ పాయసములతోను, మనోహరములై ఏ మాత్రమునిందింపరాని అపూపములతోడి (పిండివంటలతోడి) నైవేద్యముతో-9. మండల త్రయమున బుద్ధిమంతుడై మహాలక్ష్మిని సంతోషింపజేయువానికి వెంటనే పరమేశ్వరీ ప్రత్యక్షమగును-10. ఆతని మనస్సు కోరిన దానిననుగ్రహించును. తెల్లని పుష్పములతో ముక్తుని రీతిలో చక్రము నర్చించిన వాని నాలుకపైన సరస్వతీ నాట్యముజేయును. ఎఱ్ఱని పూలతో చక్రమును చెప్పినరీతిలో నర్చించినవాడు చక్రవర్తిని రాజును దాసునివలే వశీకరించుకొనును-12. పచ్చని వర్ణముగలిగి మంగళములైన పుష్పములచే నామెను బూజించినవాని యెదలో నిత్యము నిశ్చయముగా సాక్షాత్తు శ్రీదేవి యుండును. మంచి వర్ణముగలిగినను సుగంధములేని దుర్గంధముగల పుష్పములతో శివను బూజింపరాదు -14. కామాక్షియే మహాలక్ష్మి, చక్రము శ్రీచక్రమే కదా. ఈ శ్రీ విద్యయే పరా విద్య. ఈ నాయిక గురునాయిక-15. ఓ తపోధనా! ఈమె యొక్క : మంత్రరాజము శ్రీ విద్యయే. కామరాజాంతమంత్రాంతమున శ్రీబీజముతో గూడిన యీ షోడశాక్షరవిద్యయే శ్రీవిద్యయని చెప్పబడినది. (5ఏఈలహీం, హసకహలహీం, సకలహీం, శ్రీం) ఈ విధముగా రహస్యము చెప్పబడినది. ఇది ప్రయత్నముతో గోపనీయము. (దాచిపెట్ట తగినది)-16-17. త్రిమూర్తుల యొక్క శక్తి యీ విద్యయని చెప్పబడినది. అన్నీ మంత్రములకు ఈ విద్య ప్రాణ రూపిణి-18. పారంపర్యముగా. - (వంశపారంపర్యముగగాని గురు పారంపర్యముగగాని తెలిసికొన్న యీ విద్య బంధమునుండి (సంసారాదిబంధాదులనుండియు) విడివడజేయునది. పాపముల హరించునదిగను జరామృత్యువుల నశింపజేయునదిగను తలపబడినది-19. పూజించినవారికి దుఃఖ - దౌర్భాగ్య - వ్యాధి - దారిద్ర్యములను నశింపజేయును. స్తుతించినవారికి సత్కార్య విఘ్నముల బోగొట్టును. ధ్యానించిన వారికి సర్వార్థములను సిద్ధింపజేయును-20ముద్రా విశేషముల తత్త్వముల దెలిపిన వాడును మంత్రదీక్షచే నశించిన పాపములుగలవాడును. పరమేశానిని సేవించినవాడును కోరిన ఫలము లనందును-21. నరుడు బ్రహ్మ చర్యముతో నుండి తెల్లని వస్త్రముల ధరించినదియు తెల్లని యావాసము యొక్క (దేవ మందిరము యొక్క - పీఠము మొదలగువాని యొక్క మధ్యనున్నదియునైన శ్రీ దేవిని తెల్లని పుష్పములతో. బూజింపవలె-22. పెరుగన్నము - పాల అన్నము మొదలగు తెల్లని నైవేద్యములతోను లేదా సంకల్పముతో (మనమున భావనలో) తెల్లనివని భావించిన వానితోనైనను పరమేశ్వరిని పూజింపవలెను-23, 'శ్రీ' వాలమును త్ర్యక్షరీ బీజములతో క్రమముగా ఖండములలో జేర్చిన యాషోడశాక్షరీ విద్యను శుద్దమనసుడై యర్చింపవలె. (ఇచట మంత్ర స్వరూపము తెలియుట లేదు)-24. అనులోమ విలోమముగా మాత్రీకాక్షరములతో జపించుచు, దేవాగ్రమున శ్రీదేవీని దీపరూపిణిగా భావించుచు, ఓ మునీ! మనసుతో బలికిగాని, ధ్వనిలేక రహస్యముగా బలికిగాని, ధ్వనితో స్పష్టముగానుచ్చరించిగాని, శ్రీదేవీన్యాససహితుడై, శ్రీదేవిచే జేయబడిన (ఆత్మ) విగ్రహముగలవాడై ఒక లక్ష జపముజేసినచో మహా పాపముల నుండి విముక్తుడగును-27. ఓ దేవర్షీ! రెండు లక్షల జపముతో ఏడు జన్మల నుండి సాధకుడు చేసిన పాపములను పరాకళ నశింపజేయును-28. మూడు