బ్రహ్మాండ మహా పురాణము
7 - హయగ్రీ వాగస్త్యసంవాదే లలితో పాఖ్యానే స్తేయపానకథనం
: లలితోపాఖ్యానమున స్త్యేయపానకథనము :
ఇంద్రుడనెను : ఓ భగవత్స్వరూపుడా ; హింసాదులలక్షణమంతయు సవిస్తరముగా జెప్పుము. బృహస్పతియనెను. పాపములకంటే యధికమైన పాపము జీవజాతుల జంపుట. దీని కంటే మించిన పాపము విశ్వసించి శరణము (రక్షణము) వేడి వచ్చిన వానిని జంపుట-2 అంత్యజాతీకుడై పాపిష్టుడైన శూద్రుని రక్షించెదనని నమ్మించి చంపినచో బ్రహ్మహత్య కన్న మీంచిన పాపమునందును. కావున దానికి ప్రాయశ్చిత్తములేదు-8. బ్రహ్మజ్ఞాని, దరిద్రుడు, బహుపుత్రులు గల భార్య కలవాడు. అతికష్టముతో కోంతధనము సంపాదించి దానితో జీవయాత్రలు గడపదలచును. అట్టివానీ ఆ ధనమును దొంగిలించిన వాని దోషమునకు ప్రాయశ్చిత్తములేదు-4. తన్ను నమ్మిన వాని ద్రవ్యమును హరించుట పైదానికన్న మిక్కిలి దోషము. నమ్మినవాడుగాని, నమ్మనివాడుగాని దరిద్రుని యొక్కధనమునపహరించరాదు-5, ఆ తరువాత దేవ బ్రాహ్మణుల యొక్క బంగారమును రత్నములను అపహరించువానీని జంపినవానికి అశ్వమేధయాగముజేసిన ఫలము లభించును-6. గురువులు, దేవతలు, బ్రాహ్మణులు, మిత్రులు, పుత్రులు, తాము,-వీరికి సుఖములనిచ్చు ధనములనపహించుటచే ఉత్తరోత్తరముగా పది పదిరెట్లు మించిన పాపము గలుగును-7. అంత్యజుడు (మాలవాడు), పొదజుడు (శూద్రుడు), వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు-వీరి ధనములనపరిహంచినవానికి ఉత్తరోత్తరముగా పదిపదిరెట్లధిక పాపములంటును-8. ఈ విషయముననే పురాతనమైన యితిహాసమును పెద్దలుదాహరింతురు. అది రహస్యాతి రహస్యము సర్వపాప ప్రణాశనమును -9.
కాంచీపురశ్రేష్ఠమున వజ్రుడను చోరుడు జనించెను. ఆ సుందరమైన పుర శ్రేష్ఠమున అందరును సర్వైశ్వర్యముతో గూడిన వారు. అందరు నీరోగులు (రోగములు లేనివారు) బ్రహ్మచర్యాది తపక్లేశములనోర్చుకొనువారు, సుఖులు, దయచేనొప్పినవారు-10. సర్వైశ్వర్యముల నిండిన యూ నగరమున నా దొంగ మొదట కొంచెము తరువాత మరికొంచెవెక్కువ-ఈ పరిమాణక్రమముతోనే బహుద్రవ్యమునపహరించెను-11. లోభము వలన నా ధనమును అరణ్యమున నొకగుంత ద్రవ్వియందులో నుంచసాగెను. ఆ ధనము దాచుటనర్థరాత్రిలో నొక కీరాతుడువచ్చిచూచెను. వజుడను దొంగ ధనమును గుంతలోదాచి దూరముపోగా, నాకిరాతుడు పదవవంతు చొప్పున అందుండీ యపహరించి గుట్టు చప్పుడుగాకుండ (ఎవ్వరికి దెలియకుండ) కట్టెలమోపును నెత్తిన బెట్టుకొని వెళ్లుచుండెను. వజుడను దొంగయు తాను దొంగిలించి తెచ్చిన ధనమును గుంతలో వేసి పైన నౌకరాతితో గప్పి మట్టిగప్పి ధనాశతో మరల పట్టణములోనికి వెళ్లుచుండెను-14. ఈ విధముగా దొంగ విశాల ధనమును దొంగిలించి భూమిలో నుంచెను. కిరాతుడు గూడా (అందులో పదవ వంతు అపహరించి) ఇంటికి