బ్రహ్మాండ మహా పురాణము
35 - పరశురాముడు అగస్త్యాశ్రమము చేరుట
సగరుఁడిట్లడిగెను.
ఓ మునీ పరమ తత్వజ్ఞా ! ధ్యానజ్ఞానములయర్థములందు పండితా ! ఓ మహాభాగ ! నీవు చెప్పిన కథలచే భగవంతుని యందు సంలగ్నమయినవాడా మనస్సుతో దయకలిగి అనుగ్రహించితివి. పరశురాముని విచేష్టితములను, మృగముఖము నుండి భూతభవిష్య ద్వర్తమానమును నారాయణ కథాన్వితములను విని కూడ మరల ఏల ప్రశ్నించెను,
వసిష్ఠుఁడిట్లనెను.
ఓ రాజా ఆలకింపుము. ఆ మృగము యొక్క మహత్తర చరితము చేప్పెదను. ఆ మృగము తత్త్వవేత్తయట మృగీ యడిగిన సర్వమును తాను వివరించెను. మహాత్ముని యొక్క విశిష్టమయిన చరితమును విని జ్ఞానతత్త్వము తెలిసికొనుటకు ఆదరముతో మరల తన భర్తను మృగి యడిగేను.
ఆడలేడి (మృగి) ఇట్లడిగెను.
సాధు ! సాధు ! మహాభాగ ! నీవు నిజముగా కృతార్థుఁడవు. ఆ భార్గవుని దర్శించినంత మాత్రమున నీకు అతీంద్రియమయిన జ్ఞానము ఇప్పుడు కలిగినది. ఇక ఇప్పుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి సర్వము వివరింపుము. మనకీ తిర్యగ్టన్మ ఏ కర్మవలన కలిగినదో కారణము తెల్పుము”. అను వాక్యమును ప్రియురాలి వలన విని స్వయముగా ఆ మృగము తనయొక్కయు తన భార్యయొక్కయు చరిత్రము వర్ణించెను.
మృగమిట్లు చెప్పెను.
ఓ ప్రియురాలా ! మన మిర్వురమెట్లు మృగత్వమును పొందితిమో వినుము. ఓ పూజ్యురాలా ! ఈ జనన మరణాత్మక సంసారము నందు, జననమునకు కారణము భావము. (మన యొక్క ఆంతరభావము). ప్రపంచ సంబంధమయిన జీవితమున కిదియే కారణము. మనమాచరించు సదసత్కర్మల వలన జన్మ కలుగును. పూర్వమందు ద్రవిడదేశమున నానా సంపద్విభవములతో గూడిన బ్రాహ్మణుల కులమున నేను పుట్టితిని. ఆ బ్రాహ్మణులది కౌశిక గోత్రము. నాకు శివదత్తుఁడు తండ్రి. అతఁడో నానాశాస్త్ర కోవిదుఁడు. ఆతనికి మేము నల్వురము కుమారులము పుట్టితిమి. మేము ద్విజ సత్తములము, జ్యేష్ఠుఁడు రాముఁడు, అతని అనుజుఁడు ధముఁడు. అతని సోదరుడు పృథువు. ఇంక నాలుగవ వాఁడను. లోకమున ‘సూరీ’ అని విశ్రుతఁడను నేను. మహా యశస్వి శివదత్తుడు మాతండ్రి క్రమముగా మాకుపనయనమాచరించెను. వేదాంగ సపోతము, రహస్యయుతము వేదములను మాకు అధ్యాపనము గావించెను. మేము నల్వురము వేదాధ్యయన తత్పరులము.
