బ్రహ్మాండ మహా పురాణము
26 - లింగోత్పత్తి కథసమ్
ఋషులిట్లనిరి :
మహాదేవుని యొక్క మాహాత్మ్యమును, మహాత్ముఁడైన యతని ప్రభుత్వమును, ఆతని యైశ్వర్య గుణముల యొక్క విస్తరమును మేము వినఁగోరుచున్నాము.
సూతుఁడిట్లనెను :
పూర్వము త్రిలోకాధిపతియు మహాశౌర్యవంతుఁడునగు బలిని బంధించి, త్రైలోక్య విజయ సమయమున విష్ణునిచేనిది చెప్పఁబడినది. దైత్యులు నాశము చేందిరి; ఇంద్రుఁడు ప్రహృష్ణుఁడయ్యెను. అంత దేవతలందరు సనాతనుఁడయిన ప్రభువును దర్శించుటకు వెళ్లిరి. విశ్వ రూపాత్ముఁడయిన ప్రభువు క్షీరోదధిసమీపమున నుండ దేవతలందరచ్చటీకరిగిరి. సిద్దులు, బ్రహ్మరులు, యక్షులు, గంధర్వులు, అప్సర సమూహములు, వాగులు, దేవర్పులు, నదులు, సర్వపర్వతములు; మహాత్ముఁడు పురుషుడైన హరిని చేరి స్తోత్రము చేసిరి. (5) “నీవే ధాతవు. (సర్వమున కాధారుఁడవు); నీవేకర్తవు; ఓ ప్రభూ ! నీవే లోకమును సృజింతువు. నీ ప్రసాదము వలన మూఁడు లోకములు అవ్యయమైన కళ్యాణమును పొందినవి. (6) నీచే రాక్షసులందరు జయింపఁబడిరి. బలి బంధితుఁడయ్యెను.’ అనీ సురలచే, సిద్దులచే, పరమరులచే విష్ణువు స్తుతింపఁబడి; ఆ దేవతలందరి గూర్చి పురుషోత్తముఁడు ప్రత్యుత్తరమిచ్చెను. “ఓ సుర సత్తములారా ! కారణమును చెప్పెదను వినుఁడు, (8) ఎవఁడు సర్వభూతములకు స్రష్టయో, ఎవ్వఁడు కాలుడో, ఎవ్వడు కాలకరుడైన ప్రభువో, ఎవనిచేత నీ ప్రపంచములు బ్రహ్మతో సహా నేనును మాయచే సృజింపఁబడితిమో ఆతని ప్రసాదము వలన నేను సిద్ధత్వమును పొందితిని. (10) పూర్వము, అవ్యక్తమయిన తమస్సునందు, మూం డు లోకములు నాచే ఆవరింపఁబడినవో (గ్రసింపఁబడినవో), అప్పుడు నేను ఉదరము నందున్న భూతములలో శయనించి యుంటిని. అప్పుడు నాకు సహస్ర శీర్షములు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు.
చేతుల యందు శంఖ చక్ర గదలున్నవి. నేనా స్వచ్ఛమయిన అంభస్సున పండుకొనియుంటిని. అంతలో దూరమున అనంతప్రభ కలిగిన ప్రభువును చూచితిని. ఆ ప్రభువు వంద సూర్యుల కాంతితో సదృశుఁడై యుండెను. స్వకీయమైన తేజస్సుచే జ్వలించుచుండెను; ఆతనికి నాలుగు ముఖములు. మహా యోగ ప్రభాకలితుఁడు; మహా పురుషుఁడు. కాంచన ప్రభా ప్రకాశితుఁడు. కృష్ణాజినమును ధరించెను; కమండలుపు కలిగియుండెను; అట్టి దివ్య ప్రభువును పురుషోత్తముని నిమేషాంతర మాత్రమున చేరితిని. సర్వలోక నమస్కృతుఁడయిన బ్రహ్మ నాతో నిట్లనెను “నీ వెవ్వఁడవు? ఎక్కడ నుండి వచ్చితివి? ఇందెందులకుంటివి. నాకు చెప్పుము” నేను లోకమునకు కర్తను, స్వయం భువుఁడును; నేను సర్వతోముఖుఁడును. బ్రహ్మచే నీట్లు చెప్పఁబడి నేనీట్లు సమాధాన మిచ్చితిని. నేనీ లోకములకు కర్తను. అంతియేకాదు ప్రతి ప్రళయమున మాటి మాటికీ నేను సంహర్తను కూడ. ఒండొరులను జయించవలయునను నభిలాషతో ఇట్లు మేమిర్వురము సంభాషించుకొనుచుండ ఉత్తర దిశనంటి జాజ్వల్యమానమైన యొక జ్వాలను చూచితిమి. ఆ జ్వాలను చూచి ఓ అనఘులారా ! మేమిర్వురమాశ్చర్య పడితిమీ. శర్వ సంబంధమైన జ్యోతికి తేజస్సుచే బలముచే అంజలి బద్దులమయితిమి. పరమాద్భుతముగా వృద్ధి పొందుచున్నయా జ్యోతిని మేము