బ్రహ్మాండ మహా పురాణము
13 - శ్రాద్ధమాచరించుటకు పుణ్యప్రదేశకీర్తనము
బృహస్పతి ఇట్లు చెప్పెను.
వ్యయము చెందనివారు, (అవ్యయులు) మార్పు చెందినవారు నగు పితరులు ఒక్కసారి అభరితులయినను ప్రీతిమంతులగుదురు. వారు యోగాత్ములు. మహాత్ములు. వారు పాపము కానీ చెడ్డతనము కాని లేని విగతపాపులు. మహాతేజోవంతులు. ఓ సౌమ్యుఁడా ! పితరులు తమకు గల భూసంబంధమయిన అనుబంధముతో భక్తులను, మరణానంతరము స్వర్గలోకములతోను, తరువాత కాలక్రమమున ముక్తి ప్రాప్తితోను, ఆశీర్వదింతురు. అట్టి సరస్సులను, నదులను, తీర్ధములను, పుణ్య దేశములను, శైలములను, ఆశ్రమములను గూర్చి నేను చెప్పెదను. అమర కంటక శిఖరము ఎల్లప్పుడును పవిత్రము. మూఁడు లోకముల లోను నయ్యది శ్రేష్ఠమయినది. అది పవిత్రమయినది. తరచుగా సిద్దులు చారణులు దానిని సేవించుచుందురు. (4) అందు, పూర్వము భగవంతుఁడయిన అంగిరసుఁడు సుదుశ్చరమయిన తపమును లక్షలాది కోట్లాది సంవత్సరము లాచరించెను. (5) అందు మృత్యువు లేదు. అట్లనే సురలు రాక్షసులు లేరు. భూమి యుండునంతకాలము అందు భయము లేదు. దారిద్ర్యము (అలక్ష్మి) లేదు. (6) మాల్యవంతపర్వతము యొక్క శృంగమునందు, తపస్సుచే, తేజస్సుచే ఆ పర్వతోత్తమము సంవర్తక వహ్నివలె నిత్యము ప్రకాశించును. ప్రపంచాంతక ప్రళయమునందు ప్రకాశించునది సంవర్తకాన్నీ, (7) నర్మద యొక్క దక్షిణ భాగమున, కుశదర్భలు చాల శ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ ప్రసిద్ధములయినవి. అవి మృదువులు. సుగంధయుతములు. బంగారు కాంతితో చూడ నాశ్చర్యకరములు. ప్రియదర్శనములు. మరియు శాంతములు అనీ ఖ్యాతి నొందినవి. (8) అగ్నిహోత్రమును ప్రేల్చునపుడు పూర్వము మహా తేజస్వీయగు అంగీరోమహర్షి ప్రస్తారార్థము (అగ్ని గుండమునకు చుట్టును) ఈ కుశలనుపయోగించెను. అప్పుడతఁడు అచట స్వర్గసోపానములను దర్శించెను. (9) అమర కంటక పర్వతమున ఆదర్భతృణముల యందు ఒక్కసారే యైనను పిండముల నిడిన పొందు సత్ఫలమును చెప్పెదను. (10) ఆ శ్రాద్దము పితరుల కక్షయమయినదగును. పితరులకు ప్రీతివర్ణకము. తత్పదేశమును చేరి పితరులు అంతర్జానమును చెందెదరు. (11) పర్వములయిన పుణ్య దినములందు, అగ్ని జ్యోతులతో ప్రకాశించు జ్వాలాసరస్సు కనిపించును. అచ్చటనున్న నది విశల్యకరణి (ముండ్లతో గ్రుచ్చుకొనఁబడిన కలుగు బాధను పోగొట్టునది ఆ నది) అందుచే నది విశల్యా నది. సశల్యము లయిన జంతువుల ముండ్లచే గలుగు బాధను పోగొట్టునది. అది విశల్యకరణీ నది. (12) ప్రభుతుల్యమైన మాల్యవత్పర్వతశిఖరమున, కళింగదేశము యొక్క పశ్చిమ భాగమున, ఆ పర్వతము సందు ఒక వాపీ కలదు. (13) ఆ పర్వతము యొక్క పశ్చిమార్థ భాగమునకు అపాపి కూడ వ్యాపించినది. ఓ ఋషి శ్రేష్ఠులారా ! అయ్యది యొక సిద్ధి క్షేత్రముగా వాకొనఁబడినది. అయ్యది దేవతలచే, దైత్యులచే నంగీకరింపఁబడినది. ఋషి ఉశనుఁడు ఈ సందర్భమున నీ శ్లోకమును పఠించేను. (చదివేను)
'అమరకంటక' పర్వతమును చేరి ఎవ్వరు పితృ పరాయణులయి శ్రాద్ధమునందు, పితరులను తృప్తి పరచెదరో వారు ధన్యులు. (15) ఒక్కమారు పితరుల సందు శ్రాద్ధమున నభ్యర్చించిన వారు స్వర్గము నందెదరు. అల్పమయిన తపస్సుచే వారు సిద్ధిని పొందుటలో సంశయము లేదు. (16) మహేంద్ర పర్వతము పుణ్యప్రదమైనది. రమ్యమైనది. ఇంద్రునిచే అభ్యర్చింపఁబడునది. ఆ పర్వతారోహణమున జనులు పవిత్రులయ్యేదరు. అందాచరించిన శ్రాద్దము మహాఫలము నొసంగును. (17) వైలాట శిఖరమున యోగాభ్యాసము నాచరించిన, దివ్య చక్షువు యొక్క ప్రవర్తనమగును, భక్తుఁడు భూమిపై భూతములకు అదృశ్యుఁడు (చేరరానీవాఁడు) దేవుని వలె భూమి యందు సంచరించును. (18) సప్త గోదావరి యందు, తపోవనమయిన