గురు శిశ్రూషాయుక్తులము. జ్ఞాన పరాయణులమతిమి. ప్రతి దినము మేము అరణ్యమునకు పోయి ఫలములను, జలమును, సమిధలను, కుశలను, మృత్తును తీసికొని వచ్చి తండ్రికి సమర్పించెదము. తరువాత వేదాధ్యయనము చేయుదుము. ఒకనాఁడు మేమందరము “ఔద్భిదమనంబడు” పర్వతమును ఒక అడవిలో చేరితిమి. ఆ వనము కృతమాల అనెడు నదియొక్క తటమున నుండెను. ఉషఃకాలమందు మేమందరము ప్రీత మనసులమై ఆ నది యందు స్నానమాడితిమి. భగవంతున కర్యము లొసంగితిమి. జప మాచరించితిమి. ఆ పర్వతము నధిరోహించితిమి. అందు సరళ వృక్షములు, శాలతరువులు, తమాలములు ప్రియకములు, కోవిదారకములు, అర్జున తరువులు, పోకమానులు, ఖర్జూరములు, నారికేలములు, నేరేడు తరువులు, సహకార తరువులు, కట్ఫల వృక్షములు బృహతీ ద్రుమములు మరియు ఇతరములయిన నానా విధ వృక్షములు, పరప్రయోజనా పాదకములయినవి, దట్టమయిన నీడలతో కూడినవి కలవు. వానిఁజూచి సంహృష్ణులమైతిమీ. చేరిన నానా పక్షి నినాదములతో, పులులు, సింహములు, భల్ల మృగములు, గండకములు, కస్తూరి మృగములు, మదగజములు, శరభములు మొదలగు మృగములతో నొప్పిన కందరములు కలవు. మల్లిక, పాటల, కుంద, కర్ణికార, కదంబక, లతల పుష్ప సుగంధములతో గూడిన ఇతరములయిన పుష్పపరాగములు వాతోదూతములై పరీమళముల వెదజల్లుచుండెను. అందు నానామణులతో ఆకీర్ణములైన నీలపీత సితారుణ వర్ణములతో గూడిన పర్వత శిఖరములు ఆకాశమును నోరయుచుండెను. అధిక కౌతుకముతో నొప్పి యుండెను, కందరముల నుండియు, అత్యుచ్చ స్థానము నుండియు పడు కొండ సెలయేళ్లధ్వనులు వ్యాలాది మృగపక్షులు గర్జించు చున్నట్లుండెను. అట్టి పర్వత వాతావరణములో అత్యంత కౌతకముచే ఆకర్షింపఁబడిన నేత్రములతో సోదరులమయిన మేము ఒండొరులము మరచిపోయితిమీ. ఆ దృశ్యానంద పారవశ్యమున మేము పరస్పరము వీడిపోయితిమి. ఇంతలో ఒక ఆడలేడి (మృగి) దాహ పీడితయై ఆ నిర్ఝరము యొక్క పాతము యొక్క ఉపరిభాగమున నీరు త్రాగవలయునను కోరికతో వచ్చిచేరెను. ఆ మృగి నీటిని త్రాగుచుండ ఆకస్మికముగా ఒక భయంకరమైన శార్దూలమచ్చటకు యాదృచ్ఛికముగా వచ్చి, భయార్దితమయిన యాడ. లేడీని (మృగిని) పట్టుకొనెను. ఆ శార్దూలము దానిని పట్టుకొనుట చూచితిని. భయమున పలాయతుఁడనయితిని. ఆ ప్రదేశము మిట్ట పల్లములతో నుండుటచే ఆ మృగిని మనస్సున తలంచుకొనుచునే పడి మృతి చెందితినీ, ఆ మృగియు మరణించెను. అది మరణించి నీవుగా పుట్టినది. ప్రియురాలా ! నిన్నే తలపోయుచు నేను మృగముగా పుట్టితిని. నా అగ్రజులెందేగిరో నాకు తెలియదు. నిన్ను నన్ను గూర్చిన యీ కథ నా స్మృతి పథమునకు వచ్చినది. భూత భవిష్యద్వీషయములను వినుము. నేను వివరించెదను.
