బ్రహ్మాండ మహా పురాణము
37 - భార్గవ చరితము
వసిష్ట ఉవాచ :-
వసిష్ఠుఁడిట్లనెను.
ఆశ్చర్యజనకమయిన తదద్భుతమును చూచీ పరశురాముఁడు మగద్వయమును గూర్చి తాను విన్నదంతయు చెప్పెను. కుంభ సంభ వుఁడు, సాక్షాత్ భగవంతుఁడునయిన అగస్త్యర్షి దానిని వినెను. సంతోషచకితుఁడయ్యెను. తనముందు ఆసీనుడయిన పరశురామునితో నిట్లనెను. అగస్త్యుడిట్లనెను.
కార్యాకార్య విచక్షణుడవయిన రామా! మహాభాగ! మినుము. నీకు హితమును చెప్పెదను, సమాహిత మనస్కుఁడవై దాని నాచరింపుము, ఇచ్చట నుండి బహుదూరములో సుదుర్లభమయిన శిషుని యొక్క సుమహత్స్థానమున్నది. అచ్చటనే సుమహాత్ముడయిన విష్ణునిచే న్యస్తములయిన పాదములు కనిపించును. బలిచక్రవర్తిని నిగ్రహించునప్పుడు మహాత్ముఁడయిన వామనుడు తన పాదములచే సర్వలోకముల. నాక్రమించెను. ఆతని పదాగ్రము నుండి 'గంగ' యచ్చటనే సముద్భూతమయ్యెను. అచ్చటికి వెడలుము. ఇతర చింతయేదియు మనస్సున లేకుండ మన స్సమాధియుతుఁడవై నీయమ పూర్వకముగా, నియమితాహారివై ఒకమాసమీమంత్రమును పఠింపుము. శత్రువుల నీగ్రహణము కోటకు, సిద్ది కోరి, పూర్వము నీచే నే కవచమభ్యస్తమో యయ్యది నీకు సిద్ధిదమగును.
వసిష్ఠుఁడిట్లనెను.
అగస్త్యుఁడిట్లు చెప్పగా శత్రునిబర్హణుఁడయిన రాముఁడు పరమ శాంతుఁడయిన మునికి నమస్కరించి, ఆశ్రమము నుండి బయటి కరిగెను. మఱల పూర్వము వచ్చిన మార్గము నంటియే పోయి రాముఁడు, విష్ణునీ తుదీపదము నుండి, స్వర్నదియైన గంగ యెందు బయలు వెడలెనో ఆ ప్రదేశమును వెంటనే చేరుకొనెను. అచ్చట వాసమును అకృతవ్రణునితో సహితము నిర్మించుకొనెను. దీష్యము “కృష్ణ ప్రేమామృత" మను పేరు గలిగిన స్తవమును రాముఁడు అభ్యసింప మొదలీడెను. నిత్యము ప్రజపతియయిన కృష్ణుని స్తోత్రమాచరించెను. హరి సంతుష్టు డయ్యెను. వెంటనే విష్ణువు జమదగ్ని కుమారుఁడయిన రామునికి దర్శన మొసంగెను. చతుర్వ్యూహాధీపతీ, కమలలోచనుఁడు, అర్కవర్ణపు కిరీటము కలిగి, కుండలములు, కౌస్తుభముచే ప్రకాశించు వక్ష స్థలము, కలిగి పీతాంబరుడు, ఘనప్రభాకలితుఁడు మరళీవాదపరుఁడునయిన సాక్షాత్ కృష్ణుఁడు మోహనరూపము దాల్చి ప్రత్యక్షమయ్యెను. ఆతనిని రాముఁడు చూచెను. ముదాన్వితుఁడయ్యెను. వెంటనే పరశు రాముఁడు సమాధి నుండి లేచెను. దండ పత్రమాణమును భూమి యందు సాగిలపడీ చేసెను. ప్రయత్న పూర్వకముగా వీధునీ స్తోత్ర మాచరించెను.