గోకర్ణము నందు, స్నానము చేసి దానము లొసంగిన, ఆ వ్యక్తి అశ్వమేధమాచరించిన వచ్చు ఫలితము లందును. (19) «ధూమపాపమను స్థలమును చేరి. మానవుఁడు స్నానము చేసిన పవిత్రుఁడగును. దేవదేవుఁడు మహేశ్వరుఁడునయిన రుద్రుఁడా ప్రదేశమున తపస్సాచరించెను. (20) గోకర్ణ క్షేత్రమున నాస్తికులకు నీదర్శన మొసంగునొక సాక్ష్యము (ప్రత్యక్షదర్శనము) దేవతలొసంగిరి, అబ్రాహ్మణుం డెవ్వఁడైన నందు సావిత్రీ మంత్రమును జపించిన, జపించుచుండగనే ఆతడు నశించును. (21) ఎవ్వండయిన నీయమవంతుఁడయి, దేవర్షి భవన (మనుపర్వత) శృంగము నధిరోహించిన ఆతఁడు తరువాత త్రివిష్టపమును పొందును (స్వర్గము). ఆ దేవర్షి భవన పర్వతము సిద్దచారణ సేవితము. (22) అందొక వనమున్నది. అది 'దివ్యమయిన చందన వృక్షములతో ఉపశోభితమయినది. చందనముతో మిశ్రమయిన ఉదకము వాని నుండి ఎల్లప్పుడు స్రవించుచుండును. (23) ఆ గంధోదకములతో గూడి యొక నది సదా ప్రవహించును. ఆ నదీ తామ్రపర్ణి, ఆ నది చందన వృక్షములు గలిగిన మహాఖండము నుండి దక్షిణముగా సముద్రమువైపు ప్రవహించును. (24) ఎందుండి ముత్యములు జనించునో నట్టి ముత్తెపు చిప్పల నుండి శంఖములు పుట్టును. ఇయ్యవి నదీ ప్రవాహము ద్వారా సముద్రమునకు తీసికొని పోవఁబడును. (25) శంఖ మౌక్తిక యుతమయిన యుదకమును సేవించినచో (అనయనంకృత్వా) వ్యాధులచేతను, మనోవ్యాధులచేతను గలుగు బాధల నుండి విముక్తులయి మానవులు అమరావతిని (స్వర్గమును) చేరుదురు. (26) చందనము నుండి యుద్భవించిన శంఖములనుగాని ముత్యములను గాని దాన మొనరించినవారు, పాపకర్తలయినను, పితరులు తరించెదరు. ఇది శ్రుతిబద్ధము. (27) చంద్రతీర్థమందు - కన్యాకుమారి యందు, కావేరీ జన్మస్థానమునందు, శ్రీ పర్వత తీర్థములందు, వికృతగిరియందు - యీ పుణ్య ప్రదేశములందు - మరియు ఒక్కచోటనే పలాశ వృక్షములు, ఖాదిర వృక్షములు, బిల్వములు, ఇక్షములు, అశ్వతములు, వీకంకతములు, ఉన్న ఉశీర పర్వతము నందు.
అన్నియును కూడియున్న ఆ ప్రదేశమును “ఉద్విమండలావీద్ధమని' ఓ ద్విజ సత్తములారా ! యెఱుంగవలయును. ఎవ్వడీ ప్రదేశమున శరీరమును త్యజించునో, వెంటనే యతఁడు స్వర్గనగరమయిన అమరావతిని చేరును. శ్రీ పర్వతము యొక్క తీర్ధముల యందు వైకృతగిరి యందు ఆచరించిన కర్మలు మొదటి నుండియు తుదివరకు ఫలించును. (31) అందు ప్రయుక్తములయిన కర్మలు దుష్ప్రయుక్తములు (యథావిధి ఆచరింపఁబడినవి కాకపోయినను) అయినను సుప్రయుక్తములయిన కర్మలవలె సత్ఫలితముల నొసంగును. నదులలో పుణ్యవతియై శ్రేష్ఠమయిన నర్మద పితరుల యొక్క దుహిత అందాచరింపఁబడిన శ్రాద్దములు అక్షయములగును. (32) పుణ్యవంతమయినది, సిద్ధులచే చారణులచే సేవింపం బడునట్టిదియునగు 'మాఠర” వన పుణ్యవనమున, యోగసంబంధమయిన అభ్యసము లాచరించిన వెనుక, భక్తులు అదృశ్యులగుదురు. స్వర్గమును జేరుదురు. (33) పవిత్రమయిన వింధ్య పర్వతమునందు, ధర్మాధర్మములకు నీదర్శనమయిన యొక జలధార (జలపాతము) కలదు. పాపులా జలపాతమును కనరు. సాధువులయిన సత్పురుషులు మాత్రమే దానిని కాంచగలరు. ఈ విధముగా దుష్కర్ముల యొక్క పాపుల యొక్క దుష్కర్మ యా ప్రదేశమున సందృశ్యమానమగును. (35) కైలాస పర్వతమున నున్న పాపనిషూదని యనెడు మతంగ పర్వతపు తటాకమున కామ గమనము గలిగి యథేచ్ఛగా సంచరింపఁగల పక్షులు, స్నానమాడి తరువాత తత్ఫలితమున స్వర్గమును చేరును. (36) పవిత్ర శౌర్ఫారక, పాలమంజర పర్వతము, సముద్రమునకు దగ్గరనున్న పాండుకూపము, విమలము పాపరహితమునగు పిండారతటము మొదలగు క్షేత్రముల యందు సత్సంకల్పయుతముగ శ్రాద్ధ మాచరించిన అతఁడు అక్షయమయిన పుణ్యమును పొందును. (38) అంతియేకాక, చిత్రకూటమున, శ్రీ వృక్షమున, జంబూ మార్గమున, పవిత్రమయిన అసిత