బ్రహ్మాండ మహా పురాణము
12 - లలితాప్రాదుర్భవమను పండ్రెండవ యధ్యాయము.
రుద్రుని కోపాగ్నివల్ల బుట్టినందున భండుడు మహా బలుడు రౌద్ర స్వభావుడునైన దానవుడయ్యెను. తరువాత మహా తేజస్వియై దైత్య పురోహితుడైన శుక్రుడు వచ్చెను. మహా బలులైన నూర్ల కొలది దైతేయులును నచటికి వచ్చి చేరిరి.-2. తరువాత శుక్రునిచే నీయోగింపబడి భండుడు దైత్య వంశ్యుడై యాది శిల్పియైన మయుని బీలిచి విలువైన మాటను జెప్పెను-3. ఓమయ శీల్పి! పూర్వము దైత్యేంద్రులుండి ముల్లోకములు శాసించిన శోణిత పురమును అమరపురముగా జేయుమనెను-4. అది విని మయ శిల్పియు నా గొప్ప శోణీత పురమునకు వెళ్లి మానస వీక్షణముతో క్షణ కాలములో దానిని అమరపురముతో సమానమైన దానిగా జేసెను-5. తరువాత, శుక్రునిచేతను మహాబలులైన దైతేయులచేతను ఇంద్రుడుగా నభిషేకింపబడి ఉత్తమ లక్ష్మితోను లేజస్సుతోను గూడినవాడై ప్రకాశించెను.-6. పూర్వము బ్రహ్మచే హిరణ్యునకు (హిరణ్యకశిపునకు) ఈయబడినదియు, దైత్యేంద్రులచే నలంకరింపబడినదియు, సజీవమై యవినాశ్యమై బాల సూర్యునివలె ప్రకాశించు కిరీటమును శుక్రాచార్యుడీయగా బండాసురుడు ధరించెను-7. బ్రహ్మ నిర్మితములై చంద్ర ప్రకాశముగల చామరములను ధరించెను. వాటిని సేవించినచో రోగములు దుఃఖములును గలుగవు-8. పూర్వము బ్రహ్మచేతనే నిర్మింపబడిన గొడుగును గూడ శుక్రుడిచ్చెను. దానీ నీడలో గూర్చున్నవాడు అస్త్రకోటులతో గూడ బాధింపబడడు-9. విజయమను ధనువును, శత్రు సంహారియైన శంఖమును ఇంకను ఆయా మహారములైన భూషణములను ఇచ్చేను-10. ఆతనికి సూర్యునితో సమానమై యక్షయమైన సింహాసనమునిచ్చెను. తరువాత రత్న మూర్ఖ తేజస్సును వెదజల్లినట్లు ఆ సింహాసనమున గూర్చున్న వాడై భండాసురుడు సర్వాభరణములతో భూషితుడై మిక్కిలి తేజస్వీయయ్యెను-11. ఆ తరువాత భండాసురునకు - ఇంద్ర శత్రువు అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్ర కర్ముడు ఉగ్ర ధన్వుడు, వీజయుడు, శ్రుతిపారగుడు - అను ఎనమండ్రు పుత్రులు ఉండిరి.-12. సుమోహినీ, కుముదినీ, చిత్రాంగీ, సుందరీ అను నలుగురు వనితలుండిరి. వారు చూచుటకు ప్రియమైన వారు-13. కాలజ్ఞులైన సమస్త దేవతలు, ఇంద్రుడును - ఆ భండాసురుని సేవించిరి. అట్లే వేలకొలదీ రథములు, గుఱ్ఱములును, ఏనుగులును, కాల్బలమున్ను అతని సేవించిరి-14. శుక్రాచార్యమతముననుసరించి నడచుకొనువారై సమస్త దానవులు మహాకాయులు, గొప్పవారు జయముతో దీపించువారునై కలిసియుండిరి-15. మహాదేవుడైన శివుని బూజీంచుచు శీన శాసనములో నుండిరి. అచట దానవులు పుత్ర పౌత్ర ధనములతో గూడినవారైరి. ఇంటింట నంతటను యజ్ఞములు జరిగెను.-16. ఋక్కులు, యజుస్సులు, సామములు, మీమాంసాన్యాయాదులు దైత్యుల ప్రతిగృహముననపుడు ప్రవర్తిల్లుచుండెను.