36 - చింతామణి గృహాంతరకథనం

హయగ్రీవుడనేను. చింతామణిగృహముయొక్క యాగ్నేయదిగ్భాగమున కుందమాన(నామ)కమనుపేర నోకటి (సరస్సు) (యజ్ఞస్థలము)కలదు. అది ఒక యోజనము వెడల్పును పొడవును గలది. ఒక యోజనమువరకుచ్ఛ్వాసగల చాతక పక్షులు గలది-1 అచట జ్ఞానాగ్ని జ్వలించును. అది నూర్ల సుధాధారలతో నర్చింపబడినది. లలితాజ్ఞచే పరమైశ్వర్యమునిచ్చునది. పావనమైనది. -2 ఇంధనము (మండు సాధనము) లేనిది. గొప్ప జ్వాలలుగలది. సుధచేత తృప్తి చెందింపబడిన యాకారము గలదీ, కంకోల వృక్షపు చిగురాకుల వంటి వన్నెగలది. ఇట్టిజ్ఞానాగ్నిచట జ్వలించుచుండును. -అచట మహాదేవి హోమముజేయునది. పరమకామేశ్వరుడు హోమము జేయువాడు, వారిరువురు నీత్యహోతలై సకలజగమును రక్షింతురు. -4 తనకంటినుత్తముడులేని పరాత్పరుడైన కామేశ్వరునకధీనురాలై లలితాదేవి యాతనీచేత చీకార్యమునందు ప్రవర్తింప జేయబడినది. లలితాదేవిచేత ప్రేరేపింపబడిన కాముడు శంకరునిచే ప్రవర్తింపచేయబడెను. -5 చింతామణిగృహరాజముయొక్క రక్షోభాగమున నైరృత్యభాగమున) పద్మాటవీలో-6 చక్రరాజ రథశ్రేష్టమున్నది. అదియున్నతమైన యాకారముగలది. తొమ్మిది పర్వము (అంతస్తులతో భాగము)లతోగూడినది. సమస్త రత్నములతో నిండినయాకారము గలది. --7 సొలుగు యోజనముల విస్తారముగలది. పదియోజనములయెత్తైనది ముందు ముందు ఎత్తుగనుండి తరువాత కురుచగా నున్నది. లావైన నొగలతో ప్రకాశించినదీ -8 దానికి నాలుగు వేదములు గొప్ప చక్రములు. ధర్మ -అర్థ-కామ- మోక్షములనెడివి గొప్ప గుఱ్ఱములు. ఆ రథము ఉపచరించునట్టి తత్త్వములనెడి (ద్వైతాద్వైతములనెడి) వింజామరలతో ప్రకాశించినది-9.పూర్వముజెప్పిన లక్షణములతో గూడి ముత్యములగొడుగుతో బ్రకోశీంచినది. భండాసురమహాయుద్ద సాహసక్రియలనీర్వర్తించినది-10. శ్రీదేవ్యాసనమునకై కట్టె మొదలగువాని గోసి నిర్మింపబడిన రథశ్రేష్టము చింతామణి గృహరాజముయొక్క వాయువ్యదిగ్బాగమున పద్మాటవీయందు గలదు. -11 గేయ చక్రరథ శ్రేష్టము మంత్రితీయొక్క ప్రాంతమున చింతామణీ గృహరాజము యొక్క రుద్ర (ఈశాన్య) భాగమున పద్మాటవీయందున్నది -12 దండనాథకు కీర్తి చక్రమను మహారథము మిక్కిలి ప్రియమైనది. ఈ మూడు రథములును సర్వక్షేత్రమైన శ్రీ పురము యొక్క వరుసలలో నున్నవి. వానియంగస్టదేవతలు సమానము-13 ఆగ్నేయమున అగ్ని కుండము మండుచునుండును. తపించిన యిది గాయత్రిచేతపించినది. అభయము నీచును. -14 కిరణములుగల సూర్యుడుండును. ఆతని తరువాత ఓంకారము యొక్క మందిరముండును. ఓ తాపసా! అగస్త్యా! దేవియే బ్రహ్మస్వరూపిణియైన గాయత్రి కన్నులు గలది కూడను అగును. -15 ఆ తరువాత గంధర్వరాజు, పరిషత్తు(సభ) రుద్రుడు - వోనికి వెనుక భగవతియైన తారాంబిక భాగములుగా నుందురు. -16 చింతామణి గృహరాజముయొక్క రక్షోభాగమును (నైరృత్యమును) ఆశ్రయించి మూడు నామముల మహామంత్రముతో హరి చెప్పబడుచుండును. -17 దానికి ఉత్తరమున నింటినాశ్రయించి మహాగణపతియుండును-18. దానికి ఉత్తరమున పంచాక్షరీ మంత్రమునకు వాచ్యుడైన శివుడుండును-18. ఆ తరువాత మూడక్షరముల మాత్రముననే మృత్యంజయుడైన యీశుడుండును. 