పర్వతమున, యోగాచార్యుఁడయిన ధీమంతుఁడు శ్రాద్ధమాచరించిన అనంతమయిన పుణ్యము నందును. (39) పుష్కరము నందు పెట్టిన శ్రాద్దము అక్షయ పుణ్యము నొసంగును. అట్లే పుష్కరమున ఆచరించిన తపస్సు మహాఫల మొసంగును. సముద్ర తీరము నందును, ప్రభాస తీర్థమునందును, అట్టిదే ఫలము కలుగునని నిర్దేశింపఁబడినది. (40) ‘వృష' యను పేరింటి యొక కూపము "దేవకి' యందుఁగలదు. అందు సిద్ధులుందురు. అందు ఎల్లప్పుడు ఆవుల యొక్క వృషభముల యొక్క శబ్దములతో నీరు వచ్చుచుండును. (41) యోగీశ్వరులచే నది యెల్లప్పుడును అధివసితము సర్వపాప బహిష్కృతమయినది. అనగా పాపరహితము అందు శ్రాద్దమును పెట్టిన వారికి గలుగు ఫలితమును చేప్పెదను. శ్రాద్ధము అనంత ఆనంద మొసంగును. సర్వమయిన కోరికలను తీర్చును. ఆ శ్రాద్ధము పితరులకు ప్రీతిని కలిగించును. అందు 'జాతవేద - శిల' యను పర్వతము కలదు.
అచ్చట నాచరింపఁబడిన శ్రాద్ధములు, ఇతర పుణ్యకార్యములు అనంతమయిన, ఆనంద మొసంగును. అందు అగ్నిని ప్రవేశించు నతఁడు స్వర్గమున మోదము నొందును. (44) ఒక ప్రదేశమున్నది. అందు అగ్ని శాంతుఁడు. మరల నతఁడు పుట్టును రగులొల్పఁబడును). తత్రదేశమున దత్తమయినదీ అక్షయమగును. దశాశ్వమేధికమున పంచాశ్వమేధికమున నాచరింపఁబడిన దానములు (శ్రాద్ధములు) క్రతువులు, ఉద్దిష్ట ఫలము నొసంగుననుటలో సంశయము లేదు. (45) 'హరశిర' మను నొక ప్రసిద్ధ తీర్థము కలదు. అయ్యది వెంటనే వరముల నొసంగును. అందాచరించిన శ్రాద్దము సదా అక్షయ ఫలమొసంగును. దాత స్వర్గమున ఆనందించును. పవిత్ర ప్రదేశమయిన 'సుందనిస్తుంది మందు శ్రాద్దమును పెట్టవలయును. అయ్యది పాపనాశనము. (47) అచ్చటాచరించిన శ్రార్ధము అక్షయమని చెప్పఁబడినది. అట్లే జపహోమ తపములు కూడ. 'అజతుంగమను శుభంకరమయిన తీర్థమున తర్పణము లొసంగి పితరులను ప్రీతులను చేయవలయును. పర్వదినములలో దేవతల దృశ్యము లీక్షేత్రముననే యగుపించును. ‘విరజ'యను వృక్షమెందు వృద్ధి పొందునో, అందు ప్రదత్తమైనది. పృథివి యందక్షయమగును. (49) ఇందు యోగేశ్వరులు సదా నివసింతురు. 'ఇది సర్వపాప బహిష్కృతమయినది. అందు శ్రాద్ధమాచరించు వ్యక్తి పొందు ఫలమును చెప్పెదను. (50) వానిచే పితరులు ప్రత్యక్షముగా పూజింపఁబడిన వారగుదురు. ఆతఁడీ లోకమున ఇంద్రియ వశీగా నగును, మరణానంతర మతఁడు స్వర్గమున పూజింపఁబడును. (51) సాధారణముగా మద్ర దేశీయులు పుణ్యులు. అట్లే 'శివ' నామమునఁబరంగు హ్రదము కూడ పుణ్యమయినది. వ్యాస సరస్పునునది యందు పుణ్యమయినది. అట్లే బ్రహ్మ ప్రదము కూడ పవిత్రమయినది. (52) (ఊర్షంతమును పర్వతము పుణ్యమైనది. తత్పదేశమున యోగవిద్య యందు శ్రేష్ఠుఁడయిన యోగేశ్వరుని ఆలయము (స్థానము) కలదు. ఇందే, మహాత్ముఁడయిన వసిష్టుని ఆశ్రమమున్నది. అది పుణ్యమయినది. (53) స్వయంభువుఁడయిన బ్రహ్మచే ఋక్, యజుః, సామ, శిరస్కములు కపోతములు, పుషసాహ్వయములు, ఆఖ్యాన పంచములయిన వేదములు ఇవి బ్రహ్మచే సృజించబడినవి. (పుష్ప సాహ్వయము - పుష్పముతో సమానమైన ఇందే 'పంచమవేదము చెప్పం బడినది;) (54) ఈ ప్రదేశములను దర్శించి, అగ్నీ నాశ్రయించు (ఆగ్నికార్య మొనర్చు) నటీ ద్వీజుఁడు పాపముల నుండి విముక్తుఁడగును. ఈ పవిత్ర తీర్థములందు శ్రాద్ధముల, నాచరింప ఆనందమొసంగును. అట్లే ఇందాచరించిన జపహోమ తపస్సులు మోక్షదములు. (55) పుండరీక మహాతీర్థమున పుండరీక సమఫలము కలుగును. ఓ మహాప్రాజ్ఞ ! బ్రహ్మతీర్థ కృతశ్రాద్ధాదులకు సర్వయజ్ఞముల ఫలము సంప్రాప్తించును. పవిత్ర సింధునది సముద్రములో గలియు ప్రదేశమునను, మరియు పంచనదమునను శ్రాద్ధమాచరించిన అక్షయ పుణ్యము కలుగును. వీరజ యందు, మద్రవ పర్వతమునందు కూడ నట్టిదే పుణ్యము సంప్రాప్తమగును.