వెళ్లి సంతోషముతో తన ప్రియభార్యతో నిట్లనెను-15. “కట్టెలు దెచ్చుటకు వెళ్లుచుండగా మార్గమున నీ ధనము లభించినది. ఓ పిరికిదానా! అయినను ధనమును గోరుదానా! దీనిని చక్కగా గ్రహించుము-16. అది విని యా ధనమును దీసికొని లోపల భద్రపరచి, యాలోచించున్నదై తన పతితో నిట్లనెను-17. మనయిండ్లలో నిత్యము (పురోహితుడుగా) సంచరించు బ్రాహ్మణుడు నన్ను చూచి నీవు తొందరలోనే యీ విధముగా భాగ్యవతి వగుదువు-18. బ్రహ్మ క్షత్రియ శూద్ర స్త్రీలలో రాజవల్లభవు (రాణివి) అగుదువు. కాని భిల్లునీయందుగాని, కిరాతునియందుగాని, నటునియందుగాని, అంత్యజాతీయందు బుట్టినవానియందుగాని వాల్మీకి శాపమువలన లక్ష్మీ చిరకాలముండదు-19, బహుభాగ్యములకును పుణ్యములకును స్థానమైన దాని విషయమున అనుభవముతో దృష్టపూర్వమైన యా వాల్మీకి శాపవాక్యము ఎప్పుడును వ్యర్థము కాదు-20. అంతేకాని తన ప్రయత్నముతో కష్టముతో లభించిన ధనము మాత్రము చాలాకాలము మన దగ్గర నుండును. తక్కినదీ కాలముతోబాటు వీడిపోవును-21. స్వయముగా వచ్చిన ధనమును ధర్మార్థము వినియోగపరుపవలేను. కావున ఈ ధనముతో నీవు బావి, నడబావి మొదలగువానీనీద్రవ్వించు శుభాకార్యములను జేయుము-22. అనీ భార్య కిరాతునితోననెను. రాబోవు భాగ్యమువలన ప్రబోధితమైన ఆ మాటవిని, బహుజలసమమైన ప్రదేశమును అట జూచెను-23. తరువాత తూర్పుదిక్కున స్వచ్చమై యక్షయమైన జలములు కలదియు, బహుద్రవ్యముచే సాధింపదగినదియునగు నొక చెఱువును నిర్మించెను. -4. అచట కర్మకారులకు, తన దగ్గరి మొత్తము ధనము నిచ్చెను కాని చెణువు యొక్క నిర్మాణము పూర్తి కాకపోవుటచే చింతింపసాగెను-25. వజుడను ఆ దొంగనే అనుసరించి వాని చేత ననేక విధములుగా భూమియందుచబడిన విశాల ధనములో కొద్దికొద్దిగానే బహుధనము నపహరించెదను అనీ యాలోచించి యా వజుడను దొంగను వాడు తెలియకుండగనే వెంబడించెను-27. అట్లే యా ధనమును దెచ్చి దానితో చెరువు కట్ట నిర్మాణమును పూర్తిచేసెను. ఆ చెరువు మధ్యన విష్ణు దేవాలయము నిర్మించెను-28. ఆ చేరువు ఒక నీ రెండని పెద్ద చెరువయ్యెను. కట్టనడుమ గొప్ప శివాలయమును నిర్మించేను-29, అంత, అచటి యడవి నశించి బహుప్రాణులతో వ్యాకులమయ్యెను. ఆ కారణమున. కిరాతుడు, శ్రేష్ఠములు, గొప్పవారికి దగిన క్షేత్రములనేర్పరచెను-30. వానిని దేవతలకును, ద్విజులకును (బ్రాహ్మణాదులకు) విభజించి యిచ్చెను. దేవవ్రతుడు మొదలగు బహు బ్రాహ్మణులను బిలిచి-31, వారిని బంగారు వస్త్రాదులతో సంతసింపజేసి “వీరదత్తుడను కట్టెలమ్ముకొని బ్రతుకు కిరాతుడను నేనెక్కడ-52 ఈ పెద్ద చెరువు కట్ట నిర్మాణమెక్కడ దేవాలయ నిర్మాణములు నెక్కడ! క్షేత్రముల నేర్పరచుటెక్కడ! వానిలో బ్రాహ్మణివాసముల సిద్ధము జేయుటెక్కడ!