'ధారణ' అను పేరుగల సరస్వతి యితనికి ఉత్తరమున నివసించియుండును-19. ఆమె 'అ' కారము మొదలు 'క్ష' కారము వరకు గల - వర్ణములయాకారమునకుమందిరము, ఆమాతృకావర్ణరూపిణీకి ఉత్తరమున ఓవింధ్యగర్వాపహారీ! సంపదేశియు కాలసంకరణీయు శ్రీమహాశంభువు నాథుడుగా గలయామేయు నుందురు. వీరు దేవి యొక్క యావిర్భావమునకు కారణమైనవారు -21. శ్రీ పరాంబ, విశదజ్యోత, నిర్మల విగ్రహ-వీరు ఉత్తరోత్తరముగా (పూర్వపూర్వులకు ఉత్తరోత్తముగా) భవనములనేర్పరచుకొని యుందురు-22. బాల, అన్నపూర్ణ, హయారూఢ, శ్రీపాదుక - ఈ నలువురును పూర్వపూర్వులకు ఉత్తరోత్తరదిశల వైపుననే మందిరములు గలవారు-23 చింతామణి గృహరాజమునకు వాయవ్య భూమిలోని పర్వతము నుండి పద్మాటవీలో మాత్రము తక్కిన దేవతలు తమమందిరముల నేర్పరచుకొన్నారు-24. ఉన్మత్త భైరవీ, స్వప్నవారాహిక, పరమైన తిరస్కరణీకాంబ, పంచమి-25. వీరు తూర్పువైపున మందిరముల నేర్పరచుకొని మహోదయ మునందియున్న దేవులు. మహాదేవియైన శ్రీ పూర్తి శ్రీమహాపాదుక-26. వీరిరువురు తూర్పున మందిరము నిర్మించుకొన్న ఉత్తమ దేవతలు. శంకరునిచే షడామ్నాయసాగరమున జెప్పబడిన విద్యలన్నీయు మహాపద్మాటవీస్థలమున నున్నవి. -27 ఈ విధముగా శ్రీదేవి యొక్క కిరణముల వంటి శక్తుల పంక్తి యొక్క మణినిర్మిత మహాగృహములు గలవు. అవి ఓ మునీ!ఎత్తైన ధ్వజములు (జండాలు) గలవి. ఎత్తైన భవనములుగలవి. మెట్లుగలవి-28. ఇవి ఓమునీ! చింతామణి గృహరాజము యొక్క తూర్పు ద్వారమున గలవు. దక్షిణమున తూర్పు వైపున మంత్రీనాథయొక్క మహాభవనముగలదు -29 ఎడమభాగమున రత్న నిర్మితమైన దండనాథాభవనము గలదు. అర్ఘ్యస్థానమునకు పూర్వము -30 బ్రహ్మ విష్ణువు మహేశ్వరులయొక్క భవనముగలదు. అదీ రత్నకాంతులతో దిక్కులన్నింటిని వెలిగింప జేసినది. ఈ దేవతలందరు లలితాభక్తి నీండినవారు, లలితా మంత్రమును జపించువారు. శ్రీదేవిని ఉపాసింతురు. -31 ముందుజెప్పిన యర్యస్థానము, ముందుజెప్పిన యర్యకల్పనమును దక్షిణాది ద్వారములందంతట సమానమనబడినది-32. ఓ మహామునీ! ఇక చింతామణి గృహమును జెప్పెదనువినుము. అది శ్రీపటన మధ్యనున్నది. రెండుయోజనముల విస్తారముగలది-38. దానికి ఒక క్రోశము విస్తారముగల చింతామణిమయమైన గోడ. గలదు. అదీ చింతామణి శిలలతోను పైకప్పులతోను కప్పబడినది. -34 కూటరూపమున అచటచటను నెతైనది ఇంటిగోడయునట్లే నాలుగుయోజనములయెత్తైనది. దాని యొక్క భూమి యిరువదియోజనముల యొతైనది. ఆ పైన పొట్టిగాను లావుగాను ఉన్న మకుటముల (కిరీటములతో బ్రకాశించినదీ-36. ఓ మునీ! ఆ మకుటములు ఇచ్చా -క్రియా - జ్ఞాన