సప్తనదమందుఁగాని, మానసము నందుగాని చేసిన శ్రాద్దము విశేష ఫలప్రదము. అట్లే మహాకూటము నందు, అనంత గిరీయందు త్రికకుదముందు చేసిన విశేష ఫలితము కలుగును. (58) మహానది యందు సంధ్యా సమయమున మహాద్భుతమయిన దృశ్యము కనఁబడును, శ్రద్ద రహితునకాదృశ్యము కానరాదు. దృఢవ్రతునకు కనఁబడును. (59) పితరులకు అక్షయత్వము అర్థించువారు ఆయా తీర్థములను ఒకదాని తరువాత వేటిక్కటికి చేరి ఆశ్రయించి సాయంకాలములందు, ప్రతి నిత్యము, శ్రాద్ధమును చేయవలయును. (60) ఒక తీర్థమున్నది. దానిపేరు 'స్వర్గమార్గప్రద' స్వర్గమునకు మార్గము నొసంగునది. అది వెంటనే వరము నొసంగునది. ఆ ప్రదేశములో నరుఁడు కృతాత్ముఁడో? (ఇంద్రియ నిగ్రహణము కలిగిన ధన్యుఁడు) అకృతాత్ముఁడో తెలీయగలదు. (61) సప్తర్షులు తమ చెట్ల బెరడు నుండి నేయబడిన చీర వనసములను అచ్చట విసర్జించిన తరువాతనే స్వర్గమున కరిగిరి. (ఇది వారి జితేంద్రియత్వమునకు నిదర్శనము). ఇప్పటికి కూడ వారు వదలిన నార చీరలు నీటియందుఁగాననగును. ఇచ్చటి తీర్గోత్తమము నందు స్నానమాచరించి నరుడు స్వర్గమును పొందును. ఇచ్చటొక ఖ్యాతమయిన నందికి ఆయతనము (దేవాలయము) కలదు. ఈ ఆయతనము సిద్ధసేవితము. (63) నందీశ్వరుని యొక్క యామూర్తి సదాచార రహితులకు కనబడదు సూర్యోదయ సమయమున యజ్ఞ యూపములు (స్తంభములు) కాంతి జ్వాలా స్తంభములు బంగారు వీకారమయినవి కనఁబడును. వానికి ప్రదక్షిణ మాచరించిన వారు ఆనంద భరితులగుదురు; స్వర్గమును పొందుదురు. కురుక్షేత్రమున. యావత్పదేశము విశేష ఫలవంతమయిన యొక సుతీర్థము. (65) అయ్యది యోగేశ్వరుఁడు మహాత్ముఁడునైన సనత్కుమారుని యొక్క పుణ్యమయిన తీర్థము. అందు పితరులకు తీలలోసంగిన అక్షయ పుణ్యములు కలుగును. (66) అందు అమావాస్యనాడు విధివత్తుగా యథాక్రమము ధర్మరాజాచరించిన శ్రాద్ధము ఉత్తమము. విశేష ఫలదము. (సరస్వతీనది యందు) తత్సమీపమున అక్షయఫలము నొసంగును. కురుక్షేత్రమున కుమారుఁడు పితృ శ్రాద్ధమాచరించిన ఆతఁడు -ఋణ విముక్తుఁడగును. తండ్రి ఋణము తీర్చినవాఁడగును. సరస్వతీ తీర్థమున, వినశనమున, ప్లక్షప్రస్రవణమున, వ్యాసతీర్థమున, దృషద్వతీ తీర్థమున త్రిఫ్లక్షకము మొదలగు తీర్థముల శాశ్వత ఫలమపేక్షించువారు పితృశ్రాద్దముల నొనర్పవలయును. ఓం కార ప్రణవమున, గంగానదియందలి శక్తావతారమున, పర్వతోత్తమమయిన మైనాకమున మరియు యమునా జన్మ స్థానమున శ్రాద్ద మాచరించిన సర్వపాప విముక్తులగుదురు. జలములు అత్యుష్ఠములు అతిశీతలములుగా నుండుట అందులకు దర్శనము. యముని యొక్క అక్క సూర్యుని యొక్క శుభంకరమైన కూతురును అయినది, యొక పవిత్ర నది పుష్య (?) అందు శ్రాద్ధ మక్షయ ఫలదము. ఇయ్యది ఇంతకు పూర్వము పితరులచే కీర్తింపఁబడినది.