మనలను సన్నిహితముగా వెంటాడిన వ్యాధుఁడు రాముని వలన భయముచే వెనుకబడెను. ఆతనినిప్పుడొక సింహము చంపి భక్షించెను. (31) ఆ వ్యాధుడు ప్రాణములుబొసి, మనలను చంపని కారణమున, స్వర్గమున కరుగును. పుష్కర మధ్యమున మన మిర్వురము జలము త్రాగితీమి. భార్ణవ వంశీయుఁడు సాక్షాద్రూపము ధరించిన విష్ణువు అయిన రాముని మనము చూచితిమి. అందుచే అనేక జన్మల యందాచరించిన పాపము నాశనమయినది. (33) మనము అగస్త్యర్జీ దర్శనము చేసి, మోక్ష ప్రదమయిన స్తోత్రమును ఆలకించి శుభవంతములయిన లోకములను చేరగలము. ఆ లోకముల చేరిన పిమ్మట ఎవ్వరును విచారింపరు. దుఃఖమొందరు, అని ప్రియురాలి కొఱకు ఇట్లు చెప్పి, ఆ మృగము. చెప్పుట విరమించెను. అయ్యది ఎట్టి ఆత్రము లేక రాముని దర్శించుట వలన ప్రసన్నాత్ముఁడయ్యెను. (35) భార్గవ రాముఁడు మృగము చెప్పిన దెల్ల శిష్య సంయుక్తుఁడై వినెను. ఆశ్చర్య చకితుఁడయ్యెను. ఓ రాజా ! రాముఁడు అకృతవ్రణ ద్వితీయుఁడై అగస్త్యాశ్రమమునకుఁబోవ కృతమతియయ్యెను. రాముఁడు స్నానమాచరించి, నిత్యక్రియలు నిర్వర్తించి, మిక్కిలిగా సంతుష్టుఁడై బయలు దేరెను. రాముఁడు ప్రయాణించుచు, మార్గమునందు సింహ ప్రహారముచే మరణించిన వ్యాధుని చూచెను. ఆ మహాత్ముఁడా శ్చర్యపడెను. దిగువనున్న పుష్కరమునకు అర్ధయోజనము దూరముపోయి స్నానమాచరించి మాధ్యాహ్నిక సంధ్యను సంతోషముగా ఆచరించేను, రాముఁడు తనకు హితమయిన విషయమును మృగము చెప్పిన దానిని గూర్చి ఆలోచించుచుండ, తన వెనుక వచ్చుచున్న ఆ మృగద్వయము సమీపమునకు చేరెను. ఆ మృగద్వంద్వము పుష్కరోదకమును త్రాగి, నీటిని తమ శీరముల చల్లుకొనుట రాముఁడు చూచీ ఆశ్చర్యపడుచుండ ఆగస్త్యముని ఆశ్రమ పురోభాగమునకు ఆతడు వచ్చెను. విపద్దతమై యున్న (చెడియున్న?) పుష్కరమును చూచుచునే మహామతిమంతుఁడు రాముఁడు సంధ్యా క్రియాకలాపములను నిర్వర్తించి అగస్త్యాశ్రమమునకు పురోగమించెను. “విష్ణుపదములు”, నాగకుండము, (“సప్తర్షి సంస్థీతము”) అను పవిత్రస్థానములకు పోయి, పవిత్రోదకముల ఆచమాసము చేసి, అగస్త్యాశ్రమమునకు రాముఁడు వెళ్లెను. ఓ రాజా ! అందు, సరస్వతి బ్రహ్మ యొక్క అగ్నిహోత్రములకు కుండత్రయమును నింపుటకు వచ్చియుండెను. అచ్చట, ఆ పుష్కర తీరమున, బహుముని నిషేవితము శుభము పుణ్యము బహుధాఆశ్చర్యకరమునైన అగస్త్యుని ఆశ్రమమును రాముఁడు దర్శించెను. సహజ వైరమును వీడి సింహములు లేళ్లు కలిసి మెలసి శాంతమానసములతో ఆశ్రమమును సేవించుచుండెను. ఆశ్రమమున కుటరములు, అర్జున తరువులు, నింబములు, పారిభద్రములు, ధనములు, ఇంగుదములు.