రూపములు. అవి చింతామణిమయములై యెల్లపుడు వెలుగుచుండును-37. చింతామణి గృహమున సమస్తము చింతామణిమయమనబడినది. దానీద్వారములు నాలుగు. కోసున్నర పరిమాణము గలవి-38 ద్వారముల విస్తారము కోసుంపావు. చింతామణి గృహాంతరమున నన్ని ద్వారములలో -39. ఎఱ్ఱని సింధువువలె లలితాదేవి మూర్తి కప్ప బడియున్నది. అదీ వేలబాలసూర్యుల కాంతిగలది. చంద్రుని వలె చల్లనైనది. మాటి మాటికి ప్రవాహరూపమున ప్రసరించుచున్నది-40. తూర్పు ద్వారము పూర్వామ్నాయమయముగా చెప్పబడినది. దక్షిణ ద్వారము దక్షిణామ్నాయ లక్షణముగాలది-41. పశ్చిమ ద్వారదేశము పశ్చిమామ్నాయ లక్షణముగలది. ఉత్తరద్వార దేశము ఉత్తరామ్నాయ లక్షణముగలది -42. గృహరాజమధ్యలో గోడలో బిగించిన దండములతో పొదిగినవై బ్రకాశించు రత్నప్రదీపములున్నవి. అవి కోటి సూర్య సమానకాంతులు గలవి. అవి యంతటను ఉండి భవనము లోపలి భాగమునంతయు బ్రకాశింపజేయుచున్నవి-43. ఈ చింతామణి గృహము యొక్క గొప్పనైన మధ్యస్థానమున వేదికాభాగమున ఎతైనదై మహత్తరమైన బిందు చక్రముగలదు-44, చింతామణి గృహము యొక్క యెత్తైన గోడకును బిందువు (చక్రము)నకును మధ్య భూమి గలదు. అదీ గోడ యొక్క కోసును వదలి మూడు కోసుల పరిమాణముగలదీ-45, -అచట మూడుకోసుల స్థానమున అణిమాదులు తమ కాంతీలో ట్రకాశించును. ఆమూడుకోసుల మొత్తము మూరల కొలతలో ఇరువది నాలుగువేల మూరలదీయనబడును-46. బిందు పీరేశ పర్యంతము విభాగమున పదునాలుగు మూరలు మధ్యలో విభాగము జేసినచో మూరల సంఖ్యను జెప్పెదను-41. పద్మాటవీస్థలము నుండి చింతామణికి. గృహ మధ్యవరకు ఓ మునీ! ఇరువది మూరల యెత్తైనది. అట అణిమాదులుండును-48. అణిమలోని విస్తారము, పదునారు వందల మూరలు. నల్వమనగా నన్నూరు మూరలు. కిష్కు అనగా మూరయనబడును-49. అట మధ్యలో అడీమాదులు (అణిమ మొదలగు శక్తులు). తూర్పు మొదలుగామందిరముల నిర్మించుకొనిరి. అణిమ మహిమ, లఘిమ, గరిమ, ఈశిత్వము, వశిత్వము, ప్రాకామ్యము, ముక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ అనునవి ఉత్తమములైన సిద్ధులు -51. రససిద్ధి, మోక్ష సిద్ధి, బలసిద్ధి, ఖడ్గ సిద్ధి, పాదుకాసిద్ధి, అంజన, సిద్ది-52. వాక్సిద్ధి, లోకసిద్ధి, దేహసిద్ధి, ఇవి యెనిమిది (?) సిద్ధులు. తక్కిన యోగీసంమతములైనవి పెక్కులు-53. ఓ మునీ! అచట అణిమాదుల మధ్యన కోట్ల కొలది సిద్ధులు పరమేశ్వరి చుట్టును సేవింతురు-54 కొంగొత్త యందాల నింపుకొని, చిరునవ్వు ముఖకమలముగలిగి, వెలిగెడి చింతామణులు చేతిలోగలిగి, నిత్యము పదునారేండ్ల ప్రాయపువారై, మిక్కిలి యుదారమైన ప్రకృతులు గలవారై శక్తులు మదముతో క్రీడింతురు-55, అయణిమాదుల మధ్యకు పైన సుమనోహరమైనదియు, ఇరువదీ మూరలయెత్తైనదీయు, పదునారువందల మూరల విస్తారమైనదియు-56. నలుదెసల మెట్ల పంక్తులతో మిక్కిలి మనోహరమైనదియునైన బ్రహ్మాదుల యాకాశభవనముండును, అటనుండు దేవతలను వినుము-57. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి. ఏడవయామె చాముండ, ఎనిమిదవది మహాలక్ష్మి వీరు అచట తమ భవనముల నిర్మించుకొనిరి. -58. నానా విధాయుధములుగల వారును, నానాశక్తుల రక్షణ కవచముగల వారును నైన వీరు తూరుపు - దక్షిణము - పశ్చిమము - ఉత్తరము - ఈ వరుసలో మందిరముల నిర్మించుకొన్నారు-59, ఓ యగస్త్యా! తరువాత, బ్రాహ్మి మధ్యన బానిపై యిరువది మూరలు ఎత్తుగా వంగినదీయు, పదునారుమూరల. విస్తారము గలదియునై మూడు విధములైన ముద్రాంతరముగలదు. అచట ముద్రలు (శక్తులు) తమ నివాసములనేర్పరచుకొన్నవీ-60), - సంక్షోభిణి, ద్రావణీ, కర్షణీ, వశ్య, ఉన్మాదిని, మహాంకుశ, ఖేచరి, బీజయోని, త్రిఖండ, దశమి-61. ఇవి తూరుపు దక్షిణము మొదలగు వరుసలో దశదిక్కులలో ప్రతిష్టింపబడినవి. ఆ ముద్రశక్తులు మిక్కిలి సుందరమైన యాకారములు గలవారు, నవయౌవనముచే వివశలు-62 మనోహరమైనకాంతుల గృహములోనంతటను నింపుచు. ఓ మునిశ్రేషా! లలితా పరమేశ్వరిని సేవింతురు-63. మూడింటి (?) మధ్యన త్రైలోక్య మోహనమైన చక్రము గలదు. ఈ శక్తులలో ' ఆ ప్రకటింపబడిన యాధిపత్యములు గల శక్తులు ఉన్నారు (?)-64. వీరికి అధిష్ఠాత్రి త్రిపుర చక్రనాయక. ఆమె యా చక్రమును పాలించునది. ముద్రాసంక్షోభణ స్వరూపిణి-65. ఇక ముద్రాంతరము యొక్క పైన నిత్యాకలాంతరము చెప్పబడినది, అది యిరువది మూరల యెత్తైనది. పదునారు మూరల విస్తారము గలది. పర్వతమే యుత్తరోత్తర సోపానమని తలపబడినది. -66. ఆ నీత్యాకలామధ్యన కామముస్తాకర్షించువారు, సుఖస్వరూపిణులు, చుట్టును స్థితి నేర్పరచుకొన్నవారునైన షోడశ కళా స్వరూపిణులు-67. వారు చల్లని యమృత ప్రవాహములచే దిక్చక్రమును తృప్తి చెందింతురు. ఓ యగస్త్య మునీ! వారి నామములను నేను జెప్పెద వినుము-68. కామాకర్షణీకయైన నిత్యమైన కళ, అద్ద్యాకరణికమైన, నిత్యమైన కళ, రసాకర్షణీకయై నిత్యయైన కళ, గంధాకరడికయై నీత్యయైన కళ, స్కృత్యాకరణికమై నిత్యయైన కళ, నామాకర్షణికమై నిత్యయైన కళ-70. బీజాకర్షణికమై నిత్యయైన కళ, అర్ణాకర్షణీకయై నిత్యయైన కళ, అమృతాకర్షణికమై నిత్యయైన కళ, శరీరాకర్షణీకయై నిత్యమైన కళ-71. ఈ యేడుగురు యోగీనులు. త్రిపురేశ్వరీ మాత్రము చక్రిణి. సర్వాశా పరిపూరకయను. చక్రమునకధిష్టాన దేవత-72. ఈ చక్రమున పాలకురాలు. ద్రావణికయనబడు ముద్ర. నిత్యాకలాంతరమునకు పైన అతిసుందరమైన భవనము గలదు. అది యిరువది మూరల యెత్తైనది. పదునారు వందల మూరల విస్తారము గలది. పూర్వము వలెనే మెట్లతో గూడినది. దానిపేరు సర్వసంక్షోభము-74. అచట ఎనమండుగురు శక్తులున్నారు. వారు తీవ్ర మదముచే నెఱనైన కండ్లు గలవారు. నవయౌవనముచే మత్తెక్కిన వారైనను పరమేశ్వరిని సేవింతురు-75. కుసుమ, మేఖల, మదన