బ్రహ్మ తుండ ప్రదమున స్నానము చేయు వ్యక్తి వెంటనే బ్రాహ్మణుఁడగును. అందాచరించిన శ్రాద్దము అనంత ఫలము నొసంగును. అట్లే అందాచరించిన జపహోమతపములనంతఫలదములు. (73) ఒక స్థాణువు వలె నిలబడి వసిష్ఠుఁడచ్చట మహా తపస్సాచరించెను. ఇప్పటికికూడ మణిబర్హణాలంకరణముతో వృక్షములొప్పి దృశ్యమానములగుచున్నవీ. (74) ధర్మాధర్మనిదర్శనమునకయిన తులాభారము అందుకొనగును. ఆ తులామానము ననుసరించి, పవిత్ర తీర్ధముల యొక్క ఉత్తమ ఫలము, బ్రాహ్మణులు తూచెదరు. పితరుల కూతురయిన యొక యోగిని గంధకాలి యనెడు సొమమున ప్రసిద్ధురాలు. ఆమె యందే పుట్టెను. ఆమెకు మహాత్ముడు మహాయోగి పుంగవుఁడు నయిన వ్యాసుడుదయించును. ఆ వ్యాసుఁడు పరాశర వంశమున నుదయించును. ఆతఁడు బ్రహ్మ యొక్క చతుర్థాంశము. ధీమంతుఁడయిన ఆ మహాముని వేదములను నాలుగుగా విభజించును. (77) అచ్ఛోదకమను నొక సరస్సున్నదీ, అచ్ఛోదయని యెడు నది ఆ సరస్సు నుండి జన్మించును, పితరులకూతురుయోగ గంధకాలియని ప్రసిద్ధిచెందినది. గంధకాలీ యొక మత్స్యము యొక గర్భమున మరల పుట్టేను. భగవన్నియోగమునను, ఒక ప్రత్యేక కారణమునను ఆమె యందు జన్మించెను. ఆ పవిత్రము పుణ్యవంతము నయిన ఆశ్రమమును పుణ్యమాచరించిన పుణ్యకృత్తులు సేవింతురు. ఆ పుణ్యవంతులచే సేవింపఁబడు సో యాశ్రమమున నొక్కసారి శ్రాద్ధకర్మ నాచరించిన అయ్యది అక్షయమైన ఫలమొసంగునని చెప్పబడినది. (79) అంతియేకాక ఆ నది యందు సమర్పింపబడిన (శ్రాద్ధ పిండములు) యొకే యొకసారి యోగశక్తులను మనో నిగ్రహమును ప్రసాదించును. 'కుబేరతుంగా! శ్రమమున, వ్యాస తీర్థమున ఆచరింపఁబడిన శ్రాద్ధ కలాపములు పాపఘ్నములు. (80) బ్రహ్మవేది యందాచరింపఁబడిన శ్రాద్దము అనంత ఫల మొసంగును అయ్యది సిద్ధులచే నిత్యము సేవింపఁబడును. ధన్యాత్ములయిన పుణ్యవంతులు ఆ సిద్ధుల నందు దర్శించెదరు. [61) బ్రహ్మవేధికి ఈశాన్య భాగముననున్న నందొ తీర్థము నందిదీన శ్రాద్దము అనిర్వర్తన సిద్ధి నొసంగునట్టిది. అది సిద్ది క్షేత్రము. సంసారమునకు పునః నీవర్తన ముండదు. అదీ ఆధ్యాత్మిక సిద్ది క్షేత్రము. అది దేవతలతో నున్నది మోక్షము సంపన్నము. ధీమంతుఁడయిన మహాదేవునిచే మహాలయమందు పదముంచబడినది. అయ్యది భూతముల యందుగల అనుకంపకు (దయకు) నాస్తికులకు నిదర్శనము అయినట్టిది. నాస్తికులకు తమ దోషములకు నిదర్శన మొసంగునది. వీరజ యందు ఆచరించిన శ్రాద్దము అక్షయ ఫలదము. అట్టిదే మహాలయము కూడ. నంద యందు విరజాక్షేత్రము నందెట్టి ఫలమో అట్టిదే మహాలయము నందున శ్రాద్ధ ఫలము: కలుగును. (84) నంద యందు, వీరజయందు, మహాలయ ముందు శ్రాద్ధము నాచరించిన వారు, తమ్ము తరింపఁజేసి కొందురు. అంతియేకాక పది తరముల వారినీటు పదితరముల వారీనటు తరింపచేయ కారణులగుదురు. 'కాక' ప్రదమున శ్రాద్ధమాచరించినవారు, జాతి స్మరణమును పొందెదరు. పూర్వజన్మ వివేకము గలిగి యుందురు.
