1 - మధ్యమ భగము ఋషిసర్గ వర్ణనము

శాంశపాయనుఁడు అభ్యర్థించెను.

ద్వితీయపాదము తదనుబంధముతో (అనుషంగ) నీవు మాకు వివరించితివి. దయతో మూఁడవపాదమును తదుపోదాతపాదముతో సవిస్తరముగా మాకు వర్ణింపుము.

సూతుఁడిట్లనెను.

ఉపోద్ఘాత సహితముగా మూఁడవ పాదమును సవిస్తరము ససముచ్చయముగ వివరించెదను. ఓ బ్రాహ్మణులారా ! నేను చెప్పుచుండగా గ్రహింపుఁడు. ఓ ద్విజులోధా ! మహాత్ముఁడైన వైవస్వత మనువు యొక్క ఇప్పటి సర్గ క్రమమును గూర్చి ఆనుపూర్వికముగను, విస్తరముగాను ఆలకింపుఁడు. ఈ ప్రస్తుత మన్వంతరము 4 యుగముల యొక్క డెబ్బది యొకండు భాగములుగా పూర్వమే చెప్పఁబడినది. వీవస్వతునకు నమస్కరించి, వైవస్వత మనువు యొక్క సర్గమును (సృష్టిని) మనువుతో నారంభించి, భవిష్యాంతము వరకు, అనేకములయిన ఆఖ్యానములతో గూడియున్నదానిని, మీకు వివరించెను. ఈ ఆఖ్యానములు దేవతల ఋషుల, దానవుల, పితరుల, గంధర్వుల, యక్షుల, రాక్షసుల, భూతముల, మహోరగముల, మానవుల, జంతువుల, పక్షుల యొక్క విషయములను స్థావరములతో సహితముగా చెప్పెదను. స్వాయంభువమనువు కాలములో సృష్టిని మొట్టమొదట ఆరంభించిన ఆ సప్తమహా ఋషులు గతించిరి. చాక్షుష మన్వంతరము అతీతమై మరల వైవస్వత మన్వంతర మారంభమైనప్పుడు, ఈశ్వరుని యొక్క శాపముచే, దక్షుండు, మహౌజసులు మహాత్ములు నయిన భృగ్వాదులు మరల ప్రాదుర్భవించిరి. ఈ విధముగా పునర్జన్మ నొందిన సప్తర్షులు స్వాయంభువుఁడయిన బ్రహ్మయొక్క మానసపుత్రులుగా నంగీకరింపఁబడిరి. స్వయంభువుఁడే వారిని పుత్రులుగా స్వయము కల్పించెను. పునరుత్పన్నులయిన మహాత్ములచే యథాక్రమము యథాపూర్వము సృష్టి ప్రజాసంతానము ఆచరించిన వారిచే జరుపఁబడెను. ఆ జ్ఞానకర్ముల యొక్క విశుద్ధమయిన ప్రసవమును (ప్రసూతిని) చెప్పెదను. ఆనుపూర్వికముగ ఉన్నదున్నట్లే సంక్షేపముగ విస్తారముగ చెప్పెదను. చరాచరములయిన భూతములతో కూడియున్న యీ విశ్వమంతయు వారి యొక్క యన్వయము నందుదయించిన వారిచే నిండి యున్నది. గ్రహ నక్షత్ర మండితమై పునః అంతరిక్షమేర్పడెను.

ఋషులు అడిగిరీ :

“ఓ సత్తమ! బ్రహ్మకు మానస పుత్రులుగా పూర్వముదయించిన సప్తర్షులు బ్రహ్మగారిచే మరల నతని పుత్రులుగా నెట్లు కల్పించుకొనంబడిరో చెప్పఁగోరెదము.

సూతుఁడిట్లు చెప్పెను.

