23 - కురండాదిపంచసేనాపతివధో

ఇక శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున కరంకాది పంచసేనాపతివధమను నిరువదిమూడవయధ్యాయము.

అశ్వారూఢశక్తి కురండుని జంపగా భండాసురుడు మరలనామెతో యుద్దముజేయగోరి కుటిలాక్షునితో నిట్లనెను-1. స్వప్నములోను సంభవముగానిది, ఇంతకుపూర్వమెవ్వరును విననిది, నా మనమునగూడ శంకీంపనిదియైన యీ కష్టము వచ్చిపడినది-2. కురండ దుర్మదులు మహాబలవంతులైన సోదరులు. నాకు హితులు, వారిరివురు చంపబడిది. ఇది మాయావిని, దుష్టదాసియైన దేవియొక్క మిక్కలి గొప్పనైన ప్రభావము-3. ఇకముందు కరంకుడు మొదలైన యైదుగురు సేనానాయకులను నూరక్షౌహిణుల సైన్యమును రణభూమికి బంపుము-4. వారు యుద్దదర్మదులు, శూరులు, యుద్ధములలో శరీరములనైనను వదలుదురు. వారన్ని విధములుగా దుష్టవిలాసినియైన యామెను జయింపగలరు-5. అను నీ భండాసురుని మాటలు విని మిక్కిలి తొందరతో కుటీలాక్షుడు కురంకుడు మొదలగు సేనాసోయకులను బీలిచెను-6. వారు స్వామియైన భండాసురునకు నమస్కరించి, కుటిలాక్షునిచే నిర్దేశింపబడినవారై, అగ్నిలో ప్రవేశించబోవువారీవలే క్రోధాంధులై శూన్యకపురమునుండి బయలు వెడలిరి-7. వారీ జైత్రయాత్రా పటహధ్వని మిక్కిలిసహింపనలవి గాకున్నది. దానిని విని దిగ్గజములు వెంటనే చెవులు బ్రద్దలుగాగా తిరిగినవీ-8. నూరు అక్షౌహిణులసైన్యము బయలుదేరినది. దానికి జెండోలు మాలలుగానున్నది. ఎత్తైన సముద్ర తరంగమువలె తురంగములు మదించిన గజములును కదలుచు ప్రకాశించినవి-9. సైన్యము సకిలించు గుఱ్ఱములతో నిండినది. భట సమూహములు జయజయధ్వానములు జేయుచున్నవి. ఏనుగలు ఘీంకరించుచున్నవి. రధచక్రములు సింహములవోలె గర్జించుచున్నవి. ఈ సైన్యమంతయు కదలినది-10. రథ చక్రములయంచుల తాకిడికి భూరేణువులతో సూర్యుడు గప్పబడుచున్నాడు-11. సమస్త విశ్వమండలము ధూళితో నిండినది. ఒకప్పుడు కఠినమైన పటహధ్వనులతో విశ్వమండలము శబ్దమయముగూడనగుచున్నది-12. పై కెగసిన ధూళులతో రాక్షస సైనికులాక్రమింపబడిరి. దానివలన సేనసంఖ్య యింతటిదని భావింపబడినదీ-13. చేపలు సర్పములు మొదలగువానిచే చిత్రింపబడిన బహువిధాకారముల జెండాలు ధూళికాజాలమున మహాసముద్రమున చేపలవోలె నెక్కువగా గదిలీనవి-14. లలితాసైన్యముపైకి వెళ్లు రాక్షససేనలను జూచి శక్తులకు భంగమువాటిల్లు నేమో యను శంకతో దేవతలు భయపడిరి-15. కరంకుడు మొదలగు నైదురుగు దైత్య సేనాపతులుధ్ధతులై (విజృంభించి) యుద్ధమున సర్పిడి యనుమహామాయను సృష్టించిరి-16. సేనాపతులచేప్రయోగింపబడిన దుష్టమైన రణమాయ సర్పిడి ధూమ్రవర్ణ, ధూమ్రోష్టి ధూమ్రవర్ణ స్తనములుగలది-17. మహాసముద్రమువలె మిక్కిలీలోతైన గుహవంటి కడుపుగలది. అదీ రణమున శక్తుల మనమును భయ పెట్టుచు ముందుకు కదలినది-18. అది రెండవ కద్రువ (నాగమాత)వలె నున్నది, దుష్టురాలు. అనేక సర్పములలంకారములుగా గలది. మాయామయ శరీరములుగల సర్పము లామెనుండి పుట్టుసు-19. అది