శ్రాద్ద మాచరించినవారు సువర్ణయుత శరీర కాంతిని పొందెదరు. అంతీయేకాక అమితమయిన శక్తి సామర్థ్యము పొందెదరు. (85) పవిత్రసరమయిన కౌమారము నాగభోగములచే నభిరక్షితము. కుమార తీర్థమున స్నానమాచరించిన మానవుండు స్వర్గము నందును. (86) ఉమాతుంగ తీర్థమున ఏకపాదమున నిలబడి అందలి దేవాలయమున, క్లేశభూయిష్ఠము దుశ్చరమునయిన తపస్సును నిరాహారుఁడై ఆచరిచంచిన వ్యక్తి దివ్యము జ్వలించునట్టి తేజస్సు ఒక యుగకాలము పొందును. (87) ఉమాతుంగము నందు, భృగు తుంగము నందు బ్రహ్మ తుంగము నందు మహాలయము నందు నిత్యమక్షయత్వము వాంఛించు వారలు శ్రాద్దముల నాచరింప వలెను. (88) శాలగ్రామ తీర్థము నందు సర్వత్ర ఆచరించిన శ్రాద్దము అక్షయఫలప్రదము. అకృతాత్ముల (దుష్టుల) యొక్క దుష్కృత్యములు ప్రత్యక్షములగును. (89) అశీష్టులయిన వారికీ, శిష్ఠులయిన వారికి, ప్రత్యాదేశము హెచ్చరిక కలదు. అందు దేవప్రదము మిక్కిలి పవిత్రమయినది. పవిత్రుఁడయిన సర్పరాజయిన బ్రహ్మనాగము పవిత్రులచే సమర్పింపబడిన పిండములను స్వయముగా గ్రహించును. అది ప్రదీప్తములయిన భుజంగములకు వండిన అన్నమును భుజించుటకు శక్యము కాదు. (91) ఈ పవిత్ర ధర్మ తీర్థ ద్వయమునందు ధర్మము ప్రత్యక్షముగా కనఁబడును. శాండిలి యందలి గుహయందు, కారవతి యందు వామనము నందు శ్రాద్ధ మాచరించిన వ్యక్తి పవిత్రుఁడగును. పాపదూరుఁడగును. పవిత్ర హృదయముతో చేసిన శ్రాద్దమక్షయమగును. అచ్చట.ఏ మాత్రము జపము, తపము, హోమము ఆచరించినను, నయ్యద్ సుకృత మయినదగును. (93) ఎవ్వఁడు బ్రహ్మచర్యమును గురుభక్తిని నిర్వహించునో ఆతఁడు ఒక వంద సంవత్సరములు నివసించును. ఇవి పవిత్రమయిన నదులు. ఇందు స్నానమాచరించిన అఘమోక్షణమగును. కుమారధార అందు కలదు. భక్తుండద్ధానిని దర్శించిన మాత్రమున నతని పాపము ప్రణాశనము చెందును. (94) ఇప్పటికీ కూడ వ్యాసుని ధ్యానాసనమందు గోచరించును, కాంతీ పురమునకు సమీపమున ఈశాన్యభాగమున ఆ పర్వతమున్నది. అచ్చటొక పర్వతమయిన పద్మతటాకము (పుష్కరిణి కలదు) కిరాతగణములచే నయ్యది రక్షింపఁబడుచున్నది. విప్రుఁడు ఆ పుష్కరిణిలో ఒక్కసారి స్నాన మాచరించిన శాశ్వతముగా కామములను పొందును. సర్వజీవద్భూతములలో సద్భశుండై యతఁడు దేవుని వలె భూమీని సంచరించును. కాలసరి యనీ విశ్రుత మయిన కాశ్యపుని మహాతీర్థమొకటి కలదు. నిత్యమును అక్షయమును గోరు వ్యక్తి ఆ తీర్థమున శ్రాద్ధముల ఆచరించవలెను. (98)
దేవదారు వనము నందొక జలధార కలదు. అయ్యదీ పాపప్రాణశమునకు నిదర్శనము. సుకృతాత్ములయొక్క నీర్దూత పాపములు అచట కాననగును. (99) ప్రయాగలో భాగీరథీ (గంగానది యందు శ్రాద్ధము నాచరించిన నీత్య మక్షయమగును. అట్లే కాలంజరము నందు దశార్ణము నందు, నైమిషము నందు, కురుజాంగలము నందును జరుగును. (100) వారాణసి యందు శ్రాద్దమును ప్రయత్న పూర్వకముగ నాచరింపవలెను. యోగేశ్వరుడచ్చట నేప్పుడును ప్రత్యక్షమై యుండును. అందు సమర్పింపఁబడినదీ శాశ్వతముగా అక్షయత్వ మొందును. ఈ తీర్థముల సేవించినయతం డు పూతుడగు అచ్చట నాచరించిన శ్రాద్ధ మక్షయ ఫలదము. జపముకాని, హోమముకాని, ధ్యానముకాని యేమాత్ర మాచరించినను నది సుకృతము, సుఘుకృతమయినదగును.