స్వాయంభువ మన్వంతరమున ఏ సప్తరులు చెప్పబడిరో, వారు వైవస్వత మన్వంతరమును చేరిరి. ఈశ్వర శాప సంవిద్దులయిరి. అందుచే వారు పూర్వమాచరించిన తపః ప్రభావమును పొందలేకపోయిరి. జనలోకమును చేరి పోరందుండిరి. ఆ జనలోకము నుండి యొకే యొక మారు వారు తిరిగి రాగలరు. జనలోకమున మహర్షులు పరస్పరము మిట్లు చెప్పుకొనిరి. చాక్షుష మన్వంతరమున, పవిత్రమయిన వరుణ యజ్ఞము జరుపబడిన తరువాత మనము అందరము తత్సవిత్ర వ్యక్తులముగా జన్మించెదము. అదియే మనయొక్క శ్రేయస్సునకు (కీర్తికి) కారణమగును. స్వాయంభువ మన్వంతరమున శప్తులయిన మహరులందరు ఇట్లు చెప్పుకొని చాక్షుష మన్వంతరమున వారందరు సృష్టి కొణుకు పుట్టిరి. వారు జనలోకము నుండి తిరిగి వచ్చిరి. మరల జన్మించిరి. వారు, వరుణుని యొక్క భౌతికరూపము దాల్చిన మహాదేవుఁడయిన వరుణుని యజ్ఞమున, పుట్టిరి. బ్రహ్మ పుత్రులను పొందవలయునను కోరికతో తన శుక్రమును అగ్నిలో హోమము చేసి యజ్ఞమును ఆచరించుచుండ ఋషులు ద్వీతీయజన్మమమును పొందిరని మేము ఏంటీమీ. వారు బ్రహ్మయొక్క యెనిమిది మంది కుమారులు. భృగువు, అంగీరసుఁడు, మరీచి, ఫులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, అత్రి, వసిష్ణుఁడు. వితతమయిన యీ యజ్ఞమునకు దేవతలందరు వచ్చిరి. ఆ విధముగనే, అన్ని యజ్ఞాంగములందుండెను. సామమంత్రములు మూర్తిమంతములయ్యెను. వేలాది యజుర్మంత్రములు మూర్తిమంతములయినవి. క్రమబద్ధపదములచే నలంకృతమయి ఋగ్వేదము ప్రత్యేక మూర్తితో నందు ప్రత్యక్షమయ్యెను, వృత్తములతో భూషితమయిన యజుర్వేదము, ఓంకార వదనోజ్జ్వలమయి, యజ్ఞార్థమయిన సూక్త బ్రాహ్మణ మంత్రములతో సంపృక్షమై సంస్థితమై యుండెను. సామవేదము వృత్తములతోనొప్పి సర్వగేయ పురస్సరమయి విశ్వావసు మొదలయిన గంధర్వులతో కూడికొని యచ్చట సంస్థితమై యుండెను.