చూచితిమి. (19) అదీ అత్యంత విచిత్రముగా నున్నది వెంటనే నేను బ్రహ్మయును ఆ జ్వాలాభిముఖముగా తొందరగా నరిగితీమి. ఆ మండలాకారముగ నున్న జ్వాలావలయము, భూమిని స్వర్గమును నిర్భేదించికొని నిలిచియుండెను. (20) ఆ జ్వాల యొక్క మధ్యమునందు అత్యంత ప్రభావంతనుయినది, ప్రాదేశ మాత్రమున్నట్టిది, పరమదీప్తిమంతము, అవ్యక్తమునైటీ లింగమును మేమిర్వురము చూచితిమి. ఆ లింగము యొక్క మధ్యభాగమున కాంచనము. లేదు, వెండిలేదు శైల సంబంధములేదు. అది అనిర్దేశ్యముగా నున్నది. ఊహించుటకు వీలుకానట్టిది. అది పునః పునః కనబడుచు కనబడకయున్నది. అది జ్వాలామాలల సహస్రముతో గూడియున్నది. విస్మయముగా అద్భుతముగా నున్నది. గొప్ప తేజస్సుచేయుక్తమయి అత్యంతము వృద్ధి పొందుచున్నది. (23)
జ్వాలామాలలు సర్వత్ర వ్యాప్తమైయున్నవి, సర్వ జీవలోకమునకు భయోత్పాదకముగ నున్నది. భయంకరమైన ఘోరరూపముతో అత్యంతము భూమ్యాకాశముల మధ్య భాగమును పగులగొట్టుచున్నట్టున్నది. (24) అంత బ్రహ్మ నాతోనిట్లనెను. “నీవు వెంటనే పాతాళ లోకమునకు (అధో లోకమునకు) అరుగుము. మహాత్ముఁడైన లింగము యొక్క అంతమును తెలిసికొందము. నేనో ఆతని యంత్యము కనబడువరకు ఊర్థ్వలోకమున కరిగెదను.” అట్లు నియమము చేసికొనిరి. ఆతఁడూర్వమున కరిగెను నేనో అధోలోకమున కరిగితినీ. తరువాత ఒక వేయి సంవత్సరము లధోలోకమున కరిగితిని ఆతని యొక్క అంతమును చూడలేదు. అంతనేను భీతుఁడనయితినీ ఆ విధముగనే బ్రహ్మ ఊర్థ్వమున కరిగెను. ఆతనీ యొక్క అంతమును పొందలేకపోయెను. అంత ఆతఁడును నాతో కూడ మహా సముద్రోదకమున సమాగతుఁడయ్యెను. ఆ మహాత్ముని గూర్చి మేమీరువురము విస్మయమును పొందితిమి. భయపడితిమి. ఆ మహాత్ముని వలన మోహితులమయితీమి. చైతన్యమును పోగొట్టుకొంటిమి. నష్ట సంజ్ఞుల మయితిమి. అంత సర్వతోముఖుఁడు లోకముల యొక్క పుట్టుకకు నాశనమునకును ప్రభువు, అవ్యయుఁడునయిన ఈశ్వరుని గూర్చి ధ్యానరతులమయితీమి. భక్తితో అంజలినిబట్టి శర్వునకు, శూలికీ, మహాభైరవ నాదునకు, భీమరూపునకు, దంష్టలు కలిగినవానికి, అవ్యక్తునకు, మహాత్మునకు నమస్కార మొనర్చితిమీ. ఓ లోకేశ, సురేశ, ఓ దేవ నీకు నమస్కారము, ఓ మహాత్మా, ఓ భూతపతీ నీకు నమస్కారము. ఓ శాశ్వతుఁడా ఓ సిద్దయోగీ నీకు నమస్కారము. సర్వప్రపంచ ప్రతిష్ఠితుఁడవయిన నీకు నమస్కారము. నీవు పరమేష్ఠివి, పరబ్రహ్మవు; నీవు అక్షరుఁడవు; నీవే పరమపదుఁడవు; నీవే జ్యేష్ఠుఁడవు; నీవే రుద్రుఁడవు. స్కందుడవు, శివుఁడవు; నీవే యజ్ఞము; నీవే వషట్కారము; ఓంకారము నీవు; పరంతపుఁడవు నీవు; నీవు స్వాహాకారుఁడవు, సర్వసంస్కారములు నీవు;
స్వధాకారుఁడవు నీవు, ప్రతములు, నియమములు, నీవు, వేదములు, లోకములు, దేవతలు నీవే భగవానుఁడవు. నీవే సర్వస్వము. నీవు ఆకాశము యొక్క శబ్దమవు; నీవే భూతములకు ప్రభవస్థానము, సాశన స్థానము. భూమి యందలి గంధ లక్షణము నీవు, జలముల యందు రస లక్షణము నీవు, తేజోరూపము నీవు; మహేశ్వరుఁడవు. వాయువునందలి స్పర్శగుణము నీవు; దేవతల కధిపతివి; నీవే చంద్రుని శరీరమవు; నీవే మనస్సునందలి బుద్ధివి (జ్ఞానమవు). ప్రకృతికి బీజమునీవు; సర్వలోక సంహర్తవు