భూమిపై సేనాపతుల ముందర వంకరగా బ్రాకుచున్నది. తరువాత భయంకరముగా నడచుచు తన వంకరగా బ్రాకుటను అనేక విధములుగా జూపెను-20. పూర్వము రాక్షసనాయకులు అట్లే మాయతో జయించిరి. కరంకుడు మొదలగు దురాత్ములు ఐదుగురు పంచత్వమును (మరణమును) గోరుకొనుచున్నారు-21. తరువాత రాక్షసులకును, శక్తులకును యుద్ధము జరిగెను. వారు పరస్పర వీరాలాపములతో క్రోధముల గొప్పగా రెచ్చగొట్టుకొనిరీ-22. మిక్కిలి దొమ్మీగా యుద్దము జరుగుటచే శక్తులు-దానవులును ఒండొరుల దేలీయకుండిరి. శస్త్రముల చేత ధరించి పరస్పరము గొట్టుకొనుచుండిరి-23. ఒండొరుల శస్త్రముల యొరపిడి వలన మంటలు రేగినవి. ఆ మంటల ప్రవాహముచే దిగంతరములు గప్పబడినవి-24. బహురక్త. నదులు పొంగి పొరులటచే పోనీలో ఏనుగలు కొట్టుకొనీ పోవుచున్నవి. మాంసపుబురదలో మునిగీ రథముల గుంపులు కదలలేకున్నవి-25. వ్యాపించిన హతుల వెంట్రుకలనేడు నాచుతో రక్తనదులు విలసించుచున్నవి. అతనిష్ఠురముగా ధ్వంసముజేయు యోధుల సింహనాదములు భయంకరముగానున్నవి-26. ధూళితో నంధకారము నిండి యెదుట గనబడుటలేదు. రణరంగము రాక్షసస్త్రీలకు తృప్తినిచ్చినట్లుగా, శస్త్రధారుల బాణముతో దేగిన రాక్షసకంఠములు రక్తధారల జిమ్మినవి-27. ఈ విధముగ శక్తులకును, రాక్షసులకును హోరసంగ్రామము జరిగినదీ, అంత కరంకుడు, మొదలగు నైదుగురు, రాక్షస సేనాపతులు తమ బలములదెచ్చి సర్పీణీమాయను బ్రేరేపించిరి. వెంటనే యాసర్సీడి తన శరీరమునుండి బహువిధ సర్పముల సృజించెను-28. ఆ సర్పములు తక్షకునితోను కర్కోటకునితోను సమానములు. వాసుకి మొదలగువారి కాంతి గలవి, నానావిధ శరీర వర్ణములు గలవి. నానా దృష్టులచే భయంకరములు-29. సానావిధ విషజ్వాలలచే భువనత్రయమును గాల్చువారు. దారదము, వత్సనాభము, కాలకూటము-30. సౌరాష్ట్రము, బ్రహ్మపుత్రము, ప్రతీపన్నము, శౌక్తికేయము, (ఇవియన్నియు నాయా భయంకర సర్పవిషములు). ఇతర విషములు-31. వీనిని సర్పములు తమముఖములనుఁడి చంచలములైన రెండు నాలుకలచే శక్తి సైన్యముపై వెదజల్లుచు సరి తనువునుండి వ్యాపించినవి-32. ధూమ్ర వర్ణములు గలిగి రెండు ముఖములుగల సర్పము లతీభయంకరములు. అవి సర్పీణీయొక్క రెండు కన్నుల నుండి బుట్టినవి. కోపముచే మండిపోవునవి-33. పచ్చని వర్ణములు గలిగి, మూడుపడగలు గలిగి, కోరలతో వికటమైన ముఖములు గలవి. ఇవి సర్పిణీయొక్క చెవిరంధ్రముల నుండి బుట్టిన కోట్ల సర్పములు-34. ముందును వెనుకను పడగతో గూడిన ముఖమును ధరించునవి, ఆస్యాదములు, నల్లని శరీరముగలవీయు నైన సర్పములు సర్పీజీ నుండి బుట్టినవి. (సర్పిడి పడగ నుండి బుట్టినవి)-35. మరికొన్ని చిత్రవర్ణములు గలిగి నాలుగు ముఖములు, నాలు పాదములును గలిగినవి. ఇవి భయంకర కాంతిగలవి. సర్పిడి యొక్క ముక్కు రంధ్రము నుండి బుట్టినవి-36. సర్పీణియొక్క వ్రేలాడుచున్న పెద్ద చర్మముచే చుట్టబడిన స్తనమునుండియు, నాభికుండమునుండియు, రక్తవర్ణములు, భయంకరములు-37. హాలాహలమును