బ్రహ్మవేదము (అధర్వవేదము) ఘోరములయిన విధులతో కూడుకొని అందు ప్రత్యక్షమయ్యెను. ప్రత్యంగిరుల యోగముచే నయ్యది రెండు శరీరములతో (ద్విశరీరః) నుండెను. ఈ క్రింద వివరింపఁబడిన వేదపాఠ లక్షణములు భౌతిక స్వరూపముతో నందు ప్రత్యక్షము : లక్షణా - (ఒక పదమునకు సజాతి పదమో సమాన పదమో వాడుట), విస్తరము - (సంక్షిప్తస్యా గ్రతో స్యైవ వాక్యస్యార్థి గరీయసః, సువిస్తార తో వాచో భాష్యభూతాభవంతియే. (సిద్దాంత) స్తోము (సామవేదములో ఉక్త ఆశ్చర్యార్థకము). నిరుక్తము (వేదపదార్థ నిర్ణయము). స్వరభక్తి (అజ్స్వరోచ్చారణము). ఆశ్రయము, వషట్కారము, నిగ్రహము, ప్రగ్రహము (సంధికి లొంగనీ అచ్చు) ఈ క్రింద చెప్పఁబడిన దేవతామూర్తులు వ్యక్తిగతముగా నచ్చట సాక్షాత్కరించిరీ, దీప్తిమతియైన ఇలా దేవత (భూదేవత), దిశలు, సర్వదిగీశ్వరులతో సహా, దేవకన్యలు దేవతల భార్యలు, తల్లులు స్వయముగా వచ్చిరి. వరుణుఁడు స్వరూపొఖ్యమైన స్వశరీరమును ధరించి యజ్ఞమును నాచరించుచుండ, పైని చెప్పఁబడిన సౌందర్యశరీర రూపమున దాల్చిన వారందరు వచ్చిరి. వారందరు సౌందర్యముతో తేజస్సుతో భాసించుచుండిరి. వారిని చూచి స్వయంభువుఁడైన బ్రహ్మయొక్క రేతస్సు భూమిపై పడెను. ఇందు సంశయము లేదు. ఇయ్యదీ బ్రహ్మర్షి భావియైన ప్రయోజనార్థము జరిగినది. పితామహుఁడు ఆ రేతస్సును, రెండు చేతులతో సువముచే పట్టుకొనీ (ధరించి) హోమమాచరించెను. యజ్ఞోపసాధనమయిన స్రువముతో రేతస్సును గ్రహించి, అయ్యది స్రవించుచుండగా మంత్రవిధిగా మంత్రము నుచ్చరించుచు హోమము చేసెను. అంత ప్రజాపతి భూతగ్రామమును సృష్టించెను. ఆ ప్రజాపతి తన యొక్క అర్వాక్రేజస్సుచే (కాంతిచే తైజస బ్రహ్మను ప్రపంచమున సృజించెను. స్పష్టముగా లేదు. ఏదో కొంత లోపమున్నట్లున్నది. తమస్సు చేయాప్యత్వము (గడుపదగుట), సత్త్వమెట్రోరజస్సుగూడనట్లే తన రేతస్సును ఆజ్య స్టాలిలో గ్రహించి హోమక్రియ నాచరించెను. శుక్రముచే హోమము చేయబడ అప్పుడే మహార్పులావిర్భవించిరి. వారు ప్రజ్వలించు శరీరులు. వారు స్వప్రభావయుక్తులు, స్వగుణవంతులు. స్వప్రభాగుణములచే ప్రదీప్తులు. హోమ రూపమున శుక్రము అగ్నిలో హుతము చేయబడ ఆ హోమజ్వాల నుండి కవి (శుక్రుం డు) బహిర్గమించెను. (35) జ్వాలను ఛేదించుకొని ఆవిర్భవించు శుక్రుని చూచి హిరణ్యగర్బుఁడు (బ్రహ్మ) “నీవు భృగువు” అనెను. బ్రహ్మ యట్లనుటచే నతఁడు భృగువయ్యెను. మహాదేవుండంత ఆవిర్భవించెను. బ్రహ్మను చూచేను, ఇట్లనెను. “ఓ దేవ! నేను పుత్రుని కోరితిని. దీక్షితుం డను. నీచే ఆహ్వానింపఁబడితిని. ఓ ప్రభో ! మొదట పుట్టిన యీతఁడు నా కుమారుఁ డగును. 'అట్లే యగుగాక' అని స్వయంభువునిచే మహాదేవుఁడు సమనుజ్ఞాతుడయ్యెను. అంత మహాదేవుఁడు భృగువును పుత్రునిగా నొందెను. అందుచే భృగువులు వారుణులు (వరుణునికి సంబంధించినవారు) ఆ ప్రభువాతని కుమారుఁడు, రెండవసారి అంగారములపై నిప్పుకణికలపై బ్రహ్మ హోమము చేసెను. అంగిరసుని అంగములు దృఢముగా సంహతములు (కూర్చబడినవి). అందుచే నతఁడంగిరసుఁడయ్యెను. ఆతని పుట్టుకను జూచీ వహ్ని బ్రహ్మతో ఇట్లనెను.