-17. మునుల యొక్కయు ద్వీజులయొక్కయు యజ్ఞములందు హవ్యభోజులు భుజించినట్లే దైత్యుల యజ్ఞములలోను హవిర్బోక్తలు హవిస్సులను. భుజించిరీ-18. ఈ విధముగా జేయుచు మత్తుడై ప్రకాశించు భండాసురునకు అణువదివేల యేండ్లు అర క్షణమువలె గడచిపోయేను-19. తపస్సు చేతను బలముచేతను బండాసురుని బలము వృద్ధి చెందుచుండెను. ఇంద్రుని బలము అంతకంతకు క్షీణించు చుండెను. అది చూచి కమలాపతి (విష్ణువు)-20. వెంటనే ఒక లోకవీమోహినియైన మాయను సృజించెను. ఆమెతో దేవ దేవుడైన జనార్ధనుడిట్లనెను.-21. నీవు నీ తేజముతో సర్వ ప్రాణులను మోహింపజేయుచు స్వేచ్చగా దీరుగుము. నిన్నెవ్వడును గుర్తించడు (తెలియడు)-22. నీవిట నుండి తొందరగా రాక్షస నాయకుడైన భండాసురుని కడకుబొమ్ము తొందరలోనే యాతనిని మోహింపజేసి విషయ సుఖములనను భవింపుము-23. ఈ విధముగా విష్ణువు నుండి మాయ వరమును బొంది యాతనికి నమస్కరించి తన సహాయముగా ముఖ్యమైన యప్సరసలనడిగెను-24. అట్లామెతో కోరబడిన హరి కొంత మంది యప్సరసలను బంపెను. ‘విశ్వాచి’ మొదలగునప్సరసలతో గూడినదై యా “మాయాదేవి మానస సరోవరము యొక్క శ్రేష్టమై యుజ్వల వృక్షములుగల తీరమును జేరెను-25. అచటనే భండాసురుడును తన స్త్రీలతో గూడి విహరించుచుండెను. ఇచట, లేడిపిల్ల కన్నులవంటి కన్నులుగల మాయాదేవి చంపక వృక్షము యొక్క మూలమున మధురస్వరముతో గానము చేయుచు రమ్యమైన నివాసమేర్పరచుకొనెను-26. అంత భండాసురుడు తన బలిషులైన మంత్రులావరీంచిరాగా నచటకి వచ్చెను. ఆమె వీణా గానమునువిని, శ్రేష్టమై మనోహరమైనయామెను జూచెను-27. సుందరమైన సర్వాంగములుగలది. రెండవ మెరుపు తీగవలె మెరయుచున్నది. ఆమెను జూచి మన్మథమను మాయామయ మహాగర్తమున బడిపోయేసు-28. ఆతని మంత్రులు గూడ ఎదలో మదన పీడితులైరి-29. ఆ రాక్షస రాజుచేత చాలాకాలము ప్రార్థింపబడిన మాయాదేవియు, మంత్రులచే ప్రార్థింపబడిన విశ్వాచీ మొదలగు అప్సరసలును వెంటనే యంగీకరించిరి-30. వారు అశ్వమేధాది మహాయజ్ఞములచేత గూడ బొందనలవిగానివారు. అట్టి మోహినీ మొదలగు వారిని బొంది పరమానందమునందిరి. వేదములను మరచిరి. అట్లే యుమాపతియైన శివుని గూడ మరచిరి-32. ఇతరములైన శుభావహములైన యజ్ఞములను గూడవదిలిరీ, వారి పురోహితుడైన శుక్రాచార్యుడును అవమాన హతుడాయెను. వారికి పదివేల సంవత్సరములు ఒక ముహూర్త (క్షణ) కాలమయ్యెను.-33. రాక్షసులు మోహితులుగాగానే ఓ బ్రాహ్మాత్మా నారదా ఇంద్రునితో బాటు దేవతలందరు పీడల నుండి విముక్తులై పరమానందమునందిరి-34. ఆ తరువాత నొకప్పుడు సమస్తదేవతలతో పరివృతుడై సింహాసనముననున్న ఇంద్రుని దగ్గరకు నారదమహాముని వచ్చెను-35. మండుచున్న యగ్నివలె ప్రకాశించుచున్న మునిశ్రేషునికి సమస్కరించి చేతులు జోడించి యింద్రుడిట్లనెను-36. భగవన్ సర్వధర్మముల దెలిసినవాడా! పరాపరవేత్తలతో శ్రేష్ఠుడా! నారదా! నీవు, ధన్యుని జేయదలచినవాని కడకే వెళ్ళేదవు-37. ఓ మునీశ్వరా! నీవు మాకు భవిష్యత్తులో శుభములగూర్చుటకే వచ్చితివీ.. నీయమృతము వంటి మాటల వీని శ్రవణానందముచే నిండి, సమస్త దుఃఖముల గడచి కృతార్థుడ నయితిని-38.