నీవు, మృత్యు సదృశుఁడవయిన కాలుఁడవు నీవు; మృత్యువు నీనామాంతరము. నీవే మూఁడు లోకములను భరింతువు (ధరింతువు). ఓ ప్రభూ! నీవే యీ లోకముల సృష్టింతువు; నీవు నీ పూర్వదీశాముఖముతో నింద్రుని రూపము వహింతువు; దక్షిణ ముఖముతో ప్రపంచముల నన్నింటిని సంక్షేపము చేసెదవు. నాశనము చేయుదువు. (40) నీవు పశ్చిమ వక్రముతో వరుణుఁడవు (వరుణుని కలవాఁడవు) సంశయము లేదు. ఓ దేవతా సత్తమ ! ఉత్తర వక్రముచే సోముఁడవు నీవు. ఓ దేవ ! నీవు ఒక్కమారు, బహుమారుల, లోకములకు సష్టవు. అంతియేకాదు అంతకుఁడవు కూడ. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుత్తులు అశ్వినులు, సాధ్యులు, విద్యాధరులు, నాగులు, చారణులు, తపస్యులు, వాలఖిల్యులు మరియు తపస్సాచరించిన సుప్రతులైన మహాత్ములు, సిద్ధులు వీరందరు, ఓ దేవేశ ! నీవలన జన్మించిరి; వీరేకాక నియత ప్రతులెందరో ప్రసూతులయిరి. ఉమ, సీత, సినీవాలి, కుహు గాయత్రి, లక్ష్మి, కీర్తి, ధృతి, మేధ, లజ్జ, కాంతి, వసువు, స్వధ, తుష్టి, పుష్టి, క్రీయా, పోచాందేవియైన సరస్వతి, సంధ్య, రాత్రి ఓ దేవేశ నీ నుండీయే ప్రసూతులు. అయుత సంఖ్యలో (పదివేల) సూర్యుల యొక్క అయుత సంఖ్యా మూర్తుల యొక్క ప్రభావము కలవాఁడా ! వేయి చంద్రుల యొక్క గౌరవర్ణము కలహం డా! నీకు నమస్కారము. వజ్రమును పినాకమును ధరించినవాఁడా ! నీకు నమస్కారము.
బాణములను వింటినీ చేతియందు ధరించినవాఁడా నీకు నమస్కారము. భస్మముచే వీభూషితాంగ ! నీకు నమస్కారము. మన్మథ శరీరమును నాశనము చేసినవాఁడా ! నీకు నమస్కారము. ఓ. హిరణ్యగర్బ ! నీకు నమస్కారము. ఓ హిరణ్యవస్త్ర ! నీకు నమస్కారము. ఓదేవ! హిరణ్యయోనీ ! నీకు నమస్కారము. బంగారు నాభి కలిగిన ఓ దేవ! నీకు నమస్కారము. హిరణ్య రేతస్సు గలిగిన ఓ దేవ ! నీకు నమస్కారము. సహస్ర నేత్రములతోడి అద్భుత పురుషా ! నీకు నమస్కారము. (48) ఓ హిరణ్యవర్ణా ! నీకు నమస్కారము. బంగారు కేశములు కలవాడా! నీకు నమస్కారము. ఓ హిరణ్యవీర (ఉత్తమ శౌర్యము కలవాఁడా) నీకు నమస్కారము. బంగారు ప్రదానము చేయు ఓ దేవా ! నీకు నమస్కారము. (49) ఓ హిరణ్యనాథ ! నీకు నమస్కారము. హిరణ్య నాదము (ధ్వని) కలిగినవాడా ! నీకు నమస్కారము. ఓ పినాకము పాణియందు కలవాఁడా! ఓ దేవ ! నీకు నమస్కారము. ఓ శంకర ! ఓ నీలకంఠ ! నీకు నమస్కారము. (50) ఈ విధముగా స్తోత్రము చేయబడుచున్నవాఁడై, మహామతి, దేవదేవుఁడు, జగద్యోని, సూర్యకోటిసమప్రభావంతుఁడునయిన ఈశ్వరుఁడు వ్యక్తుఁడయ్యెను. ప్రత్యక్తీకరించేను. మహాదేవుఁడు, మహాద్యుతి మంతుఁడు, దయాయుక్తుఁడై వక్షకోటి సహస్రముచే ఆకాశమును మ్రింగుచున్న వానీవోలె పలికెను. (52) శంఖము వంటి కంఠము కలవాఁడు, సుజఠరుఁడు, సోనాభూషణభూషితుఁడు, విచిత్రమైన అవయవములు కలవాఁడు, నానా విధములయిన మాలలను శరీరగంధ లేపనములను ధరించినవాఁడు, పినాకపాణి, త్రిశూలధారి, దేవతాపూజ్యుఁడునయిన భగవంతుఁడు, సర్పయజ్ఞోపవీతములు కలవాఁడు, దేవతల కభయంకరుఁడుననైన శంకరుఁడు, దందుభిధ్వానముతో సమానమయిన హోషముతో, మేఘగర్జన తుల్యమైన యొక హాసము చేసెను. ఆ మహా సనాదముతో సర్వజగత్తు నీండిపోయెను.