“నీ యందు రేతస్సు నుంచినది నేను. అందుచే ఈ రెండవది నా కుమారుఁడు అగుగాక. “తధాస్తు (అట్లే యగుగాక" అనీ సదసత్పతియైన వహ్ని బ్రహ్మచే సమాధాన మీయఁబడెను. అగ్ని ఆతనిని కుమారునిగా నంగీకరించెను. అందుచే అంగీరసుల వారసులు (అనుయాయులు) ఆగ్నేయుల రని మేము ఏందుము. లోక కర్తయైన బ్రహ్మ ఆ రేతస్సును మరల ఆరుభాగములుగా చేసెను. పోనీ నగ్నిలో హోమరూపమున నుంచేను. తన్మూలముననే బ్రహ్మలు ఉద్భవించిరని వేదములలో చెప్పబడినది. ప్రథమతః కిరణముల నుండి మరీచి సముత్తితుఁడు.  ఆ క్రతువు నందు 'ఋషి క్రతువు’ పుట్టెను. అందుచే అది క్రతువనఁబడెను. 'అహం తృతీయః” నేను మూఁడవ వాఁడ' ననుచు ఋషి అత్రీ జన్మించెను. అందుచే నతఁడు 'అత్రీ' అని పేరు పొందెను. ఇక నాలుగవ ఋషి తన కేశములను విరజిమ్ముకొనుచు పుట్టెను. అందుచే నతఁడు ‘పులస్త్యుఁడని' పిలుపఁబడుచున్నాఁడు. ఐదవ ఋషి దీర్ఘములయిన కేశములతో పుట్టెను. అందుచే అతఁడు పులహుడనీ జ్ఞాపక ముంచుకొనఁబడెను. అవ ఋషీ వసువుల మధ్య నుండి పుట్టేను. ఆతఁడు స్వయముగా పశి. అంతియేకాక ధనమున కధిపతి. (వసుమాన్). అందుచే నతనిని వసిష్ఠుడనీ బ్రహ్మవాదులనిరి. ఆ బ్రహ్మవాదులు యథార్థవిషయపరిజ్ఞాతలు. (తత్త్వజ్ఞులు). ఈ విధముగా ఈ యాలుగురు మహర్చులును బ్రహ్మ మానస పుత్రులు. వారు లోక సంతానకారులు. ఈ ప్రజలందరు వారిచే వర్ణితులు. బ్రహ్మగారీ సుతులను ప్రజాపతులందురు. పితరులును ఈ మహరుల వలననే కలిగిరి (పుట్టిరీ). సప్తలోకముల యందు విశ్రుతములయిన దేవగణములు వారిచే (ఆ యార్డురు మహరులచే ఉత్పాదింపఁబడిరి. ఆ దేవగణములు జయింపఁబడని వారు (అజేయులు). వారు సంఖ్యచే నేఁడుగురు. సప్తలోకముల యందు ప్రసిద్ధులు. వారు మరీచులు, భార్గవులు, ఆంగిరసులు, పౌలస్త్యులు, పౌలహులు, వాసిష్టులు, ఆత్రేయులు. అని చెప్పఁబడుదురు. వారు పితృ లోకములను వృద్ధిపరతురు. వారంరదు క్రమముగా సమాసతః చెప్పఁబడిరి. అంతియేకాక మరల ఇతరులు మూఁడు గణముల వారున్నారు.  వారు అమర్తులు, అప్రకాశులు, జ్యోతిష్మంతులు అని విశ్రుతులు. పొరీ రాజు యముఁడు. ఆ యముఁడు “యమాది” గుణములచే కల్మషరహితుఁడు. ఇతర ప్రజాపతులున్నారు. వారిని గూర్చి శ్రద్ధగా వినుఁడు. వారు కశ్యపుఁడు, కర్ణముఁడు, శేషుఁడు, వీక్రాంతుఁడు, సుశ్రవుండు, బహుపుత్రుఁడు, కుమారుఁడు, వీవస్వంతుఁడు, శుచివ్రతుఁడు, ప్రచేతసుఁడు, అరిష్టనేమి, బహులుఁడు. మరికొందరు ప్రజాపతి, కుశోచ్చయుఁడు, వాలఖిల్యులు వీరు మహాఋషులు. వారు మనోజవులు. వారెచ్చటకయిన పోగలిగిన సర్వగతులు, వారు సర్వభోగులు. ఇంకొక బ్రాహ్మగణ సంఘము భస్మము నుండి పుట్టేను. వారందరు బ్రహ్మర్షిగణముగా అంగీకృతులు.