పరశురాముఁడిట్లు స్తోత్రమాచరించెను. ప్రపంచ సృష్టికి కారణ విగ్రహుఁడవు నీకు నమస్కారము. తన్ను చేరిన వారిని రక్షించు పాలకునకు, సర్వార్తి హరునకు, బ్రహ్మ ఇంద్రుఁడు ఈశుండు విష్ణువు మున్నగు వారిచే స్తోత్రము చేయబడువానికి, నిత్య పరమేశ్వరుడయిన వానికి నమస్కారము. ఈశానుఁడు మున్నగు దేవతలు, వివిధ ప్రకారముల వేద వాదములచే నిన్ను నిర్ణయించుటకశక్తులు. నీవజుఁడవు. అనిర్దేశ్యుఁడవు. పురాణం డవు. అనంతుఁడవు. నిన్ను స్తోత్రము చేయుదును, దయాపరుండవు కమ్ము. నిజవాంఛిత ప్రదుఁడవు ఈశుఁడవు నీవొక్కడవే. నానా విధ దేవమనుష్య తిర్యక్సులు, నీటి యందు గల జీవజాలముల వివిధ రూపములును గల భూమి యొక్క భారమును తొలగించుటకు నీవే సమర్థుడవు. భక్త జనాను రక్తుఁడవయిన నిన్ను, లక్ష్యాదుల యందు అత్యంతము విరక్తుడైన వానిని, వ్యభిచార దుష్ట చిత్తులయిన వారి యందు గూడ ప్రేమ నిబద్దమనసుని నిన్ను పూజింతును. ఓ ప్రభూ ! సంతుష్టులయిన అసురులు, సురలు, నరులు, కిన్నరులు, తిర్యక్కులు (పశుపక్ష్యాదులు) అయోని సంభవులు, మొదలగువారు నేను, నాది, నా దేహము అను భావమును సర్వమును పరిత్యజించి యేదేవదేవుని అభీప్సితప్రదునారాధింతురో యట్టి నీకు నమస్కారము. ఇంఛారహితుని, గుణవర్జితుని, అచింత్యుని, అవ్యక్తుని, పాప సమూహముల నాశనము చేయువానిని, ప్రేమనిధనుని, నీన్ను పొందితిని. కోందలు, వివిధములయిన క్లేశపూర్వక నియమములకు స్వదేహమును పాల్పరచెదరు. కొందతో వివిధములయిన యజ్ఞములచే పూజింతురు. కాని, ఓ ప్రభూ ! లౌకిక విషయ నిబద్దవాసనులయిన వారు స్వప్నమున నైనను నిన్ను చూడలేరు. జనన మరణ. సంసార శ్రమ నుండి యెవరు నిర్విజ్ఞచిత్తులై నీయంఫ్రీ పద్మముల సేవింతురో, వారు తరింతురు. ఇతరులను తరింపజేయుదురు. జన్మతరణమునకు అమృత సుధవు నీవే. ఓప్రభూ ! కాపు నిబద్దచిత్తుఁడనైన నేను ఆర్యుఁడవయిన నిన్ను వివిధ ప్రయత్నములతో ఆరాధించుచున్నాను. నీవదీ యెఱుంగుదువు. నీకు ప్రపంచములో ప్రత్యేకముగా నివేదించుకొనవలసినదేమి కలదు?
వసిష్ఠుఁడిట్లనెను.
ఈ విధముగా తన ముందు సాగిలపడి స్తోత్రము చేయుపరశురాముని గూర్చి, మిక్కిలి గభీరమయిన వాక్కులతో ప్రపంచమును తన మాయచే మోహ పెట్టువానివలె కృష్ణుడిట్లనియెను,
ఓ మహాభాగ ! రామ ఉత్తమమయిన నీ కార్యము సిద్ధి పొందుచున్నది. ఆ సిద్ధి కవచము యొక్కయు స్తోత్రము యొక్కయు ప్రభావము వలననీ యెఱుంగుము. గర్వియైన కార్తవీర్యుని నీవు చంపి, నీ తండ్రిదైన వైరమును సాధించుము, ఈ భూమిని నీఃక్షత్రీయముగా జేయుము. నా చక్రము యొక్క యవతారము భూలోకమున కార్తవీర్యుఁడు. ఓ అభిమానవంతుఁడా ! ఓ ద్వీజశ్రేష్ఠ ! నీ కార్యమును ఆతనిని చంపి, నిర్వర్తించినవాఁడవగుము. ఇప్పుడు మొదలుకొని ఈ లోకమున నీవు నీ యంశతో సంచరించెదవు. నీవు యధాకాలము నందు స్వయంకర్తవు, స్వయం హర్తవు. నీవు ప్రభుఁడవు. చతుర్వింశద్యుగమున త్రేతలో చతుర్వ్యూహుఁడను, సనాతనుఁడను నగు నేను రఘువంశమున, దశరథునకు కౌసల్య యందుదయించెదను. అప్పుడు సలక్ష్మణుఁడనై కౌశికుని యజ్ఞమును సంరక్షించి, నేను జనకుని పట్టణమున కరిగెదను. అందు ఆ జనక నగరమున ఈశ్వరుని ధనువును భంజించి విదేహజయయిన సీతను వివాహమాడి, అయోధ్యకరుగుచు ఉన్మదమయిన నీ తేజమును హరించెదను.
తపోనిధియైన జామదగ్ని నీ విధముగా ఆదేశించి, రాముని యొక్క సమక్షముననే కృష్ణుడంతర్థానము నొందెను.
ఇదీ మహాపురాణము, వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరిత్రము నందు ముప్పది యేడవ అధ్యాయము.
Summary of chapter 75 of the Brahmānda Mahā Purana is as follows:
Introducing the divine incarnation Parashurāma, this sublime chapter describes his intense spiritual penance and unwavering devotion toward lord Shiva in the holy Himalayas. It details his rigorous austerities, pure meditation, and ultimate conquest over all physical and mental limitations. The devoted reader is filled with intense awe, observing how divine avatars perform severe penance on earth to teach humanity the path of unyielding dedication.