24 - పరశురాముని తపస్సు, అస్త్రప్రాప్తి

వసిష్ఠుఁడు చెప్పెను.

ఓ భూపాల ! ఈ విధముగా వ్యాధునిచే చెప్పఁబడి, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు, మనస్సుచే నాలోచించి, విమర్శించి, ఆశ్చర్య భరితుఁడై మరల నాతనితో పలికెను.

రాముఁడు పలికెను :

'ఓ మహాభాగ! నీవెవ్వరవో చెప్పఁగోరెదను, నీవు నీజముగా ప్రాకృత పురుషుఁడవు కావు. నీ శరీరమో ఇంద్రుని యొక్క సౌందర్యాను భావముచే సులక్షితమగుచున్నది. నీ సంభాషణము, విచిత్రార్థ పదోధార్య గాంభీర్యాది గుణములచే సర్వజ్ఞుని మనోహర వాణివలె శ్రుతమగుచున్నది. ఆ నీ వాణి విచిత్రార్థయుతపదములతో, ఔదార్యముతో సుస్పష్టతతో, గాంభీర్యముతో మనోజ్ఞము. నీవు ఇంద్రుడవో, అగ్నిహోత్రుఁడవో, యముఁ డవో, బ్రహ్మవో, వరుణుఁడవో, కుబేరుడవో, ఈశానుఁడవో, సూర్యుఁడవో, దాతవో, వాయువవో, చంద్రుడవో, గురుఁడవో, కుమార స్వామివో కాక వేడొకఁడవో అయి యుండుటకు అరుండవు. కాని నీజాతి నాకు హృదయమున శంక గల్లించుచున్నది. నీ అనుభవమో మహోన్నతము. పురుషోత్తముఁడయిన విష్ణువు భగవంతుఁడు మాయావిగా విదితుఁడు. నీవెవ్వఁడవు? ఈ శరీరముతో నన్ను చేరితివి. చెప్పుము. (6) అటుకాక - నీవు జగన్నాథుఁడవు, సర్వజ్ఞుఁడవు, పరమేశ్వరుఁడవు, పరమాత్ముఁడవు, ఆత్మ సంభూతుఁడవు, శాశ్వతుఁడవునయిన ఆత్మా రాముఁడవు, సనాతనుఁడవు. యథేచ్చగా సంచరించువాఁడవు, భగవాన్ శ్రీవుఁడవు, సర్వజగన్మయుఁడవు, అయి ఈ శరీరముతో సంయుక్తుఁడవై యుండుటకు అర్జుఁడవు, (8) అట్టి వానికి కాక, వేతోకని కెవ్వనీకి ఈ ప్రపంచములో ప్రభావాను గతమయిన ఈ దృగ్విధమయిన జన్మ కలుగదు. నీవాణీ సంపద జాత్యర్థ సౌష్టవోదార్యశాలిని. భక్తవాత్సల్యము వలననే హరుఁడిట్టి వపువుతో దోచెనని నేను భావింతును. నీవు ప్రత్యక్షముగా నన్ను పరీక్ష చేయుటకు వచ్చియుంటివి. సందేహము లేదు. నీవు కేవలము కిరాతుఁడవుగావు వ్యాధుఁడవు కావు. ఆ కిరాతులకిట్టీ విధమైన ఆకృతి యెక్కడిది? అందుచే నీకు నమస్కరించుచున్నాను. భవత్సురూపమును ప్రదర్శించుము. () మహిమానుగుణమైన నీరూపము నావిష్కరీంచుము. ప్రసన్నుం డవు కమ్ము. తన్మూలమున మనస్సంబంధమయన యనేక శంకలు నిర్ముక్తములగును. ప్రసన్నుఁడవు కమ్ము, ఇప్పుడే నా బుద్దీమోహమును సర్వమును, నీ స్వరూప గ్రహణము చేతనే కేవలము సర్వనాశనము చేయుము. ఓ మహాభాగ ! అనేక మారులు శిరస్సువంచి ప్రణామ మాచరించి, నిన్ను ప్రార్ధించుచున్నాను. నీవ్వెఁడవు? నీన్ను వ్యక్తము చేయుము. ఇదిగో చేతులు జోడించి వినయముతో నిలబడితిని.