వైఖానసమునిగణములు తపస్సునకు వేదవిజ్ఞానమున కధికముగా పరాయణులు. రూప సంపన్నులయిన అశ్వనీదేవద్వయము వారి నాసిక నుండి పుట్టిరి. వాని నేత్ర సంచలనము నుండి ఋక్షరజుఁడు పుట్టెనని వారెరుంగుదురు. ఇతర ప్రజాపతులు ఆతని చెవుల నుండి పుట్టిరి. కొందఱు ఋషులు వారీ రోమకూపముల నుండి పుట్టిరి. కొందడో వారీ స్వేద మలము నుండి పుట్టిరి. అయన ద్వయముఁ (ఉత్తరాయణ, దక్షిణాయనములు) ఋతువులు, మాసములు, అర్థమాసములు, పక్షసంధులు అన్నీయు వాని నుండి పుట్టెను.  సంవత్సరము లోని అహోరాత్రములు, ఆకాశమున ప్రకాశించు జ్యోతులు వాని దారుణమైన పిత్తము. వారాతని రక్తము రౌద్ర(రుద్ర సంబంధ మందురు. ఆతని రక్తము 'కనకము'గా జ్ఞాపక ముంచుకొనఁబడుచున్నది. అయ్యదియాతని 'తైజస'మని ప్రోక్తము. ఆతని ధూమములు జంతువులుగా స్మృతము. ఆతని నుండి ఉత్పన్నములయిన అర్చులు రుద్ర సంబంధములయినవి. అట్లే పండ్రెండుగురు ఆదిత్యులు. సముత్పన్నులైరి. అంగారముల నుండి (నిప్పుకణములనుండి) దివ్యములు మానుషములునయిన అర్చులు పుట్టినవి. అంత దేవతలకు గురువైన బ్రహ్మ దేవతలచే సంప్రసాదితుఁడు. ఈ వాక్యములు వారాడిరి. ఈ ప్రపంచమున నీవు ఆదీభూతుఁడవు. నీవు బ్రహ్మ నుండి పుట్టిన బ్రహ్మవు. నీవే సర్వకామ దుం డవు. ఈ ప్రజేశ్వరులు సర్వ ప్రజలను పుట్టించెదరు. వారందరు ప్రజాపతులు : వారందరు తపస్వినులు. వారి ప్రసాదము వలన, (అనుగ్రహము వలన) ఈ పవిత్ర క్రియలు లోకమును ధరించును (రక్షించును) తద్వంశ వర్థనులు నీ యొక్క తేజస్సును నిరంతరము వృద్ధి పొందించువారు. ప్రజాపతులకుదయమొందిన వారెల్లరు వేదవిద్వాంసులు, వాక్పతులు, వేదమంత్రధారులు అగుదురు. వారందరు సత్యమయినట్టిది, పరమమయినదియునగు తపస్సునయన బ్రహ్మమము నాశ్రయింతురు. మేమందరము వీరందరు ఓ ప్రభూ నీ సంతానము. బ్రహ్మ బ్రాహ్మణులు, చరాచరములయిన లోకములు, దేవతలు, మరీచి ప్రథముఁడుగా గల ఋషులు వీరందరు నీ సంతానము. మేము నీ సంతానమగుటకు కోరుదుము. మహా భాగులైన దేవతలు, ఋషులు, యజ్ఞము నందున్న వారందరు, నీ వంశము నుండి పుట్టినవారే, వారందరు స్థానకాలాభిమానులు (దేశకాలములతో సమైక్యభావమొందుదురు). ఈ ప్రజలందరు నీ రూపముననే సంస్థితులు, బ్రాహ్మణులు యుగారంభములను యుగాంతములను స్థాపించెదరుగాక. ఈ వాక్యములు విని దేవగురుఁడు చక్కగా నవధారణముచేసి (యోచించి) ఇట్లనెను. ఈ విధముగా నిశ్చయము చేసిన తరువాతనే మీ వంశ సంభూతులయిన మహర్షులు నాచే సృజింపఁబడిరి. దీనిని గూర్చి యెట్టి సంశయము లేదు.