ధరించునవియైన సర్పరాజములు బయలుదేరినవి. అవి శక్తిసేనను బ్రవేశీంచి కరచుచు, విషాగ్నులతో దహించుచున్నవి-38. భోగపాశములతో బంధించుచున్నవి. పడగల సమూహముతో జంపుచున్నవి. ఇవి యీ విధముగా శ్రీలలితా దేవి సైన్యమును మిక్కిలి వ్యాకుల పరచినవీ-39. శక్తులయొక్క కోట్ల కొలది శస్త్రములచే మాటిమాటికీ నరకబడుచున్నప్పటికీనీ-40. గుంపులు గుంపులుగా బ్రాకుచున్నవే పైపైగా వర్ధిల్లుచుండును. బహుసర్పములు నశించును. కాని మరల బహుసర్పములు బుట్టును-41. ఒక సర్పము నశించునపుడు వేరైన బహుసర్పములు బయలు వెడలును. పోనికి మూలభూతయైన సర్పడి నశింపకుండుట దీనికి కారణము-42. అందువల్లనే సర్పీజీ తాను సృష్టించిన సర్పములు చావగా వెంటనే సరాంతరములు (వేరొక సర్పములు) బయలువెడలుచున్నవి. దానివలన శక్తసైన్యములో శరీరములు విషాగ్నిచే కాలుచుండగా దుః ఖముతో యుద్దము నుండి పారిపోయినవి, శక్తి సైన్యచక్రములకు ఏమిచేయుటకును పాలుపోలేదు-44. అపుడు ఐదుగురు కరంకాదులు తమ పరాక్రమమును బహువిధముగా జురి, కరీంద్రి యనువాడు నూరు గాడిదల బూన్చినరథము నెక్కి-45. వాడియైన యంచుగల చక్రముతో శక్తిసేనను మర్ధించెను. భండాసుర సేనాపతియైన వజ్రదంతుడనువాడు-46. వజ్రమువంటి బాణముల దెబ్బిలతో ఒంటెనుండి యుద్ధము జేసెను. వజ్రముఖుడనువాడు చక్రములు గల మహారథమునెక్కి-47. బల్లెపు టంచులతో శక్తి సైన్య చక్రమును మర్దించెను. వజ్రదంతుడను మరొక బలవంతుడైన రాక్షస సేనాపతీ-48. రెండు గ్రద్దల రథమునెక్కి బాణములతో గొట్టెను. ఆ సేనాపతులు ప్రోత్సహింపగా. నూరక్షౌహిణుల దైత్య సైన్యము ఒక్క విలాసముగా శక్తి సైన్యముపై బడెను. దురాచారయై సర్పిణీయు బహుమాయల పరిగ్రహించినదై. క్షణక్షణమున కోట్లకొలది సర్పములను సృజించెను. గరుడారూఢయైన నకుల ఆ విధముగా వికలితమైన శక్తినైన్యమును జూచి రోషవ్యాకులమై. రణరంగమున దూకెను. కాచిన బంగారువన్నెగల యానకుతి శ్రీ లలితాదేవి యొక్క దవడల నుండి బుట్టినదీ. సమస్త వాజ్మయరూప మైనది. వజ్రమయ. దంతములతో నున్నది. ఆమె సర్పిడికభిముఖముగా తనబలమును నడిపించెను. ఆమెను తన యెత్తైన భుజములపై నెక్కించుకొనీ రెక్కలతో కొండలనుగూడ కదలింపజేయుచు నడచునట్టి మేరుపర్వత మాయన్నట్లున్న గరుడుడు యుద్ధమునకు బయలుదేరెను. సర్పీడీమాయచే బుట్టిన భయంకర సర్పముల జూచి కోపముతో కన్నులెళ్లుచేసి యానకుని ముఖమును దెరచెను . శ్రీనకులీ దేవికి ముప్పది రెండు దంతముల కోటులు(మొనలు)న్నవి, వానినుండి బంగారు వన్నెగల ముప్పది రెండు కోట్ల నకులములు - (ముంగీసలు) బుట్టినవి. ఇటునటు సర్పిడీసర్పమండలమును ఖండించుచు తన కోరలతో గొరీకి మర్దించి వాని విషమును ధ్వంసముచేయుచు విషధాతుకములై బంగారు ముంగిసలు ఆభయంకర రణమున మిక్కలి తిరుగాడినవి. చెవులు పైకి నిక్కబొడిచినవి. కోపించుటచే వెంట్రుకలన్నియు నిక్కబోడిచీకొన్నవి. కొంతయుట