            అని పలికి, భృగు వంశోద్వహుఁడయి రాముఁడు ఆతని గూర్చి తెలిసికొనఁగోరి అచ్చటనే నేలపై కూర్చుండి, సమాహిత మనస్కుడై ధ్యాన నిమగ్నుఁడాయెను. పద్మాసనము ప్రచుకొనీ, మునియై, వాక్కాయమానసములను నియమించుకోనీ, వాయు సంచారమును నిరోధించి (ప్రాణాయామము వహించి) అత్యధికమయిన మనఃకేంద్రీకరణముతో ధ్యానమున నిమగ్నుఁడయ్యెను. ఇంద్రియ సమూహమును ఆతఁడు నీయమీంచెను. మనస్సును హృదయమున నిరోధించెను. ధ్యాన దృష్టి వహించి, జగద్గురుఁడయిన దేవదేవేశుని ధ్యానము చేసెను. ఆ ధ్యానసమాధిలో రాముఁడు, ఆత్మయందు సంధించిన చక్షువుతో (అంతర్మక్కయి) తన భక్తుల యందు ననుగ్రహము చూపువానిని, మృగవ్యాధ రూపమున నున్న జగన్నాథుని చూచెను. అంత కన్నులు తెరచెను. భార్గవ రాముడు వెంటనే లేచెను. ఆ రూపము శరీరముతో నున్న దేవుని తన ముందున్నవానిని రాముఁడు చూచెను. తనను గ్రడహించుట కొఱకు భక్తవత్సలుడు, శరణ్యుఁడు, ఆవిర్భవించియున్న వానినీ సంభ్రమముతో రాముడు చూచెను. రోమాంచోదిన్న సర్వాంగుఁడయ్యెను. సంతోషాశ్రువులచే నిండిన నేత్రుఁడయ్యెను. అంత వెంటనే ఆ మహామతి రాముఁడు, భక్తితో, ఆ వ్యాధుని పాదముల యందు భూమి పైపడి నమస్కరించెను. డగుత్తికలో సంభ్రమాకులమయిన పల్ములతో, ఓ భవ శరణు, శర్వ! శరణు, శంకర! శరణు అని అనేకమార రాముఁడు స్తోత్రము చేసెను. అంత స్వరూపమును ధరించిన శంభువు, ఆతని భక్తికి సంతోషించినవాఁడై, భూమీపై. ప్రణామావనతుఁడైన రాముని లేవనెత్తాను. తన చేతులతో జగద్భర్తచే లేవనెత్తబడి భృగూద్వహుఁడు కృతాంజలియై అతని ముందు నిలంబడి దేవదేవుని స్తోత్రము చేసెను. దేవదేవుఁడయిన శంకరునకు నమస్కారము. ఆదిమూర్తివైన నీకు నమస్కారము. శర్వునకు, శాంతునకు, శాశ్వతుఁ డునయిన దేవునకు నమస్కారము. భూతనాథునకు, నీలకంఠునకు, నీలలోహితమూర్తికి శివునకు, బహురూపునకు త్రినేత్రునకు నీకు నమస్కారము. ఓ జగత్పతీ, ఓశర్వ ! నీ భక్తుఁడనయిన నాకు శరణుఁడవు కమ్మ. ఇతరుని యాశ్రయములేని వారలకు భూయోభూయః నీవే శరణ్యుఁడవు. నీవే పరాయణుఁడవు.

 ఓ భగవన్, తెలీయమీ నీన్ను గూర్చి (శంకరుని గూర్చి) ఏయే దురుక్తిని పలికి యపరాధముచేసితినో, తదోషమును క్షమింపనరుఁడవు. ఓ సర్వేశ ! ఇతరునిచే తెలియబడని రూపము గల నీయొక్క సద్భావము నీవు తక్క సమ్యక్కుగా తెలియజెప్పుటకు, ఇంకొక పురుషుఁడెవ్వఁడు శక్తిమంతుడు? అందుచే సర్వభావముచే ఓ శంకర ! నా యందు ప్రసన్నుఁడవగుము. నీకంటే వేడొక గతి నాకు లేదు. నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను.

వసిష్ఠుఁడిట్లనెను.

ఎదుట నిలంబడి కృతాంజలిపుటుఁడై సంస్తుతి నాచరించుచు, నిలంబడియున్న రామునితో ప్రసన్నాత్ముఁడయిన జగన్మయుఁడు ఇట్లు పలికెను.

భగవానుడిట్లు పలికెను.