ఖదిరములు, ఆసనములు, ఖర్జూరవృక్షములు, బదరీ వృక్షములు, దట్టముగా నుండెను. అకృతవ్రణ సంయుతుఁడై రాముఁడందు ప్రవేశించెను. అందు శాంత మానసుడు అయిన అగస్త్యుని నాసీనుడై యున్న వానిని చూచెను. ఆ మహర్షి శాశ్వత బ్రహ్మ వస్తువును గూర్చి తరంగచలనములు లేని సరస్సువలె అచంచలుడై ధ్యానించుచుండెను. ఆ మునీ పల్లవోటజము నందు కౌశ్యమును వృష్యమును పైన లేడి చర్మమును ధరించి, ఆసీనుఁడై యుండెను. తన నామము నుచ్చరించుచు జమదగ్యుడను, రాముఁడను, మీ దర్శనార్థము వచ్చితినీ, మత్ర్పణిపాతమున తద్విషయ మెఱుంగుఁడు. ఓ లోకభావన ! నమస్కారము అని నమస్కరించెను. ఇట్లు చెప్పుచున్న రాముని, నెమ్మదిగా నేత్రములనున్మీలించి, చూచి, స్వాగతము పలికెను. ఆతనీ కాసన మొసంగుమని మునీ ఆదేశించెను. శిష్యుఁడు మధుపర్కమును తీసికొని వచ్చెను. మునిపుంగవుఁడు రాముని కొసంగెను. రాముని యొక్క కుశలము గూర్చి, తపస్సు గూర్చి, ఇట్లు ప్రశ్నింపఁబడి రాముఁడు ఘటోద్భవునకిట్లు సమాధాన మొసంగెను. భవత్సందర్శన ప్రభావమున ఓ భగవాన్ నాకు సర్వత్ర కుశలము. అయినను ఒక్క సంశయమున్నది. భవద్వచనామృతముచే దానిని తీర్పుము. ఓ విభో ! పుష్కర మధ్యమున నొక మృగము నాచే చూడఁబడినది. నా భూత భవిష్యద్వృత్తాంతము నంతటినదీ చెప్పెను. దాని పలుకులు భవిష్యత్ జ్ఞానమును విని నేను విస్మయావిష్ణుఁడను. భవచ్చరణమునకు వచ్చితిని. ఓ మునినాథ ! ‘కృపయా మాం పాహి. సా మహామంత్రమును సిద్ధిమంతము చేయుము. శ్రీవుఁడొసంగీన మంత్రమును కృష్ణ కవచమును సాధించుచున్నాను. ‘ఓ గురూ ! నూరుకు మించిన సంవత్సరములు జపము సాగినది. తన్మూలమున సిద్ధిని పొందలేకుంటిని. దయతో కారణము చెప్పగోరెదను అనెను.
వసిష్ణుఁడిట్లు పలికెను.
మహాత్ముఁడయిన రాముని ఈ ప్రశ్నను విని అగస్త్యుండు క్షణకాలము ధ్యానించెను. మనస్సులో మృగము చెప్పిన దానినేజింగెను. తన యాశ్రమమునకు మృగీతో వచ్చిన మృగము నెఱింగెను. కృష్ణామృతమయిన స్తోత్రమును వినుటకు తత్కారణ మెలుంగుటకు ముని ఆలోచించెను. భార్గవుని స్వవచోమృతము ఆశ్వాసించెను.
ఇది వాయుప్రోక్తము మహాపురాణము ఆయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరిత్రమున ముప్పదియైదవ అధ్యాయము.
Summary of chapter 73 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the glorious description, this chapter details how Kārtavīrya Arjuna subdued even the formidable demon king Rāvaṇa and bound him in his capital city of Māhishmatī. It portrays the king's extraordinary feats, his lavish sacrifices, and his protective presence that guaranteed peace across all realms. The faithful heart marvels at the lord's grace that empowers mortal men to perform divine deeds for the protection of righteousness.