-33 ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మీ దయ వల్లనే యిది యంతయు చేయబడినది”-అని సవినయముగా విన్నవించెను. ఆ దేవవ్రతుడు మొదలగు బ్రాహ్మణులును దానిని గ్రహించి సంతుష్టమనస్కులైరి. ఆ మహా తేజస్వులై మహాత్ములైన బ్రాహ్మణులు ఆ కిరాతునకు “ద్విజవర్మ”యనియు అతని భార్యకు “శీలవతియనీయు పేరిడిరి-35, ద్విజవర్మ వారి సంరక్షణకై ఇంద్రియ నిగ్రహముగలవాడై బంధువులతో గూడి భార్యతో బాటు అచటనే నివాసముండెను-36. బ్రాహ్మణులందరిని సంతోషపెట్టుచు పురోహితుడైన దేవవ్రతుని పేరనే యాపురమునకు కిరాతుడు (ద్విజవర్మ) దేవరాత పురమనీ పేరిడెను-37, ఆ తరువాత కొంతకాలమునకు కొలునకు వశుడై ద్విజవర్మ (కిరాతుడు) మరణించెను. అపుడు యమునియొక్కయు, బ్రహ్మయొక్కయు, విష్ణువుయొక్కయు, రుద్రునియొక్కయును దూతలువచ్చిరి-38. వారిలో నొండొరులకు' దేవదానవుల యుద్దము బోలె మహాయుద్దములు జరిగెను. ఇంతలో నారదముని వచ్చి-మీరొండొరులు యుద్ధము జేయకుడు. నా మాటవినుడు, ఈ కిరాతుడు. పూర్వము చౌర్యముచేత చేతిలువు కట్టను నిర్మించేను-40. ఆ వజుడు అనేకుల ద్రవ్యమునపహరించెను. వారందరు మరణించు వఱకు వాయువై చరింపవలె-41. నారదుని యీ మాటలు విని యఖిల దూతలు (దూతాదులు) వెడలిపోగా కిరాతుడు పండ్రెండేడులు వాయువై యాకాశమున చరించెను-42. నారదముని యా కిరాతుని భార్యతో- నీ దోషమేమియు లేదు నీవు చేసిన పుణ్యముతో (భర్తకు వాపీకూప నిర్మాణము జేయుమని చెప్పుటతో) ఆటనుండి బ్రహ్మ లోకమునకు వెళ్లుము అనేను-43, ఆమె వాయువై తన పతి చరించుచుండ తాను బ్రహ్మలోకమునకు బోనిష్టపడలేదు. మిక్కలి దుఃఖమును బొంది వారదమునితో నిట్లనెను-44. పతిని వీడి నేను బ్రహ్మలోకమునకు బోను. నాపతి స్వదేహమునందువణకు ఇచటనే యుందును-45, ఆ తరవాత నాపతి యే గతినందునో దానీనే నేనసరింతును. లేదా! నేను గానీ నా పతిగానీ దానికి పరిహారముగానేమి చేయవలెనో తెలుపుడు-46. అను . శీలవతి మాటలువిని సంతసించి తపోధనుడైన నారదుడు ఇట్లనెను. నీ శరీరము భోగాత్మకము సుఖానుభవ స్వరూపము. అది నా ప్రభావము వలన కర్మ కార్యములను జేయగలది యగును. (వాయుభూతుడైన నీ పతి యేమియు జేయుటకు వీలులేదు)-47. దానిపరిహారము ఉన్నది. దానిని నీకు జెప్పెదను, “నిరాహారవై మహా. తీర్ధమున నిత్యము స్నానమాచరించి, అంబికతో గూడిన శివుని . భక్తితో బూచించి కంద మూలములు మాత్రము . దీనీ హృదయమున మహేశ్వరుని ధ్యానించీ శతరుద్రమును (నమకమును) జపించవలెను-49. వేయి యెనిమిది (1008) మారులు జపించినచో బ్రహ్మహత్య జేసివాడును తన పాపములనుండి విముక్తుడగును. ఇతరములైన సమస్త పాపముల నుండి విముక్తుడగును. సంశయము లేదు”-50. అనీయాదేశించి నారదుడనుగ్రహించి యామెకు రుద్రాధ్యాయమునిచ్చెను. ఇట్లామెను స్వీకరింపుమని మునీ యంత్రార్థనమందెను-51. ఆమెయు భర్తయొక్క ప్రీయము కొఱకు సంకల్పము జేసి ఆయుత్కృష్టమైన రుద్రాధ్యాయ జపమును జపించెను. దానీవలన నాకిరాతుడుస్తేయ (దొంగతనపు) దోషముచే విముక్తుడై స్వశరీరమునందెను-52. ఆ తరువాత వజుడను దొంగ మరణించెను. ఆ ద్రవ్యవంతులు (యజమానులు) గూడ. మరణించిరి-53. యముడు వారినందరిని బిలిచి యిట్లనెను-54. మీ చేత పాపము జేయబడినది. దైవవశమున పుణ్యము-గూడ జేయబడినది మొదట... సుకృత ఫలమనుభవింతురా! దుష్కృతఫలముననుభవింతురా? యని యడిగెను-55 ఈ యముని మాటలు విని వజుడు మొదలగువారు సుకృత ఫలమునే మొదట ననుభవింతుము తువాత దుష్కృత ఫలమునని చెప్పిరి-56. యముడు మరల వారితో ఈ కిరాతుని పుణ్యబలమువలననే మీరందరు పుత్రమిత్ర కళత్రములతో సహ వేగముగా స్వర్గమునకు వెళ్లుడు". - అనియనేను-57. వారందరు శ్రేష్టమైన విమానమునెక్కి వారికి తగిన ఫలముతో గూడిన వారై స్వర్గమునకు వెళ్లిరి-58, ద్విజవర్మయు సీసఖుడై అఖిల లోకములను - దాటి గాణ పత్యమును బొంది కైలాసమున నేటికిని నానందించుచున్నాడు. -59.
ఇంద్రుడనేను : ఓ మహామతీ సేతుబంధాదికములగు పుణ్యముల పుణ్యవర్ణనమైన తారతమ్యవిభాగమును జెప్పుము. బృహస్పతీయనెను : మహాశయుడైన ద్విజవర్మ పుణ్యము యొక్క సగభాగమును (1/2) బౌందెను. వజుడు దానిలో సగము పుణ్యమును బొందెను(1/4) తక్కిన వారు దానిలో సగము పుణ్యమును బొందిరి(1/8). మనస్సు-వాక్కు-శరీరము-చేష్ట-ఈనాల్గింటిచే కర్మ (దుష్కర్మ) చేయబడును. అది వరుసగా చేసినవాని మానసిక-వాచిక-శారీరక-చైష్టిక ప్రాయశ్చిత్తముల చేతనే పోవును-62. (శీలవతి పూర్తి (1) పుణ్యమునందేనని యతాత్పర్యము)
ఇంద్రుడనేను : అసవము యొక్క రూపము (స్వరూపము రంగుకాదు) ఏమి? దాని దోషమేమి? గుణమేమి? ఎట్టియన్నము దోషకరము? దీనిని సవిస్తరముగా జెప్పుము-63. బృహస్పతి యనెను : పిండితోజేసినదీ, తాటి చెట్టునుండి తీసినది, కైరము (కాశ్మీర దేశపువారు చేసినది), ఇప్పపూవునుండి తీసినది, బెల్లముతో జేసినది. - అని యాసవమనేక విధము. వీనిలో వరుసగా నుత్తరోత్తరము తక్కువ తక్కువ పాపదాయకము. మొదటిదాని కన్న తరువాతది సగము దానికన్న, తరువాతిదీ సగము, ఆతరువాతిది సగము ఈ విధము ఉత్తరోత్తరము సగ - సగము పాపములు గలవి-64. క్షత్రియాది మూడు వర్ణములవారికి (క్షత్రీయ వైశ్య-శూద్రులకు) అసవము త్రాగదగినది. బ్రాహ్మణస్త్రీకి దప్ప క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలకు త్రాగదగినది-65. పతి హీనురాలు, కన్య, రజస్వలయు ఆసవమును దీసికొనరాదు. భర్త లేనపుడు లోభించి మద్యము ద్రాగిన స్త్రీ ఉన్మాదిని యనబడును. అన్యజనులే దానిని వదిలివేయవలే-67. ద్వీజాతుల కిది పది, ఎనిమిది, ఆు, నాలుగు అగును. స్త్రీలకు మద్యము దానిలో పురుషుడు