ఓ వత్స ! ఈ నీ తపస్సుచే నిప్పుడు నేను ప్రీతుఁడనయితిని. అనపాయిని యయిన నీ భక్తిచే భార్గవ సత్తమ ! సంప్రీతుఁడను. నీవు కోరినది సర్వము నీకిచ్చుట నాకభిమతము. నీవు అత్యర్థము నా భక్తుఁడవు. ఈ విషయమున విచారింపదగినది లేదు. నీ హృదయమునందున్నది యెల్లనాకు అవగతము. అందుచే నేపలికినదెల్ల నిస్సంశయముగా నీవాచరింపుము. ఓవత్స ! ఇప్పుడు రుద్ర సంబంధమయిన అస్త్రధారణమున నీకు శక్తిలేదు. అందుచే, నీవు మరల ఫోరమయిన తపస్సాచరింపుము. (36) భూమినంతటినీ చుట్టిముట్టి సర్వతీర్థముల యందు చంక్రమణము చేసి, వాని యందు స్నానమాచరించి, పవిత్ర దేహుఁడవయిన నీవు సర్వాస్త్రములను పొందుదువు. అని పలికి, ఆ ప్రభువు, ప్రపంచ సృష్టికర్తయైన శివుఁడు ఆ శరీరముతోడనే రాముఁడు చూచుచుండగనే, ఓ రాజా ! అంతర్థానము చెందెను. జగన్నాథుఁడు అంతర్షితుఁడు కాగా, రాముఁడు శంకరునకు నమస్కరించి, సర్వవసుధాతలమును చుట్టిముట్టి తీర్థ స్నానము నాచరింప నిశ్చయుఁడయ్యెను. అంత పృథివీ సంతటిని యథాక్రమము పరిక్రమించి ఆత్మవంతుఁడయిన రాముఁడు విధివంతముగా సర్వతీర్థముల యందు స్నానమాచరించెను.ర్థముల యందు, క్షేత్రములయందు, అట్లే ముఖ్యములయిన దేవాలయములయందు, శ్రద్ధావంతుఁడై రాముఁడు పితరులకు దేవతలకు విధి విహితముగా తర్పణము లాచరించెను.

తీర్థముల యందు ఉపవాసము, తపస్సు, హోమము, జపము, స్నానము మున్నగు పవిత్ర క్రియలను యథావిధి నాచరించుచు, యావదూ మండలమును రాముఁడు సంచరించెను. ఈ విధముగా తీర్థముల యందు స్నానము లాచరించి వసుంధర యంతయు ప్రదక్షిణము చేసి రాముఁ డు పవిత్రీకృత శుద్ధ దేహుఁడయ్యెను, భార్గవరాముఁడు శంభు శాసనమున సర్వ వసుమతిని తిరిగి, తిరిగి పూర్వము తానివసించిన ఆశ్రమదేశమును చేరెను. అక్కడకు చేరి, ఓ రాజా! అందుండి, తపస్సులచే, వియమాదులచే ఉమాపతినీ ఆతఁడారాధించెను. (45) ఆ సమయముననే దేవతలకు రాక్షసుల మధ్య చిరకాలము భయోత్పాదకమయిన యుద్దమయ్యెను. అంత మిక్కిలి బలవంతులయిన అసురులు దేవతలను యుద్దమున పరాజయించి, నిర్భయులై అమరుల యైశ్వర్యము నంతటినీ పొందిరి. వాసవాదులయిన దేవతలందరు యుద్ధమునందు పరాజితులై శత్రువులచే హల్లేశ్వర్యులై శంకరుని శరణుజొచ్చిరి. సాష్టాంగ నమస్కారములచే, స్తోత్రములచే, జయగీతులచే జగన్నాథుఁడయిన శంకరునీ సంతోషపరచి, దేవతలు, అసురులను వధింపవలసినదిగా నీశ్వరుని ప్రార్థించిరి. దానవుల యొక్క వధను పారలకు వాగ్దానము చేసి, దేవతలకు వరదుఁడయిన శంభుఁడు మహోదరునితో నిట్లు పలికెను. (50) “హిమ పర్వతము యొక్క దక్షిణ భాగమున ముని పుత్రుఁడు తేజస్వి, మహాతపస్వి యగు రామనామకుఁడు, నన్నుగూర్చి తపస్సాచరించు చున్నాఁడు. ఇప్పుడే మీరక్కడకు పాండు, నాయొక్క శాసనమును ఆతనికి నివేదింపుఁడు. ఓ మహోదర ! తపస్సాచరించు నాతనిని వెంటనే యిచ్చటకు తీసికొని రమ్ము. ఈ విధముగా నాజ్ఞాపింపఁబడి, ఆట్లే చేయుదునని మహోదరుఁడు శివునకు ప్రణామమాచరించి, ఎందు రాముఁడుండెనో యచ్చటకు వాయువేగమున నరిగెను. ఆ ప్రదేశమును మహోదరుఁడు చేరెను. తపస్సాచరించుచున్న మహామునివరుండైన రాముని చూచెను. వినయాన్వితుఁడై రామునితో " “భృగువర్యుఁడవయిన నిన్ను శంభుండు చూడగోరుచున్నాఁడు. ఆతని యాజ్ఞ ననుసరించి నేను వచ్చితిని. అందుచే తత్పాదాంబుజ సన్నిధికి నీవు రమ్ము. (55) అని చెప్పెను.