లక్షల జపమున వేయి జన్మల పాపముల నుండి విముక్తుడగును. పూర్తిగా నిర్మలుడగును. వరుసగా పదునాలు లక్షల జపమున దేవీ సాన్నిధ్యమునందును-29. ఇట నిత్యము త్రికాలముల (ప్రాతర్మధ్యాహ్న సాయంకాలముల) పూజ జరుగును. జపము, తర్పణము, హోమము, బ్రాహ్మణ భోజనము. పురశ్చరణమును చెప్పబడినవి (జరుగును)-30. హోమ తర్పణములకు స్వాహా, న్యాస పూజనములకు నమః. మంత్రాంతమున దేవిని పూజింపవలె. జప కాలమున తగినట్లుగా జేయవలె-31. జపములో పదవవంతు హోమముండును. హోమములో దశాంశము తర్పణముండును. తర్పణములో దశాంశము బ్రాహ్మణ భోజనముండును. (ఉదా: 1000 జపమైన, 100 హోమము - 10 తర్పణము -1 బ్రాహ్మణ భోజనము)-32. దేశమును బట్టి కానీ కాలమును బట్టిగాని హోమ తర్పణాదులకు విఘాతముగలిగినపుడు హోమ తర్పణాదుల సంఖ్యకు రెట్టింపు జపముచేసి 1000 జపమైన, 1000+100+10+1x2=2222 ఎక్కువగా జపముచేసి పురశ్చర్యను సమాప్తి చేయవలె, ( కేవలము హోమ విఘాతమైన 200 జపము. కేవలము తర్పణ వీఘాతమైన 20జపము, బ్రహ్మణభోజనమున విఘాతమైన2 జపము)-33, తరువాత కామ్య ప్రయోగమునకై మరలమూడు లక్షల జపము జేయవలె. అపుడు వ్రతమున నుండి నిర్వికారుడై మూడు కాలములలో పూజలో నాసక్తుడుగావలే. తరువాత వశ్యావశ్యాదికర్మలజేయుచు సిద్ధిని బొందగలడు-34, మంత్రోపాసకుడు దేవి నర్చించి చక్రమధ్యముననున్నవాడై తనను మొత్తమెట్టిని వానిగను, ఎఱ్ఱగా జేయబడిన సాధ్యునిగను ధ్యానించినవాడు-35. ఓ వింధ్యారియైన యగస్త్యా, సర్వసౌభాగ్యసుందరుడగును. సర్వలోకములకు ప్రియపతియై వశమునందుంచుకొనును. సంశయములేదు-36, పండితుడు నూటయెనిమిదిమారులు జపించి గోరోచనము - కుంకుమ - వీని సమభాగములతో చందనమును తిలకముసుగా ధరింపలె-37, దాని వలన వాడు తాను జూచినవానిని, తాకిన వానిని, తలచినవానిని వాని ధనములతో బాటు దాసుని వలె వశముజేసికోను-38. "అట్లే నూట యెనిమిదీ మారులు జపించి పుష్పమునుగానీ, ఫలమునుగాని, గంధమునుగాని, త్రాగువస్తువును (మధువు గాని, వస్త్రమునుగాని, యే స్త్రీకి పంపిన ఆ స్త్రీ వెంటనే మోహితయై యాకరీంపబడును-39, ఏకాంతమున భూమిపై గోరోచనముతో ఒక సురూపయు శృంగార వేష భూషలతోగూడినదియునైన ప్రతిమను వ్రాయవలె-40, ఆమె నుదురు - కంఠము హృదయము నాభి - పీక్కల ప్రదేశము - వీనిలో జేర్చబడిన జన్మనామమహావిద్యగలదీయు అంకుశాంతస్సులో జీల్చబడినదియునైన ఆమెను సర్వాంగ సంధిసంలీననుగా మదనాక్షరములతో వ్రాయవలె. (ఇచట భావము సందిగ్ధము), ఆమె యున్న దీక్కునకు ముఖముగా నయి త్రిపురాంబనే తనయాకారముగా భావించినవాడై-42. చంద్ర సూర్యకాంతులు నిండిన అగ్ని గృహమున (యాగ శాలలో జేర్చి క్షోభిణీముద్రను జూపి విద్యను నూటయెనిమిది మారులు జపింపవలె-43. ఆ తరువాత (అతడు చూచిన స్త్రీ యీ క్రింది విధముగ గాగలదు.) వీవశమైన కనుకోలుకులు గలది, మన్మథ బాణములచే పీడింపబడినది, ఉవ్వెత్తు వెలుగుచున్న మన్మథ వికాసమాయన్నట్లున్న జఘన భాగముగలది-44. శక్తి చక్రమున బ్రకాశించు కిరణవలయముతో కబళింపబడినట్లున్నది. సుచరిత్రమును దూరముజేసినది. విశాలమైన నేత్ర పద్మములు గలది, -45 ఆకర్షించినకన్నులుగలది. నష్టమైన ధైర్యమున లీనమైన సిగ్గుగలది (సిగ్గు వదిలినది). మంత్ర - యంత్ర - ఔషధ - మహా ముద్రలనెడి గొలుసులచే బంధింపబడినది. కొత్త ప్రేమను గలుపుటలో కంపించు హృదయ కమలముగలది-46. మనమునకు మించిన మహా మంత్రమును జపించుచున్నది. జారిన కోంగు కలది. విశేషముగ మోహితురాలివలెను, మిక్కిలి క్షోభజెందిన దానివలెను - కాల్పబడినదానివలెను, ఆశ్చర్యముగా నున్నది-47 - వ్రాయబడిన చిత్తరువువలె నున్నది. చైతన్యములేనిది వలె నున్నది. మిక్కిలి (యొదలో) మధింప బడినదీవలె నున్నది. పూర్తిగా విలీనమైనదీవలే నున్నది. నిశ్చేష్టురాలివలెనున్నది. తన్నుతానుగాకాక వేరొకరితయైనదివలెనున్నదిగా తానుబూచిన స్త్రీ కాగలదు-48 ఆకాశమున తిరుగుచున్న మంత్రవాయువుచే నెగురగొట్టబడిన వెదురుటాకువంటిదై నూరు యోజనముల దూరమునుండియు దిరుగుచున్న స్త్రీని భావింపవలె-49. తరువాత పర్వతములు అడవులు గలిగి చక్రమధ్యనున్న భూమిని నాలుగు సముద్రముల పర్యంతము మండుచున్నట్లుగా ధ్యానింపవలె-50. ఆ మాసముల యభ్యాసయోగముతో మన్మథునితో సమానుడగును. చూచి యే, లోకమునాకర్షించును. చూచియే వశపరచుకొనును-51. చూచియే స్త్రీని క్షోభింపజేయును. చూచియే విషమునుగూడ హరించును. చూచియే- వాక్కుల కీశుని (బ్రహ్మగా) జేయును. చూచియే సర్వమును మోహింపజేయును-52. పచ్చద్రవ్యముతో వ్రాసిన చక్రమును. రహస్యముగా ధరించిన, ప్రతివాదులకు వాక్ స్తంభము (మాట కట్టుబడిపోవుట)ను జేయును. ఇట సంశయములేదు-53, మహానీలీరసముతో శత్రు నామమును వ్రాసి దక్షిణాభిముఖుడైయగ్నిలో. గాల్చినచో నది శత్రువుల నుజంపును-54 దున్న - గుణము. వీని పేడ - లద్దులతో గోమూత్రములతో పేరును వ్రాసినయన్నమందున్న : చక్రము శత్రువులలో పరస్పర శత్రుత్వమును గలుగజేయును-55, కాకిరెక్కతో గోరోచనముతో మధ్యన పేరు వ్రాసిన చక్రము ధరించినచో కాకివలెనే శత్రువు ఆకాశ మధ్యన వ్రేలాడును, ఇది గొప్ప ఉచ్చాటనకరము- 56, పాలు - లాక్షారసము - గోరోచనములతోను మహా నీలీరసముతోను పేరును వ్రాసి చక్రమును ధరించినచో చాతుర్వర్యము (నాలుగు జాతులు) వశమగును-57: ఈ విధానముతోనే జల.. మధ్యనుంచినచో వాని స్నాన పానములవల్ల సాటిలేని సౌభాగ్యము నిశ్చయముగా లభించును-58, దేశమును, నగరిని, వరాంగనను చక్ర మధ్యగతముగా ధ్యానించినచో ఏడు దినములలో వారిని క్షోభింపజేయును-59. పచ్చ వర్ణముతో చక్రమును వ్రాసి తూరుపు మొగమై పూజించినచో సర్వ ప్రవాదులను స్తంభింపజేయును-60. సింధూర వర్ణముతో చక్రమును వ్రాసి ఉత్తరముఖుడై పూజించినచో .. . ఎప్పుడనిన నపుడే లోకము తన వశమగును. వేరుగాదు-61. గైరీకధాతువుతో చక్రమును వ్రాసి పశ్చిమ ముఖుడై పూజించిన సర్వాంగనలను. ఆకర్షించి క్షోభింపజేసి వశము జేసికొనును-62, ఓ అగస్త్యమున్నీ.. రహస్యముగ పర్వతమున నొంటరిగా దొరుగువాడై చక్రమును బూజించిన అజరామరుడు (ముసలి తనము మరణములేనివాడు) అగును. సంశయములేదు -63. ఈ రహస్యమునంతయుజెప్పితిని. మహామునీ! శ్రీమంత్రరాజమును జపించవలె. రహస్యముగానుంచుటవలన సర్వసిద్ధిగలుగును. బయలుపెట్టిన