త్రాగిన దానిలో సగమగును. భర్త యొక్క సంగమమున దానిలో పురుషుడు త్రాగిన దానిలో పావుభాగమగును-68, బ్రాహ్మణుడు మద్యమును త్రాగినచో కృచ్చచాంద్రాయణ వ్రతమాచరింపవలె. పదివేల గాయత్రినిగాని జాతవేదమంత్రమునుగాని చేయవలె-69. అంబికా హృదయమంత్రమును (స్తోత్రమునుగాని జపించవలె. అపుడు నరుడు శుద్దుడగును. క్షత్రియ విషయమునను, త్రివర్ణముల వారికీనీ ద్విజునినుండి సగము దానిలో సగము దానిలో సగము అనుక్రమము వర్తించును. -70. స్త్రీలకు అర్థాఠక్లుప్తి (సగ-సగము అనురీతి) వర్తించును. లేదా ద్వీజుల చేత గూడ జేయించవలెను. నీటిమధ్యన వేయి - జపించినను శుద్దినందును-71. భైరవుడు, భైరవి, కాళి, మహా శాస్త్రీ (మహాకాళి)యు మాతలు-72. తక్కినవి పైవారి యొక్క శక్తులు, వారి పూజనమున ‘మధువు’ ప్రశంసింపబడును, వేదవేదాంగపారగుడైన బ్రాహ్మణుడు ఆ మధువును వీడియే యజింప (హజింపవలె-73. దేవికి నివేదించిన దానిని భుజించువారు (స్త్రీలు) దేవికభిన్నలై దేవీస్వరూపలగుదురు. వారి యొక్క ప్రవాహములు వెడలును, నిర్లిప్తులై పరాశక్తి రూపమును బొందుదురు-74. తెలిసికాని తెలియకగాని జేసిన సమస్త పాపములకు పరాశక్తి యొక్క పదస్మరణము ప్రాయశ్చిత్తమని చెప్పబడినది-75. పరాశక్తిని పూజింపక మద్యము ద్రావినవాడు అధముడు రౌరవనరకమున నొకయేడుండును. బిందు సంఖ్యతోనుండును-76. భోగమును గోరి మద్యమును ద్రావినపోడు మానుషాధముడు. శైల శిఖర శిలపైనుండి పడుట, అగ్నిలో బడుట-ఇవి, దప్ప ఆతనికి వేరొక ప్రాయశ్చిత్తములేదు-77. బ్రాహ్మణుడు మోహము వల్లగాని, కామమువల్లగాని, మద్యముత్రాగరాదు. మహాత్ములయనుగ్రహమువల్లగాని, కర్మయొక్క యనుపాతము వల్లగాని, యమని, యమములచే పరాశక్తి యర్చన వల్లగాని, దీనసంఖ్యతో జేసిన కృచ్చ చాంద్రాయణ వ్రతముల వల్లగాని బ్రాహ్మణుడు శుద్ధిచెందును. పాన పాపము బుద్ధి పూర్వకమైన చో పైప్రాయశ్చిత్తములను ద్విగుణముగా జేసిన శుద్దినందును -79.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున స్తేయపాన కథనమను సప్తమాధ్యాయము 7.
Summary of chapter 119 of the Brahmānda Mahā Purana is as follows:
In verses dripping with divine sweetness, this chapter describes the awe-inspiring emergence of goddess Lalitā Parābhaṭṭārikā from the sacrificial fire of consciousness. She manifests as a maiden of unsurpassed beauty, shimmering like a thousand rising suns, holding sugarcane bow, flower arrows, noose, and goad. The celestial host and the entire universe bow down in ecstatic adoration before the supreme mother, praising her as the ultimate sovereign of all creation.