వికసించినట్లున్నవి. ఇట్టి ముంగీసలు నోళ్లను దెరచి సర్పములను గఱచినవి. ఒక్కొక్కమాయా సర్పమునకొక్కొక్క ముంగిస బయలు వెడలినది. తమ తమ ఐడీ పండతో సర్పముల యాక్షారములను ముక్కలు చేసినవి, పాముల పడగల నుండి సభించిన రకములచే ముంగిసల పెదవుల చివరలు ఎల్లనైనవి. చిగురాకులవంటి నాలుకలతో పెదవుల నాకుచు రణమున దూకినవి, ముంగీసలచే కొలకబడుచున్న సర్పముల శరీరములు చంచలములైనవి. మాటిమాటికీ పడగలతో జుట్టకొనుచు పాములు మరణ వికార చేష్టలు చేసినవి. ముంగీసల గుంపులతో గవబడీ ప్రాణములు గోలుపోయిన పాముల పడగల నుండి దొరలిన మణులు రణమున ప్రకాశించినవి. ముంగీసలచే గొణుకబడి రక్తముల స్రవించు పాములపడగలు శక్తిద్రోహ వహ్నిజ్వాలల బ్రకాశించినవి. ఈ విధముగా ముంగీసల గుంపుతో సర్పీజీమాయ మాయాసర్పజాలమంతయు ముక్కలు ముక్కలు చేయబడగా సర్పిడికి కోపము వచ్చినది. అపుడా నకులేశ్వరీ యామె (సర్పీణితో మహాయుద్ధమును జేసి బాణమున నతిక్రూరమైన గరుడాస్త్రమును సంధానించెను, ఆ గరుడాస్త్రము తన గొప్ప జ్వాలలచే దిబ్ముఖములన్నీంటి గాల్చి సర్పిడీ దేహమును ప్రవేశించి సర్వమాయను శోషింపజేసినది. మాయాశక్తి నశించుటచే సర్పిడి సంపూర్ణముగా నశించినది. దాని నాశముచేత నాయైదుగురు సేనాపతులు కోపమునందిరి. ఆమె బలమున వారు దేవసేనలను అవమానించిరి. ఆమె యిప్పుడు నకుల పరాక్రమముచే కథాశేషమునందినది (చచ్చినది). కావున తన బలము నశించుటచే మిక్కిలి రోషమునంది ఒక్కుమ్మడిగా శస్త్రసముహములను శ్రీనకులేశ్వరిపై గుమ్మరించిరి. గరుడారూఢయైన యాసేనా నాయిక యొక్క తయే యెదుగురురాక్షస సేనాపతులతో చరుకైన హస్తనైపుణ్యముతో శస్త్రముల వర్షించుచు యుద్ధము జేసెను. పట్టేశములు, ములసములు (రోకళ్లు) భీందిపాలములు (హస్తప్రమాణపుగుదీయ) (ఇవి వేలకొలది). వీనితో బాదీ యుద్ధము చేసెను. వజ్రసారములైన దంతములతో నకులములు మర్మస్థలములలో గరచినవి. దానితో 'హాహాయని యరచుచు రాక్షసకింకరులు భయంకరముగా గరచు నకుములధాటికి వ్యాకులురైరి. ముంగీసలు కొన్ని యాకాశమునుండి యెగిరిదూకి చీత్కారములు చేయు చున్నవి. కొన్ని మండుచున్న కోపములు గలవై శత్రువులసైన్యమును గఱచుచున్నవీ. కొన్ని శత్రువుల చెవులయందు కరచినవి. మరికొన్ని శిరోభాగమున గరచినవి. కొన్ని వీపున కరచినవి. కొన్ని వచ్చి వికార చేష్టలు చేసినవీ. వానిచేత సైనికులు చిరిగిన కవచములు గలవారై వీకలులై భయముతో తమ శస్త్రములను నేలకు జారవిడిచిరి. కొన్ని పాముల యొక్క తెరిచిన ముఖములను గాని పాముల పడగలనుగాని బాగుగా గట్టిగా లాగీ వారి నాలుకలను కరచినవి. కొన్ని నకులములు రాక్షసుల చెవులలో ప్రవేశించినవి, సూక్ష్మరూపములైన, నకులములు శత్రువుల నాసా రంధ్రములలోనికి ప్రవేశించి కరచి బాధించినవి. ఈ విధముగాకనకులములతో తిరస్కరింపబడి దీక్కులేని సైన్యముల జూచి కరంకుడు కోపము వహించెను. తక్కిన సేనాపతులు గూడ మహాబలులై. చురుకైన చేతులతో మేఘములవలి