ఆ మహాత్ముని శబ్దముచే మేమిర్వురము భయపడితిమి. అంత మహాదేవుడిట్లనెను. “దేవతాశ్రేష్ఠులారా ! ప్రీతుఁడనయితిని. మహా యోగశక్తిని మీరిరువురును చూడుఁడు; మీరు భయమును విడువుఁడు, మీరిరువురు సనాతనులు; సో యవయవముల నుండి పూర్వము మీరు జన్మించితిరి. లోకపితామహుఁడయిన బ్రహ్మ, సో దక్షిణ బాహువు. యుద్దము నందెన్నడును పరాజయము చెందని యీ విష్ణువు నా వామ బాహువు. మీయిర్వురీ వలన మిక్కిలి ప్రీతుఁడనయితిని. మీకు యథేస్సితమయిన వరమును నేనొసంగెదను. అంత హృదయముల యందు ప్రహృష్ణులమైతిమి. మహాదేవుని పాదములకు నమస్కరించితిమి. ప్రసన్నముగా నభిముఖుఁడైయున్న మహాదేవునితో మేమిరువరమిట్లంటిమీ. “ఓసురేశ్వర! నీవు మా యందు ప్రీతిమంతుఁడవై మాకు వరమీయఁదలంచినచో మేము నీయందేల్లప్పుఁడు భక్తితో ముందుము గాక దేవదేవుఁడిట్లనెను. తథాస్తు. ఓ మహాభోగులారా ! ప్రజలను విపులముగా సృజిపుడు”. ఇట్లు పలీకి భగవానుఁడచ్చటనే యంతర్గానుఁడయ్యెను. (61) ధీమంతుఁడయిన దేవదేవుని ప్రభావమిది. మీకు నేను చెప్పితిని. ఇది ఉత్కృష్టమైన జ్ఞానము; అవ్యక్తము; శివనామకము. అయ్యదే సూక్ష్మము; అచింత్యము. దానినీ జ్ఞానచక్షువులు గల వారు దర్శింతురు. దేవాది దేవుఁడయిన యాతనికి నమస్కారము చేయుచున్నాము, మహాదేవ ! నీకు నమస్కారము, మహేశ్వర నీకు నమస్కారము. సూతుఁడిట్లు పలికెను. దీనినీ వినీ దేవతలందరు మహాత్ముఁడయిన శంకరునకు నమస్కరించుచు వారి వారి నిహాసముల కరిగిరి. మహాత్ముఁడయిన యీశ్వరుని యొక్క స్తవము నెవ్వఁడు పఠించునో అతఁడు సర్వకామములను పొందును, పాపముల నుండి విముక్తుఁడగును. (66) ఇదంతయు ప్రభువిష్టుడైన విష్ణువుచే వారికీ మహాప్రభావంతుఁడయిన సనాతనమైన బ్రహ్మను గూర్చి, మహాదేవుని యనుగ్రహమునఁ జెప్పఁబడెను. ఇట్లు మహేశ్వరుని యొక్క బలమును గూర్చి సాచే వర్ణింపఁబడినది.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమందలి పూర్వభాగములోని, ద్వితీయానుషంగ పాదమునలింగోత్పత్తి కథనమును ఇరువది యారవ అధ్యాయము.
Summary of chapter 26 of the Brahmānda Mahā Purana is as follows:
This highly sacred chapter unveils the mystical origin of the Śiva Liṅga, the supreme symbol of the unmanifest and infinite nature of the divine. It narrates the awe-inspiring moment when a blazing pillar of light appeared to dispel cosmic arrogance, establishing the Liṅga as the eternal focal point of devout worship. Through this narrative, the faithful are drawn into the deepest realms of meditation, realizing that the supreme lord is beyond form, yet compassionately accessible through this holy emblem.