నారదుడనెను : ఆ తరువాత విష్ణుమాయచేత భండాసురుడు సంమోహితుడయ్యెను. విష్ణుమాయావిముక్తుడైనచో మరొకయగ్నివలె లోకములనన్నింటిని దహించెడివాడు-39. నీ యొక్క తేజస్సులచేతను, అస్తములచేతను, మాయాబలముచేతను అతి బలుడైన భండారుని తేజోపహారమును మీక్కిలి చేయవలె-40. ఓ ఇంద్రా దేవియైన పరాశక్తి యారాధన దప్ప ఇతరమైన కల్పకోటి శతముల తపస్సుతో గూడ సాధ్యముగాదు -41. ఓ బాలిశులారా (పిల్లల వలెనజ్ఞానులైన దేవతలారా! శత్రువు యొక్క యుదయమునకంటే (అభివృద్ధికంటే) ముందే ఆ పరాశక్తి నారాధింపుడు. మీచే నారాధింపబడిన యా భగవతి మీకు శ్రేయమును గూర్చును-42. ఈ విధముగా నారదుడు బోధింపగా దేవగణేశ్వరుడైన యింద్రుడు సర్వదేవసమన్వితుడై యామునిని పూజించెను. తపస్సునకై సన్నాహము జేసికొని హిమవత్పర్వతతటమునకు వెళ్లాను-43. అట, సమస్తఋతువులబూయు పూవులతో గొప్పగా ప్రకాశించు భాగీరథీ తీరమున నఖీలదేవతలతో గూడి పరాశక్తి పూజనాచరించెను. అదియిప్పుడఖిల సీద్దుల నిచ్చునదై యింద్ర ప్రస్థమను పేరబరగిను-44. బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు చెప్పిన విధముగా దేవియొక్క మహాపూజను జేసిరి అట్లు దేవీమహాపూజ జేయునట్టియు, జపధ్యానరతాత్ములైనట్టియు, ఉగ్రమైన తపముననుండి, దేవితో ననన్యముగా (అభేదము) చిత్తము నర్పించినట్టి దేవతలకు పదివేలయేండ్లు పది దినములు గడచినవి-46. ఇక మాయామోహినీమోహితులైన రాక్షసులను జూచి, మహామతియై రాక్షస పురోహిత గురువైన శుక్రుడు భండాసురుని కడకు వచ్చి యిట్లనెను-47. ఓ భండాసుర రాజేంద్ర! యీ దానవ విద్వఛ్ఛేష్ణులందరును నిన్నాశ్రయించియే నిర్భయులై ముల్లోకములదు స్వేచ్ఛావిహారులై తిరుగుచ్నూరు-48. హరి యెల్లప్పుడు మీ జాతినీ మీయందరిని జంపును. అతని చేతనే యీ మాయ నిర్మింబడినది, దానితో నీవు మోహితుడవు గూడనైతివి-49. నీవు మోహితుడవైనట్లు చూచి నీలోని లోపములనే వెదుకుటయందు మిక్కిలియాసక్తి గల యింద్రుడు మిమ్ముల జయించుటకై మహాతపము జేయుచున్నాడు-50. కావున ఈ మాయామయిని వీడి మంత్రులతోబాటు హిమవత్పర్వతమునకు బోయి నీ శత్రువులకు (ఇంద్రాదులతపములకు) విఘ్నము చేయుము-51. ఈ విధముగా గురువైన శుక్రుడు జెప్పగా, భండాసురుడు మాయాశయ్యను వీడి మంత్రివృద్ధులను పిలిచి శుక్రుడు చెప్పినదంతయు తెలిపెను-52. అది విని శ్రుతవర్మ పరిస్థితిని విమర్శించి భండునితో - రా నీకు శివుడిచ్చినది అరువది వేల యేండ్ల రాజ్యము-23. ఓ వీరుడా! అంతకంటే నెక్కువనే గడచినది. శివుడు చెప్పిన కాలమునకు వ్యతిరేకముగా జేయుట అశక్యము-54. శివుని నర్చింపక యాతడు నియమించిన కాలముదాటుట అశక్యము. కాలముననుసరించి సుఖమునుగాని దుఃఖమునుగాని యనుభవింపవలెను అనేను-55. ఆ తరువాత భీమకర్ముడనువాడు బలముననుసరించి, శత్రువుపేక్షింపదగినవాడుగాడు. శత్రుతపఃక్రియాదులకు విఘ్నము జేసినచో ఓ భండాసురేంద్రా! నీకే విజయము కలుగును-56. నీ యుద్ధమున శత్రుబలమును హరించు విద్య శివునిచే నీకీయబడినది. కావున నెల్లప్పుడును నీకేవిజయము గలుగును-57.: అని అనెను, దానవపతి భండాసురుడును ఆతని మాటకు సమ్మతించెను, సేనలతో సహ వెళ్ళి హిమవత్పర్వతతట మునకు వెళ్లెను-58. తపోవిఘ్నము. జేయు రాక్షసులను జూచి జగదంబిక యెదుట దాటనలవిగానీ ఉజ్వలమైన గొప్పప్రాకారమును సృష్టించెను-59. దానిని జూచి భండాసురుడు గూడ ఇది యేమీ అని యాశ్చర్యముజేందీ మిక్కిలి కోపించి బలముతో దానవాగ్రముతో ఆ ప్రాకారమును భగ్నముజేసెను-60. మరలనాప్రాకారమట్లే రాక్షసులదుట దాటనలవిగానిదిగా నిలిచెను. ఆధీరుడు. భండాసురుడు వాయువ్యాస్తముతో భగ్నముజేసి గర్జించెను.