వారిలో ముందుగా మహాత్ముఁడు, ప్రజాపతులలో మొట్టమొదటివాఁడునయిన భృగునీ గూర్చీ కీర్తించెదను. ఆతనిఁగూర్చి సవిస్తరముగ, ఆనుపూర్విగా వర్ణించెదను. భృగువున కిద్దరు భార్యలు. వారుత్తములు. ఉత్తమాభిజాత్యము కలవారు. వారు మంగళకరులు. వారిలోనోకతే ‘దివ్యనామధేయ. హిరణ్యకశిపుని కూతురు. రెండవది పౌలోమి. ఆమె వర వర్జిని. అత్యంత సౌందర్యవతి. పులోముని యొక్క దుహిత దివ్య భృగున కొక కుమారుని గనెను. ఆ పుత్రుఁడు బ్రహ్మ విద్వరులలో శ్రేష్ఠుఁడు. ఆతఁడే శుక్రుఁడు. దేవతలకు గురువు అసురులకు గురువు. ఆతం డొక గ్రహము. మనీషావంతులలో నుత్తముఁడు. (కవివరుండు), శుక్రుఁడే ఉశనుఁడు. ఆతఁడు కావ్యుఁడను నామమున నిత్యము విశ్రుతుఁడు. సోమపులైన పితరుల యొక్క మానసీకన్య నామమున గోవు. 'గౌర్నా మమున ప్రసిద్ధురాలు. యశస్వినీ, ఆమె శుక్రుని భార్యయయ్యెను. ఆతనికి నల్గురు కుమారులను కనెను. వారు త్వష్ట - 2 వరతీ3 శండుండు4 మరుఁడు, వారు తేజస్సుచే ఆదిత్యతుల్యులు. ప్రభావముచేత బ్రహ్మ సదృశులు, వరీత్రికుమారులు - రజతుఁడు ష్పడువు; రశ్ని: విద్వాంసుఁడయిన బృహంగీరుఁడు. వరత్రి యొక్క కుమారులు బ్రహ్మీస్థులు, దైత్యులకు యజ్ఞములజేయించువారు. (ఇజ్య) యజ్ఞధర్మము యొక్క వినాశము కొఱకు, వారు మనువును చేరిరీ, యజ్ఞములను (విపరీతవిధులతో) ఆచరింపజేసిరి. ధర్మము తిరస్కరింపబడుచుండెను. దాని నింద్రుఁడు చూచి మనువుతో నిట్లనియెను. “వీరిచేతనే నేను నీ యజ్ఞమును సక్రమముగా నాచరింపఁజేసెదను.” ఇంద్రునీ ఈ పలుకులు విని, ఆ వరత్రి కుమారులు ఆ ప్రదేశము నుండి తొలగిపోయిరి. వారు తీరోభూతులు కాగా, ఇంద్రుఁడు మనుపత్ని కడకు వచ్చెను. ఆమే అచేతనమైపడియుండెను. దుష్ట గ్రహవశము నుండి ఆమే కతఁడు మోక్షము గలించెను. పిదప వారల నీంద్రుడు అనుసరించెను.  అంత, ఆ మునీంద్రులు ఇంద్రుని ఏనాశనము కొఱకు ప్రయత్నించిరి. వచ్చిన దుష్టులగు వారలను జూచి యింద్రుఁడు నవ్వెను. తరువాత ఇంద్రుఁడు క్రుద్దుఁడయ్యెను. వారలను యజ్ఞవేది యొక్క దక్షిణ భాగమున దగ్గపటలము చేసెను. అచ్చట వారు వారి యొక్క శాలావృకములతో (కుక్కలతో - నక్కలతో, తోడేళ్ళతో) ఎదుర్కొనిరి. అట్లు ఇంద్రుని వారెదుర్కొనినను వారీ శీర్షములు నేలకురాలినవి. అవి ఖర్జూర వృక్షములయినవి. ఈ విధముగా వరత్రి పుత్రులు ఇంద్రునిచే పూర్వము నిహతులయిరి. శుక్రునికి దుహితగా జయంతి యందు దేవయాని జన్మించెను. విశ్వరూపుఁడను నామాంతరము గల త్రిశిరుఁడు, త్వష్టయొక్క జ్యేష్ఠకుమారుఁడు.