మదనాతుర, రేఖ, వేగిని, అంకుశ, మాలిని - వీరినమండుగురు. శక్తులు-76, వారి కోట్ల కొలదీ పరివారములు అనంగ మొదలైన వారు. ఇది సర్వ సంక్షోభణమను చక్రము. దాని యధీదేవత-77. సుందరియను పేరు గలదని తెలియవలెను. ఆమె పేరుతో మిక్కిలి నిగూఢమైనది. ఆమె చక్రమును పాలించునది. కరణీకయను ముద్రయనబడినది. -78. ఓ మునీ! అనంగ శక్యంతరము యొక్క పైన ఇరువది మూరల యెత్తైనదియు, పదునారు వందల మూరల విస్తారము గలదు. అది సర్వ సౌభాగ్యదాయకము-79. అచటి సర్వ సంక్షోభిణి మొదలగు శక్తులు ఉద్దతలై పదునలుగురు ఉందురు. పార్టీ పేరులను నేను జెప్పెద వినుము-80. సర్వ సంక్షోభిణీ శక్తి, సర్వ విద్రావిడీ శక్తి, సర్వాకర్షిణికా శక్తి, సర్వాహోదనికా శక్తి,-81. సర్వసంమోహినీ శక్తి, సర్వ స్తంభన శక్తి, సర్వజృంభణికా, శక్తి, సర్వ వశంకరీ. శక్తి-82. సర్వరంజన శక్తి, సర్వోన్మాదన శక్తి, సర్వార్థసాధికా శక్తి, సర్వసంపత్తిపూరిణీశక్తి-63. సర్వమంత్రమయీ శక్తి, సర్వద్వంద్వక్షయంకరీ శక్తి, ఈ శక్తులు సంప్రదాయ నామములు గలవారు. వారు చక్రిణీపురమున నివసించువారు-84. సర్వవశ్యనామముగల ముద్రలు ఆ చక్రమున రక్షించువారుగా జెప్పబడిరి. వారి సేవికలుగా కోట్లకొలది శక్తులుద్దరింపబడిరి-85, ఓ యగస్త్యమునీ! సంక్షోభిణ్యాద్యంతము యొక్క పైన ఇరువది మూరల యెత్తైనది. పదునారు వందల -మూరల విస్తారము గలదియునైన సర్వసిద్ధాదికల మందిరము విష్ట్యమనబడును-66. సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ర్పద, సర్వప్రియంకరీదేవి, సర్వమంగళకారిణి-87. సర్వకామప్రదాదేవి, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణి-88. సర్వాంగసుందరీదేవి, సర్వసౌభాగ్యదాయిని, ఈ దేవులు కళలతో చెక్కబడినవారు. పేరున యోగినులనబడిరి-89. తరువాత చక్రిణియనియు శ్రీ యనియు తెలియవలెను. చక్రము సర్వార్థములను సాధించునది. సర్వోన్మాదనముద్రలు చక్రమును పరిపాలించువారు-90. ఓ యగస్త్య మునీ! సర్వసిద్ద్యాద్యంతరము యొక్క పైన యిరువది మూరల యెత్తెనదీయు, పదునారు మూరల విస్తారము. గలదియునైన సర్వజ్ఞాద్యంతరమనునది గలదు. అది సర్వరక్షాకరచక్రము-91, మిక్కిలి గొప్పది. దివ్యమైనది. సర్వజ్ఞాదులు శక్తులుగా జెప్పబడిరి. -92. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశిని-93. సర్వాధారస్వరూప, సర్వపాపహరి, సర్వానందమయీదేవి, సర్వరక్షాస్వరూపిణి-94. సర్వేప్సితప్రద, వీరు గర్వములేని యోగినీశ్వరులు-95. మాలిని, చక్రిణి, సర్వమహాంకుశముద్రలుగజేప్పబడిరి. ఈ విధముగా చింతామణి గృహమున సర్వజ్ఞాద్యంతరమువరకు కొన్ని చక్రములు చెప్పబడినవి. ఓ మునీ! తక్కిన వానిని గూడ వినుము-96.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యామున చింతామణిగృహాంతరకథనమను ముప్పదియాఱవ యధ్యాయము 36.