-61 మాటిమాటికి ఆ ప్రాకారము భగ్నమగుచునే యథాప్రకారముగా నిలుచుచుండెను. ఇది చూచి భండాసురుడు దుఃఖితుడై స్వపురమునకు వెళ్ళెను-62. జగమును ధరించు నామెను, ఉజ్జల ప్రాకారమును జూచి దేవతలు భయముతో అన్ని క్రియలు మాని బాధజేందిరి-63. అంత, ఇంద్రుడు దేవతలతో ఇదిగో భండాసరుడిక్కడికి వచ్చెను. ఆతనితో యుద్దము జేయుట మనందరికిని సాధ్యముగాదు”-అనెను-64. పరుగెత్తిపోయినను మనకు ఎక్కడను గతిలేదు. యోజన విస్తారముగల శోభనమైన కుండము చక్కగా నిర్మించి యజ్ఞముజేసి పరాశక్తిని బూజించెదము-65. మహాయాగ విధానముతో అగ్నిహోత్రుని స్థాపించి ఓ దేవతలారా! మనము మహామాంసముతో (మన వ్యక్తి మాంసముతో) హోమముజేసి పరాశక్తిని బూజింతము దాన బ్రహ్మత్వమును బొందిన వారమైనను అగుదుము. లేదా స్వర్గముననుభవింతుము. : ఇట్లనగనే ఇంద్రుని ముందడుకొనీ దేవతలందరు-67. విధిప్రకారముగా శరీరములను వారి మాంసములను లాగిలాగి మంత్రపూర్వకముగా హోమము జేయసాగిరి. ఆ విధముగా సర్వమాంసములును, పాదములును చేతులును పరాశక్తికై హోమముజేసిరి-68. ఇక దేవతలు తమ మొత్తము శరీరములను హోమము చేయదలంచినంతనే ఒక యనుత్తమమైన (అంతకన్న యుత్తమము జగమున లేనట్టి) పరమతేజఃపుంజము ప్రాదుర్భవించెను. (ఆవిర్భవించెను)-69. దాని మధ్యన నొక చక్రాకారము ఆవిర్భవించాను. దాని మధ్యమున మహాదేవిని జూచిరి. ఆమె ఉదయ సూర్యకాంతి వంటి కాంతి గలిగినది-70, జగదుజ్జీవనకరీ, బ్రహ్మ విష్ణు శివాత్మిక, సౌందర్యసార సీమాంత, ఆనందరస సాగర-71 జపాకుసుమ (పారిజాతపుష్ప) వర్ణముగలది. దానిమ్మ పూవురంగుగల వస్త్రము (చీర) ధరించినదీ, సర్వాభరణములతో గూడినది, శృంగారరసమునకు ఒకే ఒక నీలయమైనదీ-72. ఆమె క్రీగన్నులు కృపాతరంగితములు. ఆమె చూపులతో వెన్నెలలు విరియును. పాశము-అంకుశము-చెఱకువిల్లు-పంచబాణములు-ఇవియొప్పిన నాలుగు చేతులుగలది-73, అభిలాత్మికయైన ఆ మహాదేవినీ జూచి ఇంద్రునితో బాటు దేవతలందరును సంతుష్టాంతరంగులై నమస్కరించిరి-74. ఆమె వారిని చూచేను వెంటనే ఆ దేవతలందరు విగతజ్వరులైరి. సంపూర్ణాంగులైరి. మిక్కిలిదృఢులైరి. వజ్రదేహులైరి. మహాబలులైరి. ఆ దేవతలు అఖిలార్థముల నిచ్చునంబికయైన యామహాదేవిని స్తుతించిరి.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున లలితోపాఖ్యానమున లలితాప్రాదుర్భావమను పండ్రెండవయధ్యాము.
Summary of chapter 124 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply esoteric chapter unveils the innermost sanctuary of Śrīnagara, culminating in the transcendent Chintāmaṇi palace crafted from wish-fulfilling gems. It portrays the radiant throne room where goddess Lalitā sits upon the lap of lord Kāmeshvara, surrounded by loving attendant deities and eternal nectar oceans. The pious reader is drawn into deep meditation, experiencing the supreme peace and unutterable bliss that permeates this divine sanctuary.