(102) పవిత్రతీర్థములయిన రౌహిత్యము నందు, వైతరణియందు, స్వర్గమేదియందు, అందుండి చేసిన శ్రాద్ధము సుకృతము. సముద్రాంతమున దేవి వివిధములయిన నామములతో కనఁబడును. గయ యందు, ధర్మ షృష్టమున బ్రహ్మ సరముందు గృధ్ర వటమునందు కావించిన శ్రాద్దము మహాఫలదము(104) ఆ ప్రదేశమందంతటను పంచ యోజనముల ప్రాంతము మంచు పడును. భరతుని యొక్క ఆశ్రమమున్న అరణ్యము పుణ్యతమమయినదిగా చెప్పఁబడినది. (105) అక్కడ మతంగవనము సర్వమానవులచే దృశ్యమానమగును. - ధర్మమున కంతటికిని అయ్యది లోకమునకు నిదర్శనముగా స్థాపింపఁబడినది. (106) అచ్చటి దండక వనము చాల పవిత్రమయినది. పుణ్యము నాచరించిన సత్పురుషులచే నదీ తరచుగా దర్శింపఁబడును పవిత్రమయిన విశల్య తీర్థ మందున్నదని పుణ్యవంతులందురు. వివిధములయిన శాస్త్రముల చేతను, వీవీధములయిన తులామానములచేతను ఆ తీర్థము వెంటనే నీదర్శన మొసంగును. పాపము నాచరించిన వారు తత్తీర్ఘదర్శనమున పాపముల నుండి విడివడుదురు. (తులామానము కలదు, ఆ తులామానపు తక్కెడ సీబ్బులవలన పాపవంతులు తేలిపోవుదురు, పుణ్యవంతులు క్రిందకు తూగి పోవుదురు. తన్మూలమున పోరి పాపక్షయాదులు సద్యః దర్శితములగును చంద్రమానమున తృతీయాదినమున (శుక్లపక్షమున) శ్రాద్ధమును నిరాధా మండలమున (?) కౌశిక్యమను మహాప్రదమున పెట్టినచో మహాపుణ్యము. (109) ధీమంతుఁడయిన మహాదేవుడు ముండపృష్ఠము నందు కాలిడేను. బహుదేవయుగముల కాలము ఇతరులచే చేయుటకు కష్టమయిన మహాతపమును ఆతడు చేసెను. (110)
సులువుగా తన సర్వ శరీరమును విడుచునట్లు ఇందు ధర్మ పరాయణుఁడు అత్యల్ప కాలములో పాపములను విసర్జించును. (111) ఇది సిద్దులకుఁ బ్రీతీజనకము. పాపులకు భయంకరము. తమ నాలుకలను పైకీ క్రిందికి ఆడించు నట్టి ఘోర మహా సర్పములచ్ఛేది రక్షింపం బడుచున్నది. (112) లోకమున విశ్రుతమయినదీ కనక నందీ యనెడు నామముగల తీర్థము. ఇది ముండప్పష్టమునకు ఉత్తరమున నున్న ఇయ్యది బ్రహ్మర్షి గణములచే సేవీతము. (113) ఇందు స్నానము చేసిన మానవులు తమ శరీరములతో స్వర్గమున కరుగుదురు. ఇందాచరింపం బడిన శ్రాద్ధము అక్షయఫలప్రదమని చెప్పబడినది. (114) ఇందు స్నానముచేసి మానవుఁడు శరీర సంబంధమయిన ఋణత్రయము నుండి విముక్తుఁడగును. మానస సరస్సున స్నానముచేసి తరువాత శ్రాద్దమును పెట్టవలయును. (115) ఆ సధస్తీరమున నొక గొప్పదయిన దేవాలయము కలదు. ఆ తీర్ధమున కరిగి జపమాచరించి, సిద్ధుఁడయి దీవమున కరుగును. (116) ఉత్తరమానసమును చేరి అనుత్తమమయిన సిద్ధిని మానవుఁడు పొందును, ఆ శ్రేష్ఠమయిన సరస్సున స్నానము చేసి ఆ వ్యక్తి అత్యంతాద్భుతమును సందర్శించును. (117) స్వర్గము నుండి చ్యుతమయి తేజస్వంతమైన యా మహానది అంతరిక్షమున ప్రకాశించును. అయ్యది గంగ. విష్ణు పాదముల నుండీ చ్యుతమయినది త్రిపథగ. అందు ఆకాశము నందు సూర్య సన్నిభమయిన తోరణము కాననగును. అయ్యది పుణ్యమయినది. జాంబూనదమయము. ఇయ్యది సువివృతమయిన స్వర్గద్వారమువలె నుండును. (119) తరువాత ఆ నది సముద్రము నంతటిని నలంకరించుచు, సర్వ భూతములను పవిత్రము చేయుచు, ప్రత్యేకముగా ధర్మజ్ఞలను పవిత్ర పరచుచు మరల ప్రవహించును. (120) మానస సరస్సు నుండి పుట్టినట్టివి చంద్రభాగము సింధువు అను దివ్య పవిత్రములయిన నదులు. అయ్యవీ పశ్చిమ సముద్రములోనికి ప్రవహించును. దివ్యమయిన సింధునది శ్రేష్ఠతరమయినది. (పెద్దది) (121) హిమవత్ పర్వతము. నాసాధాతువిభూషితము. ఇయ్యది చాల యోజనముల నిడివి గలిగినది. (122) అందొక రమ్యమయిన (సరస్సు) పుష్కరిణి యనునది కలదు. దానిపేరు సుషుమ్న, అయ్యది సిద్ధులచే చారణులచే నిండి యున్నది. తరచుగా నాపుణ్య సరస్సు దేవర్షి గణములచే సేవింపఁబడును. అందు స్నాన మాచరించిన వ్యక్తి పదివేల సంవత్సరములు జీవించును. అందాచరించిన శ్రాద్ధము అనంత ఫలదము, ఐశ్వర్యదము.