చో భ్రంశమే జరుగును-64 ఓమునీ! పురుషుడు పురశ్చర్యజేయక చేసిన పని వలన దేవతా శాపమునందును. వాడు. సిద్ధిని పొందడు-65 ప్రయోగ దోషశాంతీ కొఱకు పండితుడు మరొక లక్ష జపము చేయవలె. విధి విధానమున పూజ జేయవలె. అపుడు నరుడు మరలయోగ్యుడగును-66. భక్తితో నిండి నిష్కాముడై నిత్యము శ్రీ దేవతను బూచించువాడు, యథాశక్తి ఆమెనే ధ్యానించుచు మంత్రము జపించువాని యైహిక (ఈ. లోకపు) భారమాయెయే వహించును-68. ముక్తిని గూడనిచ్చును. ఎల్లప్పుడును దగ్గరుండి యామై యంతయు జెప్పును-69. దూడపై ప్రేమతో. తల్లియావు దూడను వెంబడించినట్లే దేవి శరణాగతుడైన భక్తుని వెంబడించును-70. అగస్త్యుడనెను:- ఐహికాముష్మిక (ఇహపరలోక) భారమును శ్రీదేవి యందేయుంచి, యామె యందే మనమును లగ్నముజేసినవాడు-72. సర్వానుకూలుడై (సర్వులు వీనికనుకూలురై) సర్వ ప్రతికూలములు లేనివాడగును, ఇతర రక్షణములేనివాడనియు దేవియే యేక మాత్ర రక్షణమనియు తలచిన వాడైతన్ను రక్షించుమని - దృఢముగా భ్రార్థించినవానిని ఆ మహాదేవి రక్షింపగలదు. -- అను విశ్వాసమేయిచట ముఖ్య ప్రయోజనము. జనుడు. ఆమె .. సేవాతత్పరుడుగావలెను, ఆమెయే శరణాగతీ-75-74, ఎపుడైనను స్తుతినిందాదులతో లోకులు నిందించనీ జనుడు స్తుతింపనీ దేవి. స్వరూపమును చక్కనీ బుద్దీతో సమీక్షించి శరణాగతి పొందినవాడు విషాద భేదములను బొందడు-75. అనుకూలము యొక్క సంకల్పము, ప్రతికూలము యొక్క వదలుట, రక్షింపగలడు అని విశ్వాసము, రక్షించువానినెన్నుకొనుట-76. ఆత్మ నిక్షేపము కార్పణ్యము. - ఈ విధముగా , శరణాగతి యాయువిధములు. ఆత్మ నిక్షేపమునంగీకరించినపుడు. పంచాంగములను సమర్పింపవలే. దీనికి సమానమైన భక్తిముక్తులసాధనము లేదు-77, అమానత్వము, (గర్వము లేకుండుట). అదంభిత్వము (కపటములేకుండుట). అహింస, క్షాంతి  (సహనము), ఆర్జవము (వంకరలేక చక్కన) ఆచార్యోపాసనము (గురూహసనము) శౌచము, ఛైర్యము (చాంచల్యము లేక స్టీరముగానుండుట), ఆత్మవినిగ్రహము (ఆత్మను స్వాధీనమందుంచుట)-8. ఇంద్రియార్థములందు వైరాగ్యము (శబ్ద స్పర్శ రూపర సగంధములయెడ వైరాగ్యము) అనహంకారము (నేనను భావములేమి) జన్మ-మృత్యు - జరావ్యాధుల దుఃఖములను దోషముగా జూచుట, పుత్ర-భార్యాగృహములందు అంటి పెట్టుకొనకయుండుట-79. ఇష్ట - అనిష్టముల యెడ నిత్యము సమభావము, నాయందు ఏకీభావమై అవ్యభిచారిణియైన (మరొకరిని బొందని) భక్తి-80. ఏజనమునందుండట, జన సమూహములందాసక్తిలేమి, అధ్యాత్మ జ్ఞానముతో - నిత్యుడగుట, తత్త్వజ్ఞానార్థములజూచుట, ఇవియన్నియు జ్ఞాన సాధనములు, వాటినెల్లప్పుడభ్యసింపవలె-61. ఆమె కర్మల జేయువాడు, ఆమె పరమయని భావించువాడు, ఏ సంగములేనివాడు, సర్వప్రాణులందు వైరము లేనివాడు, పరాశ్రీని పొందును-2 ఓ వాతాపిసంహారకా! - గురువు నావంటి బుద్ధిమంతుడు రహస్యముగ నామ్నాయమును (ఆగమములను) ఉపదేశించును. శిష్యుడుగూడ నీ వంటివాడే శిష్యుడు-83.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున ఉత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబదియొకటవయధ్యాయము-41.