రాముఁడా వాక్యమును విని వెంటనే లేచెను. శివునాజ్ఞను శిరసావహించీ, నమస్కరించి, “అట్లే ! ఇదిగో వచ్చు చుంటిని” అని ప్రత్యుత్తర మొసంగెను. అంత, మహోదరుఁడు, సత్వరయుతుఁడై, పర్వత రాజమయిన కైలాసము నందు పరమేశ్వరు సన్నిధికి రామునీ తీసికొని వెళ్లెను, అందు భార్గవ శ్రేష్ఠుఁడయిన రాముఁడు, సమస్త భూతములతో, ఇంద్రాదులతో, అమరులతో నున్న భక్తవత్సలుడనీ శంకరుని చూచెను. (58) శంకరుఁడు తపోధనులయిన నారదాది మునులచే సంస్తూయమానుఁడగుచుండెను. గంధర్వులచే గానము లాలపింపఁబడుచుండెను. అప్సరోగణములచే నృత్యము లాడబడుచుండెను. వారందరిచే ఉపాసింపబడుచున్న దేవేశ్వరుని, గజచర్మమును ధరించిన వానిని, భస్మముచేం బూయంబడిన సర్వాంగుని, త్రినేత్రుని, చంద్రశేఖరుని, వ్రేలాడు క్రింద పెదవి భుజములు గలవానినీ, ప్రసన్నమయిన ముఖపంకజము గలవానిని, ధరింపఁబడిన పింగళ వర్ణముగల జటాభారము కలవానిని, నాగాభరణభూషితుని, దేవతాసమితి యందు, బంగారు పట్టమున ఆసీనుఁడయిన వానీనీ, కృతాంజలియై, భృగు సత్తముఁడు దేవేశుని సమీపించెను. శ్రీకంఠుని దర్శనముచే రాముఁడు రోమాంచకంచుకీతవిగ్రహుఁడయ్యెను. ఆనంద బాష్పధారలచే తడిసిన కాయముతో పరమేశ్వరుని సమీపమున కరిగెను. వెళ్లి, భక్తీచే, ససంభ్రమమయిన వాక్కుచే, హరముచేతను గద్దదికము చెందీనమాటలతో వ్యాకులితాక్షరముగ, 'దేవదేవ నమస్కారము' అని పలుకుచు, త్రిపుర శత్రుఁడైన ఈశ్వరుని చరణద్వయము మూర్ధముచే స్పృశించుచు దేవతా బృందము లందరు రెప్పవేయక చూచుచుండ, సాష్టాంగముగా ప్రణామమాచరించేను. శివుఁడు ప్రీతుం డయ్యెను. ఆతనినీ లేవనెత్తాను. ప్రసన్నముఖ పంకజుఁడయిన రాముని మధురము లయిన పలుకులతో, సాదరముగా, నవ్వుచు నిట్లనెను. ఈ దేవతలు దైత్య గణములచే సమాక్రాంతులు. తమతమ అధిష్టానముల నుండి పరిభ్రష్టులు. ఆ రాక్షసులను చంప శక్తిహీనులై దేవతలు నన్ను చేరిరి. ఓ రామ ! అందుచే నా యాజ్ఞచే, దేవతలకు ప్రియమాచరించు కోరికతో, దైత్యగణముల నెల్లను జయించుము. నా దృష్టిలో నీవు సమర్థుఁ డవు. అంత రాముఁడు కృతాంజలియై, ప్రణామము నాచరించి వినయముతో దేవతలందరు వినుచుండ, ఈశ్వరునితో నీట్లనెను. “స్వామిన్ ! సర్వజ్ఞుఁడవయిన నీకు తెలియనిదేమున్నది? అయినను, నేను విన్నవించుకొను నా పలుకులను వినఁగోరెదను.