ఆ ప్రదేశమున నిర్వహించిన శ్రాద్ధము 'దశాపరేషాం. దశ పూర్వేషాం” పితరుల నుద్దరించును. సర్వత్ర హిమవత్పర్వతము పుణ్యమయినది. సమంతతః గంగానది పుణ్యమయినది. సముద్రములన్నియును సముద్రమును చేరునట్టి నదులును సర్వత్ర పుణ్యప్రదములు. ఇట్టి పవిత్ర తీర్థములందు మరియు తత్తుల్యములయిన వాని యందు పండితుఁడైన వాఁడు శ్రాద్దముల నాచరించవలయును. (126) శాస్త్రము ననుసరించి యథావీధి శ్రాద్దము లాచరించవలెను. కర్తయైన భక్తుఁడు, తీర్థముల యందు స్నానము చేయుట వలన, హోమము లాచరించుటవలన, దానము లొసంగుట వలనను పవిత్రుఁడగును. శ్రాద్దములనీప్రదేశముల యందాచరించవలెను. శైలసానువులందు, శైలశృంగములందు, కందరములయందు, గుహలయందు, ఏకాంతములయిన పర్వతపు ఉపహ్వరనితంబములందు, ప్రస్రవణములందు, నదీ తీరములందు, నదులు, పుట్టు స్థానములందు, నదీపులినములయందు, సముద్రతీరమందు, గోవుల గోష్ఠములందు, నదీ సంగమ స్థానములయందు, వనములందు, మనోహర పరిమళములచే సుపరిమృష్టములు, సులీప్తములు, పరిమళవంతములగు ప్రదేశములందు, ఆవుపేడచే నలుకబడిన వివిక్త గృహములందు, శ్రాద్దముల నాచరించవలయును. (130) భక్తుడు సర్వకామములను పొందుకోరికతో, పై చెప్పఁబడిన తీర్థములందు భక్తిమంతుఁడై ప్రాధక్షిణదిశకు పోయి శ్రాద్ధ మాచరించవలయును. (131) మేధావియైన శ్రాద్ధకర్త పైచెప్పఁబడిన యన్ని క్షేత్రములందు శ్రాద్ధమాచరించి, బ్రాహ్మీ సిద్దీని పొందును. త్రివర్ణ విహిత స్థానముల నున్నట్టి వారు, ధర్మవర్ణాశ్రమరతులైనవారు, కోపస్థానమును పరిత్యజించిన వారు బ్రాహ్మీస్థితిని శ్రాద్ధ మాచరించి పితృపూజనము నొందుదురు. కృతపాపుఁడయినను, అత్యంత శ్రద్ధావంతుఁడై తీర్ణాటనమును మనో నిగ్రహముతో మనశ్శుద్దీతో చేసినచో, పరిశుద్ధి నొందుననఁగా శుభకర్మ కర్తల గూర్చి వేరే చెప్పవలయునా? అట్టి శుభకృత్తు ఎన్నడును నీచ జంతువుల యందుద్భవింపఁడు, నీచ దేశముల పుట్టఁడు, బ్రాహ్మణుఁడు స్వర్గవాసి యగును. మోక్షోపాయమును పొందును. శ్రద్దారహితుఁడు పాపవంతమయిన జీవితమును నడుపు నట్టివాఁడు నాస్తికుఁడు, తీరనట్టి సంశయములచే బాధపడువాఁడు, హేతునిష్ణుఁడు కారణవాది మొదలగువారు తీర్థ స్నానముల వలన ప్రయోజనమును పొందజాలరు. (135) గురు తీర్థమున పరా (గొప్ప) సిద్ధి కలదు. పవిత్ర తీర్థములలో నీది పరమపద స్థానము. (136)
'ధ్యాన' మొక గొప్ప తీర్థము. దానికంటే సనాతన బ్రహ్మతీర్థము శ్రేష్ట తరమయినది. 'ధ్యానము' ఉపవాసము కంటే గొప్పది. ఇంద్రియ నివర్తనము (బాహ్య పదార్థముల నుండి) కూడ అవసరము. (187) ఉపవాస నిబద్ధులచే, మాటిమాటికి, ప్రాణములచే, ప్రాణాపానములను వశములోనికి తెచ్చుకొని, ఇంద్రియములను వశమును పొందించుకో (185)స వలయును, బుద్దీనీ మనస్సున సంయమించవలెను. జ్ఞానేంద్రియముల వ్యాపారమును ఉపసంహరింపవలెను. ప్రత్యాహారము (ఇంద్రియ నిగ్రహము) జరిగినచో, దానినే మోక్షోపాయముగా నిస్సంశయముగా నేఱుంగుము. (137) జ్ఞానేంద్రియములలో మనస్సు ఘోరమయినది బుద్ది మొదలయిన ఇంద్రియముల నివర్తనమును, ఆహారమును మానుటవలన సాధింప వచ్చును. అనశనము అనంతమయిన తపముగా నెఱుంగవలెను. (140) బుద్దియొక్క నిగ్రహముకలిగినచో అన్యబుద్ధీ ఇఁక పుట్టదు. సర్వ దోషములు క్షీణింపఁగా ఇంద్రియములు క్షీణింపఁగా, పరిశుద్ధమైన యాత్మ అనింధనమయిన అగ్ని నుండి, వహ్నియుదయించు నట్లు మోక్షము నొందును. యోగజ్ఞుండైనవాఁడు, యోగము చేతను, క్షేత్రజ్ఞుని, అన్ని కారణముల నుండి, గుణముల నుండి వ్యక్తి వ్యక్తములయిన సర్వ ప్రపంచ పదార్థముల నుండి, దూరముగా వినియోగించును. వ్యక్తా వ్యక్తములయిన చోట్ల ఆతనికెట్టి స్థానమును లేదు. ఆతఁడు సత్గాదు అసత్తు గాదు. అంతియేకాక సదసత్తు కూడగాఁడు. ఆతడేదియును గాఁడు. కానీ అతఁడు సదా అవస్థితుఁడు. (ఉన్నవాఁడు).
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము నయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున, పుణ్యదేశానుకీర్తనమను త్రయోదశాధ్యాయము.
Summary of chapter 51 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter describes the divine qualities and rigorous spiritual standards required of holy priests who participate in ancestral rites. It explains that only those adorned with Vedic wisdom, humility, and moral purity can serve as fit vessels for carrying ancestral offerings to heavenly realms. The faithful reader gains deep appreciation for true spiritual scholarship and character, seeking the company of the holy to elevate their own spiritual life.