విరోచనుని కూతురయిన యశోధరయందు (విశ్వకర్ముడు) పుట్టెను. ఆతఁడు మహాయశశ్శాలి. విశ్వరూపుని యొక్క తమ్ముడు. శుక్రునీ యొక్క అనుజయయిన దివ్య, యొక కుమార్తెను కనెను. భృగువునకు పండ్రెండుగురు దేవులైనకుమారులు కలిగిరి. భువనుడు, భావనుడు, అంత్యుడు, అంత్యాయనుడు, క్రతువు, శుచి, స్వమూర్దా, ప్యాజుడు, వసుదుడు, ప్రభవుడు, అవ్యముడు, పండ్రెండవవాడు అధిపతి. వారందరు భృగువులుగా ప్రసిద్ధులు. వారు దేవతలు. యజ్ఞారులు. పౌలోమి బ్రహ్మీష్ణుఁడయిన కుమారుని కనెను, ఆతఁడు పరిపూర్ణవశీ (యింద్రియ నిగ్రహముగల) బ్రాహ్మణుఁడు. ఆతఁడు గర్భస్థుఁడై యుండగా నొక క్రూరుఁడయిన రాక్షసునిచే అష్టమ మాసమున పగల్చబడెను. అప్పుడాతడు గర్భము నుండి జారిపడెను. అందుచే నతఁడు చ్యవనుడయ్యెను. ఆతఁడే ప్రచేతనుఁడు కూడ. ఏలయన ఆతఁడు సచేతసుడగుట. ప్రచేతసుడను నామాంతరము గలిగిన చ్యవనుఁడు పురుషులను చంపితిను పురుషాదకులయిన రాక్షసులను చంపెను. భార్గవుఁడయిన చ్యవనుఁడు సుకన్యవలన ఇరువురు పుత్రులం గనెను. ఆ యిరువురు (1) ఆప్రవానుఁడు. (2) దధీచుండును. వారిరువురు సాధు సమ్మతులు. దధీచుని కుమారుఁడు సారస్వతుఁడు. ఆతఁడు సరస్వతి వలనఁగలిగెను. మహా భాగమైన “ఋచి” నహుషుని కూతురు. ఆమె అప్రవానుని భార్య. మహర్షియైన ఔర్వుఁడు సుప్రసిద్ధుఁడు. ఆతఁడు ఋచికి ఊరువును చీల్చుకొని పుట్టెను. ఔర్వుని కుమారుఁడు ఋచీకుఁడు. ఆతం డు దీప్తాన్నీ సదృశ తేజో విశేషుఁడు. ఋచీకునకు సత్యవతి యందు జమదగ్ని జన్మించెను. భృగుఁడొసంగిన “చెరువు” (యజ్ఞప్రసాదము) యొక్క విపర్యాసము (మార్పు) వలన ఆ చెరువులు రౌద్ర వైష్ణవ సంబంధములయినవి. విష్ణు సంబంధమైన అగ్నిని మ్రింగుట వలన జమదగ్ని పుట్టెను. రేణుక రాముని జమదగ్ని వలన కనెను. ఆతఁడమీత తేజస్కుండు. శక్రతుల్య పరాక్రముఁడు. ఆతనికి బ్రహ్మ క్షత్రమయమయిన తేజస్సు కలదు. ఔర్వునకు జమదగ్ని మొదలుకొని నూర్గురు కుమారులు కలరు. భార్గవులలో పరస్పర సంబంధము వలన పుత్ర సహస్రములు కలిగిరి. ఇతర ఋషులలో కూడ బాహ్య భార్గవులు చాల మంది కలరు. వత్సులు, విదులు, ఆర్జిషేణులు, యాస్కులు, వైన్యులు, శానకులు, మిత్రేయులు వీరు ఏడవ గణమువారు వీరందరిని భార్గవులుగా తెలిసికొనవలెను.

అగ్ని యొక్క పుత్రుడై ధీమంతుఁడయిన అంగీరసునీ వంశమును గూర్చి వినుము. ఈతని వంశమునందే భారద్వాజులు గౌతములతో సహా పుట్టిరి. అంగీరసుని వంశమునకు సంబంధించిన ముఖ్యతములయిన దేవతలు మహజసులు, త్వషిమంతులు(కాంతిమంతులు). మారీచుని కుమార్తెయైన సురూప, కర్దముని కూఁతురైన స్వరాట్, మనువు దుహితయిన పథ్య అను మువ్వురు అథరుణుని యొక్క భార్యలయిరి. వారి యందు అథర్వణునకు దాయాదులు, కులోద్వహులు పుట్టరి. వారు వంశమును వృద్ధిపరచిరి. వారు గొప్ప తపస్సుచే భావితాత్ములు సయిరి. సురూపకు బృహస్పతి యుదయించెను. గౌతముని ఆయాస్యుని, వామదేవునీ, ఉతథ్యుని మరియు ఉశీతిని స్వరాట్ కనెను. పథ్య యొక్క కుమారుఁడు ధృష్టి వారి మానసపుత్రుఁడు సంవర్తుఁడు.  అయాస్య కుమారుఁడు కీలవుఁడు. శరద్వంతుఁడు ఉతథ్యుడుదయించెను. దీర్ఘతముఁడు ఉతికి కలిగెను. వామదేవునకు బృహదుక్తుఁడు కలిగెను. సుధన్వుఁడు ధృష్టి కుమారుడు, ఋషభుఁడు సుధన్వుని కొమరుఁడు. రధకారులు దేవతలుగా పరిగణింపబడుదురు. వారే ఋషభులుగా లోకవిదితులు. విశ్రుతుఁడు (ఖ్యాతిమంతుఁడు) అయిన భరద్వాజుఁడు బృహస్పతి కుమారుఁడు. బృహస్పతి కంటే చిన్నవారయిన దేవతలు ఆంగీరసులుగా విదితులు. వారు ఆంగీరసుని ఔరసపుత్రులు. సురూపయందు జనించిరి. ఆధారి, ఆయువు, దనుఁడు, దక్షుండు, దముఁడు, ప్రాణుఁడు, హవిష్యంతుఁడు, హవిష్ణువు, ఋతుఁడు, సత్యుఁడు నీరు పదిమంది. ఆంగీరసుని వంశగణములు పదియైదుగా నెఱుంగవలయును. ఆ గణములు అయాస్యులు, ఉతథ్యులు వామ దేవులు, ఔశిజులు, భారద్వాజులు, సాంకృతులు, గర్గులు, కణ్వులు, రధీతరులు, ముద్గలులు, విష్ణువృద్ధులు, హితులు, కపులు, రూక్షులు భరద్వాజులు, ఆరభులు, కితవులు, బాహ్యాంగిరో గణములు చాల ఇతర ఋషులలో కలవు. ఉత్తమ పురుషులతో గూడి యున్న మరీచుని వంశమును గూర్చి చెప్పెదను. ఆతని వంశములో జగత్తు నందలి స్థావర జంగమములన్నియును సంభూతములు. మరీచి నీటిని ప్రేమించెను. ప్రజోత్పత్తినికోరీ ఆతఁడు వానిని గూర్చీ ధ్యానించెను (భావించెను) “సర్వగుణోపేతుఁడయిన పుత్రుఁడు సంతానవంతుఁడయిన పుత్రుఁడు కలుగవలెను” అని ఆతఁడు భావించేను. భగవత్సంయోగమునందాతఁడు నీమగ్నుఁడయ్యెను. ఆ ప్రభువు తపస్సుచే పవిత్రీకృతుఁ డయ్యెను.