ప్రతి ముంగీసపై బాణవర్షముల గురిపించిరి. దైత్యసేనాపతలు వింటినుండి ప్రయోగింపబడిన బాణములు ముంగీసల దంతముల చివరలతో గట్టిగా తాకి తీవ్రమైన యెరపిడిని జేసినవి. సేనాపతుల నూటికి మించిన బాణముల సమూహములచే గొట్టబడిన ముంగీసల వజ్రదంతముల నుండి యగ్ని జ్వాలలు) బయలువెడలెను. ఆయైదుగురు సేనాపతులు ఒక్కుమ్మడిగా విడువబడినవియు. మెఱయుచున్న ములుకులుగల బాణముల సమూహములతో నకులసేనను మగ్గించిరి. ఇటునటుసేనాపతులవేసిన కోట్ల బాణములచే చీలిన శరీరములు గల నకులములు నకులేశ్వరి జుట్టినవి. ఆ తరువాత ఆ నకులియైన వాణి వాజ్మయమున కంతటకేకనాయికమైనది. ఆమె నకులములన్నియు మరలివచ్చుటచే రోషము వహించినది. అక్షీణ “నకుల" మను మహాస్త్రమును, తన శార్జధనువున సంధించెను. అది అగ్ని జ్వాలలతో జుట్టబడిన యగ్రముగలిగి సర్వతోముఖముగ బోవునది. దానినుండి. కోటీ సంఖ్యలతో నకులములు బయలువెడలినవి. అవి వజ్రాంగములు, వజ్రమువంటి వెంట్రుకలు గలవి. వజ్రమువంటికోరలు గలవి. మిక్కలి వేగములు గలవి. వజ్రసారభూతములు. ఇవి దట్టముగానై వజ్రపువలవలె భయంకరములై వజ్రాకారములైన గోళ్లతో వేగముగా భూతలమును జీల్చుచున్నవి. వజ్రరత్నప్రకాశముగల కన్నుతో గూడ బ్రకాశించినవి, వజ్రము పడునట్లు మీద బడినవి. ముక్కుతో చీత్కారమును జేసినవి. తమ దంతముల కోటులతో రాక్షస సైన్యమును మర్ధించినవి. ఏపాపములేక పవిత్రములైన యవీ తమ బహువిధ పరాక్రమమును విస్తరింపజేసినవి. నకుల కోటులచే ప్రత్యవయవముగా వినష్టములై యారాక్షసాధములు విశేషముగా నశించిరి. ఈ విధముగా వజ్రమయములైన నకుల సమూహములచే నూరక్షౌహిణుల రాక్షస సైన్యము ముక్కముక్కలుగా జేయబడగా . పంచసేనాపతులు మాత్రము మిగిలిరి. వారిలో భయమును ఆ తిరోషమును గలవారై ధనువులను లాగి అధికమైన యుద్దమును జేసరి. వారితో యుద్ధము జేయుబడుచు నకులేశ్వరీ పట్టిశ్రమను నాయుధముచేత ఒకని చేతిని, మరియొకని కఠిన శీరమును ఖండించేను, గరుడుడు, ఎగిరెగిరి కాకపొతుడు (కాకీవలే అరచువాడు) మొదలగు నలుగురి శత్రువుల శిరములను కత్తితో ఖండించెను. శ్యామలాంబిక నకులియొక్క యా రణనైపుణ్యమును జూచినదీ. దుష్టరాక్షస వినాశినియై మహాసత్త్వయైన యానకులిని శ్యామలాంబిక - మిక్కిలి బహుమానించెను, తనయంగదేవతాశ్వమును ఆమెకనుగ్రహించెను, లోకోత్తర-గుణమును జూచిన యెవరికి ప్రీతీకలుగదు? అందరికీని ప్రీతికలుగును. చావగా మీగిలిన వారు భీతభీతులై నకులదేవిని శరణు పొందిరి ఆమెయు వారిని దయతోజుచి, భయపడకుడు అని, నవ్వి యా రాజునకు ఈ రణవార్తనంతయు దెలుపుడు అని పంపెను. ఆమెతో నిట్లు పంపబడి, రణభూమిని జూచి, తాము బ్రతికితిమని సంతసించి, మరల భీతితో శూన్యకనగరిలోనికి బరువెత్తిరీ. తరువాత వారివార్తను విని భండాసురుడు కోపముతో భయంకరుడయ్యెను.

ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున            కరంకాదిపంచసేనాపతివధమను నిరువదిమూడవయధ్యాయము.