ఇంద్రుడు మొదలగు సకల దేవతలచే దేవతా శత్రువులు చంపఁబడుటకశక్తులయినచో, ఆదైత్యులందరు నా యొక్కనిచే నేట్లు చంపబడుదురు? ఓ దేవేశ ! నేనో అస్త్రజ్ఞుఁడనుకాను. యుద్దముల యందు కోవిదుఁడనుకాను, అనాయుధుఁడను, సురశత్రువులనందరనెనేనెట్లు చంప గలుగుదును. (72) ఇట్లు రాముఁడు పలుకగా, దేవేశుఁడు 'కాలాగ్నితో సమానమయిన కాంతి గలిగినది, శైవతేజోమయమయిన అస్త్రమును నిలువఁబడియున్న మహాత్ముడయిన రామున కొసంగేను. (73) అంతీయకాక స్వకీయమయినట్టిది, సర్వశస్తాభీభావకమయినదియునగు పరశువును, రామున కొసంగి, ప్రసన్నాత్ముడై యీశ్వరుండు దేవతలందరు ఆలకించుచుండ రామునితో “ఓ శత్రు దురాసదా ! ఓ సౌమ్యుఁడా, మత్రసాదవశమున సమస్త శత్రువులను నాశనము చేయు శక్తి నీకగును. ఇదిగో ! ఈ ఆయుధముతోడనే యుద్ధమునకు నీపరుగుము. శత్రువులతో యుద్ధము చేయుము. యుద్ధకౌశలము నెఱుగనంటీవికదా ! అప్పుడు నీవే స్వయముగా యుద్ధ నైపుణ్య మెఱుంగగలవు. అని అనెను.

వసిష్ఠుఁడిట్లు పలికెను.

ఈశ్వరునిచే నీ విధముగా చెప్పఁబడి, రాముడాతనికి నమస్కరించి, శైవమయిన పరశువును గ్రహించి, దేవతా శత్రువధమున కుద్యతుం  డయ్యెను, (77) అంత విష్ణు తోజోంఽశ సంభవుఁడు, రుద్రుని యందలి భక్తితో సమాయుక్తుఁడు, సూర్యమహద్యుతీతో కూడినవాడునై రాముఁడు మిక్కిలిగా శోభించెను. (77) త్రినేత్రునిచే అనుజ్ఞాతుఁడై, సర్వదేవతలతో కూడికొని యుద్ధమాచరింప కృతనిశ్చయుఁడై, అసురులను చంపుటకు బయలుదేరెను. అంత, మరల దేవతలకు త్రిలోక విజయోద్యుక్తులైన రాక్షసులకు మధ్య యుద్దమయ్యెను. యుద్దమతి భయంకరముగా జరిగెను. అంత మహాబాహుఁడైన రాముఁడు సుదారుణమయిన యా యుద్దమున, క్రోధోదగ్రుండై, మహాసురల నందరను పరశువుచే హతమార్చెను. పిడుగులతో తుల్యములయిన దేబ్బలచే, సహస్ర సంఖ్యాకముగా అసురలను చంపి, ఆ యుద్ధమునందు సంక్రుద్ధుఁడయిన వేడొక యమునివలే (కాలునివలె) సంచరించెను. దైత్యులనందరంజంపీ దేవతలనందరను సంతోషపెట్టెను. క్షణకాలములో, ప్రహర్తలలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు రాక్షసుల హతమార్చిను. దైత్యదానవులందరు రామునిచే చంపఁబడిరి. హతశేషులయినవారు రాముని సర్వత్ర దర్శించిరి. భయ సంత్రస్తులైరి. (84)

అసుర సంఘములు చంపబడగా, సర్వత్ర చెల్లాచెదరుచేయబడగా, రాముని ఆహ్వానించి, దేవతలందరు స్వర్గమునకు మరలిపోయిరి. (85) రాముఁడు దైత్యులను చంపి, దేవతలనందరినీ పోవుట కనుజ్ఞ నొసంగి, తిరిగి తపస్సు నందాసక్తమయిన మనస్సుతో స్వకీయాశ్రమమునకు పోయెను. (86) మహామతియైన రాముఁడు మృగవ్యాధ ప్రతికృతినీ (రూపమును నిర్మాణించి) వశియై ఆయాశ్రమమున నతనిని భక్తితో పూజించెను. గంధములతో, పుష్పములతో, మనోహరములయిన నైవేద్యములతో, నమస్కారాఖీనందనములతో, స్తోత్రములతో, విధివత్తుగా భక్తితో శంకరుని రాముఁడు పూజించి, ప్రీతినొందెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందలి మధ్యభాగము నందలీ, తృతీయోపోదాతపాదమునందు అర్జునోపాఖ్యానమందు ఇరువదినాలుగవ అధ్యాయము.