అంత జలములు తాడితమయ్యెను. ఆ ప్రభువు వాని యందు ఒక కుమారుని కలిగించెను. ఆతని హృదయము ధ్యానము నందు నిమగ్నమయ్యెను. ఆ కుమారుఁడప్రతిముఁడు. ఆతఁడు ప్రజాపతి ఆతని నామ మరిష్టనేమీ. తపో నిమగ్నుఁడయిన మరీచి, నీటిలో తపస్సాచరించు కుమారుని పొందెను. పుత్రార్జీమైన యాతఁడు సలిలమందు సంస్థితుఁడై యుండెను, పవిత్రమయిన వాక్కునే ధ్యానము చేయుచుండెను. ఆతఁడా నీటీ యందు ఏడువేల యేండ్లుండెను. అందుచేతనతఁడప్రతీముడు (సాటిలేని వాఁడాయెను) కశ్యపుఁడు సప్తృతుల్యుఁడు. తేజస్సుచే బ్రహ్మతో సమానుడు. అతఁడు విద్వాంసుఁడు. ప్రతి మన్వంతరమునందు నతఁడు బ్రహ్మగారి యంశముతో పుట్టును. దక్షుఁడు తన కూతుండ్ర విషయమై అత్యుక్తి పరుఁడయ్యెను. బ్రహ్మ కుపితుఁడయ్యెను. ఆతఁడు కశ్యమును త్రాగెను. కశ్యమనఁగా మద్యము. 'కశి' అను పదము హాస్యమను నర్థమొసంగునదిగా గ్రహింపవలెను. “కశ్యమను పదమునకు- వాజ్మనస్సులని అర్థము విప్రులు కశ్యమును మద్యమనీరీ. కశ్యమును త్రాగుటవలన ఆతఁడు కశ్యపుఁడయ్యెను. ‘కశము’ అను పదము క్రౌర్యమునకు ఉచ్చరింపఁబడుటచేతను దక్షునిచే శపింపం బడియతఁడు కుపితుఁడగుటచేతను, ఆతఁడు కశ్యపుఁడయ్యెను. ఆ కారణముచేతనే, పరమేష్టి యయిన బ్రహ్మచే సూచింపఁబడుటచే ప్రచేతసుని కుమారుఁడయిన దక్షుఁడు తన కుమార్తెలను వానికిచ్చి వివాహము చేసెను. వారందరు బ్రహ్మవాదీనులు. లోకమాతలు. ఈ విధముగా నెవ్వం డు ఋషీశ్వరుల సృష్టి నేఱుంగునో (పవిత్రమయిన వరుణునకు సంబంధించిన విషయమును) ఆతఁడు పుణ్యవంతుఁడు, పరిశుద్ధుఁడు, ఆయుష్మంతుఁడునై, శాశ్వతమయిన సుఖము నొందును. ఈ విషయమును జ్ఞాపకముంచుకొనినను, వీనినను ఆ వ్యక్తి సర్వపాప విముక్తుఁ డగును.

ఇది వాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున ఋషిసర్గవర్ణనమను ప్రథమాధ్యాయము.